పుచ్చకాయ గుజ్జు ముఖానికి రాసి, పది నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. నిస్సేజంగా మారిన చర్మానికి పోషణ లభించి కాంతివంతమవుతుంది.
0 Comments
టీస్పూన్ బాదం పప్పుపొడి, అర టీస్పూన్ గంధం పొడి, అర టీస్పూన్ బంగాళాదుంప తరుగు, పది చుక్కల నిమ్మరసం కలిపి కళ్ళ కింద వలయాలున్న చోటే రాయాలి. పది నిముషాలు విశ్రాంతి తీసుకొని శుభ్రపరుచుకోవాలి. రోజు విడిచి రోజు ఇలా చేయడం వల్ల నల్లని వలయాలు తగ్గుతాయి.
రెండు టేబుల్ స్పూన్ల గంధం పొడిలో టేబుల్ స్పూన్ ఓట్స్, కొన్ని పాలు, రోజ్ వాటర్ కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి స్క్రబ్ చేసుకోవాలి. ఆరిన తర్వాత శుభ్రపరచుకోవాలి. మచ్చలు తగ్గి, చర్మం కాంతివంతముగా అవుతుంది.
రెండు టేబుల్ స్పూన్ల టొమాటో జ్యూస్, 50 గ్రా. ల ఓట్స్, 25 గ్రా. ల పెరుగులో కప్పుడు నీళ్ళు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి, అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రపరచుకోవాలి. బ్లాక్ హెడ్స్, మొటిమలు తగ్గి చర్మం మృదువుగా కాంతివంతముగా కనిపిస్తుంది.
రెండు టీస్పూన్ల క్యారెట్ తురుము, టీస్పూన్ తేనె కలపాలి. ఈ మిశ్రమానికి రెండు చుక్కల ఎసేన్షియల్ ఆయిల్ చేర్చి దీనితో ముఖాన్ని మృదువుగా రబ్ చేసి, పదిహేను నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. లా చేయడం వల్ల చర్మానికి జీవకాంతి లభిస్తుంది.
పాలకూర, బచ్చలి, తోటకూర వంటి ఆకుకూరలు, చిక్కుళ్ళు, జీడిపప్పు, బాదం, అవిసె వంటి గింజ ధాన్యాలు , పాలు, పెరుగు, తక్కువ కొవ్వు కలిగిన ఇతర పాల ఉత్పత్తులు తరచు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల కురులు ఏపుగా పెరిగి, ఆరోగ్యంగా నిగనిగలాడతాయి.
టీస్పూన్ స్ట్రాబెర్రీ పేస్ట్, అరటీస్పూన్ కార్న్ పౌడర్ కలిపి ముఖానికి రాయాలి. అరగంట తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఈ ప్యాక్ ముఖ చర్మాన్ని మృదువుగా, కాంతివంతముగా చేస్తుంది.
కొబ్బరి నూనె, తేనె కలిపి పెదవులపై రాసి, మర్దన చేయాలి. రోజులో కొన్ని సార్లు చేస్తూ ఉంటే పెదవులు పొడిబారడం, పగుళ్ళ సమస్యలు తగ్గి మృదువుగా అవుతాయి.
పెదవులు నల్లగా ఉంటే..
కొద్దిగా వెన్న తీసుకొని రెండు గ్లిజరిన్ చుక్కలు వేసి కలిపి రాయాలి. ఇలా వారానికి మూడు లేక నాలుగు సార్లు రాస్తుంటే క్రమంగా నలుపు వదిలి పెదవులు ఆకర్షణీయంగా మారుతాయి. చెరుకు రసంలో కొద్దిగా పసుపు కలిపి ముఖానికి రాయాలి. వేళ్ళతో మృదువుగా మర్దన చేయాలి. పది నిమిషాల తర్వాత చల్లని నీటితో ఒకసారి ముఖాన్ని శుభ్రపరచుకోవాలి. ఈ విధముగా రొజూ చేస్తే చర్మం ముడతలు తగ్గుతుంది.
|