- - అర టీస్పూన్ కీరారసంలో కొద్దిగా రోజ్వాటర్ కలిపి ఈ మిశ్రమాన్ని కళ్లకు రాసుకుని అరగంటసేపు ఉంచి ఆ తర్వాత కడుక్కుంటే కళ్లు ఆకర్షణీయంగా ఉంటాయి.
- - కళ్లు చాలా సున్నితమైనవి కాబట్టి బజారున దొరికే ఏ క్రీం పడితే ఆ క్రీం రాసెయ్యకూడదు. ఇలా చెయ్యడం వల్ల మీ కళ్లు ఇన్ఫెక్షన్ బారిన పడే ప్రమాదం ఉంది.
- - తగినంత ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల కళ్లకు రెస్ట్ దొరికి తాజాగా కనపడతాయి.
- - గ్లాస్ నీటిలో ఉసిరిపొడి నానబెట్టి ఉదయాన్నే ఈ మిశ్రమంతో ఉదయాన్నే కళ్లను కడుక్కుంటే కళ్లు తాజాగా మెరుస్తాయి.
- - కళ్ల చుట్టూ ఉండే ముడతలు పోవాలంటే పాలమీగడతో అక్కడ మసాజ్ చేసుకుంటే ముడతలు నుండి విముక్తి పొందవచ్చు.
- - కీరదోసకాయను చక్రాల్లా కట్ చేసుకుని ఆ చక్రాలను కంటిమీద ఉంచుకుంటే కళ్లు తాజాగా ఉంటాయి. ఆల్మండ్ ఆయిల్లో కొంచెం ఆలివ్ ఆయిల్ కలిపి కంటిచుట్టూ ఉండే నలుపు ప్రాంతంపై రాస్తే ఆ నలుపును నివారించవచ్చు.
- - రోజూ పావుగంటపాటు రెండు చేతులను రెండు కళ్లపై ఉంచుకుని ప్రశాంతంగా కూర్చుంటే మీ కళ్లకు రిలీఫ్ లభిస్తుంది.
- - కళ్లకు మేకప్ చేసుకునే బ్రష్ల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. వీటిపై ఉండే దుమ్ము, ధూళి వల్ల మీ కళ్లకు ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. ఉప్పునీటితో కళ్లను కడుక్కోవడం వల్ల కళ్లు మెరుస్తాయి.
- - కళ్లకు కాటుక పెట్టుకోవడం వల్ల కళ్లు చాలా అందంగా కనబడతాయి. ఐబ్రోస్ వెంట్రుకలు రాలుతుంటే వీటికి ఆలివ్ ఆయిల్ రాయడం ద్వారా నివారించవచ్చు. కళ్లకు ఇన్ఫెక్షన్ వచ్చినపుడు మేకప్ వేసుకోకూడదు.
అందమైన కళ్లు మీ అందాన్నీ నిబిడీకృతం చేస్తాయి. చక్కటి కలువల్లాంటి కళ్లుకోసం ఈ చిట్కాలు పాటించండి.
0 Comments
1. ముఖాన్ని రసాయనకాలు తయారుచేసిన సబ్బుతో రుద్దుకునేకంటే మెత్తని సెనగ పిండితో రుద్దుకోవడం వల్ల ముఖ చర్మం మృదువుగాను, కాంతిగానూ ఉంటుంది.
2. బీట్రూట్ రసాన్ని ముఖానికి రాసుకుని అరగంట తర్వాత ముఖాన్ని కడుక్కుంటే ముఖవర్చస్సు పెరుగుతుంది. 3. సెనగపిండిలో కీరా దోసకాయ రసాన్ని కానీ, కారెట్ రసాన్ని కానీ కలిపి పేస్ట్లా చేసి ముఖానికి పట్టించి ఓ గంట తర్వాత ముఖాన్ని పరిశుభ్రమయిన నీటితో కడిగితే ముఖ చర్మపు కాంతి పెరుగుతుంది. 4. గులాబీ రెక్కల పేస్టును ముఖానికి పట్టించి, అరగంట తర్వాత ముఖాన్ని కడిగితే ముఖం ఎంతో మృదువు గానూ, ఆకర్షణీయంగానూ కనిపిస్తుంది. 5. గ్లిజరిన్లో నిమ్మరసం, టమాటోరసం కలిపి ముఖానికి రాసుకుంటే ముఖ సౌందర్యం పెరుగుతుంది. 6. పాలల్లో దూదిని తడిపి, దూదిలో తేమ ఆరిపోయేంత వరకు ఆ దూదిని కళ్ళమీద ఉంచుకుంటే కళ్ళు కాంతితో మెరుస్తూంటాయి. 7. తాజా పండ్లు, పాలు ముఖచర్మపు సోయగాన్ని, ఆకర్షణనూ పెంచుతాయి. 8. ఎండిన కమలాఫలం తొక్కలను మెత్తని పొడిచేసి, ఆ పొడిలో పసుపు, సెనగపిండి కలిపి అందులో రోజ్వాటర్ పోసి మెత్తని పేస్ట్చేసి ముఖానికి ఆ పేస్ట్ను పట్టించాలి. కొంతసేపయిన తర్వాత ముఖం కడుక్కుంటే ముఖం లేతగానూ, అందంగానూ, మృదువుగానూ, కాంతిగానూ, ఆకర్షణీయంగానూ కనిపిస్తుంది. 9. జిడ్డు చర్మం ఉన్నవారు ముఖ సౌందర్యం విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ముఖానికి జిడ్డు లేకుండా ఉండటా నికి గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రపరచాలి. సబ్బుకు బదులు మెత్తని సున్నిపిండిని వాడాలి. బయట నుంచి రాగానే గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రపరచాలి. 10. కళ్ళు చికిలిస్తూ చూడటం, ముఖం చిట్లించడం, కోపంతో పళ్ళు కొరకడం లాంటివి ముఖ సౌందర్యానికి అవరోధం కలిగిస్తాయి. ముఖ చర్మానికి ముడతలు ఏర్పడుతాయి. అటువంటి చర్యలవల్ల, అటువంటి అలవాట్లను మానుకోవాలి.అందంగా ఆకర్షణీయంగా కనిపించ టానికి ముఖ సౌందర్యం ఎంతగానో తోడ్పడు తుందని తెలుసుకోవాలి. 11. బాదం నూనెలో శనగపిండి, నిమ్మరసం కలిపి ముఖానికి అప్లై చేసి, ఆరిన తరువాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు మచ్చలు పోవడమే కాదు, ముఖం మృదువుగా కనిపిస్తుంది.
టీస్పూన్ బాదం పప్పుపొడి, అర టీస్పూన్ గంధం పొడి, అర టీస్పూన్ బంగాళాదుంప తరుగు, పది చుక్కల నిమ్మరసం కలిపి కళ్ళ కింద వలయాలున్న చోటే రాయాలి. పది నిముషాలు విశ్రాంతి తీసుకొని శుభ్రపరుచుకోవాలి. రోజు విడిచి రోజు ఇలా చేయడం వల్ల నల్లని వలయాలు తగ్గుతాయి.
పడుకునేటప్పుడు మెడ కింద కచ్చితంగా తలగడలాంటిది పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల కళ్ళ కింద భాగానికి చక్కగా రక్త ప్రసరణ అవుతుంది. దీని వల్ల నల్లని వలయాలు ఏర్పడే అవకాశాలు తగ్గుతాయి. కళ్ళ వాపు సమస్యలు దరిచేరవు.
|