ఆమె.. అడవికే ‘అమ్మ’! ఒడిషాలోని సీనపల్లి అటవీప్రాంతానికి వెళితే అక్కడ గొడ్డలి పట్టుకొని ఓ 55 ఏళ్ల గిరిజన మహిళ అడవిలో ఒంటరిగా తిరుగుతూ కనిపిస్తుంది. ఆమె చేతిలో ఉన్న గొడ్డలి చూసి ఎవరైనా భయపడతారు. ఆమె పేరు హరదే మిజ్హి. 11 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో పెద్ద పెద్ద వృక్షాలతో అలరారే ఆ అటవీ ప్రాంతాన్ని‘ కప్సి దొంగార్’ అంటారు. ఆ అడవి ఆమెకు ఆరో ప్రాణం. అది పచ్చదనంతో ఇంత సురక్షితంగా ఉందంటే అందుకు ఆమే కారణమని అటవీ అధికారులు సైతం ఒప్పుకుంటారు. వేటగాళ్లు, అడవి దొంగలు, కలప మాఫియా కళ్లెపుడూ ఆ అటవీ సంపదపైనే. వారి బారి నుంచి అడవిని కాపాడుతూ ఆమె తన కన్నబిడ్డలా సాకుతోంది. ‘‘చెట్లను రక్షించండి అవి మనల్ని రక్షిస్తాయి’’ అనే నినాదం చదువుకున్న వారే సరిగా పాటించక, ఇష్టానుసారంగా చెట్లను నరికేస్తున్న ఈ రోజుల్లో ఏ చదువులేని ఆ గిరిజన మహిళ మాత్రం ఆ నినాదం గురించి తెలియకపోయినా చక్కగా ఆచరణలో పెడుతోంది.... Read more | 'డయల్ కాశ్మీర్' రెండు వారాల్లో 'డయల్ కాశ్మీర్' అనే ఆండ్రాయిడ్ అప్లికేషన్ తయారుచేసింది ఓ కాశ్మీరీ అమ్మాయి. 23 యేళ్ల ఆ యువతి పేరు ఆయేషా ఫరూక్. ఈమె రూపొందించిన అప్లికేషన్ను మెచ్చుకుంటూ ఫేస్బుక్, ట్విట్టర్లలో సందేశాలు వెల్లువలా వచ్చిపడ్డాయి. స్వయానా జమ్ము-కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కాంప్లిమెంటరీ ట్వీట్ చేసి మెచ్చుకున్నారు కూడా.... Read more |