
శెనగపప్పు - రెండు కప్పులు
జీలకర్ర - ఒక టీస్పూన్
బిర్యానీ ఆకులు - రెండు
దాల్చిన చెక్క - చిన్నది (ముక్కలుగా చేసుకోవాలి)
లవంగాలు - మూడు
పెద్ద ఉల్లిపాయ - ఒకటి (సన్నగా తరగాలి)
పసుపు, కారం - ఒక్కోటి టీస్పూన్ చొప్పున
నెయ్యి - రెండు టీ స్పూన్లు
నిమ్మరసం - అరటీస్పూన్
కొత్తిమీర - కొద్దిగా (సన్నగా తరగాలి)
ఉప్పు - రుచికి సరిపడా
తయారుచేసే పద్ధతి :
- పప్పుని శుభ్రంగా కడిగి అరగంట పాటు నానపెట్టి కుక్కర్లో నాలుగు కప్పుల నీళ్లు పోసి ఉడికించాలి.
- ఒక గిన్నెలో నెయ్యి వేసి అది వేడెక్కాక గరం మసాలా దినుసులు (బిర్యానీఆకులు, దాల్చినచెక్క, జీలకర్ర) వేసి చిటపటమనే వరకు వేగించాలి. ఆ తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి అవి రంగు మారాక ఉడికించిన పప్పు, ఉప్పు, మసాలా దినుసులు వేసి మూతపెట్టకుండా కొంచెంసేపు ఉడికించాలి. ఈ పప్పు పైన కొత్తిమీర ఆకులు చల్లి నిమ్మరసం పోసి కలపాలి. ఈ పప్పును వేడివేడిగా రోటీ, పూరీ, పరాటా, బటర్ నాన్లతో తింటే ఆహా ఏమి రుచి అనాల్సిందే.
మూలం : సూర్య దినపత్రిక