ఆదివారం సెలవు రోజు. కాస్త ఆలస్యంగా నిద్రలేచినా ఫర్వాలేదనుకునే సగటు ఇల్లాలికి ఆ రోజే ఎక్కువ పనిభారం అనివార్యమవుతుంది. సెలవు కావడంతో ఇంట్లో భర్త, పిల్లలు ఉంటారు. తినడానికి వారు కోరుకున్నవి చేసిపెట్టాలి. చేపలు తెస్తే ఒకరు పులుసు పెట్టమంటారు, మరొకరు ఫ్రై చేయమంటారు. నాకు నాన్వెజ్ వద్దు, కాయగూరలతో కర్రీ వండమని మరొకరు అంటారు. వీరందరూ కోరుకున్నవి చేసి, భోజనాలు అయ్యేసరికి మధ్యాహ్నం రెండవుతుంది. నాలుగు మెతుకులు నోట్లో వేసుకొని, కాస్త నడుం వాల్చుదామనే సమయమే ఆ ఇల్లాలికి దక్కడం లేదు. నిత్యం ఇంటి పని మొత్తం చేసుకునే మహిళలకు కడుపునిండా తినేందుకు కూడా తీరిక ఉండదు. ఈ చేప ముక్క ఉంటే తర్వాత ఎవరో ఒకరు తింటారులే..! అని దాన్ని దాచిపెట్టి మరీ పిల్లల చేత తినిపించే తల్లులకు కొదవలేదు. అందుకే అమ్మ త్యాగానికి ప్రతీక అయింది. Read more....
0 Comments
Leave a Reply. |