Read more......
ఎవరైనా అపాయంలో చిక్కుకుని ప్రాణాపాయ స్థితిలో ఉంటే- పెద్దవాళ్లు సైతం ‘మనకెందుకులే ఈ తలనొప్పి వ్యవహారం’-అని తప్పించుకుని పోవడం సర్వసాధారణం. అయతే, ఆ బాలిక అలా భావించక, ప్రాణాలకు సైతం తెగించి అయదుగురిని మృత్యుముఖం నుంచి కాపాడింది. నీట మునిగిన ఐదుగురు చిన్నారులను రక్షించి సాహసానికి ప్రతీకగా ఆ బాలిక నిలిచింది. బీహార్లోని కటియార్ జిల్లా మోర్సంద గ్రామంలో కొద్ది రోజుల క్రితం పనె్నండేళ్ల రోజీ ఆరా ఓ చెరువు వద్ద ఉన్నపుడు- ఆకస్మికంగా చిన్న పిల్లల కేకలు వినిపించగా అటు పరుగెత్తింది. అక్కడ కనిపించిన దృశ్యం చూశాక ఆమెకి ఒక్కక్షణం నోటమాట రాలేదు. వెంటనే ఏ మాత్రం ఆలోచించకుండా చెరువులోకి దూకేసింది. తనకన్నా వయసులో చిన్నవారైన ఆరుగురు పిల్లలు నీట మునిగిపోతున్నారని గమనించింది.
Read more......
0 Comments
Leave a Reply. |