పట్టుదల, దృఢచిత్తం ఉంటే సాధించలేనిది ఏమీ లేదని గుజరాత్ రాష్ట్రానికి చెందిన కోమల్ అనే మహిళ నిరూపించింది. పెళ్లయిన 15 రోజులకే కట్నం చాల్లేదని తన భర్త, ఆడబిడ్డలు ఇంట్లో నుంచి ఆమెను గెంటివేశారు. అదనపు కట్నం ఇచ్చుకోలేని కడుపేదరికం వల్ల ఆమెను అత్తారింటివాళ్లు గెంటివేశారు. ఐనా తన జీవితం ఇక ఎడారిగా మారిపోతుందని దిగులు చెందక జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్న ఏకైక లక్ష్యంతో కోమల్ సివిల్స్ పరీక్షకు ప్రిపేర్ అయింది. ఆమె కన్న కల సాకారమైంది. యూనియన్ సర్వీస్ కమిషన్ పరీక్షలో ఏకంగా ఆమె 591 ర్యాంకు సాధించి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. Read more.....
0 Comments
Leave a Reply. |