telugutaruni.weebly.com
  • Home
  • వంటకాలు (Cookeries)
    • ఫలహారాలు (Tiffins)
    • శాకాహారం (Veg)
    • బియ్యపు వంటలు (Rice items)
    • మాంసాహారం (Non-Veg)
    • పచ్చళ్ళు (chutneys)
    • వడియాలు
    • పండ్ల రసాలు (Juices)
    • స్వీట్స్ (Sweets)
    • చిరుతిళ్ళు (Snacks)
    • గ్రేవీ ఐటమ్స్
    • సూప్స్ (Soops)
    • కొత్త కొత్తగా
  • చిట్కాలు (Tips)
    • వంటింటి చిట్కాలు ( Kitchen Tips)
    • ఆరోగ్య చిట్కాలు (Health Tips)
    • సౌందర్య చిట్కాలు (Beauty Tips)
  • మహిళా లోకం
    • ఆదర్శ మహిళలు
    • శభాష్ మహిళా..
  • విహారయాత్ర

మెరిసిపోండిలా..

11/14/2013

0 Comments

 
Picture
తెల్లగా కనిపించాలని వైటనింగ్ లోషన్లు, క్రీమ్‌లు పూసి పూసి విసుగెత్తిపోయారా? అయితే ఇకనుంచి వాటన్నింటినీ పక్కకి నెట్టేయండి. ఎందుకంటే ఇంట్లోనే పాటించే కొన్ని చిట్కాలున్నాయి కాబట్టి. అవేంటంటే...
* ఒక స్పూన్ పంచదారలో నిమ్మరసం కలిపి ముఖంతో పాటు శరీరమంతటా పంచదార కరిగే వరకు రుద్దాలి.
* క్యాబేజి/జీలకర్రలని నీళ్లలో ఉడికించాలి. ఈ నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే మెరిసే చర్మం మీ సొంతం.
* గుడ్డు తెల్లసొన, తేనె కలిపి ముఖానికి ప్యాక్ వేసుకుని 20 నిమిషాలు ఉంచుకోవాలి. ఇది చర్మానికి యవ్వనకాంతిస్తుంది.
* పొద్దుతిరుగుడుపువ్వు గింజల్ని పచ్చి పాలలో ఒక రాత్రంతా నానపెట్టి రుబ్బాలి. ఇందులో చిటికెడు కుంకుమపువ్వు, పసుపు కలిపి రాసుకోవాలి.
* ఆలు లేదా టొమాటో రసాలను ప్రతిరోజూ రాసుకుంటే చర్మం కాంతివంతంగా ఉంటుంది.
* మీగడలో బ్రెడ్ ముక్కలు కలిపి రాసుకున్నా చర్మం మృదువుగా తయారవుతుంది.


0 Comments

మొటిమలు లేకుండా...

10/26/2013

0 Comments

 
Picture
మీ ముఖంమీద మొటిమలు లేకుండా ఆకర్షణీయంగా ఉండాలంటే, కంటికింద చారలు రాకుండా ఉండాలంటే  మీ మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోండి. మంచి ఆలోచనలతో, ఆశావహమైన భావనలతో ఉంటే రక్తప్రసరణ బాగుండి, మీ ముఖం ప్రకాశవంతంగా ఉంటుందని ఆరోగ్యనిపుణులు అంటున్నారు. ఈ మొటిమల నుండి ఉపశమనానికి కొన్ని చిట్కాలు.
- ఆయుర్వేదంలో రంజిక పిత్తమనబడే హార్మోన్ల ప్రభావం వల్ల ఈ స్థితి వస్తుంది. తెల్లనువ్వులు, పాతబెల్లం కలిపి ఉండలు చేసుకుని ఆడపిల్లలు ఉదయం, సాయంత్రం తింటే ఈ హార్మోన్లు సహజంగానే సమస్థితికి చేరతాయి. మగపిల్లలు మినప సున్ని ఉండలు రాత్రిపూట తినడం మంచిది.
- గిన్నెలో నీళ్లు మసలపెట్టి ఆవిరిని ముఖానికి పట్టడం హితకరం. ఈ ఆవిరి 8-10 నిమిషాలు పడితే చాలు.
- వేపపూలు చూర్ణించిన ముద్దలో కొంచెం పసుపు, వెన్నపూస కలిపి పొక్కులపై రాసి గంట తరువాత కడిగి వేయండి. మంచి ఫలితం ఉంటుంది.
- కాకరకాయని మధ్యలో చీల్చి, చీల్చిన తెల్లనిభాగంతో చర్మంపై సున్నితంగా రుద్దితే మంచి ఫలితం ఉంటుంది.
- పోకచెక్క నీళ్లతో గంధం తీసి ముఖానికి పట్టించి మూడు గంటల తర్వాత కడిగేసుకోవాలి.
- ఉసిరిక వలుపు, తమలపాకుపై రాసుకునే కాచు కలిపి దానిలో బాదంపాటు కలిపి చూర్ణం చేసి పావు చెంచా చొప్పున తీసుకుంటే తెల్లని మచ్చలు పోతాయి.
- పాలమీగడలో పసుపు, పొట్లకాయ, పైపొట్టు, నువ్వులు కలిపి ముఖానికి రాసుకుంటే అన్ని మొటిమలు పోయి ముఖం అందంగా తయారవుతుంది.




0 Comments

ముఖంపై మచ్చలు పోవాలంటే .........

9/25/2013

0 Comments

 
                       అరటి, జామ పళ్ల ముక్కలను తీసుకుని మెత్తని పేస్టులాగా చేసుకోవాలి. దీన్ని ముఖంపై పిగ్మెం ఉన్న చోట అప్లై చేయాలి. 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచి తరువాత నీటితో కడిగేయాలి. ప్రతిరోజూ ఇలా చేయడం వల్ల జామలో లైకోపిన్, అరటిలోని శుద్ధి చేసే గుణాలు కలిసి ఆ మచ్చలను పోగొట్టి చర్మాన్ని కాంతివంతం చేస్తాయి.

0 Comments

శరీరం మృదువుగా ఉండాలంటే

9/11/2013

0 Comments

 
శరీరం మృదువుగా ఉండాలంటే మంచి బాడీలోషన్‌ రాసుకోవాల్సిందే. అలాగని ఎంతో ఖర్చుపెట్టి వాటిని కొనాల్సిన పనిలేదు. ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు.అదెలాగో తెలుసుకుందాం.   
  • - మూడు టేబుల్‌స్పూన్ల రోజ్‌వాటర్‌కి, ఒక స్పూన్‌ గ్లిజరిన్‌, రెండు టీస్పూన్ల నిమ్మరసం కలపండి. ఆ మిశ్రమాన్ని చిన్న సీసాలో పోసి ఫ్రిజ్‌లో పెట్టండి. అవసరమైనప్పుడు తీసి వాడుకుంటూ ఉంటే, చర్మం పొడిబారకుండా మృదువుగా ఉంటుంది.  
  • - కప్పు రోజ్‌వాటర్‌లో టీస్పూన్‌ బొరాక్స్‌ పొడిని, రెండు టీస్పూన్ల వేడిచేసిన ఆలివ్‌ ఆయిల్‌ని బాగా కలపండి. మార్కెట్లో లావెండర్‌ వాటర్‌ దొరుకుతుంది. దీనిని పై మిశ్రమంలో కలిపి బాగా గిలక్కొట్టండి. కాసేపయ్యాక వాడుకోవచ్చు.
  • - సబ్బుని చిన్నచిన్న ముక్కల్లా చెక్కుకుని మూడు టీస్పూన్ల నిండా దానిని తీసుకోవాలి. దానిని పావుకప్పు నీళ్లలో కలిపి వేడిచేసి, నాలుగు స్పూన్ల ఆలివ్‌ ఆయిల్‌ని, టీస్పూన్‌ గ్లిజరిన్‌నీ దాన్లో వేసి బాగా కలపాలి.

0 Comments

మొటిమలు పోగొట్టేందుకు...

9/4/2013

0 Comments

 
  • -టమోటా గుజ్జు ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాల తరువాత చల్లటి నీళ్లతో ముఖం కడగాలి.
    -మూడు టీ స్పూన్ల తేనెలో దాల్చినచెక్క పొడి కొద్దిగా కలిపి రాత్రి పడుకోబోయేముందు మొటిమలపై రాయాలి. ఇలా రెండు వారాలపాటు చేస్తే ఫలితం ఉంటుంది.
  • బాదంపప్పును పాలతో కలిపి చిక్కటి పేస్టు చేసి మొటిమలపై రాయాలి. ఇలా చేస్తే మొటిమలు మెత్తబడి త్వరగా తగ్గడమే కాకుండా మచ్చలు కూడా పడవు. 
  • -నిమ్మరసం, వేరుశెనగ నూనెల్ని సమపాళ్లలో కలిపి రాసుకోవాలి. నిమ్మరసంలో గంధంపొడి లేదా దాల్చిన చెక్క పొడి కలిపి ఆ మిశ్రమాన్ని మొటిమలపై పూసినా ఫలితం ఉంటుంది.
  • -నిమ్మరసం, రోజ్ వాటర్‌లను సమపాళ్లలో కలిపి మొటిమలపై పూసి అరగంట తరువాత చల్లటి నీళ్లతో కడిగేయాలి. నాలుగు వారాలపాటు ఇలా చేస్తే మొటిమలు తగ్గిపోతాయి.
  • అరటి, జామ పళ్ల ముక్కలను తీసుకుని మెత్తని పేస్టులాగా చేసుకోవాలి. దీన్ని ముఖంపై పిగ్మెం ఉన్న చోట అప్లై చేయాలి. 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచి తరువాత నీటితో కడిగేయాలి. ప్రతిరోజూ ఇలా చేయడం వల్ల జామలో లైకోపిన్, అరటిలోని శుద్ధి చేసే గుణాలు కలిసి ఆ మచ్చలను పోగొట్టి చర్మాన్ని కాంతివంతం చేస్తాయి.
0 Comments

ఇంటి వస్తువులతోనే ముఖ సౌందర్యం

8/27/2013

0 Comments

 
1. ముఖాన్ని రసాయనకాలు తయారుచేసిన సబ్బుతో రుద్దుకునేకంటే మెత్తని సెనగ పిండితో రుద్దుకోవడం వల్ల ముఖ చర్మం మృదువుగాను, కాంతిగానూ ఉంటుంది.

2. బీట్‌రూట్‌ రసాన్ని ముఖానికి రాసుకుని అరగంట తర్వాత ముఖాన్ని కడుక్కుంటే ముఖవర్చస్సు పెరుగుతుంది.

3. సెనగపిండిలో కీరా దోసకాయ రసాన్ని కానీ, కారెట్‌ రసాన్ని కానీ కలిపి పేస్ట్‌లా చేసి ముఖానికి పట్టించి ఓ గంట తర్వాత ముఖాన్ని పరిశుభ్రమయిన నీటితో కడిగితే ముఖ చర్మపు కాంతి పెరుగుతుంది.

4. గులాబీ రెక్కల పేస్టును ముఖానికి పట్టించి, అరగంట తర్వాత ముఖాన్ని కడిగితే ముఖం ఎంతో మృదువు గానూ, ఆకర్షణీయంగానూ కనిపిస్తుంది.

5. గ్లిజరిన్‌లో నిమ్మరసం, టమాటోరసం కలిపి ముఖానికి రాసుకుంటే ముఖ సౌందర్యం పెరుగుతుంది.

6. పాలల్లో దూదిని తడిపి, దూదిలో తేమ ఆరిపోయేంత వరకు ఆ దూదిని కళ్ళమీద

ఉంచుకుంటే కళ్ళు కాంతితో మెరుస్తూంటాయి.

7. తాజా పండ్లు, పాలు ముఖచర్మపు సోయగాన్ని, ఆకర్షణనూ పెంచుతాయి.

8. ఎండిన కమలాఫలం తొక్కలను మెత్తని పొడిచేసి,
ఆ పొడిలో పసుపు, సెనగపిండి కలిపి అందులో రోజ్‌వాటర్‌ పోసి మెత్తని పేస్ట్‌చేసి ముఖానికి ఆ పేస్ట్‌ను పట్టించాలి. కొంతసేపయిన తర్వాత ముఖం కడుక్కుంటే ముఖం లేతగానూ, అందంగానూ, మృదువుగానూ, కాంతిగానూ, ఆకర్షణీయంగానూ కనిపిస్తుంది.

9. జిడ్డు చర్మం ఉన్నవారు ముఖ సౌందర్యం విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ముఖానికి జిడ్డు లేకుండా ఉండటా నికి గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రపరచాలి. సబ్బుకు బదులు మెత్తని సున్నిపిండిని వాడాలి. బయట నుంచి రాగానే గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రపరచాలి.

10. కళ్ళు చికిలిస్తూ చూడటం, ముఖం చిట్లించడం, కోపంతో పళ్ళు కొరకడం లాంటివి ముఖ సౌందర్యానికి అవరోధం కలిగిస్తాయి. ముఖ చర్మానికి ముడతలు ఏర్పడుతాయి. అటువంటి చర్యలవల్ల, అటువంటి అలవాట్లను మానుకోవాలి.అందంగా ఆకర్షణీయంగా కనిపించ టానికి ముఖ సౌందర్యం ఎంతగానో తోడ్పడు తుందని తెలుసుకోవాలి.

11. బాదం నూనెలో శనగపిండి, నిమ్మరసం కలిపి ముఖానికి అప్లై చేసి, ఆరిన తరువాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు మచ్చలు పోవడమే కాదు, ముఖం మృదువుగా కనిపిస్తుంది.
0 Comments

అందానికి సూత్రాలు...

8/19/2013

0 Comments

 
- నిమ్మపండు తొనలు, కమలా తొనలు, తులసి మొగ్గలు, సీమచామంతి, ఇలా ఏదైనా సరే వాటిరసంతో మసాజ్ చేసుకోవచ్చు. అదే తొనలతోనయితే సరిపోయే నీటిని కలుపుకుని రాసుకుని మసాజ్ చేసుకుని కడిగేసుకోవచ్చు.
- ఒక టీస్పూన్ ఆముదము తీసుకోండి. బీవ్యాక్స్ ఒక అరటీస్పూన్, ఆప్రికాట్ నూనె ఒక అరటీస్పూన్, సముద్రపు ఉప్పు ఒక టేబుల్ స్పూన్, ఆల్మండ్ పౌడర్ ఒక టీస్పూన్, బేబీషాంపూ రెండు టీస్పూన్లు తీసుకోండి. బీవ్యాక్స్ను బాగా కరిగించి ఆముదము ఆప్రికాట్ నూనెలను వేసి బాగా కలపండి. వేడిమీద తీసెయ్యండి. సముద్రపు ఉప్పును, ఆల్మండ్ పౌడర్ని కలిపి, షాంపూలో వేసి బాగా కలియబెట్టండి. ఆ తర్వాత ఉపయోగించండి.
- బొప్పాయి కాయ సగం తీసుకోండి. దానికి నాలుగు టేబుల్స్పూన్ల బియ్పప్పిండి మొత్తాన్ని కలిపి బాగా గుజ్జుగుజ్జుగా పిసకండి. అందులో కొన్ని చుక్కల ఆరెంజ్ నూనెను కలపండి. మొత్తం కలిసేలా కలియబెట్టండి. మిశ్రమమైన ఆ పదార్థాన్ని చేతివేళ్ల చర్మంతో ముఖానికి గుండ్రంగా పూస్తూ ముఖం మొత్తం కవర్ చేయండి. పావుగంట తర్వాత ఆయిల్ను మాయిశ్చరైజర్ను చేసుకోండి. ఆపై శుభ్రంగా వాష్చేసుకుంటే ముఖం అందంగా తయారవుతుంది.

0 Comments

అందానికి ఆలూ

8/17/2013

0 Comments

 
  • బంగాళాదుంపల్ని మెత్తగా చేసి రసం తీసిపెట్టుకోవాలి. దాంతో తరచూ ముఖం కడుక్కుంటే కళతప్పి, నిర్జీవంగా మారిన చర్మం మెరిసిపోతుంది. వీలైతే ప్రతిరోజూ చేసినా మంచిదే! చర్మం కమిలిపోయిన చోట రాస్తే త్వరగా ఫలితం కనిపిస్తుంది.
  • రెండు చెంచాల బంగాళాదుంప రసంలో చెంచా నిమ్మరసం కలిపి కాసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. బయటకు తీశాక దూదితో ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని, పది నిమిషాలయ్యాక కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మృతకణాలు తొలగిపోయి చర్మం శుభ్రపడుతుంది. ఛాయ మెరుగుపడుతుంది. మొటిమలూ, మచ్చలు ఏర్పడటం వంటి సమస్యలు దూరమవుతాయి.
  • ముల్తానీ మట్టిలో చెంచా బంగాళాదుంప గుజ్జూ, నాలుగు చుక్కల రోజ్‌వాటర్‌ కలిపి ముఖానికి పూతలా రాసుకోవాలి. పావుగంటయ్యాక గోరువెచ్చటి నీళ్లతో శుభ్రపరచుకోవాలి. తరవాత చన్నీళ్లలో తడిపిన వస్త్రంతో ముఖం తుడుచుకోవాలి. మర్నాటికి చర్మం తాజాగా తయారవుతుంది.
  • బంగాళాదుంపను ఉడికించి మెత్తగా చేసుకోవాలి. అందులో కొంచెం పాలపొడి, బాదం నూనె చేర్చి ముఖానికి మర్దన చేసుకోవాలి. తరచూ ఇలా చేయడం వల్ల పొడిబారిన చర్మానికి తేమ అందుతుంది.
  • కళ్ల కింద నల్లమచ్చలు ఇబ్బంది పెడుతుంటే బంగాళాదుంపను ముక్కల్లా తరిగి కాసేపు ఫ్రిజ్‌లో పెట్టాలి. తరవాత తీసి కళ్ల కింద రుద్దుకోవాలి. కొన్ని నిమిషాల పాటు కళ్ల మీద పెట్టుకోవాలి. ప్రతి రోజూ ఇలా చేస్తుంటే క్రమంగా నల్లమచ్చలు తగ్గుముఖం పడతాయి.
  • నారింజ తొక్కల్ని అయిదు నిమిషాలపాటు ఉడకబెట్టి చల్లార్చాలి. చల్లారినవాటితో మెడపైన, ముఖం మీద సుతిమెత్తగా రుద్ది అయిదు నిమిషాల తరవాత కడిగేయాలి. ఇలా వారంలో ఒక్కసారయినా చేస్తే చర్మం తాజాగా ఉంటుంది.
  •  టీస్పూన్ తేనెలో కొద్దిగా కుంకుమపువ్వు కలిపి, ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రపరచుకోవాలి. రోజూ ఇలా చేస్తుంటే నల్ల మచ్చలు తగ్గి, ముఖ కాంతి పెరుగుతుంది.
  • రెండు చెంచాల పాలల్లో, బాదం పొడి, కలబంద గుజ్జు, తేనె కలిపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ మీద ఆప్లై చేసి అరగంటయ్యాక కడిగేసుకోవాలి. ఇలా చేస్తే ఈ కాలంలో వచ్చే చర్మ సమస్యలు దూరమవుతాయి. చర్మం పొడిబారకుండా కూడా ఉంటుంది.
0 Comments

చర్మం నల్లబడుతుంటే...

8/16/2013

0 Comments

 
                    కొంతమందికి శరీరంపై వివిధ భాగాల్లో చర్మం నల్లబడుతుంటుంది. మరీ ముఖ్యం గా ఎండ వేడి తాకే ప్రాంతాల్లో ఇది మరింత స్పష్టం గా కనిపిస్తుంది. ఎండలోకి వెళ్తే చాలు...చర్మం పై మంట పుడుతుంది. ఎండ తాకిన ప్రాంతం నల్లబడు తుంది. కొంతమందికి చర్మంపై మచ్చలు ఏర్పడుతా యి. ఈ విధమైన సమస్యలను పిగ్మెంటేషన్‌ సమస్య లుగా చెబుతుంటారు.

                    హార్మోన్ల అసమతుల్యత, థైరాయిడ్‌ సంబంధిత సమ స్యలు, దీర్ఘకాలంగా వాడుతున్న కొన్ని రకాల మం దుల కారణంగా, శిరోజాలకు క్రమం తప్పకుండా రంగు వేసుకునే వారికి ఈ విధమైన పిగ్మంటేషన్‌ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ఇవి సూర్యుడి అతి నీల లోహిత కిరణాల వల్ల ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ఈ సమస్యలు వచ్చిన తరువాత తగు చర్యలు తీసుకోవడం కంటే కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడమే మేలు. ఆరంభదశలోనే ఈ సమస్యలను గుర్తిస్తే పరిష్కారం కూడా సులువే అవుతుంది.

కొన్ని చిట్కాలు...
1. మంచినీళ్ళు ఎక్కువగా తాగాలి. తాజా పండ్ల రసాలు, మజ్జిగ ఎక్కువగా తాగాలి.
2. నల్ల ద్రాక్ష, పుచ్చకాయ, దానిమ్మ పండ్లు ఎక్కువగా తినాలి.
3. బయటకు వెళ్ళడానికి 30 నిమిషాల ముందే సన్‌క్రీమ్‌ లోషన్‌ ముఖానికి రాసుకోవాలి.
4. నల్ల ద్రాక్ష గుజ్జుకి కొంచెం తేనె కలిపి ప్రతి రోజూ స్నానానికి 20 నిమిషాల ముందు ముఖానికి రాసుకుని ఆ తరువాత చన్నీళ్ళతో స్నానం చేయాలి.
5. కొంచెం క్యారెట్‌, కొంచెం క్యాబేజీ, కొంచెం ఓట్స్‌ కలిపి మిక్సర్‌లో వేసి పేస్ట్‌గా తయారు చేసి, దానిలో సగం చెంచా పాల మీగడ, సగం చెంచా తేనె, 3 చెంచాల నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత కొంచెం గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే ముఖంపై నల్లమచ్చలు క్రమంగా తగ్గుముఖం పడుతాయి.
6. పిగ్మెంటేషన్‌ సమస్య ఉన్న వాళ్ళు ఎండలో బయటకు వెళ్లి వస్తే, ముఖం కడుక్కొని కీరాను గుండ్రటి ముక్కలుగా కోసి ముఖం పై 20 నిమిషాల పాటు ఉంచుకొని రిలాక్స్‌ కావాలి. దీని వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి.
బాదం గింజలను బాగా నానబెట్టి పేస్టు చేసుకోవాలి. దీంట్లో కొంచెం పాలపొడి, కొద్దిగా తేనె, కొన్ని చుక్కల నిమ్మరసం, కొంత ఆలివ్ ఆయిల్‌ను చేర్చాలి. ఈ మిశ్రమాన్ని మెడచుట్టూ పట్టించాలి. 30 నిమిషాలు ఆగి కడిగేయాలి. దీనివల్ల మెడచుట్టూ ఉన్న నల్ల వలయాలు పోయి అందంగా ఉంటుంది.


మూలం : సూర్య దినపత్రిక
0 Comments

June 26th, 2013

6/26/2013

0 Comments

 
                 మనం చేసుకునే సౌందర్య చిట్కాలన్నీ దాదాపుగా చర్మానికి నునుపు, తెలుపు తెచ్చేవే. తెల్లగా రావాలని ప్రతి ఒక్కరు ఆశించడంలో తప్పులేదు. ఉన్న రంగు కంటే కాస్త ఎక్కువ రంగు మెరుగుపడాలన్న చాలా ప్రయత్నాలు చేస్తారు. ఇందుకోసం బ్యూటీపార్లర్‌లకు వెళ్లే తీరిక లేకుంటే ఇంట్లోనే అంతకంటే మెరుగైన ఫలితాలు పొందడానికి ఈ ట్రీట్‌మెంట్లు. 


  • పుదీనా ఆకులను మెత్తగా గ్రైండ్‌ చేసి ఆ పేస్టును చర్మానికి పట్టించి ఇరవై నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా పదిహేను రోజులు చేయాలి.ఇలా చేస్తే నిగనిగాలాడే చర్మం మీ సొంతం.
  • ఒక టమాటోను గ్రైండ్‌ చేసి 3చుక్కల నిమ్మరసం కలిపి పట్టించాలి. ఇరవై నిమిషాలు ఉంచి కడిగేయాలి. ఇలా ఇరవై రోజుల పాటు ఉదయం, సాయంత్రం చేయాలి.
  • ఒక కప్పు వెనిగర్‌లో కప్పు నీళ్లుపోసి పలుచబరిచి చర్మానికి పట్టించాలి.
  • పచ్చి బంగాళాదుంపను గ్రైండ్‌ చేసి రసం తీసి దానికి నిమ్మరసం కలిపి చర్మానికి పట్టించాలి.
0 Comments
<<Previous

    Author

    నా పేరు సునయన ( ఉరఫ్ నర్మద). సు అంటే "మంచిది" అని, నయన అంటే "నేత్రములు" . సునయన అంటే మంచి కన్నులు కలది అని అర్థం. నా కళ్లతో చూస్తున్న ఈ  మహిళా ప్రపంచాన్ని మీముందు ఉంచాలని, అది మన మహిళాలోకానికి మేలు చేకూర్చాలని ఆశీస్తూ మనలో  ఒక  తెలుగు తరుణిగా నా ఈ చిన్ని ప్రయత్నం. 

    Archives

    January 2014
    December 2013
    November 2013
    October 2013
    September 2013
    August 2013
    July 2013
    June 2013
    May 2013

    Categories

    All
    మీ జుట్టు సంరక్షణ కోసం
    మెడ కోసం
    కేశ సంరక్షణ
    చలి చర్మానికి...
    ముఖం
    కళ్ళ కోసం
    చర్మం
    పాదాల కోసం
    చేతుల కోసం
    నలుగు వెలుగులు
    పెదవుల కోసం
    ముడతలు తగ్గడం కోసం
    జుట్టు నల్లగా ఉండాలంటే..
    చుండ్రు నివారణ కోసం
    పసుపుతో సౌందర్యము ఎలా వస్తుంది?
    కొవ్వును కరిగించే నువ్వులు
    అందానికి బీట్‌రూట్‌
    చుండ్రుకు ఇంటి వైద్యం
    కరివేపాకుతో కేశ సౌందర్యం
    వెంట్రుకలకు ట్రిమ్మింగ్ అవసరమే!

    RSS Feed

    Enter your email address:

    Delivered by FeedBurner


Powered by Create your own unique website with customizable templates.