telugutaruni.weebly.com
  • Home
  • వంటకాలు (Cookeries)
    • ఫలహారాలు (Tiffins)
    • శాకాహారం (Veg)
    • బియ్యపు వంటలు (Rice items)
    • మాంసాహారం (Non-Veg)
    • పచ్చళ్ళు (chutneys)
    • వడియాలు
    • పండ్ల రసాలు (Juices)
    • స్వీట్స్ (Sweets)
    • చిరుతిళ్ళు (Snacks)
    • గ్రేవీ ఐటమ్స్
    • సూప్స్ (Soops)
    • కొత్త కొత్తగా
  • చిట్కాలు (Tips)
    • వంటింటి చిట్కాలు ( Kitchen Tips)
    • ఆరోగ్య చిట్కాలు (Health Tips)
    • సౌందర్య చిట్కాలు (Beauty Tips)
  • మహిళా లోకం
    • ఆదర్శ మహిళలు
    • శభాష్ మహిళా..
  • విహారయాత్ర

సేవలోనూ రాణే

10/12/2013

0 Comments

 
Picture
చిన్ననాటి నుంచి చదువులో ఫస్ట్‌
ఓ పార్టీలో హుస్సేన్‌తో పరిచయం
పెళ్లి తరువాత రాణిగా పలు సంస్కరణలు
మతఛాందసవాదుల నుంచి బెదిరింపులు
లెక్కచేయకుండా ముందుకు సాగుతున్న రానియా
గౌరవ కల్నల్‌ెదానిచ్చిన జోర్డాన్‌ ప్రభుత్వం

జాతీయం... అంతర్జాతీయం... ఏ అందాల పోటీలో గెలిచిన వనితలైనా చెప్పే మెుదటి మాట సామాజానికి తన వంతు సాయం చేస్తామని... అందగత్తె కిరీటాన్ని దక్కించుకుని సేవకు సమయాన్ని ేకటారుుంచిన వారు మాత్రం చాలా తక్కువే. అరుుతే ప్రపంచ వందమంది అందగత్తెల జాబితాలో చోటు సంపారుుంచుకున్న రానియా మాత్రం సేవ చేయడానికి వెనకాడదు. ఇటు జోర్డాన్‌ రాణిగా బాధ్యతని, ెదాని నిలబెట్టుకుంటూ సేవల్లోనూ మహారాణిగానే నిరూపించుకుంది. అంతే కాకుండా ఫోర్బ్‌‌స పత్రిక ప్రకటించిన అంతర్జాతీయంగా శక్తివంతమైన మహిళల జాబితాలో స్థానం సంపాదించుకుంది.


సేవలోనూ రాణే
అందగత్తెల పోటీల్లో సౌందర్యరాశులంతా మాటల్లో ‘సేవాభావం’ కురిపిస్తారు. తరువాత బాలీవుడ్‌లోనో, హాలీవుడ్‌లోనో ప్రత్యక్షమవుతుంటారు. మరికొంత మంది వాణిజ్య ప్రకటనల షూటింగ్‌లతో, షోరూంల ప్రారంభోత్సవాలతో తీరిక లేకుండా ఉంటారు. అయితే బ్రిటిష్‌ యువరాణి డయానా వంటి వారు బహు అరుదుగా సమాజసేవలో నిమగ్నమవుతారు. ఇటువంటి వర్గంలోకి జోర్డాన్‌ రాణి రానియా చేరుతారు. మహిళల, బాలల హక్కుల కోసం ఎంతగానో కృషి చేస్తున్నారు.

అంతర్జాతీయ సమాజాన్ని ఆకర్షిస్తున్న రానియా రాజుల కుటుంబంలో జన్మించలేదు. మధ్య తరగతి కుటుంబ నేపథ్యం నుంచే వచ్చారు. కువైట్‌లో స్థిరపడిన పాలస్తీనీయుల కుటుంబంలో పుట్టింది రానియా. తండ్రి వైద్యుడు. చిన్నప్పటి నుంచే చదువులో అమిత ప్రతిభాపాటవాలు చూపిన ఆమె కైరోలోని అమెరికన్‌ యూనివర్సిటీలో బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పట్టా పుచ్చుకుంది. కొన్నాళ్లు సిటీ బ్యాంకులో ఉద్యోగం చేశాక యాపిల్‌ కంపెనీకి మారింది. అక్కడ పనిచేస్తున్నప్పుడు ఒక పార్టీకి వెళ్లడమే రానియా జీవితాన్ని మార్చేసింది. ఆ పార్టీకి వచ్చిన జోర్డాన్‌ యువరాజు అబ్దుల్లా బిన్‌ అల్‌ హుస్సేన్‌తో చూపు కలిసింది. తొలిచూపు ప్రేమ అవునో కాదో వాళ్లెప్పుడూ బయటికి చెప్పలేదు కానీ... సరిగ్గా ఐదునెలలు తిరిగే సరికి వాళ్ల పెళ్లయిపోయింది. తర్వాత కొద్ది రోజులే అబ్దుల్లాకు జోర్డాన్‌ రాజుగా పట్టాభిషేకం జరిగింది. అలా మూడుపదుల వయసు నిండకముందే ఒక దేశానికి మహారాణి అయింది రానియా.

ప్రొఫైల్‌

పేరు     : రానియా ఆల్‌ అబ్దుల్లాహ్‌
తండ్రి పేరు : ఫైసల్‌ సేద్కి ఆల్‌ యాసిన్‌
తల్లి      : ఇహం యాసిన్‌
పుట్టిన తేది : 31 ఆగస్టు 1970
జన్మస్థలం  : కువైట్‌
భర్త      : అబ్దుల్లా బిల్‌ ఆల్‌ హుస్సేన్‌
పిల్లలు    : నలుగురు. యువరాజులు హుస్సేన్‌,
          హషీమ్‌, యువరాణిలు ఇమాన్‌, సల్మా



ఎంత మహారాణి అయినా, సంప్రదాయాలనూ కట్టుబాట్లనూ దాటి ఒక మహిళ ఇలా నలుగుర్లోకీ రావడం. వాటికి విరుద్ధంగా గొంతెత్తడం అక్కడి మతఛాందసవాదులకు నచ్చలేదు. వారి బెదిరింపులను ఖాతరుచేయకుండా ధైర్యంగా తాను ఎంచుకున్న బాటలోనే నడుస్తోంది రానియా. ఒకటి కాదు రెండు కాదు దాదాపు పద్దెనిమిది అంతర్జా తీయ సంస్థల్లో సభ్యురాలిగా కీలక పాత్ర పోషిస్తోంది. యునైట్‌డ్‌ నేషన్స్‌ ఫండ్‌, యునిసెఫ్‌, గ్లోబల్‌ అలయెన్స్‌ ఫర్‌ వ్యాక్సిన్స్‌ అండ్‌ ఇమ్యునైజేషన్‌, ఇంటర్నేషనల్‌ యూత్‌ ఫౌండేషన్‌, ఫౌండేషన్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ కమ్యూనిటీ అసిస్టెన్స్‌ వంటి ప్రముఖ సంస్థల్లో రానియా సేవలు కీలకం. ఆమె సేవలకు మెచ్చి జోర్డాన్‌ ప్రభుత్వం గౌరవ కల్నల్‌హోదా కూడా ఇవ్వడం విశేషం.

అరబ్‌ దేశాలలో మహిళలూ చిన్నపిల్లల కష్టాలను చూస్తూ పెరిగిన రానియాలో బాల్యం నుంచే ఎన్నో ఆలోచనలు. రాణి అవగానే తన ఆలోచనలు అమల్లో పెట్టేందుకు గొప్ప అవకాశం వచ్చిందని భావించారు. వెంటనే జోర్డాన్‌లోని అన్ని పాఠశాలల్లోనూ విద్యాసంస్కరణలు ప్రారంభించేలా రాణి హోదాలో చర్యలు తీసుకున్నారు. భర్త కూడా అందుకు సహకరించడంతో రానియాకు మరింత ప్రోత్సాహం లభించింది. మహిళల హక్కును కాలరాసే కట్టుబాట్లకు వ్యతిరేకంగా గొంతెత్తింది. ‘జోర్డాన్‌ రివర్‌ ఫౌండేషన్‌’ పేరుతో ఒక స్వచ్చంద సంస్థను స్థాపించి మహిళలూ పిల్లల సంక్షేమం దిశగా కృషిచేస్తోంది.


0 Comments

ఇదొక 'అత్యవసర' సేవ!

10/11/2013

0 Comments

 
Picture
"హైదరాబాద్ దగ్గర్లోని ఒక తండాకి వెళ్లినప్పుడు లక్ష్మి అనే ఆవిడ 'నాకు పదమూడేళ్ల కూతురుంది. టాయిలెట్ లేక ఇబ్బందిపడుతోంది. ఎక్కడికో పొలాల్లోకి వెళ్లాల్సి వస్తోందని రోజూ ఏడుపేనమ్మా. మా సమస్యను పరిష్కరించడమ్మా' అని కళ్ల నీళ్లు పెట్టుకుంది. ఆమె బాధను చూశాక, మేము రూపొందించిన బయో టాయిలెట్ డిజైన్‌లో కొన్ని మార్పులు చేసి చౌకగా అందించే ప్రయత్నం చేయాలని నిర్ణయించుకున్నాను'' అని చెప్పారు 'బంక బయోలూ ప్రైవేట్ లిమిటెడ్' మేనేజింగ్ డైరెక్టర్ నమిత బంక. ఇంతకీ ఆవిడ రూపొందించిన ఆ బయో టాయిలెట్ ఎలా ఉంటుంది? అసలా ఆలోచన ఆమెకెలా వచ్చింది? తెలుసుకుందాం.

మనం చేసే పని సరైనది నమ్మితే ఏ పనైనా సునాయాసంగా చేయగలిగే సత్తా ఆడవాళ్లలో ఉంది. మహిళలు వ్యాపారం చేయాలంటే బ్యూటీ, బొటిక్‌లకి మించింది లేదనే ఆలోచన నుంచి బయటపడాలి. అలాగే కాలు నొప్పి, కడుపు నొప్పి అని ఇంట్లో కూర్చోవద్దు. పనిలో పడితే బుర్ర, మనసు రెండూ ప్రశాంతంగా ఉంటాయి. చురుకుగా తయారవుతారు.

"మేము హైదరాబాద్ రాకముందు సూరత్, బెంగళూరుల్లో ఉన్నాము. మాది మార్వాడీ కుటుంబం కావడంతో ఆడవాళ్లు పెద్దగా ఉద్యోగాలు చేయరు. నేను కూడా నా పెళ్లయ్యాక ఆరేళ్లు గృహిణిగానే ఉన్నాను. బుర్రలో మాత్రం ఏదైనా పని చేస్తే బాగుండనే ఆలోచనలు తిరుగుతుండేవి. ఆ ఆలోచనను మా అత్తగారు బాగా గ్రహించారు. ఎందుకంటే ఖాళీ సమయంలో మిగతా వాళ్లలా టి.వి. చూడడం, గాసిప్స్ మాట్లాడడం వంటివి చేసేదాన్ని కాదు. సమయం దొరికితే ఏదో ఒక పుస్తకం పట్టుకుని చదువుకునేదాన్ని. కాలక్షేపం పుస్తకాలు తప్ప ఏ పుస్తకమైనా ఓకే నాకు. నన్ను, నా అలవాట్లను గమనించిన తరువాత ఇంటి నుంచి చేసే పనేదైనా ఓకే అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నేను బిఎస్సీ టెక్స్‌టైల్ డిజైనింగ్ చదువుకున్నాను. పెళ్లయిన తరువాత జువెలరీ డిజైనింగ్ కోర్సు కూడా చేశాను. దాంతో సూరత్‌లో ఉండగా ఇంటి నుంచి, బెంగళూరు వచ్చాక షాపు ఏర్పాటుచేసి డైమండ్ జువెలరీ వ్యాపారం చేశాను. దాదాపు ఎనిమిదేళ్లు నేనే ఆ షాపు నడిపాను. ఆ పని చేసేటప్పుడు ఇంటినుంచి ఉదయం బయల్దేరితే సాయంత్రం తిరిగి ఇంటికెళ్లే వరకు ఒక్క చుక్క నీరు తాగేదాన్ని కాదు. తినేదాన్ని కాదు. కారణం షాపులో గాని, చుట్టుపక్కల గాని టాయిలెట్ సౌకర్యం లేకపోవడమే. మార్కెటింగ్ పనిమీద బయట ఎంతసేపు తిరగాల్సి వచ్చినా కూడా అదే పరిస్థితి. దానివల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడి సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది.

జువెలరీ వద్దనుకున్నాను
ఆ తరువాత మా ఆయన ఉద్యోగరీత్యా 2008లో హైదరాబాద్‌కి వచ్చాము. హైదరాబాద్ వచ్చాక జువెలరీ వ్యాపారం చేయొద్దని నిర్ణయించుకున్నాను. అందుకని ప్రింటింగ్ క్యాట్రిడ్జ్‌ల రీఫిల్లింగ్ వ్యాపారం చేశాను. 2009లో సెంటర్ ఫర్ సోషల్ ఇనిషియేటివ్ అండ్ మేనేజ్‌మెంట్ (సిఎస్ఐఎమ్)లో ఎన్జీవో మేనేజ్‌మెంట్‌కి సంబంధించిన కోర్సు చేశాను. అది పూర్తయ్యాక రైళ్లలోని బయో టాయిలెట్లను అమర్చే 'ఓఇఎమ్స్' అంటే ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మానుఫాక్చరర్స్‌కు సర్వీస్ ఏజెంట్‌గా పనిచేశాను. ప్రారంభంలో మా ఎదుట ఉన్న సవాల్ - భారతీయ రైల్వేలకి అమ్మిన టాయిలెట్స్ సరిగా పనిచేస్తున్నాయా లేదా చూడడం. అవి సరిగా పనిచేసేందుకు మా టీం 24 గంటలూ పనిచేసింది. అప్పుడు మేము పడిన కష్టం అంతా ఇంతా కాదు.

బయోలూతో పరిష్కారం
రైళ్లలో ఏర్పాటుచేసిన బయో టాయిలెట్లు డిఆర్‌డిఒ శాస్త్రజ్ఞుల సృష్టి. అయితే ఈ టాయిలెట్లని రైళ్లతో పాటు వ్యాన్‌ల వంటి పెద్దపెద్ద వాహనాల్లో ఏర్పాటుచేసుకుంటున్నారు. వీటిని కనీసావసరాలు లేని గ్రామాల్లో, ఇరుకుగా ఉండే మురికివాడల్లో నివసించే వాళ్లకు కూడా ఏర్పాటుచేయొచ్చు కదా అనిపించింది నాకు. నా ఆలోచనకు తగ్గట్టుగా వాటిని డిజైన్ చేసి డిఆర్‌డిఒ వాళ్లను సంప్రదించాను. కొన్ని మార్పులుచేర్పుల తరువాత వాళ్లు ఆ డిజైన్‌కు ఓకే చెప్పారు. వాటికే 'బయోలూ' అని పేరుపెట్టి తయారీ మొదలుపెట్టాను. ఈ టాయిలెట్లని ఎక్కడైనా నిర్మించుకోవచ్చు. రెడీమేడ్‌గా ఉంటాయి కాబట్టి రెండుగంటల్లో ఏర్పాటు చేసుకోవచ్చు. ఎక్కువ స్థలం కూడా అక్కర్లేదు. మురుగు కాలువ వ్యవస్థ లేని దగ్గర వీటికి మించిన పరిష్కారం లేదు. దీని ప్రత్యేకత ఏమిటంటే... టాయిలెట్ కింది భాగంలో ఒక బాక్స్ ఉంటుంది. అందులో బయో డైజెస్టివ్స్(బ్యాక్టీరియా) ఉంటాయి. ఈ బ్యాక్టీరియా మలాన్ని తిని నీటిని మాత్రం బయటికి వదులుతాయి. అలా వదిలిన నీటిని గార్డెనింగ్‌కి వాడొచ్చు. లేదా అలానే వదిలేసినా భూమికి నీటి సారం అందించిన వాళ్లమవుతాం. దీని ధర ఇప్పుడయితే 22 వేల రూపాయలు. టాయిలెట్ తయారీకంటే రవాణాకే ఎక్కువ ఖర్చవుతోంది. అందుకని డిజైనింగ్‌లో కొన్ని మార్పులు చేసి ధరని ఇంకా తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటివరకు వంద బయో టాయిలెట్స్ నిర్మించాం.

ప్రతీ ఇంటి అవసరం
ఈ టెక్నాలజీతో మా కంపెనీకి పెద్ద కంపెనీల పక్కన స్థానం కలిగింది. బయోటాయిలెట్లను పబ్లిక్ ప్రదేశాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో, నిర్మాణాలు జరిగే దగ్గర, కొండ ప్రాంతాల్లో - ఎక్కడ మురుగు నీటి కాలువ వ్యవస్థ లేదో అక్కడ నిర్మించుకోవచ్చు. బీహార్, జార్ఖండ్‌లలో బయో టాయిలెట్లను అందుబాటులోకి తేనున్నాం. ఆంధ్రప్రదేశ్ గ్రామాలతో పోలిస్తే అక్కడి గ్రామాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 40 మంది, భువనేశ్వర్, కలకత్తాల్లో 22 మంది ఉద్యోగులు మా కంపెనీకి పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గ్రామాల్లో పనిచేసేందుకు మరింత మంది ఉద్యోగులు కావాలి. టాయిలెట్స్‌కి సంబంధించిన పని అని చాలామంది ఆసక్తి కనపర్చరు. మా కంపెనీలో పనిచేసే వాళ్లు మొదట్లో కొన్నాళ్లు తామెక్కడ పనిచేస్తున్నామో చెప్పేవారు కాదట. కాని ఇది ప్రతీ ఇంటి అవసరమని గుర్తించాలి. ముఖ్యంగా మహిళలు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు.
చివరగా మహిళలకి ఒక విషయం చెప్తాను. 1999 నుంచి నేను వ్యాపారరంగంలో ఉన్నాను. ప్రారంభంలో నిర్ణయాలు తీసుకోవాలంటే చాలా భయపడేదాన్ని. కాని ఈ రోజున వ్యాపారరంగంలో ఉన్న మగవాళ్లు ఎలాగైతే నిర్ణయాలు తీసుకుంటారో ఆ స్థాయిలో నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాను. శారీరకంగా, మానసికంగా కూడా ఎంతో దృఢంగా తయారయ్యాను. మనం చేసే పని సరైనది నమ్మితే ఏ పనైనా సునాయాసంగా చేయగలిగే సత్తా ఆడవాళ్లలో ఉంది. మహిళలు వ్యాపారం చేయాలంటే బ్యూటీ, బొటిక్‌లకి మించింది లేదనే ఆలోచన నుంచి బయటపడాలి. అలాగే కాలు నొప్పి, కడుపు నొప్పి అని ఇంట్లో కూర్చోవద్దు. పనిలో పడితే బుర్ర, మనసు రెండూ ప్రశాంతంగా ఉంటాయి. చురుకుగా తయారవుతారు'' అని ముగించారు.


0 Comments

కాల్పనికకథలతో ఓలలాడించిన కలం

10/9/2013

0 Comments

 
Picture
అనగనగా ఒక బాలుడు, ఆ బాలుడు ఏడుసముద్రాల ఆవల ఉండే భీకరారణ్యంలోకి చొచ్చుకునివెళ్లి, అక్కడ ఓ చీకటి గుహలో దాక్కుని, తన మంత్రాలు, తంత్రాలతో ప్రపంచాన్ని తన గుప్పెట్లో ఉంచుకునేందుకు ప్రయత్నించే ఓ మాంత్రికుడితో పోరాడి గెలిచే సాహస కథలంటే పిల్లలకే కాదు పెద్దలకు ఇష్టమే. ఇలాంటి కథలకే రౌలింగ్‌ అనే ఓ మహిళారచయిత శ్రీకారం చుట్టారు. ఆమె రాసిన నవలే 'హ్యారీపొట్టర్‌'.  అదే ఆమెకు ఇంతటి ఖ్యాతి తెచ్చిపెడుతుందని ఊహించలేదు. పిల్లలు సాహసాలకు మారుపేరుగా చెప్పుకోవచ్చు. మాంత్రికుడి కుతంత్రాలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ, ఆసాంతం భయంకర పోరాటం చేస్తూ, జాతిని, దేశాన్ని, విశ్వాన్ని కాపాడే సాహసబాలుడి చుట్టూ తిరిగే కథనే హ్యారీపొట్టర్‌. ఇలాంటి సినిమాలు 60,70 దశాబ్దంలో మన తెలుగులో పాతాళభైరవి, మాయాద్వీపం, జ్వాలాద్వీపరహస్యం వంటి సినిమాలు పిల్లలతోపాటు పెద్దల్ని అలరించి, నేటికీ ఆదరణపొందుతున్న ఇలాంటి కథలనే రౌలింగ్‌ కాస్త వెరైటీగా రాసి, ప్రేక్షకులకు అందించారు.


లేతవయసులోనే కథలకు శ్రీకారం
అతితక్కువ కాలంలో విశ్వఖ్యాతి నొందిన నవల, ఆ నవలను ఆధారంగా చేసుకుని తీసిన సినిమా ఎంతటి పాపులారిటీని సంపాదించిందో, అంతకంటే ఐశ్వర్యం, పేరు ఆమెకు వచ్చింది. నవల, సినిమా ఎంత పాపులరో ఆమె పేరు కూడా అంతే పాపులర్‌. రౌలింగ్‌ పూర్తిపేరు జె.కె.రౌలింగ్‌. బ్రిటన్‌ దేశానికి చెందిన 48 సంవత్సరాల రౌలింగ్‌  లేత వయసులోనే పిల్లల కథలను రాయడం అలవర్చుకున్నారు.  చిన్నప్పుడు తోటిపిల్లలకు కథలను చెప్పడంలో ఆరితేరిన రౌలింగ్‌ అదే స్పృహతో రచనలపై ఆసక్తిని చూపించారు. 


తల్లి నుంచి ప్రేరణ
రౌలింగ్‌ 1965 జూలై 31న ఇంగ్లండులో ఒక మారుమూల ప్రాంతంలో జన్మిచారు. రౌలింగ్‌  తల్లిపేరు 'అన్నీ'. ఫ్రాన్స్‌, స్కాట్‌లాండ్‌ రెండు దేశాలకు చెందిన తల్లి భర్త నుంచి ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. ఈ ప్రభావం రౌలింగ్‌పై బాగా ఉండేది. ఎందుకంటే తల్లి కష్టపడి తనను చదివించడం, తన కోసం తల్లి చేస్తున్న పోరాటం ఆమెలో ఒక పట్టుదల రావడానికి కారణమైంది. ఇంగ్లండ్‌లోని సెయింట్‌ మైఖెల్‌ ప్రైమరీ స్కూలో రౌలింగ్‌ చదువుకున్నారు. ఒకసారి స్థానికంగా ఉండే చర్చికి రౌలింగ్‌ హాజరయినప్పుడు ఒక ఆంటీ 'జెస్సికామిట్‌ఫోర్ట్‌' అనే ఒక మహిళ జీవిత చరిత్ర పుస్తకాన్ని ఇచ్చి చదవమంది. ఈ పుస్తకం చదివిన రౌలింగ్‌ తనేందుకు రచనలు చేయకూడదని అనుకున్నారు.


చారిటీలో పనిచేసిన రౌలింగ్‌
రౌలింగ్‌ బిఎ పూర్తయ్యాక పారిస్‌ నుంచి లండన్‌కు వచ్చారు. లండన్‌లో కొన్ని సామాజిక సంస్థలో పనిచేశారు. ఆమ్నేస్టీ అంతర్జాతీయ చారిటీలో పనిచేశారు. చారిటీలో పనిచే స్తున్నప్పుడు మానవహక్కుల కోసం పోరాడుతూనే వాటిని ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేసేవారు. ఒకసారి రౌలింగ్‌ మన్‌సేస్టర్‌ నుంచి లండన్‌కు వెళ్లేందుకు పయనమయ్యారు. ఆ ట్రైన్‌ నాలుగుగంటలు ఆలస్యంగా వచ్చింది. ఈ నాలుగు గంటలు ఆమె జీవితాన్ని మార్చివేస్తుందని రౌలింగ్‌  ఊహించి వుండరు. కారణం ఆ సమయంలో ఆమెకు ఒక పిల్లాడు స్కూలుకు వెళ్తున్నప్పుడు ఎలాంటి ఆలోచనలు మెదలుతాయి? అనే ఒక ఆలోచన ఆమెలో జీవం పోసుకుంది. 1990లో ఆమె ఒక సాహసబాలుడి గురించి కథను రాయాలని అనుకున్నారు. కానీ ఇదే సమయంలో రౌలింగ్‌ తల్లి మరణించడంతో తీవ్రదిగ్భ్రాంతికి గురయ్యారు. తల్లితో తనకున్న అనుబంధం, జీవితంలో ఎదురైన సంఘటనలు, అప్పటికే తన భర్త విడిపోవడం, 8సంవత్సరాల కూతురి బాధ్యతను మోయడం వంటివన్నీ రౌలింగ్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. 1990లో కథను రాయాలనే ఆలోచన అయితే వచ్చింది కానీ, 1995 వరకూ అది సాధ్యం కాలేదు. తన కూతుర్ని దృష్టిలో పెట్టుకుని, పసిపిల్లల్లో ఉండే ఆతృత, ఆసక్తి, ఉత్సాహం వీటిని ఆధారం చేసుకుని, 'హ్యారీపొట్టర్‌' నవలకు శ్రీకారం చుట్టారు.


నవలే సినిమాగా...
1996లో విడుదలైన హ్యారీపొట్టర్‌ పుస్తకం హాట్‌కేక్‌లా అమ్ముడుపోవడం ఒక సంచలనం అయితే బ్రిటన్‌లో అన్ని లైబ్రరీలలో పిల్లలకోసం ఈ పుస్తకాన్ని అందుబాటులో ఉంచింది. తర్వాత బ్రిటన్‌ నుంచి అమెరికా 1998లో ఈ పుస్తకహక్కుల్ని కొన్న వార్నర్‌ బ్రదర్స్‌ పుస్తకం పేరుతోనే సినిమాగా తీసారు. ఈ సినిమా ఇంతగా విజయం పొందుతుందని ఎవరూ ఊహించలేదు. మీడియా కూడా నవలతోపాటు సినిమాకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో సూపర్‌ పాపులర్‌ అయ్యింది.


నవల ఏడు సీరీస్‌గా
పుస్తకం, సినిమాకు ఊహించని పాపులారిటీ లభించడంతో రౌలింగ్‌ ఇదే నవలను 7 సీరీస్‌గా రాశారు. 1. హ్యారీపొట్టర్‌ ఫిలసాఫీయర్స్‌స్టోన్‌, 2.హ్యారీపొట్టర్‌ అండ్‌ ద చాంబర్‌ ఆఫ్‌ సీక్రెట్స్‌, 3. హ్యారీపొట్టర్‌ అండ్‌ ద ప్రిజనర్‌ ఆఫ్‌ అక్బన్‌,    4. హ్యారీపొట్టర్‌ అండ్‌ ద గోబ్లెట్‌ ఆఫ్‌ ఫైర్‌, 5.హ్యారీపొట్టర్‌ అండ్‌ ద ఆర్డర్‌ ఆఫ్‌ ద ఫియోనిక్స్‌, 6. హ్యారీపొట్టర్‌  అండ్‌ ద హాఫ్‌బ్లడ్‌ ఫ్రిన్స్‌, 7. హ్యారీపొట్టర్‌ అండ్‌ ద డెత్లీ హాల్లోస్‌గా రాశారు. 2006లో రౌలింగ్‌ తన ఫైనల్‌ పుస్తకం రాసి, ముగించారు. ముగింపు కథలో కథానాయకుడు హ్యారీపొట్టర్‌ మరణంతో ముగుస్తుంది. అందుకే ఈ కథకు 'హ్యారీపొట్టర్‌ అండ్‌ ద డెత్లీ హల్లోస్‌'గా నామకరణం చేశారు. ఈ పుస్తకం 2007లో విడుదలయ్యింది. ఈ పుస్తకం ఫేవరెట్‌ మాత్రమే కాక అన్ని సమయంలో వేగంగా అమ్ముడుపోయే పుస్తకంగా మారింది. చివరి పుస్తకం నాకెంతో నచ్చింది. కారణం ఇందులో సంతోషం, దుఃఖం నిండిన భిన్నమైన కథ. హ్యారీపొట్టర్‌ కథను పూర్తిచేసిన రౌలింగ్‌ చిన్నచిన్న కథలు రాస్తున్నారు.


చేతిరాత సరిగ్గా లేక తిరస్కరణ
 ఆరంభంలో రౌలింగ్‌ తన చేతిరాతతో హ్యారీపొట్టర్‌ నవలను రాసి, దాదాపు 12 ప్రచురణసంస్థలకు ప్రచురణ నిమిత్తం పంపారు. కానీ ఆమె చేతిరాత అర్థం కాక, అవి ప్రచురించేందుకు నిరాకరించాయి. చివరికి ఆమె క్రిస్టఫర్‌ అనే ఒక వ్యక్తిని పట్టుకుని, తన కథను టైపింగ్‌ చేసి, పంపారు. ఈ నవల ప్రచురించబడినందుకు ఆరంభంలో రౌలింగ్‌ కేవలం 1500 పౌండ్లు మాత్రమే లభించాయి.


ఎందుకింత పాపులర్‌?
హ్యారీపొట్టర్‌ నవల, సినిమా ఎంతగా పేరుపొందాయో తెలియని వారుండరు. 2007లో చివరి నవల అయిన హ్యారీపొట్టర్‌ అండ్‌ ద డెత్లీ హాల్లోస్‌ రాసి, మార్కెట్లోకి విడుదల చేయకముందే ఆ కాపీని సొంతం చేసుకునేందుకు బ్రిటన్‌, అమెరికా, ఫ్రాన్స్‌, జర్మనీ, చివరికి ఇండియా కూడా యువతీ యువకులు పుస్తకాల స్టాల్స్‌ ముందు బారులుతీరారు. ఇంత పాపులారిటీని పొందడానికి అసలు ఈ నవలల్లో ఏం ఉన్నాయి? అని గమనిస్తే హ్యారీపొట్టర్‌, అతడి స్నేహితులు హోవార్ట్స్‌ అనే మంత్రాల స్కూల్లో విద్యార్థులు. మంత్రాలు, తాంత్రికవిద్య ప్రయోజనకరమైన వాటికోసం కాక, అవినీతి, అన్యాయంతో ప్రపంచాన్ని తన గుప్పెట్లో ఉంచుకుని, ఆధిపత్యం చెలాయించాలని ప్రయత్నించే మాంత్రికుడి కుతంత్రాల్ని ఎప్పటికప్పుడు హ్యారీపొట్టర్‌ అనే బాలుడు తిప్పికొట్టడం చేస్తుంటాడు. హ్యారీపొట్టర్‌ 11 సంవత్సరాల ఒక అనాధబాలుడు. ఇతడి బాధ్యత పిల్లల్ని మంత్రాల స్కూల్లో చేరేందుకు ప్రోత్సహించడం, తద్వారా తనతోటి వారికి అలాంటి చదువును నేర్పించి, అందులో విజయం పొందాలనే ధ్యేయంతో ఉంటాడు. అయితే మంత్రాలు, తంత్రాల వల్ల ప్రయోజనం కంటే నష్టాలే అధికమని గమనించి, ఇందులో నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తాడు. కానీ ఆ ప్రయత్నాల్ని మాంత్రికుడి పెద్ద విఫలం చేస్తుంటాడు. తద్వారా ఆ మాంత్రికుడు హ్యారీపొట్టర్‌, అతడి స్నేహితుల్ని అంతం చేసే ప్రయత్నంలో మాంత్రికుడు తనకున్న మంత్రశక్తుల ద్వారా నిత్యం పోరాడుతూ సాగే కథ పాఠకుల్ని ఆసాంతం ఉత్కంఠంలో పడేస్తూ, సస్పెన్షన్‌, థ్రిల్లర్‌, హర్రర్‌ వంటి మసాలాను జోడించి రాయడంలో రోలింగ్‌ తనకున్న సత్తాను చాటుకున్నారు. నవలను ఆధారం చేసుకుని తీసిన సినిమా ప్రేక్షకుల్ని మరింత ఆసక్తిగా తిలకించేందుకు దోహదం చేసింది. తద్వారా రచయితగా రౌలింగ్‌కు, సినిమాగా తీసిన వార్నెర్‌ బ్రదర్స్‌కు కనకవర్షంతో పాటు పేరు, అవార్డుల ప్రవాహంలో తడిసిపోయారు.


పేదలపై మనసు
ఇంతటి పేరు, డబ్బును ఏకకాలంలో సంపాదించుకున్న రౌలింగ్‌  తను సంపాదించిన కోట్లాదిరూపాయల్లో ఒక మిలియన్‌ను పేదల కోసం ఖర్చు పెడుతున్నారు. నేను దేవుడిని నమ్ముతాను, ఆయనే నాకు తోడుగా ఉండి, నడిపిస్తున్నాడని నేను భావిస్తుంటాను.

అవార్డులు: 1997లో గోల్డ్‌ అవార్డు, 1998లో బ్రిటిష్‌ ప్రభుత్వం అవార్డు, 1999లో బుక్‌ప్రైజ్‌ అవార్డు, ఇదే సంవత్సరంలో నేషనల్‌ బుక్‌ అవార్డు, చిల్డ్రన్‌ బుక్‌ అవార్డు, 2000లో గోబ్‌లెట్‌ ఆఫ్‌ ఫైర్‌ అవార్డు, 2003లో హ్యారీపొట్టర్‌ అండ్‌ ద ఆర్డర్‌ ఆఫ్‌ ద పోనెక్స్‌ అవార్డు, 2005లో హ్యాఫ్‌బ్లెడ్‌ ప్రిన్స్‌ 2005లో అవార్డు, 2007లో హ్యారీపొట్టర్‌ అండ్‌ ద డెడ్లీ హాల్లోస్‌ అవార్డులను పొందారు.        

0 Comments

అమ్మలగన్న అమ్మ నరసమ్మ!

10/9/2013

0 Comments

 
Picture
ఇంటికొచ్చి "అమ్మా.. నరసమ్మా! నొప్పులొస్తున్నాయి తల్లీ! నువ్వు రాకపోతే తల్లీబిడ్డా దక్కేలా లేరు'' అని చెబితే చాలు. గుడ్డ సంచి చేతికి తగిలించుకుని "పదండి పదండి'' అంటూ ఏ ఊరు, ఎంత దూరం, ఎలా వెళదాం అన్న ప్రశ్నలేవీ అడక్కుండా రయ్యిమని పోవాల్సిన చోటికి వెళ్లిపోతుంది నరసమ్మ.

"అమ్మా.. నరసమ్మా! ఈ లోకం నీకు చేతులెత్తి మొక్కినా నీ రుణం తీర్చుకోలేనిది. పురుడు పోసుకోవడానికే నోచుకోని నిరుపేదల తల్లులకు నువ్వు పెద్దదిక్కు. నువ్వే కనుక లేకపోతే పదిహేనువందల మంది పిల్లలు ఈ భూమ్మీదికి వచ్చేవారా? ఎంతమంది తల్లులు కాన్పుల్లోనే కన్నుమూసేవారో మధ్యతరగతి గర్భిణులే ప్రసూతి ఖర్చుల్ని భరించలేకపోతున్న ఈ రోజుల్లో చిల్లిగవ్వ తీసుకోకుండా పసిగుడ్లకు ప్రాణం పోస్తున్నావంటే.. నువు నరసమ్మవు కావు. అమ్మలుగన్న అమ్మవు..'' సరిగ్గా ఇలాంటి ఉత్తరాలు, ప్రశంసలు, అవార్డులు రివార్డుల వంటివి నరసమ్మను ముంచెత్తుతున్నాయి. మారుమూల పల్లెల్లోని పదిహేనువందల మంది నిరుపేద గర్భిణులకు కాన్పులు చేసినందుకుగాను.. రెండ్రోజుల కిందటే నరసమ్మకు కేంద్రప్రభుత్వం జీవనసాఫల్యపురస్కారం ప్రకటించింది.

ఆంధ్ర- కర్ణాటక సరిహద్దుల్లోని పావగడ తాలూకా క్రిష్ణాపుర వాసి నరసమ్మ. చుట్టుపక్కల ఊళ్లలోని ప్రజలందరికీ ఆమె తలలో నాలుక. అర్థరాత్రి అపరాత్రి అనేం లేదు. ఇంటికొచ్చి "అమ్మా.. నరసమ్మా! నొప్పులొస్తున్నాయి తల్లీ! నువ్వు రాకపోతే తల్లీబిడ్డా దక్కేలా లేరు'' అని చెబితే చాలు. గుడ్డ సంచి చేతికి తగిలించుకుని "పదండి పదండి'' అంటూ ఏ ఊరు, ఎంత దూరం, ఎలా వెళదాం అన్న ప్రశ్నలేవీ అడక్కుండా రయ్యిమని పోవాల్సిన చోటికి వెళ్లిపోతుంది నరసమ్మ. అదేం మహత్యమో కానీ, ఆమె చెయ్యిపడితే చాలు. అప్పటివరకు నొప్పులతో అల్లాడిపోతున్న గర్భిణుల కళ్లల్లో ఆశలు చిగురిస్తాయి. "నాకిప్పుడు తొంభై అయిదేళ్లు. ఇప్పటి వరకు పదిహేనువందల మంది ఆడవాళ్లకు కాన్పులు చేశాను. ఈ సంతృప్తితో నేను ఎప్పుడు పోయినా ఫర్వాలేదు. ఇంతవరకు నా చేతిలో ఒక్క బిడ్డకానీ, తల్లికానీ చనిపోలేదు. మంత్రసాని విద్యను మా అమ్మమ్మ మరిగమ్మ దగ్గర నేర్చుకున్నాను. అప్పట్లో ఆవిడకు ఎంతో పేరుండేది. ఆమె ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్లేదాన్ని. కాన్పులు చేయడంలో ఆమె నేర్పరితనం, గుండె ధైర్యం నన్ను విస్తుగొలిపేవి. అమ్మమ్మ చేతి నైపుణ్యాన్ని చూసి కొన్ని రహస్యాలు నేర్చుకున్నాను. అంతకంటే నాకు ఎలాంటి తెలివితేటలు లేవు'' అంటుంది నరసమ్మ. ఆమెకు పన్నెండేళ్లప్పుడే అంజినప్పతో పెళ్లయింది. వారికి పన్నెండు మంది పిల్లలు.

తను చేసే ప్రతి కాన్పుకు ఒక కథ చెబుతుందీ పెద్దమ్మ. "తొలికాన్పును అనుకోకుండా చేశాను. కనుముక్క అనే ఊరికి కూలిపనికి వెళ్లానప్పుడు. మాతోపాటే కూలిపనికి వచ్చిన ఒక గర్భిణికి అకస్మాత్తుగా నొప్పులు వచ్చాయి. మగవాళ్లు విశ్వప్రయత్నం చేస్తున్నారు. నేనది చూడలేక రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఒకవైపు చేతులు వణుకుతున్నాయి. మరోవైపు ఆ గర్భిణి ఆర్తనాదాలతో తల్లడిల్లిపోతోంది. నాకు తెలిసిన లఘువుతో కాన్పు చేశాను. తల్లీబిడ్డా క్షేమంగా బయటపడ్డారప్పుడు. ఆ రోజు మగబిడ్డ పుట్టాడు'' అని గుర్తు చేసుకుందామె. ఈ రోజుల్లో ఎంత చిన్న ఆస్పత్రి అయినా సరే, కాన్పు చేయాలంటే ఇరవై నుంచి యాభైవేల రూపాయలు తీసుకోవడం సహజం. కానీ నరసమ్మ నయాపైసా అడగదు. కాన్పు అయ్యాక దయతలిచి అంతో ఇంతో చేతిలో పెడితే మాత్రం కాదనదు. నరసమ్మ ఒక్క కర్ణాటకలోనే కాదు. ఆంధ్రప్రదేశ్‌లోనూ పదుల సంఖ్యలో కాన్పులు చేసింది. వచ్చే నెల ఒకటో తేదీన 'ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఓల్డర్స్' సందర్భంగా.. న్యూఢిల్లీలో జరగనున్న కార్యక్రమంలో రూ.2.25 లక్షల నగదు పురస్కారం అందుకోనుంది నరసమ్మ.


0 Comments

జీవన రాగమే మూగబోయింది

10/8/2013

0 Comments

 
Picture
కోట్లాదిమందిని ఆనందడోలికల్లో ఓలలాడించే కళా హృదయుల జీవితాలు అత్యంత విషాదకరంగా ఎందుకు ముగిసిపోతాయో ఏమీ చెప్పలేం. హిందీ సినిమాల్లో 1200 పాటల దాకా పాడిన గీతాదత్ జీవితం అలా విషాదకరగానే ముగిసింది. దాదాపు పాతికే ళ్ల పాటు హిందీ చిత్రసీమను తన స్వర మాధుర్యంతో రాగరంజితం చేసిన గీతారాయ్ జీవితం గురుదత్‌ను ప్రేమ వివాహం చేసుకున్న కొన్నాళ్లకు తీవ్రమైన సంఘర్షణకు గురయ్యింది. ఈ క్రమంలో గురుదత్ ఆత్మహత్యకు చేసుకున్నాడు. ఈ పరిణామంతో హతాషురాలైన గీతాదత్ మద్యానికి బానిసై లివర్ సిర్రోసిస్ బారిన పడి తన 41 ఏటనే కన్నుమూసింది. ఆమె జీవిత విషాదాన్ని అక్షరాలా ప్రతిఫలించే 'దో భాయి' సినిమాలోని 'మేరా సుందర్ సప్‌నా బీత్‌గయా' పాటను జాఁ నిసార్ అఖ్తర్ రచిస్తే ఎస్ డి బర్మన్ సంగీతంలో గీతా దత్ గుండెల్ని పిండేసేలా పాడారు.

మేరా సుందర్ సప్‌నా బీత్ గయా
మై ప్రేమ్ మే సబ్ కుచ్ హార్‌గయీ బేదర్డ్ జమానా జీత్‌గయా
మేరా సుందర్ సప్‌నా బీత్ గయా
( నా అందమైన కల చెదిరిపోయింది
ప్రేమలో నా సమస్తాన్నీ ఓడిపోయాను
దయలేని లోకం జయించింది)
ప్రేమ ఎంతో అద్భుతమైనది. అందమైన ది. అంతటి అపురూపమైన ప్రేమలో ఎవరు మాత్రం పడకుండా ఉంటారు? ప్రేమలో పడిపోవడం సహజమే కానీ, ప్రేమను నిలబెట్టుకోవడం మాత్రం అందరి వల్లా కాదు. ప్రేమలో పడటానికి ఆ ప్రేమికులు ఇద్దరే చాలు. ప్రేమను నిలబెట్టుకునే క్రమంలో కొన్నిసార్లు ఇతరుల జోక్యం కూడా ఉంటుంది. నిజానికి ప్రేమ ఫలించడానికి తోడ్పడే వాళ్లకన్నా, ప్రేమను భగ్నం చే సేవాళ్లే లోకంలో ఎక్కువ . అందుకే ఎన్నోసార్లు ప్రేమికులు ఓడిపోతారు. ఒక్కోసారి ఆ ఇద్దరి మధ్యే ఏవో వైరుధ్యాలు మొదలై కూడా అనుబంధం బీటలు బారవచ్చు. పైగా, ఎంతసేపూ లోకం తమను అర్థం చేసుకోవడం లేదని ప్రేమికులు వాపోతారే కానీ, చాలా వరకు లోకాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యరు. అందుకే అనేక సార్లు ప్రేమికులు చిక్కుల్లో పడతారు.
క్యూ కాలీ బదరియా ఛాయీ హై
క్యూ కలీ కలీ ముస్కాయీ హై
మేరీ ప్రేమ్ కహానీ ఖత్మ్ హుయీ
మేరే జీవన్ కా సంగీత్ గయా / మేరా సుందర్ సప్‌నా /
( ఈ నల్లనల్లని మేఘాలెందుకో ఆవ హించాయి
ప్రతి మొగ్గా ఎందుకో మందహాసం చేస్తోంది.
నా ప్రేమ కథ మాత్రం ముగిసిపోయింది
నా జీవన సంగీతం ఎటో వెళ్లిపోయింది)
ప్రేమికులు ఎలా ఉన్నా, ఏమైపోయినా దాని ప్రభావం ప్రకృతి మీద ఏమీ ఉండదు. ఎవరి కోసమో ప్రకృతి తన దశ దిశల్ని మార్చుకోదు. కాలాలూ, రుతువులూ నిర్ధిష్ట వేళల్లో మారుతూనే ఉంటాయి. రవిచంద్రులు వచ్చి వెళుతూనే ఉంటారు నక్షత్రాలు మొలుస్తూనే ఉంటాయి. ఆకాశం వ ర్షిస్తూనే ఉంటుంది. మొక్కలు మొలుస్తూనే ఉంటాయి. మొగ్గలు వికసిస్తూనే ఉంటాయి. ప్రపంచంలో ఎవరి కోసం ఏది ఆగిందని? కాకపోతే ప్రకృతి గమనం సహజంగా, సజావుగా సాగిపోతున్నంత మాత్రాన మానవ హృదయాల్లో కల్లోలాలు పుట్టకుండా పోతాయా? సంఘర్షణలు తలెత్తకుండా ఉంటాయా? ఒక్కోసారి ఎన్ని ప్రయత్నాలు చేసినా, జీవితం కలతల పాలుకాకుండాపోదు. ప్రేమ కథే అయితే మాత్రం ఏమిటి? ఒక్కోసారి అది అర్థంతరంగా ముగిసిపోవచ్చు. రాగరంజితం అవుతుందనుకున్న జీవితం శోకాలతో హోరెత్తిపోవచ్చు.
ఓ...ఛోడ్ కే జానే వాలే కా
దిల్ తోడ్ కే జానే వాలా ఆ
ఆంఖే అసువన్ మే డూబ్‌గయీ
హస్‌నే కా జమానా బీత్ గయా / మేరా సుందర్ సప్‌నా /
(వదిలేసి వెళ్లిపోతున్నవాడా
మనసు విరిచేసి పోతున్న వాడా ఇటురా
నా కళ్లు కన్నీళ్లలో మునిగిపోయాయి
హాయిగా నవ్వుకునే కాలం అంతమైపోయింది. / నా అందమైన కల/)
ఊరకే వదిలేసిపోతే సరే కానీ, పోతూ పోతూ హృదయాన్ని విరిచేసి పోతున్నాడు కదా! ఆ స్థితిలో ఇంకేమవుతుంది? అప్పటిదాకా వెన్నెలను కురిపించిన కళ్లే కన్నీటిలో మునిగిపోతాయి. హాయిగా నవ్వుకునే క్షణాలు శాశ్వతంగా అంతరించిపోతాయి. నిజానికి ఎన్నేళ్ల తపన అది. ప్రేమ ఇసుక తిన్నెల మీద హాయిగా విహరించాలని ఎంత కాలంగా కంటున్న కల ? తన ప్రేమమూర్తిని వే యి కళ్లతో చూసుకోవాలన్న ఎంత ఆరాట మది? కానీ, ఏమైపోయింది? జీవితం జీవితమంతా తనను వె న్నంటి , తోడుగా, నీడగా ఉంటాడనుకున్నవాడు చివరికి ఇలా తనను వదిలేసి వెళ్లిపోతున్నాడు. ఊరికే పోకుండా మనసును తునాతునకలుగా విరిచేసి వెళ్లిపోతున్నాడు. ఆ స్థితిలో ఏ ప్రేమికుల జీవితంలోనైనా జరిగేదేమిటి? జీవితం కన్నీటి పర్యంతం అయిపోతుంది. ఆనందంగా సాగిపోతాయనుకున్న క్షణాలు విషాదంగా ముగిసిపోతాయి.
హర్ రాత్ మేరీ దివాలీ థీ
మై పియా కీ హోనేవాలీ థీ
ఇస్ జీవన్ కో అబ్ ఆగ్ లగే....ఆగ్ లగే
ముఝే ఛోడ్‌కే జీవన్ మీత్ గయా / మేరా సుందర్ సప్‌నా /
( ప్రతి రే యీ నాకో దీపావలిలా ఉండేది.
నేను నా ప్రియతముని సొంతమైపోయే దాన్నే కానీ,
ఈ జీవితానికి ఇప్పుడు నిప్పంటుకోనీ.... నిప్పంటుకోనీ
నా జీవననేస్తమే నన్ను వదిలేసిపోయాడు / నా అందమైన కల /)
ప్రేమ మహొద్వేగంగా సాగిపోతున్న వేళల్లో హృదయంలో కోటి దీపాలు వెలుగుతున్నట్లే అనిపిస్తుంది. ఆ దీపాల వెలుగులో తన ప్రియతముడు తనలో కలిపేసుకున్నట్లే అనిపిస్తుంది. అతని జీవిత సామ్రాజ్యంలో తనో అర్థభాగమైపోయినట్లే అనిపిస్తుంది. కానీ, అంతలోనే ఎంతో మార్పు. జీవితమంతా తనతోనే ఉంటాడనుకున్న అతనే తనకు శాశ్వతంగా దూరమైపోతున్నాడు. ఆ స్థితిలో జీవితం ఉండి మాత్రం ఏం చేస్తుంది? కాలిపోనీ అనిపిస్తుంది. ప్రేమే ప్రపంచం అనుకుని జీవిస్తున్న వారికి ప్రేమ దూరమైతే ప్రపంచం దూరమైనట్లే కదా! అలా తమ ప్రపంచమే కోల్పోయిన వారి హృదయ ఘోష ఎలా ఉంటుందో ఎవరో చెప్పాల్సిన పనేముంది? ఎవరికి వాళ్లు అవలీలగా ఊహించుకోవచ్చు. కాకపోతే ప్రేమికులు తమదైన ఊహాలోకానికే పరిమితమై పోకుండా వాస్తవిక ప్రపంచాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే బహుషా ఈ విషాదాలకు అంత తావుండ దేమో!


0 Comments

నృత్య వైభవం

10/7/2013

0 Comments

 
Picture
కళకు వన్నె తెచ్చిన షర్మిష్ఠ ముఖర్జీ
రాజకీయాలు అంటే అంతగా నచ్చవు
హంగు ఆర్భాటాలకు చాలా దూరం
నలుగురిలో కలిసిపోయే మాటకారి
నిర్మొహమాటం ఎక్కువ
ప్రణబ్‌తో సాన్నిహిత్యం ఎక్కువ

                  భారతీయ నృత్య వైభవం ఆమె ప్రదర్శనలో సాక్షాత్కరిస్తుంది. రాష్టప్రతి కుమార్తె అన్న భావన ఏమాత్రం ఆమెలో కనిపించదు. అందరిలో తను ఒకరిలా కలివిడిగా కలిసిపోతుంది. అందుేక ఆమె అంటే ఇష్టపడే సహచరులు ఎందరో ఉన్నారు. ప్రణబ్‌ ముఖర్జీ కుమార్తెగా కంటే కథక్‌ నృత్యకారిణిగా గుర్తింపు రావడమే తనకు విశేషమని చెబుతుంటారు. నాలుగు రోజుల క్రితం విశాఖలో జరిగిన ఓ ఉత్సవాల తొలి ప్రదర్శనగా భారత రాష్టప్రతి కుమార్తె శర్మిష్ఠా ముఖర్జీ కథక్‌ నృత్యం అందరిని ఆకట్టుకుంది.

                       శర్మిష్ఠ జన్మస్థలం కోల్‌కత్తా. ఢిల్లీలో పెరిగింది. లేడీ ఇర్విన్‌, సెయింట్‌ స్టెఫన్స్‌, జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయాల్లో విద్యాభ్యాసం,ఆమెకు పిన్నవయస్సు నుండే నృత్యంపై వల్ల మాలిన అభిమానం. ఎన్నో ప్రదర్శనలు నిర్వహించింది. తరచూ మ్యూజియాలను, చరిత్రకు సంబంధించిన ప్రదేశాలను సందర్శిస్తూ ఉంటుంది. పండిట్‌ దుర్గాలాల్‌, ఉమాశర్మ, రాజేంద్ర గంగానీ వద్ద ఆమె నృత్యాన్ని అభ్యసించింది. తండ్రి పనుల్లో బిజీగా ఉండడంతో తల్లి సుద్ర, కుమార్తెను నృత్యం నేర్చుకోవటానికి తగిన ప్రోత్సాహం అందజేసింది.

                            విశాఖలో కథక్‌ ప్రవాహ్‌ పేరున గంటపాటు ఆమె ప్రదర్శించిన నృత్య విన్యాసాలు ప్రేక్షకులను రంజింపజేశాయి. ఈ సందర్భంగా శర్మిష్ఠకు నాట్యశ్రీ బిరుదు ప్రదానం చేశారు. శర్మిష్ఠముఖర్జీ ఆషామాషా వ్యక్తి కాదు. ప్రపంచ వ్యాప్తంగా భారతీయ కళలకు రాయబారిగా విధులు నిర్వ హిస్తోంది. ఆమె కథక్‌ కళాకారిణి. క్లాసికల్‌ డాన్స్‌లో మేటి. తనకంటూ ప్రత్యేక స్థానానికై కృషి చేసింది. తండ్రి చాటు బిడ్డగా కాకుండా, ప్రావీణ్యతలో తనదైన శైలిని ప్రదర్శించింది. షర్మిష్తాకు ఇద్దరు సోదరులు. అభిజిత్‌. ఇంద్రజిత్‌. ఓ సారి ఓ ఆకతాయి తనను వేధిస్తుడంటూ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అంతే మంత్రిగారి కూతురు కావడంతో పోలీసులు నానా హడావుడి చేశారు. ఎక్స్‌ కేటగిరి భద్రత ప్రకటించారు. దీంతో శర్మిష్ఠకు కోపం వచ్చింది. ఏదో అతన్ని మందలించమని చెబితే ఇంత తతంగం ఎందుకు చేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేసింది. ఆమె సమాజంలో ఇతర స్ర్తీలలా ఉండాలని కోరుకుంటుంది.

                               అనవసర హంగు ఆర్భాటాలు అంటే నచ్చవు అనడానికి ఇదో ఉదాహరణ మాత్రమే.ఆమె వ్యక్తిగత గ్రంథాలయంలో విలువైన పుస్తకాలు ఎన్నో ఉంటాయి. ఎన్నో పరిశోధన గ్రంథాలు, నవలలు చోటు చేసుకున్నాయి. ఆమెకు వైన్‌ అంటే ఇష్టం. శునకాలు, వర్ణచిత్రాలు, పెద్ద కార్‌ షోలంటే మక్కువ. సుప్రసిద్ధ యూసఫ్‌ అర్రకాల్‌ పెయింటింగ్స్‌ ఆమె ఇంటిలో ఉన్నాయి. శర్మిష్ఠ ఆరేళ్ల క్రితమే భర్త నుండి విడాకులు తీసుకుంది. ఆమెకు జంతువులపై ప్రేమ ఎక్కువ. కుక్క పిల్లలను సాకుతుంది.అవి లేకపోతే ఆమెకు తోచదు. వారింట్లో కుక్కలకు గుగ్లీ, జున్ను, ధియోరా అని నామకరణం చేసింది. ఆరోగ్యపరంగా, వాటికేమైనా తేడా చేస్తే, తాను ప్రదర్శనలోనూ పాల్గొనదు. ఓసారి తండ్రి అంటార్కి టాకు బయలుదేరితే, తనను అంటార్కిటికా తీసుకువెళ్లమంది, లేకపోతే చంపమని నిర్మొహమాటంగా చెప్పింది. శర్మిష్ఠ ససేమిరా రాజకీయాలకు రానంటుంది. ఆరు ఎపిసోడ్ల ‘తాల్‌మేల్‌’ అనే నృత్య రూపకాన్ని టెలీ సీరియల్‌గా ప్రదర్శించింది. ‘బియాండ్‌ ట్రెడిషన్‌’ పేరున ఫీచర్‌ ఫిల్‌‌మను డాన్స్‌పై నిర్మించింది.

                        తనకు నచ్చని ఏమి చేసినా కుటుంబ సభ్యులు అని కూడా చూడకుండా ఖండిస్తుంది. ఢిల్లీలో అత్యాచారాల నేరాలను ఖండిస్తూ జరుగుతున్న ఆందోళనలపై అబిజిత్‌ తన అభిప్రాయాన్ని చెప్తూ విధ్యార్ధినుల కంటే ఎక్కువగా మహిళలే ఉన్నారని పేర్కొన్నారు. వాస్తవ పరిస్థితులు తెలియని వారు ఆందోళనల్లో పాల్గొంటున్నారని అభిజిత్‌ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బయట ప్రజలతో పాటు ఆయన సోదరి శర్మిష్ఠ కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం ఆమె నిర్మొమమాటానికి ప్రతీకగా చెప్పవచ్చు.

                          శర్మిష్ఠ కథక్‌ కళకే అంకితం. కథక్‌ నృత్య ప్రదర్శనల కోసం తక్కువ సమయంలో ప్లాన్‌చేసి రైలులో ప్రయాణించవలసి వచ్చేది. ఆ పరిస్థితులలోనే, రిజర్వేషన్‌ కోసం తండ్రి పేరును వినియోగించుకునేది తప్ప మిగతా ఏ పనులకూ తండ్రిని అర్థించలేదు. శర్మిష్ఠ మాటకారి. ఎక్కడ ఎప్పుడు ఎలా మాట్లాడాలో ఆమెకు బాగా తెలుసు. భవిష్యత్తు కోసం ప్రత్యేకంగా ప్రణాళికలు ఎప్పుడూ వేసుకోదు. నడుస్తున్న కాలానుగుణంగా జీవిస్తుంది. ఆమె వెనిజులాకు 2004లో వెళ్లింది. భారతీయ సాంస్కృతిక ప్రదర్శనలు అక్కడ తక్కువే. శర్మిష్ఠ ప్రదర్శనతో అందరినీ మెప్పించింది. సంగీతం, నృత్య ప్రదర్శనలతో హద్దుల గోడలను పటాపంచలు చేయవచ్చని ఆమె నమ్మకం

0 Comments

పాత చిత్రాల పోస్టర్లతో ...కొత్త డిజైన్లు

10/5/2013

0 Comments

 
Picture
నిదా ప్రతిభకు అద్దం పట్టే కళ
ఫ్యాషన్‌ డిజైనర్‌గా జాతీయ స్థారుులో కీర్తి
పాత పోస్టర్లపై మక్కువ ఎక్కువ
‘న్యూ ఇండియా బయోస్కోప్‌’ స్థాపన

ప్రస్తుతం యువతలో చాలా మంది టెక్నాలజీ అంటూ ముందుకు దూసుకుపోతున్నారు. ఈ సరికొత్త పరిజ్ఞానంతో వినూత్నమైన వస్తువులు తయారు చేయడమే కాదు. వాటితో సమయాన్ని ఎలా పొదుపు చేసుకోవాలో ఆలోచిస్తున్నారు. చేసే పని వేగంగా పూర్తయ్యే మార్గాల కోసం ప్రయత్నిస్తున్నారు. అరుుతే అందరూ ఇలాగే ఆలోచిస్తున్నారంటే పొరబాటే. ఈ నాటి కాలంలోని కురక్రారులోనూ పాత కళాకృతులపై మక్కువ చూపే వారు ఉన్నారు. వాటికి నేటి పరిజ్ఞానాన్ని జోడించి అందమైన కళాకృతులను రూపొందిస్తున్నారు. వారిలో నిదా మహ్మూద్‌ ఒకరు. తనకి డిజైన్‌పై ఉన్న మక్కువతో పాత చిత్రాల పోస్టర్లను రూపొందిన కళాకారులను అన్వేషిస్తున్నారు. వారి చేత ఆకర్షణీయమైన రూపాలను డిజైన్‌ చేరుుస్తున్నారు. ఆనాటి కళాకారులకు ఉపాధిని కల్పిస్తున్నారు.

వివిధ రకాల కళాకారుల కలయిక చిత్రరంగం. ఇందులో పోస్టర్లను రూపొందించే వారు కూడా ఒకరు. కాని నేటి కాలంలో చేతితో పోస్టర్లను చిత్రీకరించేవారు కనుమరుగైపోతున్నారు. అంతా టెక్నాలజీ మహిమతో డిజిటల్‌ ప్రింట్లు దర్శనమిస్తున్నాయి. ఎంత టెక్నాలజీ వచ్చినా, పాత చిత్రాల్లోని వస్తువులు, వాటి పోస్టర్లకు నేటి డిజిటల్‌ ప్రింట్లు జీవం పోయలేవని భావిస్తారు ఫ్యాషన్‌ డిజైనర్‌ నిదా మహ్మూద్‌. తను అనేక చిత్రాలకు ఫ్యాషన్‌ డిజైనర్‌గా పని చేయడమే కాకుండా, చిత్రీకరణకు ఉపయోగమైన సామాగ్రిని కూడా డిజైన్‌ చేశారు. అయితే ఈమెకు పాత పోస్టర్లపై మక్కువ ఎక్కువ. అందులో ఎంతో అందం ఉంటుందని చెబుతుంటారు. అందుకే వాటిని రూపొందించిన కళాకారులను అన్వేషించి, వారి చేత అనేక కళాకృతులను సృష్టింపజేస్తున్నారు. వాటికి నేటి ఆధునిక పరిజ్ఞానాన్ని జోడించి మరింత ఆకర్షణ తీసుకొస్తున్నారు నిదా. ఆనాటి కళను నేటి వారికి పరిచయం చేయడానిి కృషి చేస్తున్నారు.

నిదా ఆలోచనలు విభిన్నమైనవి. ఈమె న్యూ ఇండియా బయోస్కోప్‌ అనే కంపెనీని స్థాపించింది. దీన్ని ఒక ప్రొడక్ట్‌ డిజైన్‌ హౌస్‌గా తీర్చిదిద్దింది. దీనికి పెద్ద కాన్వాస్‌గా భావించి బాలీవుడ్‌ చిత్ర వైభవాన్ని చాటాలని ప్రయత్నించింది. ఇందులో భాగంగా పాత చిత్రాల్లోని కుర్చీలు, టేబుల్స్‌, బ్యాగ్స్‌, షూస్‌, డైరీలు, పోస్టర్లు, ఇలా ఎన్నో వస్తువుల సేకరణలో మునిగిపోయింది నిదా మహ్మూద్‌.ఇలా పాత చిత్రాల్లోని వస్తువులను సేకరించడమే కాకుండా వాటిని రూపొందించిన కళాకారులను కూడా అన్వేషించారు నిదా. ‘గత వేసవిలో, మా ఆయన రావుల్‌ చంద్రతో కలిసి పాత ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలకు వెళ్లాం. అక్కడ కళాకారుల కోసం వెతికాం. పాత ఢిల్లీలో ఐదు మంది పోస్టర్‌ ఆర్టిస్ట్‌లను కలుసుకోగలిగాం. చాలా మంది కురువృద్ధులై పోయారు. మరణానికి దగ్గరి పరిస్థితిలో ఉన్నారు.

అక్కడ వారు ఆర్టిస్టులు ముంబాయి, వడోదరాలో ఉంటారని చెప్పారు. దాంతో మేం అక్కడికి వెళ్లి వారి కోసం అన్వేషించాం. వరికి కొంతమందిని కనుగొన్నాం. అందులో 85 సంవత్సరాల వయసు గలిగిన పోస్టర్‌ ఆర్టిస్ట్‌ను గుర్తించాను. అతను ప్రస్తుతం ఏమీ గీయలేరు. కాని ఆయన ఎన్నో వివరాలు చెప్పారు. అవి నాకు ప్రోత్సాహాన్నిచ్చింది’ అని నిదా అన్నారు.
ఈ పోస్టర్‌ కళాకారుల గురించి నిదా వివరించారు. దాదాపు 15 సంవత్సరాల నుంచి హ్యాండ్‌ పెయింట్‌తో చేసిన పోస్టర్‌ లేదు. ఈ కళాకారులు తమ వృత్తిని వదులుకొని వివిధ కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ ఆర్టిస్ట్‌లు పెద్ద భవనాల వద్ద వాచ్‌మెన్‌లుగా స్థిరపడ్డారు. మరికొంత మంది ఇంట్లో గోడలకు పెయింట్‌లు వేసుకుని కడుపు నింపుకుంటున్నారు. నేను వారిని కలిసి... మీరు అభిమానించే పాత వృత్తిని చేపట్టండని వారిని చెప్పాను.
యూరోపియన్‌లు పాత తరహా డిజైన్‌తో రూపొందిన ఉత్పత్తులను ఇష్టపడుతున్నారు. విదేశాల నుంచి విరివిగా ఆర్డర్లు వస్తున్నాయి అని నిదా చెప్పారు.

చిత్ర నిర్మాణానికి మాత్రమే కాకుండా కుటుంబ సభ్యుల చిత్రాలను చిత్రీకరించడానికి, వెడ్డింగ్‌ కార్డుల డిజైన్‌కు ఈ శైలిని కోరుకుంటున్నారని అన్నారు.వీటిని ఇష్టపడే వారు రోజురోజుకి పెరిగిపోతుండంతో నాకు చాలా ఆనందంగా ఉంది. ఆఫ్‌బీట్‌ చిత్రాలకు డిజైన్‌ చేయడమంటే నాకు చాలా ఇష్టం. వాటికి చేసే అవకాశం రావాలని కోరుకుంటున్నాను. అలాగే గృహోపలంకరణ వస్తువులు, రెస్టారెంట్‌లోని కళాకృతులను చేయాలన్నా చాలా ఆసక్తి.నా జీవితంలో ఇది మంచి నిర్ణయం. నేను ఇలాంటి రంగంలోకి వెళతాను అనిచెప్పేసరికి మా పేరెంట్స్‌ అంతా మొదట షాక్‌ తిన్నారు. నాకంటూ ప్రత్యేకమైన గుర్తింపు కలిగిన వృత్తి చేపట్టాలని భావించాను. దానికి నా తల్లిదండ్రులు నన్ను ప్రోత్సహించారు. దాంతో నేను ఇప్పుడు నేను ప్రస్తుత స్థాయిలో ఉన్నాను. అందుకే ఈ నిర్ణయం తీసుకోవడం నా జీవితంలో మంచిదని నేను భావిస్తుంటాను.

నా లాగా పాత సినిమాలోని వస్తువులను సేకరించి భద్రంగా దాచిపెట్టిన వారిని కలిసాను. వారి వద్ద ఉన్నవాటికి మరలా పెయింటింగ్‌ చేశాను. ఇవి చాలా మందిని ఆకట్టుకుంది. అప్పుడు వారు దీవార్‌ పోస్టర్లు, బసంతి బ్యాగ్‌లు, గబ్బార్‌, జీనత్‌ కుర్చీలు కోరారు. ఇలా అనేక రకాల పోస్టర్లకు అవకాశాలు వస్తున్నాయి. దీంతో పోస్టర్‌ పెయింటింగ్‌ కళాకారులకు మంచి ఉపాధి దొరికింది.


0 Comments

అనుపమాన కృషి

10/4/2013

0 Comments

 
Picture
                         బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమ లోని అగాధాల నేపథ్యం లో రాసిన సంకలనం ‘ఇవవై దశాబ్ధాల హిందీ సినిమా’ అనే పేరుతో పెంగ్విన్‌ ఇండియా వారు ప్రచురించారు. ఈ గ్రంథానికి మంచి ఆదరణ, ప్రశంసలు అందుకుంది అనుపమ. ఈమె మరో గ్రంధం ‘ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో’. ఈ పుస్తకానికి ముందు మాట షారూక్‌ ఖాన్‌ రాయడం మరింత ఉత్సాహాన్ని నింపింది.

                            అభివృద్దిచెందిన అనేక రంగాల్లో చలనచిత్ర పరిశ్రమ అతి పెద్ద ఏకైక రంగంగా నిలిచింది. అయితే తెరమీద కనిపించే వారే ఈ రంగంలో సాధారణంగా ప్రజల దృష్టిపథంలో ఉంటారు. కానీ, ఇందుకు కారణమైన తెరవెనుక ప్రజ్ఞావంతులు చాలా వరకూ ఎవరికీ తెలియరు. కానీ ఏ సినిమా సూపర్‌ హిట్టయినా కేవలం నటీనటులవల్లనే అనుకునే భ్రమలు ఇంకా ప్రేక్షకలోకాన్ని విడిచిపెట్టలేదు. ఒక సినిమా రూపొందాలంటే దాని వెనుక ఎన్ని రంగాల నిపుణులు శ్రమిస్తారో ఒక్కసారి ఆలోచిస్తే చిత్ర విజయ సారథులు ఎవరు? అన్న విషయం తేటతెల్లమవుతుంది.

                         ఈ విధంగా ప్రజ్ఞాపాఠవాలతో అందరి మన్ననలు పొందిన వారిలో ఒకరు ‘అనుపమ చోప్రా’. ఈమె ఒక రచయిత్రి, జర్నలిస్ట్‌, సినీ విమర్శకురాలు. ఈమె ఎన్నో భారతీయ చలన చిత్రాల మీద ఎన్నో గ్రంధాలు రాసింది. సమీక్షకురాలిగా ఎన్‌డిటీవీకి, ఇండియా టుడేకి తన వ్యాసాలు అందిస్తోంది. అలాగే హిందుస్తాన్‌ టైమ్స్‌ పత్రికకి కూడా సినిమా విమర్శకురాలిగా ఉంటోంది.

చిన్ననాటి ముచ్చట్లు
                      అనుపమ చోప్రా కలకత్తాలోని ఒక బెంగాలీ కుటుంబంలో జన్మించింది. తండ్రి యూనియన్‌ కారె్బైడ్‌లో ఉద్యోగి. తల్లి కామ్నా చంద్ర సినీ రచయిత్రిగా ఎన్నో చిత్రాలకి డైలాగులు రాసింది. ప్రేమ్‌రోగ్‌, చాందినీ చిత్రాలకి మాటల రచయిత అనుపమ తల్లి కామ్నా చంద్రే. అనుపమ అసలు పేరు కూడా అనుపమ చంద్ర. వివాహానంతరం అనుపమ చోప్రాగా మారింది. అనుపమ బాల్యం అంతా ముంబాయిలోనే సాగింది. యుక్త వయసులో చాలా సంవత్సరాలు హాంగ్‌కాంగ్‌లో ఉంది. 1987లో ముంబాయ్‌లోని సెయింట్‌ జేవియర్స్‌ కాలేజీలో బి.ఎ లిటరేచర్‌ పూర్తిచేసింది. తన టీచర్‌ సలహా అనుసరించి జర్నలిస్ట్‌గా స్థిరపడాలని నిర్ణయించుకుని నార్త్‌ వెస్ట్రన్‌ కళాశాలలో మెడిల్‌ స్కూల్‌ ఆఫ్‌ జర్నలిజంలో ఎం.ఏ పూర్తిచేయడమే కాకుండా హర్రింగ్‌టన్‌ అవార్డని సాధించింది. మొదట్లో అనుపమ సినిమాకోసం పనిచేయడడం ఎవరూ ఇష్టపడలేదు. అయినా పట్టుదలతో ఆ రంగంలో విజయాలు సాధించి అందరి మన్ననలు అందుకుంది.

కృషి, పట్టుదల
                     అనుపమ చోప్రా ఎన్నో విలువైన పుస్తకాలు రచించింది. ఈమె మొట్టమొదటి రచన ‘షోలే’. ఇది ఎంతటి సంచలనాన్ని కలిగించిందో వేరే చెప్పనవసరం లేదు. 2000 సంవత్సరంలో ఈమె రాసిన ది మేకింగ్‌ ఆఫ్‌ క్లాసిక్‌ అనే గ్రంధానికి 2001లో నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డ్‌ లభించింది. తరువాత 2002లో ఈమె రచించిన ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే’ పుస్తకాన్ని బ్రిటీష్‌ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ద్వారా ప్రచురించబడింది. ఇది ఆమె అధునిక రచనా సంపుటాల్లో ఒకటి. ఇది ఎంతో గర్వకారణంగా చెప్పవచ్చు. అలాగే ఈమె రచించిన ‘కింగ్‌ ఆఫ్‌ బాలీవుడ్‌’ షారూక్‌ ఖాన్‌ అండ్‌ ది సెడెక్టివ్‌ వరల్డ్‌ ఆఫ్‌ ఇండియా’ అనే మరో పుస్తకం గురించి న్యూయార్క్‌ టైమ్స్‌ మాగజైన్‌లో ఎడిటర్స్‌ చాయిస్‌ శీర్షిక కింద సమీక్ష ప్రచురితమయ్యింది. అనుపమ కృషికి ఇదో కలికితురాయిగా అభివర్ణించవచ్చు.

                               బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలోని అగాధాల నేపథ్యంలో రాసిన సంకలనం ‘ఇవవై దశాబ్ధాల హిందీ సినిమా’ అనే పేరుతో పెంగ్విన్‌ ఇండియా వారు ప్రచురించారు. ఈ గ్రంథానికి మంచి ఆదరణ, ప్రశంసలు అందుకుంది అనుపమ. ఈమె మరో గ్రంధం ‘ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో’. ఈ పుస్తకానికి ముందు మాట షారూక్‌ ఖాన్‌ రాయడం మరింత ఉత్సాహాన్ని నింపింది. ఇలా అనుపమ రచనలు కేవలం పుస్తక రూపాల్లోనే కాకుండా ‘ఇండియా టుడే’, ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ , ‘ది లాస్‌ ఏంజిల్స్‌ టైమ్స్‌’, వంటి ప్రతిష్ఠాత్మకమైన అనేక పత్రికలో ప్రచురితమయ్యాయి. అవుతున్నాయి కూడా. అలాగే స్టార్‌ వరల్డ్‌ చానెల్‌లో ప్రతివారం ‘ది ఫ్రంట్‌ రో’ అనే చిత్ర సమీక్షా కార్యక్రమాన్ని అనుపమ నిర్వహిస్తోంది. నిర్విరామ కృషితో అంచలంచెలుగా విజయ సోపానాలు అధిరోహిస్తున్న అనుపమ చోప్రా మరింత మందికి ఆదర్శవంతంగా నిలుస్తుందని కోరుకుందాం.


0 Comments

ఉపాధితో వెన్నుదన్ను

10/4/2013

0 Comments

 
                      మాది గుంటూరు. పీజీ అయ్యాక ఓసారి స్నేహితురాల్ని కలవడం కోసం హైదరాబాద్‌ వచ్చా. అప్పుడే డెక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల గురించి తెలిసింది. వాళ్లు ఏర్పాటు చేసిన ఓ ఎగ్జిబిషన్‌కు వెళ్లా. అక్కడికొచ్చిన గ్రామీణుల్ని చూశా. చదువుకునే అవకాశం లేక, ఉపాధి మార్గాలు అందుబాటులో లేక వాళ్లు పడుతున్న ఇబ్బందులు నన్ను కదిలించాయి. ఐదంకెల జీతం కన్నా పదిమంది జీవితాల్లో మార్పుకి కారణమైతే కలిగే సంతోషమే ఎక్కువనిపించింది. వెంటనే ఆ సేవా సంస్థలో సభ్యురాలిగా చేరాను. కొంత జీతం ఇచ్చేవారు. అది నా అవసరాలకు సరిపోయేది. సహోద్యోగి నర్సన్నను పెళ్లి చేసుకున్నాను.

                  కొన్నేళ్ల పాటు ఇద్దరం గ్రామీణుల మధ్య ఉంటూ వాళ్లకు చదువు చెప్పడం, ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయడం, ఆధునిక వ్యవసాయ పద్ధతుల గురించి చెప్పడం చేశాను. ఆ సమయంలోనే సహజ వనరుల్ని ఉపయోగించుకోలేక, స్వయం ఉపాధి అవకాశాలు లేక మహిళలు పడే ఇబ్బందిని గమనించాను. ఆ చేయూతను వాళ్లకందిస్తే అభివృద్ధి సాధిస్తారని అనిపించింది. అనుకున్నదే తడవు, అరణ్య అగ్రికల్చర్‌ ఆల్టర్‌నేటివ్స్‌ పేరుతో సంస్థను ప్రారంభించా. మహిళా సాధికారత లక్ష్యంగా మెదక్‌ జిల్లాలోని కొన్ని వెనుకబడిన గ్రామాలను ఎంచుకొన్నా. మహిళలకు చదువు చెప్పడంతో పాటూ ఆదాయం సంపాదించడం, ఆదా చేసుకోవడం గురించి అవగాహన కల్పించా. అప్పుడే ప్రభుత్వ డ్వాక్రా సంఘాల ఏర్పాటును ప్రోత్సహిస్తోంది.

                    నేను స్థానిక డీఆర్‌డీఏ అధికారుల సాయంతో ఆరొందల బృందాలనూ, నాలుగు మహిళా సమాఖ్యలనూ ఏర్పాటుచేశా. వర్షపు నీటిని నిల్వ చేసుకోవడం, భూగర్భజలాలు పెరిగేలా చూడటం, చెక్‌ డ్యామ్‌ల నిర్మాణం వంటి పనుల్ని మహిళా గ్రూపులకు అనుసంధానం చేశాం. సామాజిక వనాలూ, వంటింటి తోటలూ, నర్సరీల ఏర్పాటులో వాళ్లని నిమగ్నం చేశాం. దీంతో చాలామందికి ఆదాయ మార్గం ఏర్పడింది. భూసారాన్ని సంరక్షిస్తూ, పండ్ల తోటలూ కూరగాయలూ ఒకేచోట పండించే ప్రకృతి హితమైన వ్యవసాయ పద్థతులను గ్రామీణులకు పరిచయం చేయాలనుకున్నా. అందుకోసం కొన్ని ఎకరాల్లో పంట వేశాం. ఎరువులు లేకుండా పండించాం. దిగుబడి బాగా వచ్చింది. దీన్ని మెదక్‌ జిల్లాలోని ఎల్గోయి, ఆరు గ్రామాల్లోని రైతులు అందిపుచ్చుకున్నారు.

                         ఉత్సాహంతో వెనుకబడిన ఆదిలాబాద్‌ జిల్లాలోని ముప్ఫై గిరిజన గ్రామాల్లో ఎరువుల వాడకం లేకుండా సహజ పద్ధతుల్లో పంట దిగుబడి పెరిగేలా, మంచి లాభం వచ్చేలా ప్రణాళికలు అమలు చేశాం. మిద్దిచింత, రాంపూర్‌ వంటి గ్రామాల్లో కరెంటు సౌకర్యం లేకపోవడం గమనించి... పది లక్షల రూపాయలతో సౌరశక్తి దీపాలు ఏర్పాటుచేశాం. గ్రామీణుల సహకారంతో అరుదైన కూరగాయలూ, పండ్ల విత్తనాలను సేకరించి లక్ష మొక్కలతో రెండు నర్సరీలను ఏర్పాటు చేశాం. వీటిల్లో ఉత్పత్తి అయ్యే పండ్లూ, కూరగాయ మొక్కల్ని రైతులు తమ పొలంలో పెంచుకుని దిగుబడి సాధిస్తున్నారు. ఆదాయం పొందుతున్నారు. చిన్న చిన్న దుకాణాలు పెట్టుకోవాలనుకునే వారికి బ్యాంకులతో మాట్లాడి రుణం ఇప్పించడంతో చాలా కుటుంబాలు ఆర్థికంగా స్థిరపడ్డాయి

0 Comments

మహిళా సమస్యలపై పోరాటం

10/2/2013

0 Comments

 
Picture
మహానగరంలో టాయ్‌లెట్ల కోసం ఇబ్బందులు
పాదయాత్ర నిర్వహించిన మహిళా రాజ్యాధికార సంఘం అధ్యక్షురాలు
మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం పేరిట ఉద్యమం
విద్యార్థునుల సమస్యలపై ఆవేదన
దాదాపు నెల రోజులు జనం మధ్యే
త్వరలో రాజకీయాల్లోకి వస్తా
నిర్మాతగా రాణిస్తున్న ఆకుల విజయ


                   సందేశాత్మక చిత్రాల నిర్మాతగా ఎంతో మందికి ఆమె సుపరిచితం. కానీ అంతటితో ఆమె సరిపెట్టుకోలేదు. సమాజానికి తన వంతు బాధ్యతగా ఏదో చేయాలని తలచింది. అది మహిళల సమస్య అరుుతే బాగుటుందని భావించింది. నగరంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుంది. అందులో ఆమెకు చాలా ఇబ్బంది, బాధ అనిపించిన విషయం మహిళలు టాయ్‌లెట్లు లేక ఇబ్బందిపడడం. ఇది ఎవరికీ చెప్పుకోలేని బాధ. సమస్య పరిష్కారం కోసం ఆమె పాదయాత్ర చేసింది. నిర్మాతగా, మహిళా నాయకురాలిగా పలువురి మన్ననలు అందుకున్న ఆమే ఆకుల విజయ.

                   హైదరాబాద్‌ నగరం మహా పట్టణం. కోట్ల జనాభాతో దేశంలోనే ఐదవ అతిపెద్ద నగరంగా, ఐటి హబ్‌గా, దేశానికి రెండో రాజధానిగా విల్లసిల్లుతోంది. ఇది ఒక పార్శం మాత్రమే. రెండోవైపు ఎన్నో సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. నిరంతరం లక్షల మంది మహిళలు వివిధ కారణాల రీత్యా నగరంలో తిరగాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి స్థితిలో ఎప్పుడైనా టాయ్‌లెట్‌కు వెళ్లాలంటే ఎలా? ఇది ఎవరికీ చెప్పుకోలేని బాధ. ఎంతో మంది ఇబ్బంది పడుతూనే ఉన్నారు. అలాంటి వారి బాధను అర్థం చేసుకున్న మహిళా రాజ్యాధికార సంఘం అధ్యక్షురాలు ఆకుల విజయ ఉద్యమం ప్రారంభించింది. 35రోజులు పాదయాత్ర చేసింది. నగరంలోని పలు ఏరియాల్లో పర్యటించి వారి ఇబ్బందులను తెలుసుకుంది. పాఠశాలలను సందర్శించింది. వందల మంది విద్యార్థునులు ఉన్న పాఠశాలల్లో కూడా ఒకే ఒక్క టాయ్‌లెట్‌ ఉండడం ఆమెను ఆవేదనకు గురిచేసింది. ఆమె పాదయాత్ర ద్వారా ఈ ఇబ్బందిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది.

                    మొదట ఇదేం సమస్య అన్న వారే తరువాత విజయ మహిళల ఆత్మ గౌరవ పాదయాత్రకు మద్దతు ప్రకటించారు. ఫిబ్రవరి 10 తేదీన ప్రారంభం అయిన ఆకుల విజయ పాదయాత్ర నగరంలోని చాలా ప్రాంతాల్లో సాగి మార్చి 5 ముగిసింది. మల్కాజ్‌గిరి, ఉప్పల్‌ ప్రాంతాల్లోని స్కూల్‌ విద్యార్థునుల ఆమె ముందు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. వారి ఇబ్బందులు విన్న విజయ ఎంతో చలించిపోయారు. బల్కంపేట, ఎస్‌ఆర్‌ నగర్‌ ప్రాంతాల్లోనే కాక చుట్టు పక్క ప్రాంతాల మహిళలు కూడా సమస్యల పరిష్కారంలో కోసం ఈమెను సంప్రదిస్తుంటారు. వారి విన్నపంలో న్యాయం ఉందని అనిపిస్తే వారికి సాయం చేస్తారు విజయ. పాదయాత్ర గురించి ఆమె మాట్లాడుతూ నగరంలో ఇంత మంది మహిళలు సంచరిస్తుంటే ప్రభుత్వ పట్టనట్లు వ్యవహరించడం సరికాదన్నారు. విద్యార్థునులు ఎక్కువగా ఉన్న పాఠశాలలో సంఖ్యాపరంగా టాయ్‌లెట్లను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేసింది. మహిళల ఇబ్బందులను తెలియజేస్తూ పలువురు మంత్రులను కలిసి విన్నవించినట్లు చెప్పారు.

                     విజయ అభ్యర్థనకు వారు సానుకూలం స్పందించి సిఎంతో మాట్లాడతామని హామీ ఇచ్చినట్లు ఆమె వివరించింది. దీనిపై మీరు సంతృప్తి చెందారా అని ప్రశ్నించగా సమస్య పరిష్కారం అయిన నాడే తాను సంతోషిస్తానని బదులిచ్చారు. మహిళలు రాజకీయాల్లో రావాల్సిన అవసరం ఎంతో ఉందని ఆమె వివరించారు. సమస్యలు పరిష్కారం చేయాలంటే అది చట్టసభల్లో సభ్యురాలిగా ఉంటేనే సాధ్యమన్నారు. త్వరలో రాజకీయాల్లోకి రానున్నట్లు తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. అంతేకాదు సమాజంలో సగం అయిన మహిళలకు చట్టసభల్లోనూ 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని అందు కోసం తన వంతు ప్రయత్నం చేస్తానని విజయం చెప్పారు.

                      ‘బొమ్మాళి’, ఆపరేషన్‌ దుర్యోధన-2 లాంటి పలు చిత్రాలను ఆకుల విజయ లక్ష్మీ ప్రణవ్‌ ప్రొడకన్స్‌పై నిర్మించారు. అనుకున్న స్థాయిలో చిత్రాలు హిట్‌ సాధించకపోయినా సమాజానికి సందేశాత్మక చిత్రాలను అందించానన్న తృప్తి పొందినట్లు నిర్మాత ఆకుల విజయ చెప్పారు.


0 Comments
<<Previous
Forward>>

    Author

    నా పేరు సునయన ( ఉరఫ్ నర్మద). సు అంటే "మంచిది" అని, నయన అంటే "నేత్రములు" . సునయన అంటే మంచి కన్నులు కలది అని అర్థం. నా కళ్లతో చూస్తున్న ఈ  మహిళా ప్రపంచాన్ని మీముందు ఉంచాలని, అది మన మహిళాలోకానికి మేలు చేకూర్చాలని ఆశీస్తూ మనలో  ఒక  తెలుగు తరుణిగా నా ఈ చిన్ని ప్రయత్నం. 

    Archives

    January 2014
    December 2013
    November 2013
    October 2013
    September 2013
    August 2013
    July 2013
    June 2013

    Categories

    All
    ఏ అమ్మాయీ అమ్ముడవకూడదన్నదే నా లక్ష్యం
    ఆ మూడేళ్లూ కంటినిండా నిద్రలేదు..
    ఏ ఆడబిడ్డనూ ఇటువైపు రానివ్వను
    ఆటో కుమారి
    వేల మందికి కొత్త జీవితం!
    ఈమె పత్రికే ఓ రికార్డు
    పాత చిత్రాల పోస్టర్లతో ...కొత్త డిజైన్లు
    ఆమె ప్రతిభకు అమెరికా ప్రోత్సాహం
    ఇదొక 'అత్యవసర' సేవ!
    ఖేల్ రత్న కుంజరినీ దేవి
    రజనీ బాలలు
    తొలి మహిళా మంత్రి
    జీవన రాగమే మూగబోయింది
    నవీన వనితకు స్ఫూర్తి ప్రదాత.. శారదా దేవి
    కలలు డిజైన్ చేసుకున్న అమ్మాయి
    ఒంటి కాలితో గెలిచింది!
    వందల మందిని కాపాడింది...
    అడవి తల్లికి ఆడబిడ్డల పహరా
    ఐరాస మెచ్చిన అమ్మాయిలు
    పంటల పాఠాలమ్మ
    వసతి గృహాల్లో 'మనో పాఠాలు'
    సహాజ చిత్రాలతో కొత్త అందాలు
    సాయం చేసేందుకు పత్రిక పెట్టింది!
    జీవన సందేశానికి ఒక్క కుంచె చాలు!
    ధ్యాస
    తరుణీ .. ధిల్లానా !
    నిన్న ఆటో డ్రైవర్.. నేడు లాయర్..!
    అంధుల కోసం పత్రిక
    నృత్య వైభవం
    బుకర్ బరిలో జుంపా
    పాతిక లక్షల నష్టం పాఠాలు నేర్పింది!
    లక్కీ ఛాన్స్
    ఈమెను చూస్తే లోకమే చిన్నబోతుంది
    నెలలు నిండని జ్ఞాపకాలు
    తిండి మారితేనే తరాలు బాగుపడతాయి
    మహిళా సమస్యలపై పోరాటం
    చీకటి జీవితాలకు కొత్త వెలుగు...
    మహిళా సాధికారతే లక్ష్యంగా మన్ దేశీ
    ఖైదీల జీవితాల్లో కాంతిరేఖ
    పక్షి ప్రేమికురాలు
    మహిళా పారిశ్రామికవేత్తలకు స్పూర్తి
    పరుగుల షైనీ
    అందమైన సెల్ కవర్లు ఫేస్ బుక్ లో అమ్మేస్తా!
    అవయవాల పంటకు అక్షర సేద్యం
    అశ్వనీ మలాలా!
    కావ్యా టీచర్...మా బడికి రండి
    విరామం తర్వాత విజేతలయ్యేలా!
    మనసుకు నచ్చిందే చదువు
    సాగులో ఆందెవేసిన చేయి కూతురే కొడుకయింది
    అద్భుత ప్రతిభాశాలి వి.యస్. రమాదేవి
    రొమ్ము క్యాన్సర్‌పై జనచైతన్యం
    సేవలోనూ రాణే
    అనుపమాన కృషి
    కారుణ్య బంధం
    రేసింగ్ బైక్ పై నవతరం అమ్మాయి
    అందులకు అండగా..
    నైనానంద ప్రతిభ
    అక్షరమే అతివకు అండ..
    ప్రపంచం మరువలేని మేడమ్‌ క్యూరీ
    ఉపాధితో వెన్నుదన్ను
    ఆకాశమంత ఆత్మవిశ్వాసంతో ముందడుగు
    సమస్యలను మించి పరుగు
    పరదేశంలో చదువు మనదేశంలో సేవ
    పడిలేచిన కెరటం..!
    రుక్మిణి త్యాగం
    తండ్రిని మించిన తనయ
    రుబ్బుడు చదువులు మనకొద్దు :సుచిస్మిత
    పద్మశ్రీ వారియర్‌
    ఆదివాసుల ఆత్మఘోషకు తొలి కదలిక
    వీరీవీరీ గుమ్మడిపండ్లు
    తెలుగందం... మెరిసింది
    ఆణిముత్యం
    ఎగిరిపోతే ఎంత బాగుందో!
    రికార్డుల రాణి ఎలెనా
    అమ్మలగన్న అమ్మ నరసమ్మ!
    సోనాగచికి కొత్త ఆశాదీపం... ఇషిక!
    వ్యాపారమే జీవితం
    విజయోత్సవ నృత్యం
    ఆత్మరక్షణ పాఠాలతో అండ
    సమాజాన్ని కుంచెతో తట్టిలేపిన ధీర
    హైదరాబాద్ సంస్కృతి అంటే ప్రాణం
    స్వాతంత్య ఉద్యమంలో...మహిళామణులు
    ఆఫ్రికాలో అన్నపూర్ణ...
    పాకిస్తాన్ లో తొలి మహిళా ఫైటర్ పైలట్
    మనోనేత్రమే ఆమె జీవిత నేస్తం
    పాకిస్తాన్ సాహాస బాలిక .. మలాలా
    అంతర్జాతీయ కీర్తి కిరీటం
    మృత్యువునే పరిహసించిన సాహస బాలిక
    తెల్లమ్మాయి 'చెత్తశుద్ధి'
    కెమెరాఉమెన్ మల్లీశ్వరితో…
    ఆత్మవిశ్వాసం
    స్వధార్‌హోమ్ వంచితులకు ఆసరా
    ప్రశ్నిస్తేనే ప్రపంచం తెలిసేది...
    కాల్పనికకథలతో ఓలలాడించిన కలం
    1f435d7218
    24050e4082
    245c28fe88
    261cdb5043
    2818b63e80
    28389ca502
    2b0e1c1639
    2fa703fa92
    అంచెలంచెలుగా ఎదిగిన మహిళ: పాక్ విదేశాంగమij
    ఎన్నారై భర్తతో గెంటివేయబడ్డ కోమల్ ప్రవీణ
    హార్వార్డ్ లో భారతీయ తొలి మహిళా ప్రొఫెసరĺ
    31c13c6389
    3554a3419a
    35656ad80d
    55a74999b9
    5780c63669
    57c51a6293
    581f19c0c8
    596314788a
    5b25932644
    601df7f45e
    6038f96c83
    60bb50a07e
    6ac90962a4
    6acc2723b8
    6eceeac0ef
    72a7da41c2
    88cfd59ee5
    994726a014
    A2999c254a
    A31cb50ffd
    A90748427f
    Aaf6b495b5
    B68abb9e8a
    B72ae5d725
    C08f40206b
    E88f0055d9
    F3fc20019d
    F85bffc883
    F9ded65a21
    Fbb115455d
    Fcf7a2fc59
    Freedom Fighter Laxmi Sehgalpng5013f7c557

    RSS Feed


Powered by Create your own unique website with customizable templates.