ఉప్మా రవ్వ : రెండు కప్పులు
బియ్యం పిండి : ఒక కప్పు
మజ్జిగ : రెండు కప్పులు
ఉల్లిపాయ ముక్కలు : రెండు కప్పులు (సన్నగా తరిగి పెట్టుకోవాలి )
పచ్చి మిర్చి ముక్కలు : ఒక చెంచాడు
ఇంగువ : కొద్దిగా
జీడిపప్పు : తగినన్ని
ఉప్పు : తగినంత
తయారుచేసే పద్ధతి :
మొదటగా ఉప్మా రవ్వలో బియ్యపు పిండి, మజ్జిగ, కొద్దిగా ఇంగువ, సోడియం బై కార్బోనేట్, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీడిపప్పు ముక్కలు వేసి బాగా కలపాలి. ఇలా కలిపిన పిండిని రెండు గంటలు నాననిచ్చి దోశలు వేస్తె సరి కరకరలాడే రవ్వ దోశలు రెడీ. క్రిస్పీగా, టేస్టీ గా ఉండే రవ్వ దోశను మరీమరీ ఇష్టంగా తింటారు.
మూలం : ఆదివారం ఆంధ్రప్రభ