
కందిపప్పు - 200 గ్రా.
టొమాటో ముక్కలు - పావు కప్పు
చింతపండు - తగినంత,
మిరియాలు - 6
ధనియాలు - టీ స్పూను,
పచ్చిమిర్చి - 6
వెల్లుల్లి రేకలు - 8,
నూనె - రెండు టీ స్పూన్లు
మునగాకు - 200 గ్రా.
రిఫైన్డ్ ఆయిల్ - 3 టేబుల్ స్పూన్లు
ఎండుమిర్చి - 8,
ఆవాలు - టేబుల్ స్పూను
జీలకర్ర - టేబుల్ స్పూను,
కరివేపాకు - రెండు రెమ్మలు
పసుపు - కొద్దిగా,
ఉప్పు - తగినంత
మినప్పప్పు - 100 గ్రా.,
కొత్తిమీర - కొద్దిగా
కరివేపాకు - రెండు రెమ్మలు
తయారి
- ముందుగా కందిపప్పును శుభ్రంగా కడిగి, టొమాటో ముక్కలు జతచేసి, కుకర్లో మెత్తగా ఉడికించాలి.
- చింతపండును నానబెట్టి రసం తీసి పక్కన ఉంచుకోవాలి.
- మిరియాలు, ధనియాలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి మిక్సీలో వేసి పేస్ట్ చేయాలి.
- బాణలిలో నూనె కాగాక ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు వరసగా వేసి వేయించాలి.
- మునగాకు జతచేసి, ఉడికించిన పప్పు, ఉప్పు, నీరు పోసి మూడు నాలుగు నిముషాలు ఉడికించాలి.
- చింతపండు రసం, పసుపు వేసి బాగా మరిగించాలి.
- కొత్తిమీర, కరివేపాకు వేసి దించేయాలి.