లవంగాలు, దాల్చినచెక్క, యాలకులు, శొంటి కొద్ది కొద్దిగా తీసుకొని పొడి చేసి డబ్బాలో వేసి పెట్టుకోండి. టీ చేసేటపుడు టీ పొడితో పాటు ఈ మసాలా పొడి కొద్దిగా వేసి మరిగించండి. తర్వాత పాలు, చక్కర కలపాలి. ఇది మంచి ఘాటు అయిన సువాసన ఇస్తుంది. ఈ మసాలా దినుసులన్నీ వేసి డికాక్షన్ బాగా మరిగించినందున ఆ దినుసుల్లోని రసాయనాలు టీ లో చేరతాయి.దాల్చినచెక్క రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియ మెరుగవుతుంది. అంటు వ్యాదులనుండి కాపాడుతుంది.
తయారుచేసే పద్ధతి :
లవంగాలు, దాల్చినచెక్క, యాలకులు, శొంటి కొద్ది కొద్దిగా తీసుకొని పొడి చేసి డబ్బాలో వేసి పెట్టుకోండి. టీ చేసేటపుడు టీ పొడితో పాటు ఈ మసాలా పొడి కొద్దిగా వేసి మరిగించండి. తర్వాత పాలు, చక్కర కలపాలి. ఇది మంచి ఘాటు అయిన సువాసన ఇస్తుంది. ఈ మసాలా దినుసులన్నీ వేసి డికాక్షన్ బాగా మరిగించినందున ఆ దినుసుల్లోని రసాయనాలు టీ లో చేరతాయి.దాల్చినచెక్క రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియ మెరుగవుతుంది. అంటు వ్యాదులనుండి కాపాడుతుంది.
0 Comments
కావలసిన పదార్థాలు :
సేమియా - ఒక కప్పు పచ్చిమిర్చి - 3 పల్లీలు - రెండు చెంచాలు పచ్చి శనగపప్పు - రెండు చెంచాలు మినపప్పు - చెంచాడు ఆవాలు - చెంచాడు జీలకర్ర - చెంచాడు కర్వేపాకు - రెండు రెమ్మలు ఎండు మిర్చి - 3 అల్లం - చిన్న ముక్క ఉల్లిగడ్డలు - 2 నూనె - సరిపడా ఉప్పు - తగినంత తయారుచేసే పద్ధతి : మూకుట్లో నూనె వేసి వేడయ్యాక పచ్చి శనగపప్పు, పల్లీలు, పోపు గింజలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. కరివేపాకును చిటపట లాడించి ఒక కప్పు సేమియాకు రెండు కప్పుల చొప్పున నీళ్ళు పోసి మరిగించాలి. తర్వాత సేమియాతో పాటు ఉప్పు వేసి ఉడికించాలి. అది గట్టిపడే దాక స్టవ్ మీదే ఉంచి తర్వాత దించుకుంటే సరి. కమ్మని 'సేమియా ఉప్మా' రెడీ... మూలం : నమస్తే తెలంగాణ ఆదివారం పుస్తకం కావలసిన పదార్థాలు :
సేమియా - ఒక కప్పు పెరుగు - 2 కప్పులు పచ్చిమిర్చి - 3 మిరియాల పొడి - కొద్దిగా కరివేపాకు - రెండు రెమ్మలు కొత్తిమీర - కొద్దిగా ఆవాలు - అర టీస్పూన్ ఎండు మిర్చి - 4 నెయ్యి - ఒక టీస్పూన్ ఉప్పు - తగినంత తయారుచేసే పద్ధతి : ఒక పాత్రలో మూడు కప్పుల నీళ్ళు పోసి మరిగించాలి. దాంట్లో సేమియా వేసి బాగా ఉడికించి దించాలి. నీటిని వడకట్టి, సేమ్యాను చన్నీళ్ళలో వేసి ఫైఫైన కదిపి నీళ్ళలో నుంచి తియ్యాలి. బాణలిలో నెయ్యి వేసి కాగాక ఆవాలు, ఎండుమిర్చి, మిరియాల పొడి, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు వేసి బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో పెరుగు వేసి అందులో ఉడికించిన సేమియా, వేయించి ఉంచుకున్న పోపు, ఉప్పు వేసి కలపాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. మూలం : సాక్షి దినపత్రిక కావలసిన పదార్థాలు :
మైదా పిండి - అర కిలో పుల్లటి పెరుగు - అర లీటర్ వంట సోడా - చిటికెడు ఉప్పు - తగినంత తయారుచేసే పద్ధతి : ఒక పాత్రలో మైదా పిండి తీసుకొని అందులో పెరుగు, వంట సోడా వేసి తగినంత ఉప్పును చేర్చుకొని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఐదు లేక ఆరు గంటలు మూత పెట్టి నాననివ్వాలి. ఇది సాదారణ బియ్యపు పిండిలా ఉబ్బుతుంది. తర్వాత స్టవ్ మీద బాణలి ఉంచి నూనె పోయాలి. నూనె మరిగిన తర్వాత మైదా పిండి, పెరుగు మిశ్రమాన్ని బాగా కలుపుకొని కావలసిన సైజ్ ల్లో ఉండలు ఉండలుగా నూనెలో వేసి ఎర్రబడే వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే మైసూరు బోండాలు రెడీ. వీటిని వేడి వేడిగా కొబ్బరి చట్నీతో గాని లేదా పండు మిరపకాయల పచ్చడితో ఆరగిస్తే చాలా బాగుంటుంది. మూలం : సాక్షి దినపత్రిక కావలసిన పదార్థాలు :
మినపప్పు : రెండు కప్పులు బియ్యం : రెండు కప్పులు ఉడకబెట్టిన బంగాళాదుంప గుజ్జు : మూడు కప్పులు కొబ్బరి కోరు : అరకప్పు ఉల్లిపాయ ముక్కలు : రెండు కప్పులు (సన్నగా తరిగి పెట్టుకోవాలి ) ఉడికించిన బటాణి : అరకప్పు పచ్చి మిర్చి ముక్కలు : ఒక చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ : కొద్దిగా ఆలివ్ నూనె : మూడు స్పూన్లు ఆవాల పొడి : ఒక స్పూన్ జీలకర్ర పొడి : కొద్దిగా ఇంగువ : కొద్దిగా పాలకూర : కొద్దిగా కొత్తిమీర : కొద్దిగా ఉప్పు : తగినంత తయారుచేసే పద్ధతి : మినపప్పు, బియ్యాలను నానబెట్టి రుబ్బుకున్న తర్వాత ఉడకబెట్టిన బంగాళాదుంపల గుజ్జు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన బటానీలు, తాజా కొబ్బరి కోరు, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆలివ్ ఆయిల్, ఆవాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ఇంగువ, పాలకూర, కొత్తిమీరల తరుగు, తగినంత ఉప్పు బాగా కలిపి దోశలుగా వేసుకుంటే సరి ... ఘుమఘుమలాడే మైసూర్ మసాలా దోశలు ప్లేట్ లో నోరూరిస్తాయి. మూలం : ఆదివారం ఆంధ్రప్రభ కావలసిన పదార్థాలు :
ఉప్మా రవ్వ : రెండు కప్పులు బియ్యం పిండి : ఒక కప్పు మజ్జిగ : రెండు కప్పులు ఉల్లిపాయ ముక్కలు : రెండు కప్పులు (సన్నగా తరిగి పెట్టుకోవాలి ) పచ్చి మిర్చి ముక్కలు : ఒక చెంచాడు ఇంగువ : కొద్దిగా జీడిపప్పు : తగినన్ని ఉప్పు : తగినంత తయారుచేసే పద్ధతి : మొదటగా ఉప్మా రవ్వలో బియ్యపు పిండి, మజ్జిగ, కొద్దిగా ఇంగువ, సోడియం బై కార్బోనేట్, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీడిపప్పు ముక్కలు వేసి బాగా కలపాలి. ఇలా కలిపిన పిండిని రెండు గంటలు నాననిచ్చి దోశలు వేస్తె సరి కరకరలాడే రవ్వ దోశలు రెడీ. క్రిస్పీగా, టేస్టీ గా ఉండే రవ్వ దోశను మరీమరీ ఇష్టంగా తింటారు. మూలం : ఆదివారం ఆంధ్రప్రభ కావలసిన పదార్థాలు :
బియ్యం పిండి : ఒక కప్పు కొబ్బరి కోరు : ఒక కప్పు ఉప్పు : తగినంత తయారుచేసే పద్ధతి : మొదటగా బియ్యాన్ని నాలుగ్గంటల పాటు నానపెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. అందులో కొబ్బరి కోరు, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి పల్చగా దోశ వేసి బంగారు వర్ణం వచ్చే వరకు కాలిస్తే సరి పిల్లాపెద్దా లొట్టలేస్తూ తినాల్సిందే!. మూలం : ఆదివారం ఆంధ్రప్రభ కావలసిన పదార్థాలు :
పెసర పప్పు : ఒక కప్పు జీలకర్ర : కొద్దిగా పచ్చిమిర్చి : మూడు అల్లం ముక్క : చిన్నది ఉప్పు : తగినంత తయారుచేసే పద్ధతి : పెసర పప్పును నాలుగైదు గంటల పాటు నాననిచ్చి నీళ్ళు తీసేసి రుబ్బుకోవాలి. కొద్దిగా జీలకర్ర, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కని మెత్తగా నూరి పిండిలో కలుపుకొని దోశలుగా వేస్తే సరి ఘుఘుమలాడే పెసరట్ దోశ వాహ్వా అంటూ తినేయవచ్చు. మూలం : ఆదివారం ఆంధ్రప్రభ ఉప్మా, చపాతీల్లాంటివి అప్పటికప్పుడు చేసుకోవచ్చు. కానీ ఇడ్లీ, దోశ లంటే ముందురోజే నానబెట్టుకొని పిండి సిద్దం చేసుకోవాలి. లేదంటే రెడీమేట్ పిండి కొనుక్కోవాలి. ఇలా ప్రిసేర్వేటివ్స్ కలిపిన పిండి అందరికి నచ్చదు. మరీ ముందు ప్లానింగ్ లేకుండా దోశలు వేసుకోవాలంటే ఈ పద్దతిని పాటించండి.
కావలసిన పదార్థాలు : మైదా పిండి : రెండు కప్పులు శనగ పిండి : ఒక కప్పు పెరుగు : ఒక కప్పు వంట సోడా : కొద్దిగా ఉప్పు : తగినంత తయారుచేసే పద్ధతి : మొదట మైదా పిండిలో శనగ పిండి కలిపి, దానిలో ఒక కప్పు పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా వంట సోడా, తగినంత ఉప్పు వేసి కలిపి దోశ వేసుకోవాలి. మూలం : ఆదివారం ఆంధ్రప్రభ " మెదడుకో బుద్ది, జిహ్వకో రుచి" అన్నారు. కనుకనే హాటుహాటుగా తినాల్సిన వాటిని కూడా కొందరు తియ్యతియ్యగా తినాలనుకుంటారు. అలాంటి అభిరుచి ఉన్నవారి కోసమే ఈ స్వీట్ దోశ..
కావలసిన పదార్థాలు : బియ్యం : మూడు కప్పులు కంది పప్పు : అర కప్పు శనగ పప్పు : అర కప్పు పచ్చిమిర్చి : మూడు కొత్తిమీర : కొద్దిగా మిరియాల పొడి : కొద్దిగా కొబ్బరి కోరు : ఒక కప్పు ఉప్పు : తగినంత తయారుచేసే పద్ధతి : ముందుగా బియ్యం, కంది పప్పు, శనగ పప్పులను రుబ్బుకొని పొడి చేసుకోవాలి. తర్వాత దానికి కొద్దిగా ఉప్పు వేసి వేన్నీళ్ళతో మరీ చిక్కగా, పల్చగా కాకుండా మద్యస్థంగా కలుపుకోవాలి. ఈ పిండిని అరగంట సేపు నాననిచ్చి అందులో తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, తాజా కొబ్బరి తురుము, మిరియాలపొడి వేసి కలిపి దోశలు వేయాలి. బెల్లం కానీ, పంచదార కానీ వేయలేదు కదానే సందేహం రావచ్చు కానీ, ఇవి మామూలు దోశలులా కాకుండా తియ్యగానే ఉంటాయి. మూలం : ఆదివారం ఆంధ్రప్రభ |