పెసర పప్పు - కప్పు
వేరుశనగపప్పు - పావుకప్పు
మామిడికాయ తురుము - 2 టీస్పూన్లు
పచ్చి కొబ్బరి తురుము - 2 టీస్పూన్లు
కొత్తిమీర - కొద్దిగా
ఉప్పు - తగినంత
పచ్చిమిర్చి - రెండు (సన్నగా తరగాలి)
తయారుచేసే పద్ధతి :
ముందుగా పెసరపప్పు, వేరుశనగపప్పులను విడివిడిగా మూడు లేక నాలుగు గంటల పాటు నానపెట్టి నీళ్ళు వడకట్టాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో ఈ పప్పులను, పచ్చిమిర్చి తరుగు, పచ్చి మామిడి తురుము వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఐదు లేక ఆరు నిముషాలు నాననివ్వాలి. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. (మామిడికాయ బదులు నిమ్మరసం కూడా వాడుకోవచ్చు).
మూలం : సాక్షి దినపత్రిక