Read more......
చుట్టూ ఎత్తయిన కొబ్బరిచెట్లు.. వాటిని తాకాలని తాపత్రయపడే అలల హోరు.. చల్లటి గాలులతో అలరారే నీరోజక్ముంచల్ బీచ్ అంటే ఆమెకు ప్రాణం.. బుడిబుడి అడుగుల వేస్తూ ఆ బీచ్లోఎన్నో ఆటలు ఆడుకుంది... పెళ్లయి భర్తతో అత్తారింటికి వెళుతూ కూడా ఆ సముద్రాన్ని తనివితీరా ఓ సారి చూసుకొని వెళ్లిపోయింది... అలాంటి ఆందమైన బీచ్ కొందరి స్వార్థానికి కళావిహీనం కావడాన్ని ఆమె ఏ మాత్రం సహించలేకపోయంది. ఆ బీచ్ను పరిరక్షించేందుకు ఆమె అలుపెరుగని పోరాటం చేస్తోంది. కేరళలోని కన్నూర్ జిల్లా పాజయాంగడికి చెందిన జజీరాకు పెళ్లయి ఇద్దరు పిల్లలు పుట్టారు. అప్పటివరకు ఆ బీచ్ చుట్టుపక్కల పెద్ద మార్పేమీ జరగలేదు. మూడో బిడ్డను కనటానికి 2010లో జజీరా పుట్టింటికి వచ్చింది. వచ్చీరావటంతోనే అందమైన బీచ్ను చూసేందుకు వెళ్లి షాక్కు గురైంది. ఆహ్లాదకరమైన ఆ ప్రాంతంలో ఎత్తయిన భవనాలు, నిరంతరం ఇసుకును తోడేస్తూ తిరిగే ట్రక్కుల శబ్దాలు తప్ప పర్యాటకుల జాడే లేని బీచ్ను చేసి ఆమెకు కన్నీరు ఆగలేదు. రేయింబవళ్లు ఇసుక తరలిపోవడం ఆమెను ఆవేదనకు గురిచేసింది. డబ్బు సంపాదన కోసం ఇసుక మాఫియా బీచ్ అందాలను కొల్లగొడుతున్నా అక్కడివారు ఏమీ పట్టనట్లు చూస్తూండడం జజీరాను కలిచివేసింది. బీచ్ను కాపాడుకోపోతే క్రమంగా అది కనుమరుగయ్యే ప్రమాదం ఉందని నిండు గర్భిణిగా ఉన్నా ఆమె కార్యాచరణకు ఉపక్రమించింది.
Read more......
0 Comments
Leave a Reply. |