
క్యాబేజీ తరుగు-రెండు కప్పులు,
బంగాళాదుంప-ఒకటి
పెసరపప్పు-అరకప్పు,
మిర్చి-నాలుగు
ఉప్పు-తగినంత,
పసుపు-చిటికెడు
కొబ్బరితురుము-రెండు చెంచాలు
గరంమసాలా-చెంచా,
కరివేపాకు-నాలుగు రెబ్బలు
శనగపిండి-రెండు కప్పులు,
వంటసోడా-చిటికెడు
వాము-అరచెంచా,
నూనె-వేయించడానికి సరిపడినంత
తయారుచేసే విధానం
- బంగాళాదుంపను కుక్కర్లో రెండు కూతలు వచ్చే వరకూ ఉడికించాలి. చల్లారాక పొట్టుతీసి చేత్తో మెత్తగా మెదిపి పక్కన పెట్టుకోవాలి. పెసరపప్పును నానబెట్టి ఉంచాలి. తరువాత బాణలిలో నాలుగు చెంచాల నూనె వేసి కరివేపాకు, పచ్చిమిర్చి, కొబ్బరి తురుము, ఉప్పు, పసుపు వేయాలి. కొద్దిసేపటికి క్యాబేజీ తరుగు, పెసర పప్పు వేసి కలియతిప్పాలి. అందులో కాసిన్ని నీళ్లు పోసి మూతపెట్టాలి.
- ఐదు నిమిషాలయ్యాక బంగాళాదుంప మిశ్రమం, కొత్తిమీర, గరంమసాలా వేసి పక్కన దించేయాలి. చల్లారాక ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఓ గిన్నెలో శనగపిండి తీసుకుని అందులో వంటసోడా, ఉప్పు, వాము చేర్చి బజ్జీలా పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె పోసి పొయ్యిమీద పెట్టాలి.
- వేడయ్యాక ముందు సిద్ధం చేసి పెట్టుకున్న ఉండల్ని శనగపిండిలో ముంచి వేయాలి. బంగారు వర్ణంలోకి వచ్చేవరకూ వేయించి తీస్తే క్యాబేజీ బోండా సిద్ధం. వీటిని టమాటసాస్తో తింటే బాగుంటాయి.