
ఈ విషయం డాక్టర్ గీతాడ్డికి అనుభవైకవేద్యం!తల్లికన్నా గొప్ప తత్వం బోధించేవాళ్లుంటారా?ఉండరు.. ఈశ్వరీబాయి, గీతాడ్డిల అనుబంధమే అందుకు సాక్ష్యం! అమ్మకు సాటివచ్చే గైడ్ ఎవరు లోకంలో...?ఎవరూలేరు! అందుకు గీత సాధించిన విజయాలే సోదాహరణలు!‘అఆఇఈ’ల చదువు నుంచి ఆత్మవిశ్వాసం గెలుపు దాకా గీతలో పోతపోసుకున్నదంతా ఈశ్వరీబాయే!అయినా అమ్మలో నేను పదిశాతం కూడా లేను అనుకుంటుంది ఆ బిడ్డ! అలాంటి గీతాడ్డి మనోగతమే ఇది....
నేను చాలా అదృష్టవంతురాలిని. దళిత మహిళా నేత జె. ఈశ్వరీబాయి నాకు తల్లికావడం నా పూర్వజన్మ సుకృతం. ఆమెలాంటి వ్యక్తిత్వం బహుశా ఇంకెవరికీ ఉండకపోవచ్చు. దళిత కుటుంబంలో పుట్టి, చిన్న వయసులోనే భర్తను కోల్పోయి జీరో నుంచి జీవితాన్ని మొదలుపెట్టింది. ఓ వైపు టీచర్గా ఉద్యోగం చేస్తూనే ఇంకో వైపు సాంఘిక సేవలో ఇన్వాల్వ్ అయింది. రెడ్క్షికాస్ సొసైటీ చాలా కార్యక్షికమాల్లో ఆమె భాగస్వామి. రెడ్క్షికాస్ సొసైటీ లైఫ్ మెంబర్. పేదలకు చదువు చెప్పించాలని తన దగ్గరున్న డబ్బుతోనే గీతా ప్రైమరీ స్కూల్ అని, గీతా మిడిల్ స్కూల్ అని ఇన్స్టిట్యూషన్స్ మొదలుపెట్టింది. నాన్న చనిపోయినప్పుడు నేను చాలా చిన్నదాన్ని. ఆయన పుణెలో డెంటిస్ట్. నాన్న పోవడంతో నన్ను తీసుకొని సికింవూదాబాద్లోని అమ్మమ్మవాళ్లింటికి(చిలకలగూడ) వచ్చేసింది అమ్మ. అక్కడి స్లమ్స్కి వెళ్లి అడల్ట్ ఎడ్యుకేషన్ చెప్తానని అమ్మ అక్కడ ఓ బోర్డ్ పెట్టి, ఓ వరండాలో అందరినీ పోగేసి చదువు చెప్పేది. నేను అప్పుడప్పుడే స్కూల్కి వెళ్తున్నాను. స్కూల్ నుంచి రాగానే నేనూ అమ్మతో వెళ్లి నాకు వచ్చిన ఏబీసీడీలు బోర్డుమీద రాసి వాళ్లకు చెప్పేదాన్ని.
ఇండిపెండెంట్..
మేమున్న ఏరియా వెరీ సెక్యులర్. ఒకవైపు అంతా ముస్లిమ్స్, ఇంకో వైపు క్రిస్టియన్స్. మధ్యలో మేముండేవాళ్లం. అన్ని పండుగలను అందరం కలిసే చేసుకునేవాళ్లం. కులమతాలకతీతమైన మంచి వాతావరణంలో పెరిగాన్నేను. ఎస్సీనని చిన్నప్పటి నుంచీ తెలుసు. కాని దానివల్ల వచ్చే కష్టాలు, నష్టాలు మాత్రం నేనెప్పుడూ ఫేస్ చేయలేదు. అట్లా పెంచింది నన్ను అమ్మ. ఒకవైపు సంఘసేవ, ఆపదలో ఉన్న వాళ్లను ఆదుకోవాలనే తత్వం లాంటివన్నీ మా అమ్మవల్ల చిన్నప్పుడే తెలిశాయి. అన్నిటికి మించి ఆత్మస్థయిర్యం. ఆమె నాకు మదర్, టీచర్, గైడ్ , ఫిలాసఫర్, ఫ్రెండ్ కూడా! ఆమెను చూసిన ప్రతిసారి ఒక ఉత్సాహం కలిగేది. ఇన్స్పైర్ అయ్యేదాన్ని. ఆమె అప్పుడే కార్ డ్రైవ్ చేసేది. ఎలాంటి డేంజరస్ సిట్యూయేషన్స్ ఉన్నా, ఎవరైనా ఆడవాళ్లు బాధల్లో ఉన్నట్టు తెలిస్తే చాలు ఎంత రాత్రయినా సొంతంగా కారేసుకొని వెళ్లిపోయేది. మా అమ్మవాళ్ల బ్రదర్ రామకృష్ణ .
ఆయన టోటల్ లెఫ్టిస్ట్. అమ్మకు పొలిటికల్ థాట్స్, అవేర్నెస్ కల్పించింది ఆయనే! భర్త చనిపోయి తల్లిగారింటి మీదున్నా అమ్మ ఏనాడూ డిపెండెంట్గా లేదు. ఆ రోజుల్లోనే ఆమె మెట్రిక్ పాసైంది. టీచర్ ఉద్యోగం చేస్తూ ఇండిపెండెంట్గానే ఉంది. ఎక్కడున్నా అందరితో కలివిడిగా, ప్రేమతత్వంతో ఉండేది. అణగారిన వర్గాలు, స్త్రీల పట్ల చాలా కమిట్మెంట్తో ఉండేది. జీవితాంతం అంబేద్కర్ సిద్ధాంతానికి కట్టుబడి ఉంది. ఇండిపెండెంట్గా పొలిటికల్ కెరీర్ స్టార్ట్ చేసి అంబేద్కర్ రిపబ్లికన్ పార్టీలోకి వెళ్లింది. ‘రూలింగ్ పార్టీలో ఉంటే మనకు వాయిస్ ఉండదు. వాళ్లు చెప్పినట్టే నడుచుకోవాలి. అదే అపోజిషన్లో ఉంటే క్వశ్చన్ చేసే రైట్ ఉంటుంది’ అని చెప్పేది ఎప్పుడూ! అంత పోరాటపటిమతో ఉండేది. మా అమ్మలో నేను పదోవంతు కూడా లేను. రెండుసార్లు కౌన్సిలర్గా ఉండి తర్వాత ఎమ్మెల్యే అయింది. మా గ్రాండ్పేంట్స్ కూడా ఆమెకు చాలా స్వేచ్ఛనిచ్చారు. జనాలంతా డైరెక్ట్గా ఆమె బెడ్రూమ్లోకే వెళ్లేవాళ్లు. కింద ఒక గొంగడి పర్చుకొని కూర్చునేవారు.
అక్కడే అమ్మ ఒక టైపిస్ట్ని, క్లర్క్ని పెట్టుకునేది. ప్రజల సమస్యలు విని అప్పటికప్పుడే లెటర్ టైప్ చేయించి ఇస్తుండే. అమ్మ చూడ్డానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉండేది, మంచి డ్రెస్ సెన్స్ ఆమెది. తనను చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది... ఒక్క మహిళ... ఇన్ని పనులు చేయగలదా అని! అట్లా ఎదుగుతూ ఎదుగుతూ ఆమె చివరకు రిపబ్లికన్ పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ అయింది. పుణెలో ఉన్నప్పుడు మరాఠీ బాగా నేర్చుకుంది. మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాల్లో ఆమెతో పార్టీవాళ్లు మరాఠీలో స్పీచ్లిప్పించేవారు. పీవీ నరసింహారావు, అమ్మ అయితే మరాఠీలోనే మాట్లాడుకునేవాళ్లు. ఆయన అమ్మను ‘అక్కా’ అని పిలిచేది. పీవే కాదు అన్ని పార్టీల నేతలు అమ్మను చాలా గౌరవించేవారు. నా చిన్నప్పటి నుంచి అమ్మ ఒకటే మాట అంటుండే..‘మీ ఫాదర్ డెంటిస్ట్గా ఉండే, నువ్వు గైనకాలజిస్ట్ కావాల, డాక్టర్నే పెళ్లి చేసుకోవాల, నేను హాస్పిటల్ కట్టాల, మీరు అందులో ప్రాక్టీస్ చేయాలి’ అని! నన్ను మాత్రం పాలిటిక్స్లోకి రావద్దు అని చెప్పేది. పాలిటిక్స్కి నేను సూట్ కానని ఆమె ఉద్దేశం. నిజానికి ఆమె నన్ను ఓ లిటిల్ ప్రిన్సెస్లా పెంచింది. ఫస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ రాజేంవూదవూపసాద్, కృష్ణమీనన్, జవహర్లాల్ నెహ్రూ.. ఇట్లా అందరినీ నాకు చూపించింది. షి వజ్ సో ఫాండ్ ఆఫ్ మి. నేను ఆమె కలలను నెరవేర్చాను.
వారితో పరిచయం.. ఫారిన్ ప్రయాణం
నేను గాంధీ మెడికల్ కాలేజ్లో మెడిసిన్ చేశాను. డాక్టర్గారు (భర్త, డాక్టర్ రామచంద్ర రెడ్డి ) మణిపాల్లో ఎంబీబీఎస్ చేసి హౌస్సర్జన్సీ కోసం హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ వచ్చారు. నాదీ గాంధీ హాస్పిటలే. అట్లా మా ఇద్దరి పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లింది. 1971లో నా పెళ్లి అమ్మ ఊహించుకున్న రేంజ్లోకాక చాలా సింపుల్గా జరిగిపోయింది. పెళ్లాయ్యాక హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ఆస్ట్రేలియా వెళ్లాం ఇద్దరం. అక్కడే జాబ్ చేస్తూ పీజీ చదివాం. తను అనస్థీషియా, నేను గైనకాలజీ! మూడేళ్ల తర్వాత ఇండియా వచ్చాం. తన ఫ్రెండ్స్ని, రెండు వైపుల బంధువులను పిలిచి గ్రాండ్ రిసెప్షన్ ఇచ్చింది. ఆ టైమ్లో ఆస్ట్రేలియాకు పెద్ద పేరు లేదు. ఇంగ్లండ్ అంటేనే గొప్ప. ‘ఏం ఆస్ట్రేలియా.. లండన్లో చదువుకుంటే గొప్ప’ అని అమ్మ బంధువులు అన్నారు. అట్లా ఆస్ట్రేలియా నుంచి 1977లో లండన్ వెళ్లాం. అక్కడ మెంబర్ ఆఫ్ రాయల్ కాలేజ్లో obstetrics and gynecologyలో నేను, అనస్థీషియాలోడాక్టర్గారు.. డిగ్రీ చేశాం.
మేమున్నప్పుడు ఒకసారి రాయల్కాలేజ్ ఫంక్షన్కి క్వీన్ ఎలిజబెత్ వచ్చారు. ఆమె ఎవరి దగ్గరకైతే వచ్చి మాట్లాడుతుందో వాళ్లు మోకాళ్ల మీద వంగి ఆమెకు రాజవందనం తెలపాలని మాకు ముందే చెప్పి ఉంచారు కాలేజ్ స్టాఫ్. నేను చీర కట్టుకొని, నగలు వేసుకొని కంప్లీట్ ఇండియన్ లేడీగా తయారై వెళ్లాను. డాక్టర్గారు ముందే చెప్పారు ‘ఎలిజబెత్ సరాసరి నీ దగ్గరికే వస్తుంది’ అని. ఆ మాటను నేను తేలికగా తీసుకున్నాను. అన్నట్టుగానే క్వీన్ ఎలిజబెత్ డైరెక్ట్గా నా దగ్గరకే వచ్చి పలకరించింది. ఆ ఎగ్జైట్మెంట్లో ఆమెకు మోకాళ్ల మీద వంగి నమస్కారం చేయాలనే విషయాన్ని కూడా మరిచిపోయిన! మేం ఇంగ్లండ్లో ఉన్నప్పుడే అమ్మ ఇక్కడ ఎమ్మెల్యే. తను అపోజిషన్లోఉన్నప్పటికీ ఆమెను విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కమిషన్కి చైర్మన్ చేశారు. అంటే అది కేబినెట్ ర్యాంక్ అన్నమాట. అమ్మకు మాత్రమే దక్కిన అరుదైన గౌరవమనుకుంటా అది! అంత స్ట్రేచర్, బిజీగా ఉండే అమ్మ నా ఎగ్జామ్స్ టైమ్స్లో లండన్కి వచ్చి పక్కా తల్లి పాత్ర పోషించింది. ఆమె మంచి కుక్. మాకే కాదు మా ఇంటికొచ్చిన అందరికీ ఓపికగా బిర్యానీ సహా రకరకాల వంటలు వండిపె ఎన్ని క్వాలిటీసో ఆమెలో!
కింగ్ ఫర్హాద్..
లండన్లో మా చదువులు ముగిసే నాటికల్లా సౌదీ అరేబియా రాజధాని రియాద్లోని కింగ్ ఫర్హాద్ హాస్పిటల్లో పనిచేయడానికి ఆఫర్ వచ్చింది మా ఇద్దరికి. అప్పటికే డాక్టర్గారు కూడా ‘మనం సొంతంగా ప్రాక్టీస్ పెట్టుకోవాలంటే డబ్బు, అనుభం కావాలి కదా.. వెళ్లి చేద్దాం’ అన్నారు. మంచి హాస్పిటల్, పెద్ద జీతం, గొప్ప అవకాశం అది. వెళ్లాం. ఆ హాస్పిటల్లో మా ఇద్దరికీ మంచి పేరుండేది. మేం అక్కడున్నప్పుడే 1980లో ఇండియా నుంచి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ, పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్న రాజీవ్గాంధీ ఇద్దరూ రియాద్కి వచ్చారు. ముస్లిం కంట్రీస్లో వాళ్ల జెండాతో పాటు ఇండియా జెండా కూడా కలిసి ఎగరడం ఓ అద్భుతం. అదిచూసిన మాకు చాలా గర్వంగా అనిపించింది. అప్పుడే సౌదీ కింగ్ ఫర్హాద్ ఇందిరాగాంధీ, రాజీవ్లతో పాటు అతికొద్ది మంది సన్నిహితులకు ఒక డిన్నర్ ఏర్పాటు చేశాడు. దానికి మా ఇద్దరికీ ఆహ్వానం అందింది. వెళ్లాం. అందరినీ పరిచయం చేసుకుంటూ ఇందిరాగాంధీ మా దగ్గరకీ వచ్చింది. అప్పుడు నేను చాలా అగ్రెసివ్గా ఉండేదాన్ని.
ఆమెకు నన్ను నేను పరిచయం చేసుకున్నాను. ‘అచ్చా బాబా...’ అంటూ చాలా క్లోజ్గా మాట్లాడి ‘అంత చదువులు చదివి ఇక్కడెందుకు ? నీ సొంతదేశమొచ్చి సర్వీస్ చేయొచ్చు కదా’ అంది. ‘ఫారిన్లో ఉన్న డయాగ్నస్టిక్ ఫెసిలిటీస్ హైదరాబాద్లో లేవు కదా?’ అంటూ సమాధానమిచ్చాను. ఆమె తన వెనకాలే ఉన్న రాజీవ్గాంధీని పిలిచి మమ్మల్ని పరిచయం చేసి ‘కింద నాకు ప్రెస్ కాన్ఫన్స్ ఉంది. వీళ్లతో నువ్ మాట్లాడు’ అని రాజీవ్కి చెప్పి ఆమె వెళ్లిపోయింది. రాజీవ్గాంధీతో కూడా అదే చెప్పాను. ‘మనదేశంలో వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్న ఫెసిలిటీస్ లేవు. మేమో వెల్ట్రైన్డ్ డాక్టర్స్మి. ఇక్కడున్న ఫెసిలిటీస్ అక్కడ లేకపోతే మేం నేర్చుకున్నదంతా వేస్ట్ అయిపోతుంది కదా?’ అని. దానికి ఆయన ‘లేదు.. లేదు.. మనదేశానికి మీలాంటి చదువుకున్నవాళ్ల అవసరం చాలా ఉంది. సరే ఎలా చేద్దామనేది చూద్దాం’ అన్నారు. ఈలోపే మా అమ్మ నుంచి మెస్సేజ్...‘హాస్పిటల్ కట్టడం పూర్తయింది, మీరు రావాలి’ అని.
ఇండియాకు వెళ్లేముందు జర్మనీ వెళ్లి అక్కడ బెంజ్ కారు సహా మా ఇన్నేళ్ల సంపాదనలో కొన్నుక్కున మెడికల్ ఎక్విప్మెంట్స్, ఎలక్ట్రానిక్ గూడ్స్, ఇంటికోసం కొనుక్కున్న ఎన్నో సామాన్లను ఇక్కడికి ట్రాన్స్ఫర్ ఆఫ్ రెసిడెన్స్లో తెచ్చుకున్నాం. తీరా ముంబై వెళ్లి చూస్తే షిప్లో మా సామాన్లున్న పెట్టెలకు వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి సామాన్లు మాత్రం మాయం. బాధ, కోపం! ఏం చేస్తాం! కంప్లయింట్ చేసినా ముంబైలో అప్పుడు మేం అనామకులం. ‘ఇండియా రండి, ఇండియా రండి అన్నారు.. ఈరకమైన స్వాగతమా? రాజీవ్కి చెప్దాం ఈ అన్యాయం గురించి’ అని ఆయనకు ఉత్తరాలు రాశాం. జవాబు లేదు. ఇలా అయితే కుదరదు వెళ్లి డైరెక్ట్గా కలుద్దామని ఢిల్లీ వెళ్లాం.
సోనియాగాంధీ సహాయం..
ఏపీ భవన్లో ఉన్నాం. ఇదిగో కలుస్తారు, అదిగో కలుస్తారు అనుకోవడంలోనే రోజులు గడిచాయి కానీ రాజీవ్గాంధీ మాత్రం కలవలేదు. అప్పుడు సోనియాగాంధీ మాకు హెల్ప్ చేసి రాజీవ్గాంధీ అప్పాయింట్మెంట్ ఇప్పించారు. ఆయనకు మా విషాదగాథ అంతా వివరించాం. రాజీవ్గాంధీ సహకారంతో మా ఇన్సూన్స్ డబ్బులు మాకు వచ్చాయి. హైదరాబాద్ చేరిన తర్వాత అమ్మ తను కట్టించిన హాస్పిటల్ చూసి నేనైతే నోరెళ్లబెట్టి రోడ్డుమీదే నిలుచుండి పోయిన. ‘ఇది దేవత లేని గుడిలాగా ఉంది. ఎక్కడో దేశంకాని దేశంలో నువ్వు గొప్ప డాక్టర్గా పేరు తెచ్చుకుంటే నాకేం సంతోషం? నా కండ్లముందు నా బిడ్డ గొప్ప పేరు తెచ్చుకుంటే సంతోషం కాని’ అంది మా అమ్మ. ఆ హాస్పిటల్లో మా ప్రాక్టీస్ మొదలైంది. గ్రామాల్లో కూడా మొబైల్ మెడికల్ సర్వీసూ మొదలుపెట్టిన. రెండు వ్యాన్లు తీసుకొని దానికి ‘రాజీవ్ మొబైల్ మెడికల్ సర్వీస్’ అని బ్యానర్లు కట్టుకొని మెదక్ జిల్లాలోని గజ్వేల్, నర్సాపూర్, సిద్ధిపేట్ ఏరియా అంతటా మెడికల్ క్యాంపులు పెడ్తుంటి. ఫ్రీగా మందులు ఇచ్చేవాళ్లం. అక్కడున్న కాంగ్రెస్ వాళ్లు కూడా బాగా పరిచయం అయిపోయిండ్రు. ఒకవైపు మెడికల్ సర్వీస్ చేసుకుంటూనే ఇంకోవైపు జనాలకు కాంగ్రెస్ గురించి, అది అందిస్తున్న పథకాల గురించి చెప్తుంటి.
ఓడిపోతే బాగుండు..
1986లో అంజయ్య చనిపోయాడు. ఆ బై ఎలక్షన్లో నేను నిలబడాలి. నా వెల్విషర్స్, డాక్టర్గారు అందరూ చెప్తే ఆ సీట్ నాకివ్వడానికి రాజీవ్గాంధీ ట్రై చేశారు. కాని కుదరలేదు. ‘ఇది బై ఎలక్షన్ కదా.. అందరి దృష్టి దానిమీదే ఉంటుంది తర్వాత చూద్దాంలే’ అని రాజీవ్గాంధీ ఆ సీట్ను మణెమ్మకు ఇచ్చారు. అది కరెక్టే! ఆ తర్వాత 1989లో మళ్లా నేను సిద్ధిపేట్ ఎంపీ టికెట్కి అప్లికేషన్ పెట్టుకున్న. అంతకుముందు అక్కడ నంది ఎల్లయ్య ఉండే. ఆల్మోస్ట్ టికెట్నాకిచ్చేసినట్టే చెప్పారు. చివరకు ‘ఆ స్థానం నంది ఎల్లయ్యకే కావాల, ఎంతైనా ఆయన సీనియర్.. ఆమె ఇప్పుడిప్పుడే వచ్చింది, కావాలంటే ఆమెకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వచ్చు..’ అంటూ మళ్లీ మా పెద్ద నాయకులందరూ రాజీవ్గాంధీని ఇన్సిస్ట్ చేశారు. రాజీవ్గాంధీ కూడా ‘ఎమ్మెల్యేగా నిలబడుదువుగానీ’ అన్నారు. నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. ‘నో ప్రాబ్లం .. ఐ గో బ్యాక్ టు మై ప్రాక్టీస్’ అన్నాను ఆయనతో. ‘నోనో.. సిద్ధిపేట్లో నీకే సీట్ కావాలంటే అది ఇస్తాను’ అన్నారు.
పెద్దమనిషి అంత ఇదిగా అంటుంటే రిజెక్ట్ చేయడం కూడా మర్యాద కాదనుకొని గజ్వేల్ సెలెక్ట్ చేసుకొని ఎమ్మెల్యేగా నిలబడ్డ... ‘ఓడిపోతే మంచిగుండు’ అనుకుంటూ! ఎందుకంటే అప్పటికే ఇంట్రెస్ట్ పోయింది. ఓడిపోయాను అనుకొని ఎవరినీ నొప్పించకుండా మళ్లీ నా ప్రాక్టీస్కి నేను వెళ్లిపోవచ్చు అని. నాట్ నోయింగ్ మచ్ ఎబౌట్ పాలిటిక్స్, అంతగా కాన్వాసింగ్ కూడా ఏమీ లేకుండానే ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసిన. కాని గెలిచిన. ఆ టర్మ్లోనే మినిస్టర్గా అవకాశం కూడా వచ్చింది. అయితే నేను అనుకున్న దానిపట్ల కమిటెడ్గా ఉంటానని నామీద రాజీవ్గాంధీకి నమ్మకం ఉండె!
న్యూ కమ్మర్నే అయినా..
మంత్రిగా నాకు చాలా పోర్ట్ఫోలియోలు వచ్చాయి. చెన్నాడ్డి ముఖ్యమంవూతిగా ఉన్నప్పుడు సోషల్ వెల్ఫేర్, సెకండరీ ఎడ్యుకేషన్, ప్రోటోకాల్ ఈ మూడింటికి నేను మంత్రిని. నా విజయం పట్ల మా అమ్మకు సంతోషమే ఉండే. దాన్ని ఇంట్లోనే వ్యక్తం చేసేది కాని బయట పదిమందిలో ఎప్పుడూ పొగిడేది కాదు. అది ఆమెలో ఉన్న గొప్ప క్వాలిటీ! అంతెందుకు.. మొదటిసారి మంత్రిగా ప్రమాణస్వీకారం చేయడానికి నిజాం కాలేజ్క్షిగౌండ్స్కి వెళ్తూ.. ‘నా ప్రమాణస్వీకారానికి నువ్వు రావాలి అమ్మా... నా కార్లోనే వెళ్దాం రా’ అంటే ‘అది నీ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ప్రమాణస్వీకారానికి నేనెందుకు వస్తాను, రాను’ అంది. ‘అరే.. నేను నీకు ఒక్కగానొక్క బిడ్డను. నేను ఫస్ట్ టైమ్ మంత్రినయినా.. నువ్ చూడవా ? రా’ అని బతిమాలినా.. ‘నువ్ పో అమ్మ పో... నీ ప్రమాణస్వీకారం నేను టీవీల జూస్కుంటలే’ అని టీవీలోనే చూసింది కానీ నిజాం కాలేజ్ గ్రౌండ్స్కి మాత్రం రాలేదు. దటీజ్ ఈశ్వరీ బాయి. అంత ప్రిన్స్పుల్డ్, ఐడియలాజికల్ పర్సన్! షి ఈజ్ ద రోల్ మోడల్ ఫర్ టుడేస్ పాలిటీషియన్స్!
1991...
ఆయేడు మా అమ్మ చాలా సిక్ అయింది. బాంబేలోని ఫేమస్ డాక్టర్ సూనావాలాకు చూపించాం. బయాప్సీ చేస్తే క్యాన్సర్ అని తేలింది. అది నాకు సెట్బ్యాక్ అయింది. ఎందుకంటే నాకింకా వేరే బ్రదర్స్, సిస్టర్స్ లేరు కదా! అమ్మ అయినా, ఫ్రెండ్ అయనా తనే! అందుకే ఆమెకు క్యాన్సర్ అని తేలేసరికి నేను చాలా కుంగిపోయాను. ట్రీట్మెంట్ ఇప్పించినా... 1991, ఫిబ్రవరి 21న షి పాస్డ్ అవే! దురదృష్టవశాత్తు అది చాలా బ్యాడ్ ఇయర్. మేలో రాజీవ్గాంధీ హత్య జరిగింది. ఆ టైమ్లో నా హజ్బెండ్ చాలా సపోర్ట్గా ఉన్నారు. అయినా ఎందుకో ఇక పాలిటిక్స్ వద్దనిపించింది. పాలిటిక్స్ వదిలేస్తానని డైరెక్ట్గా చెన్నాడ్డిగారితోనే చెప్పాను. ‘పిచ్చిగా మాట్లాడకు. బాగాలేకపోతే కొన్నాళ్లు రెస్ట్ తీసుకో. అర్జెంట్ ఫైల్స్ ఉంటే చూడు, లేకపోతే ఏమీ పట్టించుకోకు’ అని సర్దిచెప్పాడు. ఆగస్ట్లో రాజీవ్గాంధీ జయంతి అయిపోగానే సోనియాగాంధీ దగ్గర టైమ్ తీసుకొని వెళ్లి కలిశాను. ‘మీ కుటుంబం వల్లే నేను ఈ స్థాయికి వచ్చాను. ఇప్పుడు నేను కంటిన్యూ కాలేను.
ఐ గో బ్యాక్ టు మై ప్రాక్టీస్’ అని చెప్పిన. దానికి ఆమె ‘దేశంలో మీలాంటి యంగ్ అండ్ ఎనర్జిటిక్ పర్సన్స్ చాలామందిని ఆయన రాజకీయాల్లోకి తెచ్చారు మీరంతా ఏదోచేస్తారని.. ఇప్పుడు మీరు విరమించుకుంటానంటే అంత బాగుండదేమో’ అన్నారు. ఆమె అంత మాటనేసరికి నా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోక తప్పలేదు. 1994 కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా నేను రెండుసార్లు పార్టీ జనరల్ సెక్రటరీగా చేశాను. 2000 నుంచి 04 దాకా పార్టీ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా కూడా చేశాను. అధికారంలో ఉన్నా , లేకపోయినా పార్టీ నాకు ఇవ్వాల్సినంత గుర్తింపు, గౌరవాన్నిచ్చింది. 2004లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావడంతో మళ్లీ మంత్రి పదవి వరించింది. 2009లో డీలిమి నాకు జహీరాబాద్ నియోజకవర్గం వచ్చింది. 2009లో రాజశేఖర్డ్డిని అడిగిన... ఎమ్మెల్యే, మంత్రి పదవులు చాలు.. ఎన్నాళ్లని ఇంకా స్టేట్ పాలిటిక్స్లో ఉండాలి? ఎంపీకి పోటీచేస్తానని.
కాని అవకాశం రాలేదు. టూరిజం, స్పోర్ట్స్, భారీపరిక్షిశమలు, ఇన్ఫర్మేషన్.. ఇట్లా అన్ని శాఖలకూ మంత్రిగా చేశాను. నా కెపాసిటీని ప్రూవ్ చేసుకున్నాను. 2004లో టూరిజం శాఖకు మంత్రిగా ఉన్న నన్ను వోక్స్వ్యాగన్ వ్యవహారంతో భారీ పరిక్షిశమల శాఖనూ నాకు అడిషనల్ పోస్ట్గా ఇచ్చారు. దాన్ని చాలా జాగ్రత్తగా డీల్ చేశాను. తర్వాత ఇప్పుడూ అదే శాఖకు నన్ను మంత్రిని చేయడం నిజంగా ఐయామ్ వెరీ థాంక్ఫుల్ టు చీఫ్మినిస్టర్! ఈ శాఖకు సంబంధించి మొన్న వైస్వూపెసిడెంట్ హమీద్ అన్సారీ నుంచి ‘బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్టేట్’ అవార్డ్ కూడా తీసుకున్నాం. ఇన్వెస్ట్మెంట్స్లో దేశంలో మనం సెకండ్ ప్లేస్లో ఉన్నాం. పరిక్షిశమల్లో ఎస్సీఎస్టీలను ఎంకరేజ్ చేయడానికి ఒక పాలసీ తెచ్చాం. వాళ్లకు 30 శాతం రాయితీలు పెంచాం.
ఎస్సీ, ఎస్టీ మహిళా వ్యాపారులకైతే 40 శాతం సబ్సిడీలు పెంచాం. ఇది చరివూతాత్మక నిర్ణయమే! నేను వచ్చిన కొత్తలో కేవలం 78 యూనిట్స్ ఉంటే ఇప్పుడు మూడువేల యూనిట్స్కి పెరిగాయి. షుగర్ ఇండస్ట్రీస్కి సంబంధించి కూడా బాగానే వర్క్ చేశాం. 2005లో మూతపడ్డ ఎనిమిది పరిక్షిశమలను రివైవ్ చేశాం. దీన్నిబట్టే నాకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాననిపిస్తుంది. ఏ శాఖ ఇచ్చినా అందులో టోటల్గా ఇన్వాల్వ్కావడం, అధికారులతో మంచి రాపో మెయిన్టైన్ చేయడం నా నైజం!
మిస్ అవుతున్నాను
డాక్టర్గా కూడా నేను సక్సెస్ఫులే. నా మెడికల్ కెరీర్లో ఎన్నో కాంప్లికేటెడ్ కేసెస్ను డీల్ చేశాను. నా అదృష్టమేంటంటే మా ఆయన ఎనస్థిటిస్ట్ కావడం. అర్ధరాత్రి కేసొచ్చినా ఇద్దరం పరిగెత్తేవాళ్లం. అప్పట్లోనే ఇన్ఫెర్టిలిటీ ట్రీట్మెంట్లో నేను నెంబవర్ వన్. నా లైఫ్లో బెస్ట్ అంటే రీకానలైజేషన్ సర్జరీ. పిల్లలు కాకుండా ఆపరేషన్ చేయించుకున్న ఒకామెకు మళ్లీ పిల్లలు కలిగేలా ఆపరేషన్ చేస్తే కొడుకు పుట్టాడు. ఇప్పుడు అతనికి 24 ఏళ్లు. ఆ అబ్బాయిని తీసుకొని అప్పుడప్పుడు ఇంటికొస్తుంది ఆమె. నేను మెడిసిన్ను ఇష్టపడే చదివాను. డాక్టర్గా ప్రాక్టీస్ను చాలా ప్రేమించాను. ఇప్పుడు ఆ ప్రొఫెషన్ను, ఆ వన్ టు వన్ రిలేషన్ను మిస్ అవుతున్నాననిపిస్తుంది! నాకొక కూతురు. తను చాలా తెలివిగా హాస్పిటల్ మేనేజ్మెంట్లో ఎంబీఏ చేసింది. ఇప్పుడు మా హాస్పిటల్ను డాక్టర్గారు, మా అమ్మాయే చూసుకుంటున్నారు. అల్లుడు ఐఎస్బీలో ఎంబీఏ చేసి జార్ఖండ్లో సోలార్ ప్లాంట్ బిజినెస్ చేస్తున్నాడు. వాళ్లకు ఒక పాప ఆకృతి, నాలుగేళ్లు! నా గ్రాండ్ డాటరే నా బెస్ట్ ఫ్రెండ్.
మేము చూస్తామని అనుకోలేదు...
తెలంగాణ మా అమ్మకాలం నాటి పోరాటం. ఆ ఉద్యమంలో మా అమ్మ ఒక సైనికురాలిగా పోరాడింది. పోలీసులు ఆమెకోసం మా ఇంటిచుట్టూ పహారాకాసేవాళ్లు. దొరకకుండా ఒక నెలరోజులు మా అమ్మ వాళ్లను ముప్పుతిప్పలు పెట్టింది. లాస్ట్ పట్టుకున్నారనుకోండి. ఆమెను జైల్కి తీసుకెళ్తుంటే తనలో కొంచెం కూడా బెరుకులేదు. ‘అయ్యోనాకో కూతురు ఉంది, నేను జైల్కి వెళ్తే తనెట్లా’ అన్న ఆలోచనే లేదు! ఆమె అట్లా వెళ్తుంటే వెనకాల ఫియట్కారులో మేము...!’ అంత ధైర్యం నేను ఎవరిలో చూడలేదు. అన్నేళ్ల పోరాటానికి ఫలితం అన్నట్లుగా సోనియాగాంధీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇది నా జీవితకాలంలో చూస్తాననుకోలేదు. అంతటి చారివూతాత్మక పరిణామానికి మనమంతా సాక్షులుగా ఉన్నాం. చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ కల నెరవేరింది. తెలంగాణ ప్రజలమంతా కష్టపడి దీని అభివృద్ధికి పాటుపడాలి. ప్రతి ఒక్కరం అందులో భాగస్వాములం కావాలి!
మూలం : నమస్తే తెలంగాణ