కాబూలీ శనగలు - 250 గ్రా.
ఉల్లి తరుగు - 50 గ్రా.
టొమాటో తరుగు - 75 గ్రా
పచ్చిమిర్చి - 4
అల్లం వెల్లుల్లి పేస్ట్ - అరటీస్పూన్
పుదీనా తరుగు - అరకప్పు
కొత్తిమీర తరుగు - కొద్దిగా
బిరియానీ ఆకులు - మూడు
పసుపు - చిటికెడు
నూనె - 25 గ్రా.
మిరప్పొడి - అరటీస్పూన్
చోలే మసాలా - అరటీస్పూన్
ఆమ్ చోర్ పౌడర్ - అరటీస్పూన్
గరం మసాలా - పావుటీస్పూన్
ఉప్పు - తగినంత
తయారుచేసే పద్ధతి :
- శనగలను ముందురోజు రాత్రి నానబెట్టి, మరుసటి రోజు నీరంతా తీసేసి కుకర్ లో సుమారు అరగంట సేపు ఉడికించాలి.
- బాణలిలో నూనె వేసి కాగాక, బిరియానీ ఆకు, గరం మసాలా వేసి వేగాక, ఉల్లితరుగు వేసి గోధుమ రంగులోకి వచ్చే వరకు వేయించాలి.
- అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి రెండు నిముషాలు వేగాక, టొమాటో తరుగు, మిగతా పదార్థాలు కూడా ఒక్కదాని తర్వాత ఒకటి వేసి దోరగా వేయించుకోవాలి.
- ఉడికించిన శనగలో పావుకప్పు శనగలను మెత్తగా చేసి పై మిశ్రమంలో కలపాలి.
- మూడు లేక నాలుగు నిమిషాల తర్వాత నీరు లేకుండా శనగలు పై మిశ్రమంలో వేసి, రుచికి తగ్గట్టు ఉప్పు కలిపి కొంచెం సేపు ఉడకనివ్వాలి.
- తర్వాత ఒక కడాయిలోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వడ్డించాలి.
మూలం : సాక్షి దినపత్రిక