
శెనగపిండి - రెండు కప్పులు,
బియ్యప్పిండి - పావుకప్పు,
వంటసోడా - పావు టీస్పూన్,
ఉల్లిపాయ - ఒకటి,
పచ్చిమిర్చి - మూడు,
కొత్తిమీర - కొద్దిగా
అల్లం - చిన్న ముక్క,
వెల్లుల్లి రెబ్బ - ఒకటి,
వంకాయలు - మూడు,
నూనె, ఉప్పు - సరిపడా.
తయారుచేసే పద్ధతి :
- వంకాయల్ని నాలుగు భాగాలుగా కోయాలి( గుత్తి వంకాయ కూరకి కోసినట్టుగా). వాటిని నూనెలో వేసి సగం ఉడికించి పక్కన పెట్టాలి.
- ఆ తరువాత శెనగ, బియ్యప్పిండిలో నీళ్లు పోసి వంటసోడా, ఉప్పు వేసి చిక్కటి పేస్ట్లా కలపాలి.
- మిక్సీలో పచ్చిమిర్చి, ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లం, కొత్తిమీర, కొద్దిగా ఉప్పు వేసి మెత్తటి పేస్ట్లా చేయాలి.
- ఆ తరువాత సగం ఉడికిన వంకాయల్లో మిక్సీ చేసిన మసాలా పేస్ట్ కూరాలి. వీటిని బజ్జీ పిండి మిశ్రమంలో ముంచి నూనెలో వేసి మిర్చి బజ్జీకి వేగించినట్టుగానే వేగించాలి. వీటిని నచ్చిన చట్నీతో తినొచ్చు లేదా అన్నంలో కూరగా అయినా తినొచ్చు.
మూలం : ఆంద్రజ్యోతి దినపత్రిక