పెసరపప్పు - ఒక గ్లాస్
నీళ్ళు - రెండు గ్లాసులు
పాలు - రెండు గ్లాసులు
పంచదార - అర గ్లాస్
యాలకులు - రెండు
జీడిపప్పు - కొంచెం
కిస్ మిస్ లు - కొంచెం
నెయ్యి - రెండు స్పూన్లు
తయారుచేసే పద్ధతి :
పెసరపప్పును నీళ్ళలో మెత్తగా ఉడికించాలి. బాగా ఉడికాక పాలు పోసి పంచదార వేసి సన్నని సెగపై ఉంచి కలుపుతూ ఉండాలి అది గరిట జారుగా అయినాక జీడిపప్పు కూడా కలపాలి. మీద నుంచి రెండు చెంచాల నెయ్యి వేయాలి. గరిట జారుగానే ఉంచాలి. తరువాత నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్ మిస్ లు, యాలక్కాయ పొడి వేసి బాగా కలపాలి. ఇది పాయసంలాగా చాలా బాగుంటుంది. అమ్మవారి నైవేద్యానికి సులువైన వంటకం.
మూలం : ఆంద్రభూమి సచిత్ర మాస పత్రిక