కోట్లాదిమందిని ఆనందడోలికల్లో ఓలలాడించే కళా హృదయుల జీవితాలు అత్యంత విషాదకరంగా ఎందుకు ముగిసిపోతాయో ఏమీ చెప్పలేం. హిందీ సినిమాల్లో 1200 పాటల దాకా పాడిన గీతాదత్ జీవితం అలా విషాదకరగానే ముగిసింది. దాదాపు పాతికే ళ్ల పాటు హిందీ చిత్రసీమను తన స్వర మాధుర్యంతో రాగరంజితం చేసిన గీతారాయ్ జీవితం గురుదత్ను ప్రేమ వివాహం చేసుకున్న కొన్నాళ్లకు తీవ్రమైన సంఘర్షణకు గురయ్యింది. ఈ క్రమంలో గురుదత్ ఆత్మహత్యకు చేసుకున్నాడు. ఈ పరిణామంతో హతాషురాలైన గీతాదత్ మద్యానికి బానిసై లివర్ సిర్రోసిస్ బారిన పడి తన 41 ఏటనే కన్నుమూసింది. ఆమె జీవిత విషాదాన్ని అక్షరాలా ప్రతిఫలించే 'దో భాయి' సినిమాలోని 'మేరా సుందర్ సప్నా బీత్గయా' పాటను జాఁ నిసార్ అఖ్తర్ రచిస్తే ఎస్ డి బర్మన్ సంగీతంలో గీతా దత్ గుండెల్ని పిండేసేలా పాడారు.Read more..........
0 Comments
Leave a Reply. |