కావలసిన పదార్థాలు :
బియ్యం : మూడు కప్పులు
కంది పప్పు : అర కప్పు
శనగ పప్పు : అర కప్పు
పచ్చిమిర్చి : మూడు
కొత్తిమీర : కొద్దిగా
మిరియాల పొడి : కొద్దిగా
కొబ్బరి కోరు : ఒక కప్పు
ఉప్పు : తగినంత
తయారుచేసే పద్ధతి :
ముందుగా బియ్యం, కంది పప్పు, శనగ పప్పులను రుబ్బుకొని పొడి చేసుకోవాలి. తర్వాత దానికి కొద్దిగా ఉప్పు వేసి వేన్నీళ్ళతో మరీ చిక్కగా, పల్చగా కాకుండా మద్యస్థంగా కలుపుకోవాలి. ఈ పిండిని అరగంట సేపు నాననిచ్చి అందులో తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, తాజా కొబ్బరి తురుము, మిరియాలపొడి వేసి కలిపి దోశలు వేయాలి. బెల్లం కానీ, పంచదార కానీ వేయలేదు కదానే సందేహం రావచ్చు కానీ, ఇవి మామూలు దోశలులా కాకుండా తియ్యగానే ఉంటాయి.
మూలం : ఆదివారం ఆంధ్రప్రభ