సేమియా : కప్పు
మామిడి తురుము : కప్పు
తాలింపు దినుసులు : రెండు చెంచాలు
పచ్చిమిర్చి : 4
ఎండుమిర్చి : 4
కరివేపాకు రెమ్మలు : 3 లేదా 4
తెల్ల నువ్వులు : రెండు టేబుల్ స్పూన్లు
ఇంగువ : చిటికెడు
నూనె : రెండు పెద్ద చెంచాలు
పల్లీలు : కొన్ని
ఉప్పు : తగినంత
పసుపు : కొద్దిగా
తయారి విధానం :
నువ్వుల్ని ముందుగా నూనె లేకుండా వేయించుకొని మెత్తగా పొడి చేసుకొని పెట్టుకోవాలి. ఓ గిన్నెలో నాలుగు కప్పుల నీళ్ళు, సేమియాకు సరిపడా ఉప్పు, రెండు చెంచాల నూనె తీసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. అవి మరుగుతున్నపుడు సేమియా వేసేయాలి. సేమియా మూడు వంతులు ఉడికాక దింపేసి చిల్లుల గిన్నెలోకి తీసుకొని పైన వెంటనే చన్నీళ్ళు పోసేయాలి. ఇలా చేస్తే సేమియా ఒకదానికి ఒకటి అంటుకోకుండా పొడిపొడిగా వస్తుంది. ఇప్పుడు బాణలిలో నూనె వేడి చేసి తాలింపు గింజలు, పల్లీలు, ఎండుమిర్చి, ఇంగువ వేయాలి.అవి వేగాక పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు రెమ్మలు కూడా వేయించాలి. నీళ్ళు పోయి తురుము పొడిపొడిగా అయ్యాక ఉడికించి పెట్టుకున్న సేమియా, తగినంత ఉప్పు, పసుపు, నువ్వుల పొడి వేసి బాగా కలపాలి. కావాలనుకుంటే కొద్దిగా కొత్తిమీర కూడా చల్లుకోవచ్చు.
మూలం : ఈనాడు దినపత్రిక