Read more........
సాధారణ వ్యక్తి కూడా సులభంగా అర్థం చేసుకునేలా చిత్రాలను గీయడం ఆమె ప్రత్యేకత.నిజానికి ప్రాంతీయతకు దర్పమైన కళారూపం ఏదైనా తన ప్రస్థానాన్ని మరింత విజయవంతంగా కొనసాగిస్తుంది. చిత్రకారుడు ఏం ఫీలవుతాడో అదే కాన్వాస్పై వాలుతుంది. కొన్ని సార్లు ఒక థీవ్గును ఎంచుకుని కూడా పెరుుంటింగ్ ఉంటుంది. ప్రతీ కళాఖండానికి థీవ్గు ఉంటుందనేది మరో వాదన. ఏదేమైన కళాకారుడి ఆంతరంగిమై చిత్రకళకు ఆది. అర్పిత కూడా తన పెరుుంటింగ్స్లో వివిధ రకాలైన థీవ్గ్సును ప్రదర్శించే వారు. 1990 తరువాత అర్పిత పెరుుంటింగ్స్ను అనేక జాతీయ , అంతర్జాతీయ స్థారుులో ప్రదర్శించింది. అందుకు గుర్తింపుగా అమెకు ‘పద్మభూషణ’్ అవార్డు కూడా లభించింది.
Read more........
0 Comments
గెలిచినప్పుడు... ప్రపంచమంతా వెంట ఉంటుంది. ఎటు చూసినా వెలుగే కనిపిస్తుంది. ఓడిపోయినప్పుడు... ఒంటరితనమే తోడుంటుంది. చుట్టూ చీకటి కమ్ముకుంటుంది. రెండుసార్లు అనుకున్నది సాధించాలనే ఆరాటంలో ఘోరంగా కుప్పకూలిపోయిన స్వప్నదీ ఒకప్పుడు అదే పరిస్థితి. కలిసి రాని వ్యాపారాలు లక్షల్లో నష్టాన్ని మిగిల్చాయి. ఆశల్ని ఆవిరి చేశాయి. అయినా అధైర్యపడకుండా పట్టుదలగా మరో ప్రయత్నం చేసిన ఆమె, వ్యాపార విజయం సాధించింది. రోజుకి నాలుగొందల గ్లాసుల చెరకు రసాన్ని అందించే కేన్ కోక్ మెషీన్ల తయారీతో నిలదొక్కుకుంది. కడుపు నింపుకోవడానికి కూడా డబ్బుల్లేని పరిస్థితి నుంచి కోటి టర్నోవర్ స్థాయికి ఎదిగిన తీరుని ఇలా చెబుతోందామె.గా చదువుకోవాలి... కానీ ఉద్యోగంలో చేరకుండా సొంతంగా ఏదయినా వ్యాపారం చేయాలన్నదే చిన్నప్పట్నుంచీ నా ఆలోచన. కానీ ఆ దారిలో నడక ప్రారంభించాక అది అనుకున్నంత సులువు కాదని నాకు అర్థమైంది. Read more......
అందమైన ప్రకృతి అంటే మన కళ్లెదుట కనిపించే పచ్చటి చెట్లే అనుకుంటే పొరపాటు. ఆ చెట్లపై తిరిగే ఎన్నోరకాల కీటకాలు, రంగురంగుల సీతాకోకచిలుకలు కూడా ప్రకృతిలో ఓ భాగమే. మన ఇళ్లలో చెట్లను పెంచుకుంటాం గానీ, సీతాకోకచిలుకలను ఎగరనీయం. చెట్లను ఆశ్రయించి బతికే కీటకాలు కనిపిస్తే చాలు వాటిని చిదిమేసి చంపేసే వరకూ నిద్రపోం. సాటి మనుషుల్నే పురుగుల కంటే హీనంగా చూసే ప్రవృత్తిని అలవరచుకుంటున్న ఆధునిక మానవుడు ఆ పురుగులనేం రక్షించగలడు? Read more..........
చుట్టూ ఎత్తయిన కొబ్బరిచెట్లు.. వాటిని తాకాలని తాపత్రయపడే అలల హోరు.. చల్లటి గాలులతో అలరారే నీరోజక్ముంచల్ బీచ్ అంటే ఆమెకు ప్రాణం.. బుడిబుడి అడుగుల వేస్తూ ఆ బీచ్లోఎన్నో ఆటలు ఆడుకుంది... పెళ్లయి భర్తతో అత్తారింటికి వెళుతూ కూడా ఆ సముద్రాన్ని తనివితీరా ఓ సారి చూసుకొని వెళ్లిపోయింది... అలాంటి ఆందమైన బీచ్ కొందరి స్వార్థానికి కళావిహీనం కావడాన్ని ఆమె ఏ మాత్రం సహించలేకపోయంది. ఆ బీచ్ను పరిరక్షించేందుకు ఆమె అలుపెరుగని పోరాటం చేస్తోంది. కేరళలోని కన్నూర్ జిల్లా పాజయాంగడికి చెందిన జజీరాకు పెళ్లయి ఇద్దరు పిల్లలు పుట్టారు. అప్పటివరకు ఆ బీచ్ చుట్టుపక్కల పెద్ద మార్పేమీ జరగలేదు. మూడో బిడ్డను కనటానికి 2010లో జజీరా పుట్టింటికి వచ్చింది. వచ్చీరావటంతోనే అందమైన బీచ్ను చూసేందుకు వెళ్లి షాక్కు గురైంది. ఆహ్లాదకరమైన ఆ ప్రాంతంలో ఎత్తయిన భవనాలు, నిరంతరం ఇసుకును తోడేస్తూ తిరిగే ట్రక్కుల శబ్దాలు తప్ప పర్యాటకుల జాడే లేని బీచ్ను చేసి ఆమెకు కన్నీరు ఆగలేదు. రేయింబవళ్లు ఇసుక తరలిపోవడం ఆమెను ఆవేదనకు గురిచేసింది. డబ్బు సంపాదన కోసం ఇసుక మాఫియా బీచ్ అందాలను కొల్లగొడుతున్నా అక్కడివారు ఏమీ పట్టనట్లు చూస్తూండడం జజీరాను కలిచివేసింది. బీచ్ను కాపాడుకోపోతే క్రమంగా అది కనుమరుగయ్యే ప్రమాదం ఉందని నిండు గర్భిణిగా ఉన్నా ఆమె కార్యాచరణకు ఉపక్రమించింది.
Read more...... భారతీయ సంతతికి చెందిన రచరుుత్రి
ఇంటర్ప్రెటర్ ఆఫ్ మాలడీస్కు పులిట్జర్ తెరెకక్కిన తొలి నవల ద నేవ్గు సేక్ నక్సల్ బరి నేపథ్యంలో ది లోల్యాండ్గ ఆలోచింపజేసే రచనలు ఆమె సొంతం ఆమె రాసిన మూడు నవలలు ఓ సంచలనం. ఆమెకు లక్షల మంది అభిమానులు తెచ్చిపెట్టారుు. అరుుతే విమర్శకులు లేకపోలేదు. ఓ హెన్రీ, పులిట్జర్ అవార్డులు అందుకుని తన రచనా ఘనత ఏపాటిదో చూపించారు. తండ్రి భారతదేశాన్ని వీడిపోరుున తరువాత లండన్లో జన్మించింది ఈ రచరుుత్రి. అరుునా భారత దేశ సంసృ్కతి, సంప్రదాయాలు, సమస్యలు అన్నింటిపైన పట్టు సంపాదించింది. 1967లో పశ్చిమ బెంగాల్లో దున్నే వాడిదే భూమి పేరుతో ప్రారంభమైన ఉద్యమ నేపథ్యంలో రాసిన నవల ‘ది లోల్యాండ్గ’. ఇది ఈ సంవత్సరానికి బుకర్ పురస్కారం ఎంపిక జాబితాలో చోటు సంపాదించుకుంది. Read more........... ప్రతి ఆరోగ్య సమస్యా బాధిస్తుంది. ఎయిడ్స్ శారీరకంగా బాధపెట్టడమే కాదు... మానసికంగా కూడా కుంగదీస్తుంది. ఆ వ్యాధి లక్షణాలు ఉన్నాయని తెలియగానే చాలామంది కించపరిచేలా మాట్లాడతారు. ఒక్క ఆ వ్యక్తినే కాకుండా... కుటుంబ సభ్యుల్నీ దూరం పెడతారు. ఇవన్నీ బాధితుల్నీ, వారి కుటుంబ సభ్యుల్నీ ఎంత క్షోభ పెడతాయో దగ్గరగా చూసింది తమిళనాడులోని కరూర్కి చెందిన ఆస్మా నజీర్.
Read more........... చిత్రలేఖనం అనగానే మనసు అగాధంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న భావాలన్నింటినీ ఏరికూర్చి తెల్లని కాగితంపై ఒక మాలగా అల్లి సింగారించే అద్భుత కావ్యగీతిక. చెప్పాలనుకున్న మాటలు ఎంతకీ చెలియకట్టలు తెగిరాక, వెన్నెల వెలుగుతో దోబూచులాడే మూగభాష్యం ఎవరికి చెప్పను? ఎలా చెప్పను? ఎప్పుడు చెప్పను? చెప్పాలనుకునే మాటలు నాకంటే ముందుగా ఎవరో ఒకరు ఏదో ఒక సందర్భంలో చెబుతూనే ఉంటారు. అయినా నా మనోవేదన తీరడం లేదు. నాకు నేను నీతో సమీపంగా గాలికూడా దూరలేనంత దగ్గరగా ఎండిపోయిన ఆకులశబ్దం రాగతాళాల మధ్యలో శ్రావ్యంగా, మనోహరంగా చెప్పాలనుకుంటున్నా...అయినా నీ చెంతకు నా పలుకు చేరడం లేదు. గాలితుపానుల మధ్య వీచే ప్రతి కెరటంపై నేను రాసి పంపుతున్న ప్రేమకావ్యం నీదరికి రావడం లేదు. ఏదిఏమైనా, ఎలాగైనా, ఏమైనా సరే నేను పంపాలనుకునే సందేశం నీకే నేరుగా నీగుండె గదిలో నిక్షిప్తంగా నిలిచేలా పంపాలనుకున్నా. అదేంటో తెలుసా? ఈ గిఫ్ట్కాగితం విప్పి చూడు నీకే తెలుస్తుంది...పగలూ రాత్రి తేడా లేకుండా, అన్నపానీయాలను దరిచేరనీయకుండా నీకోసం వేసిన ప్రేమచిత్రం నీ మనసు కదిలించడం లేదా? అంటూ పాషాణ గుండెల్ని కదిలించే ప్రేమ సన్నివేశాలతో చిత్రాలను వేసి, 20వ శతాబ్దంలో టాప్టెన్ చిత్రాల్లో తన చిత్రానికి చోటు సంపాదించి, చరిత్ర సృష్టించిన ధీర వనిత క్లారా క్లింగ్హోఫర్. Read more..... 'ఆడపిల్లలు ఇలా నడవాలి, అలాగే నడుచుకోవాలి... ఫలానా ఉద్యోగాలే చేయగలరు... ఏ స్కూటీనో, స్కూటరో తప్ప వేరే బండిని నడపడం అటుంచి అసలు బండిని పట్టుకోమనండి చూద్దాం...' ఈ మూసపోసిన ఆలోచనలకు కళ్ళెం వేసి,ఊహలకు రెక్కలు తొడిగి, బైక్ మీద పరుగులు పెట్టిస్తోంది 21 ఏళ్ళ శీతల్ అయ్యర్.
Read more... మనిషిలో సాధించాలనే పట్టుదల, చొరవ, శ్రమించే తత్వం ఉంటే ఏదైనా సాధ్యమే. మనం ఏ ప్రయత్నం చేయకుండా, మనకేదీ దక్కలేదని బాధపడడం అవివేకమని అంటోంది బెంగళూరుకు చెందిన ఓ మహిళా ఆటో డ్రైవర్.. కాదు కాదు.. మహిళా న్యాయవాది. ఆటోడ్రైవర్కు బదులు మహిళా న్యాయవాది అంటే ఒకింత ఆశ్చర్యపోతున్నారా? అవును మరి..! వెంకటలక్ష్మి ఒకప్పుడు ఆటోడ్రైవరే. మొక్కవోని దీక్షతో ‘లా’ కోర్సు చదివి, తాను కో రుకున్న విధంగా న్యాయవాద వృత్తిలో ప్రవేశించింది. Read more...........
నీనా పుట్టకముందే ఆమె తల్లిదండ్రులు న్యూయార్క్లో స్థిరపడ్డారు. తండ్రి ధనకోటేశ్వరరావు గైనకాలజీ నిపుణుడు. తల్లి షీలా రంజనిది సాఫ్ట్వేర్ రంగం. నీనా పసిపిల్లగా మూడేళ్ల పాటు విజయవాడలో ఉన్న అమ్మమ్మ దగ్గరే పెరిగింది. తరవాత తల్లిదండ్రుల వద్దకెళ్లింది. తండ్రి తరఫున బంధువులంతా అక్కడే ఉంటారు. దాంతో తెలుగు సంప్రదాయాల మధ్యే పెరిగింది. ఇంట్లోనూ తెలుగులోనే మాట్లాడుకోవడంతో తనకూ భాష మీద మంచి పట్టు ఉంది. వేసవి సెలవులొస్తే నీనా అక్కతో కలిసి ఇండియాకొచ్చేస్తుంది. |