పాతికేళ్ల రంగూ శౌర్య డిగ్రీ పూర్తయ్యాక ఉద్యోగం కోసం వెతుకుతూ ఇంటి దగ్గరే ఉంది. బయటకెెళ్లిన ప్రతిసారీ రోడ్డు పక్కన ఎవరో ఒకరు అక్రమ రవాణాకు గురైన అమ్మాయిల గురించి మాట్లాడుకుంటూ కనిపించేవారు. తనూ అలాంటి సంఘటనలెన్నో చూసింది. ఆ సమయంలోనే జరిగిన ఓ సంఘటన తన జీవితాన్ని మార్చేసింది. ఓసారి శౌర్య పక్కింటి వాళ్లు తమ పదమూడేళ్ల కూతుర్ని పని కోసం ఢిల్లీకి పంపించారు.తరవాత ఆ అమ్మాయి సమాచారం లేదు. పోలీసులకు చెప్పినా ఫలితం దక్కలేదు. శౌర్య ఆ అమ్మాయిని కనిపెట్టి తీసుకొచ్చేందుకు ఢిల్లీ వెళతానంది. తనదీ పేద కుటుంబమే. అయినా అప్పు చేసి బయల్దేరింది. ఫోన్ నంబర్ల ఆధారంగా, ఒక్కో అడుగూ వేస్తూ ఆ అమ్మాయి ఆచూకీ కనుక్కొంది. పనిలో పెట్టుకున్న వాళ్లను దోషులుగా నిలబెట్టింది. తొమ్మిదేళ్ల క్రితం సంఘటన ఇది. Read more.......
0 Comments
Leave a Reply. |