- పుదీనా ఆకులను మెత్తగా గ్రైండ్ చేసి ఆ పేస్టును చర్మానికి పట్టించి ఇరవై నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా పదిహేను రోజులు చేయాలి.ఇలా చేస్తే నిగనిగాలాడే చర్మం మీ సొంతం.
- ఒక టమాటోను గ్రైండ్ చేసి 3చుక్కల నిమ్మరసం కలిపి పట్టించాలి. ఇరవై నిమిషాలు ఉంచి కడిగేయాలి. ఇలా ఇరవై రోజుల పాటు ఉదయం, సాయంత్రం చేయాలి.
- ఒక కప్పు వెనిగర్లో కప్పు నీళ్లుపోసి పలుచబరిచి చర్మానికి పట్టించాలి.
- పచ్చి బంగాళాదుంపను గ్రైండ్ చేసి రసం తీసి దానికి నిమ్మరసం కలిపి చర్మానికి పట్టించాలి.
మనం చేసుకునే సౌందర్య చిట్కాలన్నీ దాదాపుగా చర్మానికి నునుపు, తెలుపు తెచ్చేవే. తెల్లగా రావాలని ప్రతి ఒక్కరు ఆశించడంలో తప్పులేదు. ఉన్న రంగు కంటే కాస్త ఎక్కువ రంగు మెరుగుపడాలన్న చాలా ప్రయత్నాలు చేస్తారు. ఇందుకోసం బ్యూటీపార్లర్లకు వెళ్లే తీరిక లేకుంటే ఇంట్లోనే అంతకంటే మెరుగైన ఫలితాలు పొందడానికి ఈ ట్రీట్మెంట్లు.
0 Comments
ఒక టేబుల్ స్పూన్ పెసరపిండికి రెండు టీ స్పూన్ల పాలు, రెండు మూడు చుక్కల నిమ్మరసం కలిపి ముఖం, మెడ, చేతులకు పట్టించి పదిహేను నిమిషాల తర్వాత కడిగేయాలి. క్రమం తప్పకుండా నాలుగు వారాలపాటు చేయాలి.
నాలుగు బాదం పప్పులను నానబెట్టి పాలు కలుపుతూ మెత్తగా గ్రైండ్ చేసి మిశ్రమాన్ని రాత్రి పడుకోబోయే ముందు ముఖం, మెడ, చేతులకు పట్టిందా ఉదయాన్నే చల్లటినీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. వరుసగా పదిహేనురోజులు చేస్తే ఫలితం ఉంటుంది.
|