ఇంకా చదవండి .........
నవలలు, కథలు, రచనలకు ఉన్న ప్రాధాన్యత నాటకాలకు లేదు. ఒక మంచి సినిమా వస్తే ప్రేక్షకులు దాన్ని ఆదరిస్తారు. అది ఆస్కార్ అవార్డును కైవసం చేసుకుంటుంది. ఒక మంచి పుస్తకాన్ని రాస్తే నోబెల్ బహుమతో, రామన్మెగసెసే అవార్డు పొందవచ్చు. కానీ నాటకాలు ఇలాంటి అవార్డులకు నోచుకోలేవు. ఎందుకంటే వాటికి అంత ఆదరణ లేదు. 24గంటలు సినిమా టివి ఛానళ్లు వచ్చాక నాటకాలకు ఆదరణ లేక కనుమరుగైపోతున్నాయి. అప్పుడప్పుడు ఎక్కడైనా వీటిని ప్రదర్శించినా, వాటిని చూసేందుకు ప్రేక్షకులు కరువ్ఞ. ఇలాంటి పరిస్థితుల్లో ఒక వనిత రాసిన నాటకానికి అంతర్జాతీయ అవార్డు లభించడం విశేషం. కేవలం ఒకేఒక్క రచనతో విశ్వఖ్యాతి పొందిన భారతీయ రచయితలు ఎందరో ఉన్నారు. ఇలాంటి జాబితాలో మంజులా పద్మనాభన్ కూడా ఉన్నారు. ఒకే నాటకంతో ఆమె 250,000 పౌండ్ల బహుమతిని పొంది ఔరా! అనిపించుకున్నారు.
ఇంకా చదవండి .........
0 Comments
Leave a Reply. |