కావలసిన పదార్థాలు :
మైదా - ఐదు టేబుల్ స్పూన్లు,
బేబీకార్న్ - పది,
కొత్తిమీర తరుగు - ఒక టేబుల్ స్పూన్,
మొక్కజొన్నపిండి - ఐదు టేబుల్ స్పూన్లు,
వెల్లుల్లి రెబ్బలు- ఆరు,
అల్లం - చిన్న ముక్క,
నూనె- వేగించడానికి సరిపడా,
ఉప్పు - రుచికి సరిపడా.
తయారుచేసే పద్ధతి :
బేబీకార్న్ నిలువుగా రెండు భాగాలుగా కోసుకోవాలి. పచ్చిమిర్చి, అల్లంలను మిక్సీ వేసుకోవాలి. అందులో మైదా, మొక్కజొన్నపిండి, ఉప్పు, మసాలా పేస్ట్, కొత్తిమీర తరుగు వేసి నీళ్లతో పకోడి పిండిలా కలపాలి. ఈ పిండిలో బేబీకార్న్ ముక్కల్ని ముంచి నూనెలో వే సి బంగారు రంగు వచ్చే వరకు వేగించాలి. వేడివేడిగా తింటుంటే కరకరమంటూ బాగుంటాయి.