Read more...
‘ఎవరో ఒకరూ... ఎపుడో అపుడూ.. నడవరా ముందుకు... అటో ఇటో ఎటోవైపు..’ -ఈ పాట చాలాసార్లు మనం వినే వుంటాం. ఎవరో? ఎప్పుడో? అనేది మాత్రం ప్రశ్నార్థకమే! అయితే- ‘ఆమె’ని కలిశాక ఆ పాట అక్షర సత్యం అనిపించింది. అనాథలను ఆదుకోవడమే కాదు, ఎంతోమంది మానసిక వి కలాంగులకు ఆశ్రయం ఇస్తూ వారి యోగ క్షేమాలను కనిపెడుతూ వారికి ఆమె జీవన మాధుర్యం చవి చూపుతోంది. సొంత తల్లిదండ్రులను ఇంట్లో ఉంచుకొని రెండు పూటలు భోజనం పెట్టలేకపోతున్న ఈ రోజుల్లో అనాథ శవాలకి అంత్యక్రియలు చేస్తూ, మృతుల ఆత్మకు శాంతిని చేకూరుస్తున్న ఆమె నిజంగానే ధన్యురాలు. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలంటేనే మనం సంకోచిస్తాం. అక్కడ అనాథ శవాలుంటాయని, వాటిని చూసేందుకే మనం జంకుతుంటాం. అనాథలు కూడా సాటి మనుషులే అనే ఆలోచనను మన దరికి రానివ్వం. అయతే, అనాథ శవాలకు అంత్య్రకియలు చేయటం అనేది మాటలకందని మహోపకారం.
Read more...
0 Comments
Leave a Reply. |