మైదా పిండి - అర కిలో
పుల్లటి పెరుగు - అర లీటర్
వంట సోడా - చిటికెడు
ఉప్పు - తగినంత
తయారుచేసే పద్ధతి :
ఒక పాత్రలో మైదా పిండి తీసుకొని అందులో పెరుగు, వంట సోడా వేసి తగినంత ఉప్పును చేర్చుకొని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఐదు లేక ఆరు గంటలు మూత పెట్టి నాననివ్వాలి. ఇది సాదారణ బియ్యపు పిండిలా ఉబ్బుతుంది. తర్వాత స్టవ్ మీద బాణలి ఉంచి నూనె పోయాలి. నూనె మరిగిన తర్వాత మైదా పిండి, పెరుగు మిశ్రమాన్ని బాగా కలుపుకొని కావలసిన సైజ్ ల్లో ఉండలు ఉండలుగా నూనెలో వేసి ఎర్రబడే వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే మైసూరు బోండాలు రెడీ. వీటిని వేడి వేడిగా కొబ్బరి చట్నీతో గాని లేదా పండు మిరపకాయల పచ్చడితో ఆరగిస్తే చాలా బాగుంటుంది.
మూలం : సాక్షి దినపత్రిక