
కావలసిన పదార్థాలు :
చేపలు : అరకిలో
నూనె : అయిదు టీ స్పూన్లు
ఉల్లిపాయలు : రెండు ముక్కలుగా చేసుకోవాలి
మిరియాలు : ఆరు
లవంగాలు : ఆరు
మొక్కజొన్న పొడి : ఒక టేబుల్ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ : రెండు టేబుల్ స్పూన్లు
కారంపొడి : మూడు టేబుల్ స్పూన్లు
పసుపు : చిటికెడు
ధనియాల పొడి : ఒక టేబుల్ స్పూన్
ఉప్పు : రుచికి తగినంత
కొత్తిమీర ఆకులు : కొన్ని
నిమ్మరసం : ఒక టేబుల్ స్పూన్
టమేటో ప్యూరీ : ఐదు టేబుల్ స్పూనులు
తయారుచేసే పద్ధతి:
చేపలు : అరకిలో
నూనె : అయిదు టీ స్పూన్లు
ఉల్లిపాయలు : రెండు ముక్కలుగా చేసుకోవాలి
మిరియాలు : ఆరు
లవంగాలు : ఆరు
మొక్కజొన్న పొడి : ఒక టేబుల్ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ : రెండు టేబుల్ స్పూన్లు
కారంపొడి : మూడు టేబుల్ స్పూన్లు
పసుపు : చిటికెడు
ధనియాల పొడి : ఒక టేబుల్ స్పూన్
ఉప్పు : రుచికి తగినంత
కొత్తిమీర ఆకులు : కొన్ని
నిమ్మరసం : ఒక టేబుల్ స్పూన్
టమేటో ప్యూరీ : ఐదు టేబుల్ స్పూనులు
తయారుచేసే పద్ధతి:
- చేపలను శుభ్రం చేసుకుని ముక్కలు చేసి సిద్ధంగా ఉంచాలి. ముందుగా దానికి నిమ్మరసం, మొక్కజొన్న పొడి, ఉప్పు కలిపి పట్టించి పక్కన పెట్టుకోవాలి.
- బాండీలో నూనె వేసి అందులో మిరియాలు, లవంగాలు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగి బంగారు రంగులోకి వచ్చిన తర్వాత దానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి బాగా వేయించాలి. ఆ తర్వాత టమోటో ప్యూరీ కూడా వేసి కొద్దిగా నీరు కలిపి బాగా ఉడికించాలి.
- ఇవన్నీ బాగా ఉడికిన తర్వాత చేప ముక్కలను వేసి ఐదు నిమిషాల పాటు ఉడికించి దించే ముందు ధనియాల పొడి కొత్తిమీర వేసి దింపాలి.
- చేపల పులుసును వేడి వేడిగా తింటే రుచిగా ఉంటుంది. మామూలుగా చింతపండుకి బదులుగా టమోటా ప్యూరీని వాడుకుంటే కూరకు రంగుతో పాటు రుచి వస్తుంది.