మహిళలు నేడు రాణించని రంగమంటూ లేదు.తాము ఎంచుకున్న రంగంలో విజయపథంలో పయనిస్తున్నారు. గ్రామీణ ప్రాంత మహిళలు సైతం తామేమీ తీసిపోమన్న రీతిలో చిన్న తరహా పరిశ్రమలను నెలకొల్పి ఆ రంగంలో తమ పనితనానికి పదును పెడుతున్నారు. మహారాష్టల్రోని సతారా జిల్లాకు చెందిన మహిళలు అదే కోవకు చెందుతారు. తమ కాళ్లమీద తాము నిలబడడంతో పాటు తోటి మహిళలకు చేయూతనివ్వాలనే లక్ష్యంతో ఆ మహిళలు ఏకంగా మన్దేశి మహిళా సహకార బ్యాంక్ పేరుతో ఒక మహిళ సహకార బ్యాంక్ను స్థాపించారు. దాని ద్వారా బిజినెస్స్కూల్ను ప్రారంభించారు. హెచ్ఎస్బిసి బ్యాంక్ సహకారంతో మన్దేశి ఉద్యోగిని పేరుతో ప్రారంభమైన ఈ స్కూల్ మహిళలను ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.ఇంకా చదవండి
నిరుపేద కుటుంబంలో పుట్టి పెరిగిన పూనమ్ అమెరికాలోని యూనివర్శిటీలో ఉచితంగా చదువుకొనే అవకాశం దక్కించుకుంది. అదెలాగో చదవండి.నమ్ పుట్టి పెరిగింది హర్యానాలోని కైతా జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో. ఆమె తండ్రి సురేష్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. పూనమ్ డిగ్రీ వరకూ ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే చదువుకుంది. ఎప్పుడూ క్లాస్ ఫస్ట తనే! తండ్రికి కష్టం కలిగించకుండా... సాయంత్రం ట్యూషన్లు చెప్పుకొని వచ్చిన డబ్బులతో పుస్తకాలు కొనుక్కొనేది. తమ్ముడూ, చెల్లికి కావల్సిన అవసరాలూ తనే చూసేది. పూనమ్ వాళ్ల గ్రామంలో ఆడపిల్లలను బయటకు పంపడం చాలా తక్కువ. కాలేజీ చదువంటే తల్లిదండ్రులు ముందుకొచ్చేవారు కాదు. అలాంటిది పూనమ్ ఇంట్లో వాళ్లని బలవంతంగా ఒప్పించి.. తనతోపాటు చెల్లికూడా చదువుకొనేలా ప్రోత్సహించింది.ఇంకా చదవండి
పద్దెనిమిదేళ్ల క్రితం చదివిన చదువును మళ్లీ మొదలుపెట్టి... దాన్ని ఒక ఆదాయ వనరుగా మార్చుకోవడమే కష్టం. ఇక, వ్యాపార విజయం సాధించడమంటే మరీ కష్టం. ఆ సవాల్నే స్వీకరించారు హైదరాబాద్కి చెందిన సుర్జీత్ కౌర్. రెడ్డీల్యాబ్స్, అరబిందో, సీసీఎంబీ వంటి సంస్థలను తన క్లయింట్లుగా మార్చుకునే స్థాయికి చేరుకున్నారు. 'మైక్రోబయాలజీ సేవలు కొన్ని పరిశ్రమలకే కాదు... రైతులు సహా అనేక రంగాల్లోని వారికి ఉపయోగపడతాయి' అంటూ ఆ విశేషాలనూ, అడ్డంకులను దాటి ఎదిగిన తీరునీ చెబుతున్నారు సుర్జీత్. ఇంకా చదవండి |