- -టమోటా గుజ్జు ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాల తరువాత చల్లటి నీళ్లతో ముఖం కడగాలి.
-మూడు టీ స్పూన్ల తేనెలో దాల్చినచెక్క పొడి కొద్దిగా కలిపి రాత్రి పడుకోబోయేముందు మొటిమలపై రాయాలి. ఇలా రెండు వారాలపాటు చేస్తే ఫలితం ఉంటుంది. - బాదంపప్పును పాలతో కలిపి చిక్కటి పేస్టు చేసి మొటిమలపై రాయాలి. ఇలా చేస్తే మొటిమలు మెత్తబడి త్వరగా తగ్గడమే కాకుండా మచ్చలు కూడా పడవు.
- -నిమ్మరసం, వేరుశెనగ నూనెల్ని సమపాళ్లలో కలిపి రాసుకోవాలి. నిమ్మరసంలో గంధంపొడి లేదా దాల్చిన చెక్క పొడి కలిపి ఆ మిశ్రమాన్ని మొటిమలపై పూసినా ఫలితం ఉంటుంది.
- -నిమ్మరసం, రోజ్ వాటర్లను సమపాళ్లలో కలిపి మొటిమలపై పూసి అరగంట తరువాత చల్లటి నీళ్లతో కడిగేయాలి. నాలుగు వారాలపాటు ఇలా చేస్తే మొటిమలు తగ్గిపోతాయి.
- అరటి, జామ పళ్ల ముక్కలను తీసుకుని మెత్తని పేస్టులాగా చేసుకోవాలి. దీన్ని ముఖంపై పిగ్మెం ఉన్న చోట అప్లై చేయాలి. 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచి తరువాత నీటితో కడిగేయాలి. ప్రతిరోజూ ఇలా చేయడం వల్ల జామలో లైకోపిన్, అరటిలోని శుద్ధి చేసే గుణాలు కలిసి ఆ మచ్చలను పోగొట్టి చర్మాన్ని కాంతివంతం చేస్తాయి.