ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని, ఆర్థిక ఇబ్బందుల్ని దాటుకుని పాలిటెక్నిక్ పూర్తిచేసిన అమ్మాయిలు అనువైన పని గంటల్నీ, అద్దాల గదుల్లో కూర్చుని చేసే ఉద్యోగాల్నీ కోరుకోలేదు. సవాళ్లతో కూడిన, సాహస విధుల్ని చేపట్టాలనుకున్నారు. వేల మందిని గమ్యస్థానాలకు చేర్చే రైల్వే ఉద్యోగం... అసిస్టెంట్ ఎలక్ట్రిక్ లోకో పైలట్లు కావాలనుకున్నారు. సాధారణంగా రైల్వేలోని ఈ ఉద్యోగం పేరు చెబితే వెంటనే గుర్తొచ్చేది పురుషులే. ఇప్పటిదాకా ఈ ఉద్యోగం పట్ల ఆసక్తి చూపించే అమ్మాయిల్ని వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. బ్యాచ్కి ఒకరో, ఇద్దరో ఉండేవారు. కానీ ఈ ఏడాది ఏప్రిల్లో శిక్షణకు ఎంపికైన బృందంలో పద్నాలుగు మంది అమ్మాయిలు ఉన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న ఎనిమిది మందిలో ఐదుగురు మన రాష్ట్రానికి చెందిన వాళ్లు. విజయవాడలోని ఈటీటీసీలో శిక్షణ పొందిన లావణ్య, జి.వి.ఎస్.నళినీ కుమారి, జి.శిరీష, సీహెచ్.శిరీష, జి.నళిని... 'కష్టపడటం మాకేం కొత్తకాదు. పాలిటెక్నిక్ చదివిన మేం చాలామందిలా ఏదో ఒక సంస్థలో చేరిపోవాలనుకోలేదు. పదిమందిలో ప్రత్యేకంగా కనిపించే ఉద్యోగం చేయాలనుకుని ఇటొచ్చాం. రోజూ లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చే భారతీయ రైల్వేలో ఉద్యోగం చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం' అన్నారు.Read more...
0 Comments
Leave a Reply. |