- రసాయన ఎరువుల్లో ఉపయోగించే నత్రజని, భాస్వరం, పొటాష్ లాంటివాటికి ఆవర్తన పట్టికలో ఉండే స్థానాలూ ధర్మాలూ మర్మాలూ ఏమీ తెలియదు ఆ అమ్మకు. ఆమెకు తెలిసిందల్లా ఒక్కటే...చేలల్లో చాళ్లలో వేళ్లు పారాడిస్తూ పంట నిండుగా పండాలంటే నేలకు సారం ఉండాలని! అందుకు రసాయనాల కంటే పేడ, పుట్టమట్టిలాంటివే గట్టివని! ఆ అనుభవంతో సేంద్రియ ఎరువనే పరుసవేదిని ఆకాశం స్లాబ్ కింద నేలతల్లి ఫ్లోరింగ్లోని నాలుగెకరాల చేను ల్యాబ్లో కనుక్కుందామె. ఆ పరుసవేదిని పంటకు ఆనించి బంగారం పండించితన చెలకలో ఆమె సృష్టించిన కలకలం ఢిల్లీలోని ‘కలెక్టర్ల కాలేజీ’ చెవులనూ తాకింది. అంతే... నేల మోటారునే అబ్బురంగా చూసే ఆమె గాలిమోటారుని నిబ్బరంగా ఎక్కి వచ్చింది. కాబోయే ‘జిల్లా దొరలకు’ పాఠాలు చెప్పడానికి ఢిల్లీ దాకా వెళ్లొచ్చిన లలితమ్మ స్ఫూర్తిదాయక కథనo. Read more