మహిళలు నేడు రాణించని రంగమంటూ లేదు.తాము ఎంచుకున్న రంగంలో విజయపథంలో పయనిస్తున్నారు. గ్రామీణ ప్రాంత మహిళలు సైతం తామేమీ తీసిపోమన్న రీతిలో చిన్న తరహా పరిశ్రమలను నెలకొల్పి ఆ రంగంలో తమ పనితనానికి పదును పెడుతున్నారు. మహారాష్టల్రోని సతారా జిల్లాకు చెందిన మహిళలు అదే కోవకు చెందుతారు. తమ కాళ్లమీద తాము నిలబడడంతో పాటు తోటి మహిళలకు చేయూతనివ్వాలనే లక్ష్యంతో ఆ మహిళలు ఏకంగా మన్దేశి మహిళా సహకార బ్యాంక్ పేరుతో ఒక మహిళ సహకార బ్యాంక్ను స్థాపించారు. దాని ద్వారా బిజినెస్స్కూల్ను ప్రారంభించారు. హెచ్ఎస్బిసి బ్యాంక్ సహకారంతో మన్దేశి ఉద్యోగిని పేరుతో ప్రారంభమైన ఈ స్కూల్ మహిళలను ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.ఇంకా చదవండి
0 Comments
Leave a Reply. |