
ఓట్స్ - 100 గ్రా.
సగ్గుబియ్యం - 150 గ్రా.
బంగాళదుంప - ఒకటి
బియ్యప్పిండి - 50 గ్రా.
ఉల్లిపాయ - ఒకటి
అల్లం - చిన్న ముక్క
పచ్చిమిర్చి - మూడు
మజ్జిగ - తగినంత
ఉప్పు - తగినంత
నూనె - వేయించడానికి సరిపడా
తయారుచేసే పద్ధతి :
- ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చిని సన్నగా తరగాలి.
- బంగాళదుంపను ఉడికించి పొట్టు తీసి మెత్తగా చిదమాలి.
- సగ్గుబియ్యం, ఓట్స్ ను మజ్జిగలో గంట సేపు నాననివ్వాలి. ఇప్పుడు సగ్గుబియ్యం, ఓట్స్ మిశ్రమంలో చిదిమిన బంగాళదుంప, ఉల్లిపాయ ముక్కలు, అల్లం, పచ్చిమిర్చి ముక్కలు, బియ్యప్పిండి, ఉప్పు వేసి కలపాలి. బాణలిలో నూనె వేసి కాగాక ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న వడల్లా వేసి ఎర్రగా వేయించి తీయాలి.
మూలం : సాక్షి దినపత్రిక