telugutaruni.weebly.com
  • Home
  • వంటకాలు (Cookeries)
    • ఫలహారాలు (Tiffins)
    • శాకాహారం (Veg)
    • బియ్యపు వంటలు (Rice items)
    • మాంసాహారం (Non-Veg)
    • పచ్చళ్ళు (chutneys)
    • వడియాలు
    • పండ్ల రసాలు (Juices)
    • స్వీట్స్ (Sweets)
    • చిరుతిళ్ళు (Snacks)
    • గ్రేవీ ఐటమ్స్
    • సూప్స్ (Soops)
    • కొత్త కొత్తగా
  • చిట్కాలు (Tips)
    • వంటింటి చిట్కాలు ( Kitchen Tips)
    • ఆరోగ్య చిట్కాలు (Health Tips)
    • సౌందర్య చిట్కాలు (Beauty Tips)
  • మహిళా లోకం
    • ఆదర్శ మహిళలు
    • శభాష్ మహిళా..
  • విహారయాత్ర

అక్షరమే అతివకు అండ..

8/31/2013

0 Comments

 
Picture
                         ‘ప్రతి మహిళా చదువుకోవాలి.. అన్ని రంగాల్లోనూ అతివలు రాణించాలి.. ప్రగతి పథంలో మన దేశం దూసుకుపోవాలంటే స్ర్తిల భాగస్వామ్యం తప్పనిసరి.. మహిళా శ్రేయస్సుకు అవరోధంగా నిలిచే మూఢాచారాలను, ఛాందస భావాలను అందరూ ముక్తకంఠంతో నిరసించాలి..’- ఈ మాటలు ఎప్పటికీ అక్షర సత్యాలు. కాలం ఎంతగా మారినా స్ర్తిలకు సంబంధించి ఇప్పటికీ ఎనె్నన్నో నిర్బంధాలు, అర్థం లేని కట్టుబాట్లు తప్పడం లేదు. అందుకే- మహిళ విద్యతో చైతన్యవంతమైతేనే కు టుంబం, తద్వారా సమాజం బాగుపడుతుందని ఆమె నేటితరం వారికి ఉద్బోధిస్తుంటారు. మాటల్లో గాక, ఆదర్శాలను ఆచరణాత్మకంగా పాటిస్తూ ఆమె ఎందరెందరిలోనో స్ఫూర్తిని రగిలించారు. స్ర్తి విద్య, వితంతు వివాహాలు, వేశ్యావృత్తి నిర్మూలన వంటి విషయాల్లో దశాబ్దాల పాటు కృషి చేసిన ఆమె పోరాట పటిమ నేటి తరానికి ఆదర్శప్రాయం. ప్రస్తుతం విశాఖపట్నంలో శేష జీవితాన్ని గడుపుతున్న చెల్లూరి వెంకట రమణమ్మ (95) మహిళా సంక్షేమానికి ఇంకా జరగాల్సింది ఎంతో ఉందని చెబుతుంటారు. తనను కలుసుకునేందుకు వచ్చే వారికి- అలనాడు స్ర్తి జనోద్ధరణ కోసం సాగిన ఉద్యమాల గురించి ఓపిగ్గా చెబుతుంటారు.

                    వయోవృద్ధురాలైనప్పటికీ ఈమె ఎవరిపైనా ఆధార పడకుండా ఇప్పటికీ తన పనులన్నీ తానే చేసుకుంటారు. చూపు కాస్త మందగించిప్పటికీ జ్ఞాపక శక్తి, వినికిడి శక్తిలో ఎలాంటి లోపం లేకుండా గంభీరమైన మాటలతో అప్పటి సంగతులను, మధురమైన జ్ఞాపకాలను అందరికీ చెబుతుంటారు. స్ర్తిలు విద్యావంతులైతేనే వారిలో సంస్కార బలం వస్తుందన్న నమ్మకంతో కుటుంబ సభ్యులు తనను ‘సనాతన స్ర్తి విద్యాలయం’లో చేర్పించారని, అక్కడ నేర్చుకున్న విషయాలే తనను తీర్చిదిద్దాయని ఆమె చెబుతుంటారు.

                       వెంకట రమణమ్మ తూర్పు గోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలోని కేశనకుర్రులో గుడిమెట్ల జగన్నాథ శాస్ర్తీ, కామేశ్వరమ్మ దంపతులకు 1918 ఫిబ్రవరి 28న జన్మించారు. 11వ ఏటనే ఆమెకు అదే జిల్లాలోని వాకతిప్పకు చెందిన చెల్లూరి సీతారామయ్యతో వివాహం జరిగింది. బి.ఎ చదివి, సహకార శాఖలో పనిచేసే సీతారామయ్య తన భార్య కూడా విద్యలో రాణించాలని ఎంతగానో ప్రోత్సహించేవారు. స్ర్తి విద్య, బాల్య వివాహాల నిర్మూలన, వితంతు వివాహాల కోసం సమాజాన్ని ఎదిరించి ధైర్యంగా పోరాడిన కందుకూరి వీరేశలింగం రచనలు సీతారామయ్యపై ఎంతో ప్రభావం చూపేవి. అవే భావాలతో వెంకట రమణమ్మ కూడా సమాజ సంస్కరణకు తన వంతు కృషి చేయడం ప్రారంభించారు.

                        విదేశీయుల పాలన నుంచి విముక్తి కోసం దేశ వ్యాప్తంగా స్వాతంత్య్ర సమరం ఉవ్వెత్తున సాగుతున్న రోజులవి. అదే సమయంలో స్ర్తిల స్థితిగతులు మారాలంటూ రాజమండ్రిలో వీరేశలింగం పంతులుతో పాటు మరెందరో ప్రముఖులు సమాజ సంస్కరణోద్యమాన్ని ఉద్ధృతంగా నడిపేవారు. దేశానికి ఎప్పటికైనా స్వాతంత్య్రం రావడం ఖాయమని, అయితే ముందుగా స్ర్తిలు సామాజిక కట్టుబాట్ల నుం చి విముక్తి పొందాలంటూ ‘దేశ బాంధవి’ దువ్వూరి సుబ్బమ్మ వంటి వ్యక్తులు నడుం బిగించారు. అతివల కోసం అక్షరోద్యమం ప్రారంభించాలంటే వారికి ప్రత్యేక పాఠశాల అవసరమని భావించిన సుబ్బమ్మ 1924లో ‘సనాతన స్ర్తి విద్యాల యం’ ప్రారంభించారు. ఆ విద్యాలయంలో చేరిన వెంకట రమణమ్మ అప్పటి సమాజ పరిస్థితులపై అవగాహన పెంచుకున్నారు. ‘మహాత్మా గాంధీ దర్శనమే పావనము..’, ‘మాకొద్దీ తెల్లదొరము..’ వంటి పాటలు పాడుతూ సహచర బాలికలతో పాటు వెంకట రమణమ్మ వీధుల్లో తిరిగేవారు. రాట్నం వడుకుతూ ఖద్దరు దుస్తుల విక్రయాన్ని ప్రోత్సహించేవారు. స్ర్తిలను ప్రోత్సహించ కూడదని ఏ ధర్మశాస్త్రాల్లోనూ చెప్పలేదని, వారు పునర్విహాలకు అర్హులేనని కొన్ని పురాణాలు సైతం అంగీకరిస్తున్నాయని వెంకట రమణమ్మ చెబుతుంటారు.

అవన్నీ అనాచారాలే...

                  అప్పట్లో స్వాతంత్రోమం ఓ వైపు కొనసాగుతుండగా, మరో వైపు మూఢాచారాలు, సామాజిక కట్టుబాట్ల ఫలితంగా మహిళలు నానాపాట్లు పడేవారని వెంకట రమణమ్మ తన జాపకాలను వివరిస్తుంటారు. రజస్వల వేడుకకు ముందే ఆడపిల్లకు విధిగా పెళ్లి చేసేవారని, చిన్న వయసులోనే భర్తలను కోల్పోయే స్ర్తిలను అన్నింటికీ దూరంగా ఉంచుతూ అడుగడుగునా వివక్ష చూపేవారని అలనాటి సంగతులను చెబుతుంటారు. భార్యను కొట్టడం, సంతానాన్ని పట్టించుకోకపోవడం, చెడు వ్యసనాలతో మగాళ్లు మరీ బరితెగించేవారు. ఆచారాలు, సంప్రదాయాల ముసుగులో అన్ని రకాలుగా స్ర్తిలను అణగదొక్కేవారు. భర్తను కోల్పోయిన మహిళను ఇంట్లో నిర్బంధించి నానా బాధలు పెట్టేవారు. అన్ని రకాల ఆహార పదార్థాలను వారు తినరాదంటూ ఆంక్షలు విధించేవారు. స్వేచ్ఛ కోసం ప్రయత్నించే వితంతువులుంటే- వారికి దెయ్యం పట్టిందని చావ బాదేవారు. వితంతువు ఎదురైతే అపశకునంగా భావించి నిందలు మోపేవారు. చదువుకోవాలని ఆసక్తి ఉన్నా ఆడపిల్లలను బడికి పంపేవారు కాదు. భార్యలపై భర్తల దాష్టీకాలు దారుణంగా ఉండేవి.

               వీరేశలింగం వంటి సంస్కర్తలు ఎన్ని రచనలు చేసినా వాటిని చదివేందుకు, మార్పు చెందేందుకు కొందరు పురుషులు విముఖత చూపేవారు. స్ర్తిలపై అప్పట్లో కొనసాగిన దౌర్జన్యాలను, అనాచారాలను చూస్తుంటే ఒక్కోసారి భయం కలిగేదని వెంకట రమణమ్మ అంటుంటారు.

             కాగా, 95 ఏళ్ల వయసులోనూ తాను ఎలాంటి శారీరక, మానసిక సమస్యలు లేకుండా ఉన్నానంటే చిన్నప్పటి జీవన విధానం, అప్పటి ఆరోగ్య అలవాట్లే కారణమని ఆమె వివరిస్తుంటారు. తన భర్త కీర్తిశేషులై 35 ఏళ్లు నిండాయని, ప్రస్తుతం విశాఖలో తన కుమార్తెల చెంత ఎలాంటి చీకూచింతా లేకుండా శేష జీవితం సాఫీగా సాగుతోందని ఆమె తెలిపారు. తమ సంతానమైన ముగ్గురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు జీవితంలో స్థిరపడ్డారని, మనవలు, మునిమనవలతో కాలక్షేపం చేయడం కంటే ఇంకేం కావాలని ఆమె ప్రశ్నిస్తుంటారు. కాలం ఎంతగా మారినప్పటికీ, నేటి నవ నాగరిక సమాజంలోనూ మహిళల కోసం చేయాల్సింది ఎంతో ఉందని వెంకట రమణమ్మ అంటారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో మహిళలు మరింతగా దూసుకుపోవాలంటే ముందుగా వారు విద్యలో రాణించాలని ఆమె సూచిస్తున్నారు. విద్య వల్లే సంస్కార బలం, మనో నిబ్బరం, ఆత్మవిశ్వాసం, సాధికారత వంటివి సాధ్యమవుతాయని ఆధునిక మహిళలకు ఆమె ధైర్యం చెబుతుంటారు.


0 Comments

లక్కీ ఛాన్స్

8/30/2013

0 Comments

 
Picture
                 రాత్రి ఎనిమిదిగంటల ముప్ఫై నిమిషాలు... కోల ముక్కు... తీరైన కనుబొమ్మలు... ఎన్నో ఊసులను దాచుకున్న నీలి కళ్ల యాంకర్ లక్కీ.. క్రైమ్ న్యూస్ చదువుతున్నది.. వార్తలు చదవడంలో విశేషం లేకపోవచ్చు.. కానీ ఆ యాంకర్‌కో గొప్పతనముంది... అది ఆమె థర్డ్ జెండర్ కావడం! వాళ్లు రోడ్డు మీద కనిపిస్తే దూరంగా వెళ్లిపోతాం... మనుషులను చేతగానివాళ్లని చెప్పడానికి వాళ్లను ఉదాహరణగా చేసుకొని తిడతాం.. కానీ అవకాశమిస్తే వాళ్లూ దేంట్లోనూ తీసిపోరు.. ఆ అవకాశమిచ్చింది వీ సిక్స్ న్యూస్ ఛానల్... దాన్ని సద్వినియోగం చేసుకుంటూ తనను తాను నిరూపించుకుంటున్నది లక్కీ...

                ‘‘హైదరాబాద్ ఓల్డ్‌సిటీలోనే పుట్టి పెరిగాను. చిన్నతనంలోనే నాన్న చనిపోయాడు. అమ్మే కష్టపడి పెంచింది. నాకు ఒక అన్నయ్య, ఒక అక్క. చిన్నప్పటినుంచి యాక్టివిటీస్ అన్నీ అమ్మాయిలాగే ఉండేవి. అక్కకు కొత్త బట్టలు తెస్తే అవే వేసుకునేవాడిని. అందరూ అమ్మాయి అనుకునేవారు. చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ మిగిలిన అబ్బాయిలు క్యూట్‌గా ఉన్నాడని బుగ్గలు గిల్లేవారు. ముద్దుపెట్టుకోవడం లాంటివి చేసేవారు. రాను రాను నేను కొంచెం డిఫంట్ అని అర్థమయిపోయింది. స్కూల్‌కు వెళ్లాలంటే బాగా భయమయ్యేది. దాంతో ఇంట్లోనే చదవడం, రాయడం నేర్పించింది అక్క. నాకు జుట్టు చాలా పెద్దగా ఉండేది. అందుకే ఇంటి దగ్గర మ్యూజికల్ నైట్స్, వినాయక చవితిలాంటి పండుగలకు నేను అమ్మాయిలా రెడీ అయి బాగా డాన్సులు వేసేది. దాంతో మా బస్తీలో అందరూ అబ్బాయి ఇలా చేస్తున్నాడు అని నెగిటివ్‌గా చూడకుండా... చిన్నప్పటినుంచే ఆర్టిస్ట్‌గా, ఓ డాన్సర్‌గా చూడటం మొదలుపెట్టారు. అంతేకాదు నన్ను ప్రేమగా కూడా చూసుకునేవారు. అది నాకు ప్లస్ అయ్యింది.

డాన్స్ అంటే ఇష్టం...
                   నాకు డాన్స్ అంటే ఇష్టం. ప్రత్యేకంగా నేర్చుకోకపోయినా టీవీలో వస్తుంటే చూసి అలాగే వేసేది. సంగీతం వినపడితే చాలు కాలు నిలవకపోయేది. నా పదేళ్లప్పటినుంచే బాలభవన్‌లో ఏవైనా కార్యక్షికమాలు జరిగితే వెళ్లి పాల్గొనేది. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ ఏవైనా జరిగితే నా డాన్స్ కచ్చితంగా ఉండాల్సిందే. అప్పటికీ బయటి ప్రపంచం తెలియదు. అయితే నేనే ఇట్లున్ననా, మిగిలినవాళ్లు కూడా ఇట్లానే ఉన్నరా? అన్న అనుమానం వచ్చేది! బయటికెళ్లాలంటే భయమేసేది మొదట్లో. ఒంట్లో వణుకుపు నేను మిగిలినవారికంటే భిన్నంగా ఎందుకున్నాననేది చిన్నతనంలో తెలియదు. ఇప్పుడంటే నామీద నాకు ఆత్మవిశ్వాసం వచ్చింది. కానీ టీనేజ్‌లో ఉన్నప్పుడు ఇంటి దగ్గర కానీ, చుట్టాలింట్లోకానీ ఫంక్షన్స్ అయితే నేను బయటికొస్తే.. ‘ఈమె ఎవరు? వీళ్ల అబ్బాయా? ఇట్లా ఉన్నాడేంటి?’ అంటూ అదోరకంగా ముఖాలు పెట్టేవాళ్లు. అప్పటిదాకా నన్ను ఏ రకంగానూ ఇబ్బంది పెట్టని అమ్మ ముఖంలోనూ కొంచెం రంగులు మారేవి. ఆమె ఏనాడూ నన్ను డైరెక్ట్‌గా ఏం అనకపోయినా... ముఖంలో భావాలు తెలిసేవి. అప్పుడు బాధయ్యేది. అప్పుడనిపించేది.. ‘పుడితే అమ్మాయిలాగా పుట్టాలి. లేదా అబ్బాయిలాగా పుట్టాలి. కానీ నేనేంది ఇట్లా?’ అని! కానీ ఇప్పుడనిపిస్తుంది... అమ్మాయినో, అబ్బాయినో కానంతమావూతాన నాకొచ్చిన నష్టమేంటి? అని!

కుటుంబ ప్రోత్సాహం కొంతమందికే...
                నాన్న లేకపోయినా అమ్మ చాలా బాగా చూసుకునేది. అందుకే అమ్మంటే చాలా ఇష్టం. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను ఎక్కడికెళ్లయినా డబ్బు సంపాదించుకోవచ్చు. కానీ నాకు అమ్మను వదిలి ఉండదు. అందుకే మాలాంటి వాళ్లకోసం హవేలీ ఉన్నా... అక్కడ ఉండకుండా అమ్మతోనే ఉంటున్నాను. అక్కకు, అన్నయ్యకు పెళ్లిళ్లు ఎప్పుడో అయిపోయాయి. అన్నయ్యకు ముగ్గురు పిల్లలు. అక్కకు నలుగురు పిల్లలు. అన్నా వదిన, అక్కా, బావ అందరూ నన్ను బాగా చూసుకుంటారు. అన్న వాళ్ల పిల్లలయితే మా దగ్గరే ఎక్కువగా ఉంటారు. నాకు ఫ్యామిలీతో ఉండే అవకాశం ఉంది. కానీ ఫ్యామిలీ ప్రోత్సాహం కొంతమందికే ఉంటుంది. అందరికీ ఉండదు. డబ్బు ఉన్నవాళ్లు పిల్లలను ఏమీ అనరు. హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ కల్చర్ ఉన్న దగ్గర పెద్దగా పట్టించుకోరు. కానీ చిన్న టౌన్స్, గ్రామాల్లో పరిస్థితి అలా ఉండదు. పిల్లలను వదిలేస్తారు. అట్లా వదిలేసినవాళ్లు ఉండటానికి ప్రత్యేకమైన సెంటర్స్ ఏం లేవు. ఇల్లు కిరాయికి కూడా ఇవ్వరు. తెలిసిన వాళ్లు ఉండని ప్లేస్‌లకి, కొంచెం లోక్లాస్ (మాస్) ఏరియాల్లోకి వెళ్లి ఉండాల్సి వస్తుంది. ఒక వేళ కిరాయికి ఇల్లు దొరికినా రెంట్ కట్టడానికి డబ్బుపూక్కడినుంచి వస్తాయి. చేయడానికి పని ఉండదు. అందుకే ఎక్కువగా డాన్స్ ప్రోగ్రామ్స్‌కి వెళ్తుంటారు. అక్కడా కొంతమంది ఎక్కువ డబ్బు ఇస్తారు. ఇంకొంతమంది అసలే ఇవ్వరు. ఆ డబ్బు తీసుకొచ్చి హవేలీలో ఉన్న అందరం సమానంగా పంచుకుంటాం.

కొన్నాళ్లయ్యాక...
                నా డాన్స్‌ల వల్ల నాకు థర్డ్ జెండర్స్ హక్కుల కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలు మిత్రుడు, పహచాన్, సురక్ష, దర్పణ్‌లతో పరిచయం ఏర్పడింది. ఇప్పుడు మిత్రుడు లేదు. సురక్ష ఎయిడ్స్ మీద ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం పనిచేస్తున్నది. 15 ఏళ్లుగా ఆ సంస్థ పనుల్లో పాల్గొంటున్నా. అప్పుడప్పుడు ఆ సంస్థ కార్యకలాపాల్లో పాలు పంచుకోవడం, మిగిలిన టైమ్‌లో డాన్స్‌లు. ఇలాగే ఉండేది జీవితం. అయితే డాన్స్ చేయడం, వచ్చిన డబ్బుతో కాలం గడపడం ఇదేనా జీవితం అనిపించింది కొంత కాలానికి! ఏదైనా జాబ్, పని ఉంటే దాంట్లో మన స్కిల్స్ చూపించుకోవాలనే తపన ఉండేది. కానీ డాన్స్ తప్ప మాకు వేరే లోకం లేదు. కాబట్టి అందం మీద ఎక్కువ దృష్టి పెట్టేది. అలా అందరిలోకి అందంగా కనిపించాలని ఆరాటపడేది. ఆ ఆరాటంతోనే మేల్కొలుపు లాంటి రన్స్, ఫ్యాషన్ పరేడ్‌లు నిర్వహించడం. దేశవ్యాప్తంగా ఉన్న థర్డ్ జెండర్స్‌తో సమ్మేళన్స్ చేస్తుంటారు ఏటా! అలా హైదరాబాద్‌లో జరిగిన ప్రతి ఫ్యాషన్ షో, పరేడ్‌లో నేను ముందు వరుసలో ఉండేదాన్ని. అనేక బహుమతులు కూడా వచ్చాయి. తరువాత హిజ్రాల సమస్యలపై అనేకమార్లు న్యూస్ ఛానల్స్‌లో చర్చా వేదికల్లో కూడా పాల్గొన్నాను.

ఆ గుర్తింపే....
             నన్ను ఛానల్‌లో ఉద్యోగం వైపు నడిపించింది. సంవత్సరం కిందటే నన్ను కలిశారు వీ సిక్స్ ఛానల్ వాళ్లు. ఉద్యోగావకాశం ఇస్తాం. మీరు ఇక్కడే ఉంటారా? అని అడిగారు. నిజానికి హిజ్రాలు అనగానే ఒక్క చోట ఉండరు. స్థిరత్వం ఉండదు. దేశమంతటా తిరుగుతుంటారు అనే ఓ అపోహ ఉంటుంది. అందుకే అలా అడిగి ఉంటారేమో! కానీ నేను ఇక్కడే హైదరాబాద్, ఓల్డ్‌సిటీలోనే ఉంటానని చెప్పాను. తరువాత రీసెంట్‌గా నన్ను అడిగారు ‘ఓ క్రైమ్ బులిటెన్ యాంకరింగ్ చేస్తావా?’ అని! అసలు మమ్మల్ని చూస్తేనే దూరంగా జరిగిపోయే మనుషులున్న చోట, రోజువారి పని ఇవ్వడానికే ఇబ్బంది పడే చోట... పిలిచి ఉద్యోగం ఇస్తుంటే కాదంటానా? ఏదయితేనేం... నాకు గుర్తింపునిచ్చే పని కావాలి అని ఓకే చెప్పాను. మొదట రెండు నెలలు ట్రైనింగ్ ఇస్తామని చెప్పారు. కానీ అంతకంటే ముందే నేర్చేసుకున్నా. ఆఫీస్‌కొచ్చిన మొదట్లో అందరూ వచ్చి వింతగా చూసేవారు. ఎవ్వరూ మాట్లాడేవాళ్లు కాదు. భయంగా ఉండేది. అందుకే రాకుండా రెండ్రోజులకోసారి డుమ్మాలు కొట్టేదాన్ని. తరువాత తరువాత అందరూ ఫ్రెండ్స్ అయిపోయారు. మంచి వాతావరణం. ఇంటి తరువాత ఇల్లులా మారింది నాకు ఆఫీస్. ఈ ఆత్మవిశ్వాసానికి కారణం... మా సీఈవో అంకం రవి, మా ప్రోగ్రాం హెడ్ దామోదర్, నా సహోద్యోగులే.

అవకాశాలేవి?
                హిజ్రాలు అనగానే ఓ నెగెటివ్ ఫీలింగ్ ఉంది అందరిలో. రోడ్డుమీద అందరి దగ్గరా బలవంతంగా డబ్బులు గుంజుకుంటారని, జబర్దస్తీ చేస్తారని. నిజంగా థర్డ్ జెండర్స్ అలా మీదపడి డబ్బులు లాక్కోరు. ఆత్మగౌరవంతో బతకాలని కోరుకుంటారు. సమాజంలో మేమూ మనుషులమే! అయినా మాకో ఐడెంటిటీ లేదు. ఏదైనా అప్లికేషన్ ఫామ్‌లో ఆడ, మగ ఉంటుంది. మరి అదర్స్ అన్న ఇంకో ఆప్షన్ ఉండదు. ఓ రేషన్ కార్డు ఉండదు. ఉపాధి అసలే దొరకదు. ఇలాంటి చోట మాకు ఉపాధి కావాలంటున్నాం. మాలో అనేక స్కిల్స్ ఉన్నవాళ్లున్నారు. మేకప్ ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు, డ్యాన్సర్స్, ఫ్యాషన్ డిజైనర్స్ ఇలా... సున్నితమైన కళల్లో అందెవేసిన చేయి ఉన్నవాళ్లున్నారు. కానీ మమ్మల్ని మేం ప్రూవ్ చేసుకునే అవకాశం ఎక్కడిది? ఇలా ఆత్మగౌరవంతో బతకడానికి అవకాశం కల్పించండని కోరుతున్నా’’ అంటూ ముగించింది లక్కీ!

టాప్ రేటింగ్‌లో...
               తమిళ ఛానల్ ‘విజయ్ టీవీ’ రోజ్ అనే థర్డ్ జెండర్ ‘యువర్స్ ట్రూలీ రోజ్’ అనే టాక్ షోను నిర్వహిస్తున్నది. థర్డ్ జెండర్‌వాయిస్‌ను ఓ ఛానల్‌లో వినిపించడం తెలుగు మీడియాలో ప్రప్రథమం. ఆ ధైర్యం చేసింది వీ సిక్స్ ఛానల్. అయితే వాళ్ల శ్రమ వృథా పోలేదు. ఆ ఛానల్‌లో తీన్మార్ తరువాత టాప్ రేటింగ్ ఉన్న ప్రోగ్రాం లక్కీ చేస్తున్న అరణ్యం (క్రైమ్ బులిటెన్) మాత్రమే. అరణ్యంలో లక్కీని చూసిన తరువాత ఆ ఛానల్‌ను అభినందించిన వాళ్లు అనేకం. లక్కీలో తమను తాము ఐడెంటిఫై చేసుకున్న ఎందరో హిజ్రాలకు ఇప్పుడామె స్ఫూర్తి. అందుకే ఖరగ్‌పూర్ ఐఐటీకి చెందిన ‘అర్ధనారీశ్వర’ అనే స్వచ్ఛంద సంస్థవాళ్లు లక్కీని బ్రాండ్ అంబాసిడర్‌గా తీసుకునే ప్రతిపాదనలో ఉన్నారు.

మూలం : నమస్తే తెలంగాణ దినపత్రిక 

0 Comments

కళ్లతో కాదు.. కళతో చూస్తారు!

8/29/2013

0 Comments

 
Picture
తెలుపు రంగులో మల్లెపూల పరిమళాలు..
ఎరుపు రంగులో గులాబీపూల గుబాళింపులు..
పసుపు రంగులో పండునిమ్మ సువాసనలు..
ఆరెంజ్ రంగులో కమలా పండు కమ్మదనాలు..
ఇదేంటిలా ఒక్కో రంగును ఒక్కో వాసనతో పోల్చారు. ఈ రంగులేవీ అలాంటి వాసనలు రావే అంటున్నారా. అవును మామూలుగా అయితే రంగులకి ఆ వాసనలేవీ ఉండవు. కాని కొన్ని ప్రత్యేక సందర్భాల్లో రంగులు కూడా సువాసనలు విరజిమ్ముతాయి. చీకటి ప్రపంచంలో రంగుల వెలుగుల్ని పరుస్తాయి.

"చూపులేకపోవడం వల్ల మా కళ్లకి చీకటి తప్ప మరోటి కనిపించదు. కాని అదంతా మమ్మల్ని లలిత మేడమ్ కలవనంత కాలమే. ఆమెతో పరిచయం ఏర్పడిన తరువాత రంగుల్ని గుర్తించగలుగుతున్నాం. ప్రకృతి అందాలను మనసుతో చూడగలుగుతున్నాం. మనసు చూసిన వాటికి రంగులద్ది పెయింటింగ్‌లు వేస్తున్నాం. ఆవిడకొచ్చిన విద్యను మాకు నేర్పించాలనే ఉద్దేశంతో లలిత మేడమ్ ఎంతో శ్రమపడ్డారు. మేము వేసిన పెయింటింగ్స్‌తో త్వరలో ఒక ప్రదర్శన కూడా ఏర్పాటు చేస్తానంటున్నారామె. ఇంకా బాగా నేర్చుకుని మంచి పెయింటింగ్‌లు వేస్తాం'' అని ఎంతో దృఢంగా చెప్పారు ఇంటర్మీడియెట్, డిగ్రీ చదువుతున్న సుధ, దివ్య, సుష్మ, సంధ్య, లక్ష్మి.

బాబా ఇచ్చిన పిల్లలు వాళ్లు

కంటిచూపులేని వాళ్లకు పెయింటింగ్ నేర్పించాలనే ఆలోచన ఎలా వచ్చిందని లలితకుమారిని అడిగితే... "ముందునుంచీ ఆలోచించి, పెద్దపెద్ద ప్రణాళికలు వేసుకుని ఈ పని చేయలేదు నేను. సాయిబాబా పూజని 49 రోజులు చేయాలని ప్రారంభించాను. ఈ పూజకిగాను వారంలో ఏడు రోజులు సాయిబాబా పుస్తకాన్ని నాతో కలిసి ఆరుగురు వ్యక్తులు ప్రతిరోజూ చదవాలి. కొన్నిరోజులు స్నేహితులు, బంధువులు వచ్చి చదివారు. ఆ తరువాత రోజూ ఏడుగురు వ్యక్తులు దొరకడం కష్టమైంది. మనుషులు దొరక్కపోతే పూజ చేయడం కుదరదు. ఎలాగా అని ఆలోచిస్తుంటే ఓల్డేజ్ హోమ్స్ గుర్తుకు వచ్చాయి. వాటిలో ఉంటున్న పెద్దవాళ్లని రమ్మంటే బాగుంటుంది అనిపించింది. దానికోసం ఓల్డేజ్‌హోంలను సంప్రదిస్తే వాళ్లను బయటకు పంపడం కుదరదని చెప్పారు. అప్పుడొచ్చింది అంధులను కూర్చోపెట్టి ఆ పుస్తకం చదివి వినిపించాలన్న ఆలోచన. వెంటనే అంధులకి ఆశ్రయమిస్తున్న గోపాల్‌గారితో విషయం చెప్పాను. ఆయన సంతోషంగా ఒప్పుకున్నారు.

ఆయనకి తెలిసిన వేరే వాళ్ల వివరాలు కూడా నాకు ఇచ్చారు. దాంతో నాకు మనుషుల్ని వెతుక్కోవాల్సిన అవసరం తప్పింది. ప్రతి రోజు ఏడుగురు పిల్లల్ని ఇంటికి తెచ్చుకుని బాబా పుస్తకం చదివి వినిపించేదాన్ని. వచ్చిన ఆ పిల్లలతో బాగా పరిచయం ఏర్పడింది. ఆ పిల్లలు కూడా అప్పటివరకు తాము తరగతి పుస్తకాలను తప్ప ఇటువంటి పుస్తకాలు బ్రెయిలీ లిపిలో లేకపోవడం వల్ల చదవలేకపోయామని, బాబా పుస్తక శ్రవణం చాలా ఆనందాన్ని ఇచ్చిందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. చివరి 20 రోజుల పూజ ఆ పిల్లలతోనే చేశాను. వాళ్లతో మాట్లాడుతుండగా పలు విషయాల పట్ల ఆసక్తి ఉన్నప్పటికీ చూపు లేకపోవడం వల్ల వాటిని చేయలేకపోతున్నామని బాధపడ్డారు.

రంగులు కనపడకపోతేనేం...

నేను పెయింటింగ్స్ వేస్తుంటాను. ఆసక్తి ఉంటే పెయింటింగ్ వేయడం మీకూ నేర్పిస్తాను అన్నాను. దానికి వాళ్లు "పెయింటింగ్ మేమెలా వేయగలం? రంగుల్ని ఎలా గుర్తించగలం? పిల్లి, కుక్క, పక్షుల వంటి వాటినైతే స్పర్శ ద్వారా, వాటి అరుపుల ద్వారా గుర్తించగలం. అవే గోడ మీద కూర్చుంటే ఎలా ఉంటాయి, ఎగురుతుంటే ఎలా ఉంటాయి, చెట్లమీద ఎలా ఉంటాయి, పడుకుంటే ఎలా ఉంటాయనేది మాకు తెలియదు కదా'' అన్నారు. మీరవేవీ ఆలోచించొద్దు. మీకు పెయింటింగ్ నేర్పించే బాధ్యత నాది అన్నాను. ఓ ఐదుగురు పిల్లలు ఆసక్తి కనపరిచారు. ఇక అప్పటి నుంచి వాళ్లకి రంగుల్ని అర్థమయ్యేలా చెప్పేందుకు కొన్ని ప్రయత్నాలు చేశాను. ఎలా చెప్తే వాళ్లకి సులభంగా అర్థం చేయించగలనో తెలుసుకునేందుకు నా మీద నేనే ప్రయోగం చేసుకున్నాను. కళ్లు మూసుకుని రకరకాల పద్ధతులు అవలంబించిన తరువాత చివరికి ఒక పద్ధతి కనుగొన్నాను.

దాని ద్వారానే వాళ్లకు పెయింటింగ్ వేయడం నేర్పాలనుకున్నాను. వాసనల ద్వారా రంగుల్ని ముందుగా పరిచయం చేశాను. అంటే తెలుపు రంగు గుర్తించేందుకు మల్లెపువ్వు వాసనను తెలుపు రంగులో కలిపాను. ఎరుపు రంగుకోసం గులాబి, ఆరెంజ్ రంగు కోసం కమలా ఫ్లేవర్, పసుపు రంగులో నిమ్మపండు ఫ్లేవర్‌లు కలిపి రంగులు గుర్తించడం నేర్పించాను. కళ్లతో చూడలేనిది మైండ్‌తో చూడొచ్చనే విషయాలను అర్థమయ్యేలా చెప్పి ఆ తరువాత పెయింటింగ్ పని మొదలుపెట్టాను.

ఐదుగురు పిల్లలు నెల రోజుల్లో 15 పెయింటింగ్‌లు వేశారు. పేపర్ మీద గ్లూ కలర్‌తో అవుట్‌లైన్స్ ఎంబోజింగ్ చేశాను. పారుతున్న నది, ఒడ్డు, ఒడ్డు మీద చెట్టు, నదిలో బాతులు, చెట్టు మీద పక్షులు ... ఇలా అన్నింటికీ అవుట్‌లైన్స్ గీసిచ్చాను. పిల్లలు చేతివేళ్లతో నెమ్మదిగా తడుముతూ వాటి వివరాలు ముందు తెలుసుకునేవారు. ఆ తరువాత బొమ్మను బట్టి ఎంపిక చేసుకోవాల్సిన రంగుల్ని నేను సూచిస్తుంటే, వాసన ద్వారా రంగుల్ని గుర్తించి బొమ్మలకి రంగులద్దారు. ఒక్కో బొమ్మకు మూడు నాలుగు రోజుల సమయం కూడా పట్టింది. బొమ్మ పూర్తవ్వగానే వాళ్ల మొహాల్లో కనిపించిన ఆనందం చూస్తే వాళ్ల కోసం ఇంకా ఏదైనా చేస్తే బాగుండనిపించింది. పెయింటింగ్‌లో మరికొన్ని పద్ధతులు కూడా నేర్పించి గ్రీటింగ్ కార్డులు తయారు చేయించాలనుకుంటున్నాను. అలాగే వాళ్లు వేసిన పెయింటింగ్స్‌తో ప్రదర్శన ఒకటి ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నాను. వీళ్లకే కాకుండా క్యాన్సర్ ఆసుపత్రులకు వెళ్లి క్యాన్సర్ సోకిన పిల్లలకు కూడా పెయింటింగ్ నేర్పిస్తున్నాను.

జీవితాన్ని ఇంకా ప్రేమించాలి

స్కూల్‌కి వెళ్లే రోజుల్లో నేను డ్రాయింగ్స్ వేస్తుంటే 'చదువుకోకుండా అదేం పని' అని మా అమ్మ నన్ను తిట్టేది. కాని నాకు చిన్నప్పట్నించీ డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం. అందుకే పెద్దయ్యాక సొంతంగానే పెయింటింగ్ నేర్చుకున్నాను. నా పిల్లలు పెద్దవాళ్లు అయిన తరువాత మళ్లీ నా అభిరుచికి పదును పెట్టాను. నేను సింగిల్ పేరెంట్‌ని. వ్యక్తిగత జీవితంలో ఎదురైన గందరగోళం నన్ను పెయింటింగ్‌కి బాగా దగ్గర చేసింది. ఒత్తిడి నుంచి బయటపడేందుకు యోగా కోర్సు చేశాను. ఫ్యామిలీ కౌన్సిలింగ్‌లో పిజి డిప్లొమా చేశాను. ప్రాణిక్ హీలింగ్, ఆర్ట్ ఆఫ్ లివింగ్‌లో కొన్ని కోర్సులు చేశాను. నాకు తోచినంతలో ఇతరులకు సాయం చేస్తున్నాను. యోగాలో శిక్షణ కూడా ఇస్తున్నాను. సమస్యలు ఎదురైనప్పుడు ఆడవాళ్లు కుంగిపోవాల్సిన అవసరంలేదు. ఇంకా అప్పుడే బలంగా తయారవ్వాలి. జీవితంపై ప్రేమ పెంచుకోవాలి. గెలుపు సాధించాలి'' అన్నారు వి.లలిత కుమారి.
పిల్లలు చేతివేళ్లతో నెమ్మదిగా తడుముతూ వాటి వివరాలు ముందు తెలుసుకునేవారు. ఆ తరువాత బొమ్మను బట్టి ఎంపిక చేసుకోవాల్సిన రంగుల్ని నేను సూచిస్తుంటే, వాసన ద్వారా రంగుల్ని గుర్తించి బొమ్మలకి రంగులద్దారు.


0 Comments

శాంతి కోసం... పట్టిన పంతం

8/28/2013

0 Comments

 
Picture
                  దేశంలో సామాజిక  పరిస్థితులు ఎలా ఉన్నా తమ మానాన తాము ఉండిపోయే యువతే ఎక్కువ శాతం. ఏ దేశంలోకి తొంగి చూసినా ఇలాంటి దృశ్యమే కనిపిస్తుంది. సంపన్నదేశాల్లో ఇలాంటి  ధోరణి మరీ ఎక్కువ. ఇక  జనాలు ఆకలితో అలమటించే దేశాల్లోని యువతకు ఆ ఆకలితో పోరాటానికే సమయం సరిపోతోంది. కానీ వ్యవస్థలో మార్పు కోసం పాటుపడే యువత మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. మిగతా వారికి భిన్నంగా ఏటికి ఎదురీదుతూ ఎక్కడో ఒకరు కనిపిస్తారు. తాము చేసే ఉద్యమాలతో ప్రపంచవ్యాప్తంగా  గుర్తింపు తెచ్చుకుంటారు. ఇలాంటి వారిలో ఒకరు... ఒమర్ గోల్డ్‌మన్.  పదిహేనేళ్లు నిండిన యువత కాలేజీలో చేరడం కన్నా మిలటరీలో చేరడానికే ఎక్కువ ఉత్సాహం చూపుతుంది. పెన్నులు విసిరేసి గన్నులు పట్టడం మీద ఆసక్తి చూపుతుంది. ఇందుకు భిన్నంగా తమదేశ సంప్రదాయ యువత తీరుకు వ్యతిరేక దిశలో శాంతి పరిరక్షణ కోసం కృషి చేస్తోంది ఒమర్ గోల్డ్‌మన్.

                         హైస్కూల్ చదువును ముగించుకుని కాలేజీలో చేరే దశ అంటే... అది యువతకు ఒక ఉద్విగ్నపూరిత దశ. జీవితంలో ఒక అద్భుతమైన ఎగ్జైట్‌మెంట్‌ను నింపే వయసది. ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో యువతకు ఇలాంటి అనుభవం చాలా సాధారణం. అయితే ఇజ్రాయెల్‌లో మాత్రం ఇలాంటి పరిస్థితి ఉండదు.  పదిహేనేళ్లు నిండిన యువత కాలేజీలో చేరడం కన్నా మిలటరీలో చేరడానికే ఎక్కువ ఉత్సాహం చూపుతుంది. చదువులన్నీ పక్కనపెట్టి, పెన్నులు విసిరేసి గన్నులు పట్టడం మీద ఆసక్తి చూపుతుంది. ఇందుకు భిన్నంగా తమదేశ సంప్రదాయ యువత తీరుకు వ్యతిరేక దిశలో శాంతి పరిరక్షణ కోసం కృషి చేస్తోంది ఒమర్ గోల్డ్‌మన్. ఈమె పోరాడుతోంది అంతర్జాతీయ శాంతి కోసం కాదు... తమ దేశంలో శాంతియుత పరిస్థితులు నెలకొనడానికి. 

                          యుద్ధోన్మాది అనే ముద్ర ఉన్న తన దేశానికి దాన్నుంచి విముక్తి కలిగించడానికి ప్రయత్నిస్తోంది. హైస్కూల్ దాటిన విద్యార్థులు సైనికులుగా కాకుండా కాలేజీ స్టూడెంట్స్‌గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తోంది. టెల్ అవీవ్ ప్రాంతానికి చెందిన ఒమర్ తండ్రి ఇజ్రాయెలీ గూఢచర్య సంస్థలో పనిచేసేవారు. దీంతో చిన్నప్పటి నుంచి వీళ్లింట్లో యుద్ధం, సైనికులు, మరణాలు, త్యాగాలు వంటి అంశాల గురించే ఎక్కువ చర్చ జరిగేది. ఇలాంటి పరిస్థితుల్లో తన సోదరుల్లాంటి వాళ్లంతా మిలటరీలో చేరి జీవితాన్ని అశాంతిమయం చేసుకోవడాన్ని... శత్రువులంటూ అమాయకులను చంపి విజయోత్సవాలు చేసుకుంటుండటాన్ని ఒమర్ సహించలేకపోయింది. హైస్కూల్ చదువు పూర్తికాగానే ధైర్యంగా ముందుకొచ్చిన తన స్నేహితులతో కలసి శాంతి పరిరక్షణ బృందాన్ని ఏర్పరిచింది. అప్పటికే ఈ విషయంలో కృషి చేస్తున్న కొంతమంది మాజీ సైనికులతో కలిసి ఒమర్ బృందం శాంతియుత పోరాటం మొదలుపెట్టింది.

                               పదహారేళ్ల వయసులో ఒమర్ ఈ పోరాటం మొదలుపెట్టింది. ఈమె వ్యూహాత్మకంగా తన వయసు వారిని లక్ష్యంగా చేసుకుని పనిచేస్తోంది. వారందరిలోనూ ‘శాంతి’ అనే తన భావాన్ని నింపడానికి యత్నిస్తోంది. తను చదివిన స్కూల్‌లోని సీనియర్లను, జూనియర్లను కలుపుకుని వారి చేత ‘మేము మిలటరీలో చేరం...’ అని ప్రతిజ్ఞ చేయిస్తూ యువతలో యుద్ధోన్మాదాన్ని తనకు చేతనైనంత మేర తగ్గిస్తోంది. యువతలో ఉన్మాదపూరిత, తీవ్రస్థాయి భావోద్వేగపూరిత దేశభక్తిని నిరోధిస్తూ ఒమర్ తన పోరాటాన్ని కొత్త శైలిలో ముందుకు తీసుకెళ్తోంది. ఇజ్రాయెల్- పాలస్తీనాల మధ్య దశాబ్దాలుగా జరుగుతున్న పోరాటాన్ని ఆపడానికి, పశ్చిమాసియాలో శాంతియుత పరిస్థితులు ఏర్పడటానికి ఐక్యరాజ్యసమితితో సహా ఎంతోమంది ప్రయత్నిస్తున్నారు. వీరెవరి ప్రయత్నాలూ ఫలించడం లేదు. ఒమర్ మాత్రం పరిస్థితిని మూలాల దగ్గర నుంచి మార్చాలని భావిస్తోంది. పశ్చిమాసియాలో శాంతియుత పరిస్థితులను ఏర్పడరచడంలో ఈమె ప్రయత్నం విజయవంతం కావాలని ఆశిద్దాం.

మూలం : సాక్షి దినపత్రిక 

0 Comments

సేవా సౌందర్యమూర్తి

8/27/2013

0 Comments

 
Picture
                  ఆమె ఒడే ఓ ప్రపంచం. అంతులేని అనురాగాల విశ్వం. ప్రపంచంలోని ప్రజలందరినీ తన బిడ్డలుగా చూసుకున్నా రామె. అనాధలకు ఆమె ఒక ఆలంబన. అతి సామాన్య జీవితం నుంచి అసాధారణ వ్యక్తిత్వం మూర్తిభవిస్తే, ఆమే - మదర్‌ థెరెసా. ఆ మానవతామూర్తి 103వ జయంతి నేడు. ప్రపంచానంతటికి తన ప్రేమను పంచిన మహౌన్నత వ్యక్తిని ఒకసారి గుర్తుకు చేసుకుందాం.

               'నిర్మలమైన మనసే దేవుడిని చూస్తుంది' అన్న ప్రభువు మాటల్ని మదర్‌థెరెసా తన జీవితంలో చేసి, చూపించి, కోట్లాదిమందికి ఆదర్శమహిళగా నిలిచారు. 'జీవితం ఒక అవకాశం దాన్ని ఒక గొప్పలక్ష్యం కోసం వినియోగించు, జీవితం అందమైనది దాన్ని ఒప్పుకో, జీవితం ఒక కల దాన్ని నిజం చేసుకో, జీవితం ఒక వృత్తి దాన్ని పూర్తిచేయి, జీవితం ఒక ఆట సంపూర్ణంగా ఆడు, జీవితం ఒక ప్రమాణం దాన్ని నెరవేర్చు, జీవితం దుఃఖమయం అయినా దాన్ని జయించు, జీవితం ఒక పాట దాన్ని మనసారా పాడు, జీవితం ఒక పోరాటం దాన్ని అంగీకరించు, జీవితం ఒక విషాదం దాన్ని అధిగమించు, జీవితం ఒక సాహసం ధైర్యంగా దాన్ని ఎదుర్కో, జీవితం ఒక అదృష్టం దాన్ని వరించుకో, జీవితం అమూల్యమైనది దాన్ని పాడుచేసుకోకు, జీవితమే ఓ జీవనం దానికోసం నిరంతరం పోరాడు' అంటూ నిర్భాగ్యుల జీవితంలో వెలుగును నింపేందుకు దేశంకాని దేశానికి వచ్చి, చనిపోయేంతవరకూ తన మాటల్ని నెరవేర్చుకుని, నేటికీ అనేకుల మనసును దోచుకుంటున్న ప్రేమమూర్తి, అమృతవాణి మదర్‌థెరెసా. జాతిపిత మహాత్మాగాంధీకి సమానంగా మదర్‌ ఫొటోను మంత్రుల నుంచి, ఉన్నతాధికారుల వరకు తమ కార్యాలయాల్లో పెట్టుకుని, ఆమెను తమకు ఆదర్శంగా సేవామూర్తిగా తలంచుకుంటూనే ఉంటారు.


బాల్యంలోనే వికసించిన సేవ
                     మదర్‌థెరెసా 1910 ఆగస్టు 26వతేదీన అల్బేనియాలోని స్కోప్‌జీ (ప్రస్తుతం ఇది మెకడోనియా రాజధానిలో ఉంది)లో జన్మించారు. మదర్‌ ఎనిమిది సంవత్సరాల వయసులోనే తండ్రిని కోల్పోయారు. దీంతో ఈమె తల్లి రోమన్‌క్యాథలిక్‌ విధానంలో మదర్‌ను పెంచారు. కొంతమంది మిషనరీలు బెంగాల్‌లో పనిచేస్తున్న విషయాన్ని థెరెసా తన చర్చిలోని పాస్టర్ల కథల ద్వారా విని, ఆమె నన్‌గా మారి, తన 18వ సంవత్సరంలో మిషనరీగా భారతదేశానికి వచ్చారు. ఇలా వచ్చిన థెరెసా మళ్లీ తన తల్లిని చూడలేకపోయారు. ఆరంభంలో థెరెసా కోల్‌కతాలోని ఒక కాన్వెంట్‌ స్కూల్‌లో టీచర్‌గా పనిచేశారు.  ఇదే సమయంలో ఆమె తన చుట్టూ పేదరికంలో మగ్గుతున్న ప్రజల్ని గమనించేవారు. 1943వ సంవత్సరంలో కోల్‌కతాలో కరువు తాండవమాడినపుడు ఆ పరిస్థితులను చూసిన థెరెసా        చలించిపోయారు. అంతే ఆమెలో సేవాభావం ఒక కెరటంలా మనసులో ఎగసిపడింది. ఇదే సమయంలో ఆమె ఒకసారి కొల్‌కతా నుంచి డార్జిలింగ్‌కు రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు ప్రభువు ఆమెతో మాట్లాడసాగాడు. ఆయన స్వరాన్ని విన్న థెరెసా దానికి విధేయులై, సేవ కోసం భారత్‌లోనే స్థిరపడ్డారు. 1946వ సంవత్సరంలో సిస్టర్‌ థెరెసా కాస్త మదర్‌థెరెసాగా మారిపోయారు.


సేవాకార్యక్రమాలు


                   ఆమె 1948వ సంవత్సరం నుంచి మిషనరీ పనిలో నిమగ్నమయ్యారు. మొదట కేవలం కొద్దికాలం నివాసం ఉండేందుకు భారత పౌరసత్వాన్ని స్వీకరించారు. పేదల్లో నిరుపేదల్ని ఆమె ఎంపిక చేసుకుని, వారి పోషణభారాన్ని స్వీకరించారు. ఇలా వీరికి సేవ చేయడం ఆరంభించారు. అతికొద్దికాలంలోనే ఈమె సేవాకార్యక్రమాలు మనదేశంలో ఉన్నతాధికారుల దృష్టిని ఆకర్షించాయి. దీంతో మనదేశం ఆమెను భారతీయమహిళగా భావించి, శాశ్వత పౌరసత్వాన్ని ఇచ్చింది. పేదల్ని పోషించేందుకు థెరెసా ఆరంభదినాల్లో ఆహారాన్ని, ఇతర వస్తువుల్ని దాతలను నుంచి అడుక్కోవాల్సి వచ్చేదని ఆమె తన డైరీలో రాసుకున్నారు. దీంతో థెరెసా 'ఇది దేవుడు నాకు ఇచ్చిన సేవ కాదు, ఒకవేళ దేవుడే ఈ పరిచర్యను నాకు ఇస్తే, ఇతరులను అడుక్కునే పరిస్థితికి వచ్చేదాన్ని కాదు' అనుకుని ఆ సేవకు గుడ్‌బై చెప్పాలనుకున్నారు. కానీ దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. నేను వెనక్కి వెళ్లాలనుకున్నాను. ఆ వైఫల్యమే దేవుడు నాకు విజయంగా మార్చాడు. ప్రభువుపై ఆధారపడే అనుభవాన్ని నాకు ఇచ్చాడు అంటారామె. 1950వ సంవత్సరం అక్టోబర్‌ 7న కేవలం 13మందితో ఆరంభమైన మదర్‌ సేవ, నేటికి నాలుగువేలమందికి పైగా సిస్టర్లు అనాథుల సేవలో తరిస్తున్నారంటే ఈ సంఖ్య ఎంతో ఊహించవచ్చు.

కష్టాల కడలిలో...
                      'నిర్మలమైన మనసు స్వేచ్ఛా మనసే, శాంతి ఒక చిరునవ్వుకు చిహ్నం' అంటూ తన డైరీలో రాసుకున్న థెరెసా ఆ శాంతి కోపం చనిపోయేంత వరకూ పోరాడారు. అనాథలకు ఆమె ఒక దేవత, తాగుబోతులకు ఆమె చేయి ఓ వెచ్చటి ఆప్యాయత స్పర్శ. కోల్‌కతాలో మదర్‌ సేవను అపార్థం చేసుకున్న ఒక తెగ ప్రజలు ఈమె మన సంస్కృతిని పాడుచేస్తున్నదని ఒక గూండాను మదర్‌పై దాడిచేసేందుకు పంపించారు. ఆమెపై దాడిచేసేందుకు మదర్‌ ఉన్న ఆశ్రమం తలుపువద్దకు వచ్చిన ఆ గూండా ఆ సమయంలో మదర్‌ తప్పతాగిన ఒక వ్యక్తి వాంతి చేసుకుంటుండగా, ఆమె తన చేతులతో ఆ వాంతిని పట్టుకుని, శుభ్రం చేస్తున్న దృశ్యాన్ని చూసి చలించిపోయాడు. ఆమెలో ఒక అద్వితీయశక్తిని చూసి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆమె కాళ్లపై పడి క్షమించమని అడిగాడు.


పేదలంటే ఎందుకింత ప్రేమ!
                    మదర్‌ థెరెసాకు పేదలంటే ఎందుకింత అభిమానమని గమనిస్తే ఆమెలో రగిలే భావాలే ఇందుకు కారణంగా చెప్పవచ్చు.  ఆమె మనసు ఎప్పుడూ పేదలపైనే తిరుగుతుండేవి. 'ఈ విశ్వంలో ప్రేమకోసం తపించే వారెంతో మంది ఉన్నారు. బాధ, ఒంటరితనం, పేదరికం, ఆదరణ లేకపోవడం, తిరస్కారం, వెలివేయబడడం వంటి వీటిని మనం ఎప్పుడో ఒకప్పుడు అనుభవించే ఉంటాం. మనలాగా బాధపడేవారిపై మనకున్న భారం ఏంటి?' అని ప్రశ్నించుకుని, ఆ దిశగా వారికి సేవ చేసేందుకు ఆమె ముందుకు వచ్చారు.


భక్తిలో ఉదయించి సేవ
                      మదర్‌ సేవకు రాకముందు ఆమెకు ప్రభువుపై విపరీతమైన భక్తి ఉండేది. ఆ భక్తే ఆమెను సేవ వైపుకు నడిపించింది. అందుకు ఆమె తన డైరీలో రాసుకున్న అంశాల్ని పరిశీలిస్తే తెలుస్తుంది. 'నువ్వెప్పుడు మౌనంగా ఉంటావో అప్పుడే దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడెప్పుడు నీతో మాట్లాడుతాడో వెంటనే ఆయన చెప్పిన పని నీవు చేస్తావు'అనే మాటను థెరెసా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. 'నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి' అని చెప్పిన యేసు మాటకు ఆమె ఎప్పుడూ అవిధేయురాలిగా ప్రవర్తించలేదు. 'నిన్ను నీవే ప్రశ్నించుకో, ఆయనెంతగా నిన్ను ప్రేమించాడో, ఎప్పుడైతే నీవు ఈ విధంగా ప్రశ్నించుకుంటావో, వెంటనే నేనెంతగా ఇతరులను ప్రేమిస్తున్నాను' అనే సందేహం నీలో ఉదయిస్తుంది అంటారు మదర్‌థెరెసా.


నన్‌ నుంచి సామాజికవేత్తగా ఎదిగిన థెరెసా
                         చాలామంది మదర్‌థెరెసా అనగానే ఆమెను ఒక సామాజిక సేవకురాలిగా మాత్రమే చూస్తారు. ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. రెండవవైపు ఆమె పూర్తిగా ప్రభువుకు విధేయురాలైన శిష్యురాలు. మదర్‌థెరెసా యేసుక్రీస్తును ప్రేమించకపోయి ఉంటే ఆమె 'నన్‌'గా మారి ఉండేవారు కారు. నన్‌గా మారిన ఆమె మొదట మిషనరీ తరపున భారతదేశానికి వచ్చారు. సామాజిక సేవ కోసం ఈ దేశానికి రాలేదు కానీ, ఆధ్యాత్మిక చింతనతో నిండిన భావంతో వచ్చారు. కోల్‌కతాలోని మురికివాడల్లో నిరుపేదలు, ఏ ఆదరణ లేక బాధపడుతున్నవారిని ప్రత్యక్షంగా చూసిన థెరెసా చలించిపోయారు. తిరిగి ఆమె తన స్వదేశానికి వెళ్లిపోయారు. కానీ భారత్‌లో ఆమె చూసిన దృశ్యాలు వెంటాడే జ్ఞాపకాలుగా ఆమెను నిలువనివ్వలేదు. ఇదే సమయంలో ప్రభువు ఆమెతో ప్రత్యేకంగా మాట్లాడాడు. అందరు ఆడపిల్లల్లా ఉద్యోగం, వివాహం, పిల్లలు వంటి ఆలోచనలతో థెరెసా ఉందని భావించిన ఆమె తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చేయాలనుకున్నారు. కానీ థెరెసా వీటిని సున్నితంగా తిరస్కరించి, మళ్లీ మిషనరీ తరపున కొల్‌కతాకు వచ్చారు.


నిర్మల్‌ శిశుభవన్‌
                1955లో మదర్‌ అనాథ పిల్లల కోసం 'నిర్మల్‌ శిశుభవన్‌'ను ఆరంభించారు. 1960లో కుష్ఠురోగులకు సంబంధించిన ఆసుపత్రులను ప్రారంభించారు. ఇదే సమయంలో వెనిజులాలో 1965వ సంవత్సరంలో ఐదుగురు సిస్టర్ల సాయంతో ప్రారంభించారు. రోమ్‌, టాంజానియా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఆమె అనాథాశ్రమాలను నిర్మించారు.


సేవను ప్రభావితం చేసిన కొన్ని అంశాలు
                     థెరెసా గొప్పగొప్ప ప్రసంగాలతో, ఆవేశంతో, అందరిని ఆకట్టుకునేలా ఎప్పుడూ ప్రవర్తించేవారు కారు. చిన్నచిన్న మాటలతో, పదాలతో కోట్లాదిమందిని ఆకట్టుకోగల్గారు. ఏ పనిలోనైనా విజయాన్ని సాధించాలంటే అందుకు 'నమ్మకం, లేదా విశ్వాసం' ఉండాలనేది థెరెసా నమ్మిన సిద్ధాంతం. సేవ చేయాలంటే ఏదో త్యాగం చేసినట్లుగా కాదని, అదెంతో విలువైనదిగా ఉండాలంటే నిన్ను నీవు ఖాళీ చేసుకోవాలని థెరెసా చెబుతుంటారు. 'ఫలించే ప్రార్థన మౌనంగా ఉంటుంది, ఫలించే ఆ ప్రార్థన నమ్మకంతో ఉంటుంది, ఆ నమ్మకం ప్రేమతో నిండి ఉంటుంది, ఆ ప్రేమ సేవ చేసేందుకు ప్రేరేపిస్తుంది, ఆ సేవ ప్రశాంతతను ఇస్తుంది' థెరెసా చెప్పిన ఈ మాట విశ్వఖ్యాతి చెందింది.


వ్యక్తి మరణానికి మనమే కారణం
                       ఒక వ్యక్తి ఆకలితో చనిపోతే అందుకు బాధ్యులం మనమే అంటారు థెరెసా.  మనం ఇతరులతో పంచుకోవాలి. ఆకలి గల వారికి ఆహారాన్ని ఇవ్వమని ప్రభువే చెప్పాడు. 'నాపేరిట ఒక గ్లాసు మంచి నీరు ఇచ్చినా అది నాకు ఇచ్చినట్టే' అని యేసు చెప్పాడు కాబట్టి మనం ఏది ఇచ్చినా, ఏదీ చేసినా ఆయన పేరుతో చేద్దామనేది థెరెసా నమ్మిన సిద్ధాంతం. ప్రతివారిలో ఒకటే తపన కనిపిస్తున్నది, నేను ఎదగాలి, ఐశ్వర్యవంతుడిగా కావాలి, నేను నా కుటుంబం ఆర్థికంగా ఏ ఇబ్బంది లేకుండా ఉండాలని శ్రమిస్తున్నారు. మానవుడు పశువుగా జీవిస్తున్నా దేవదూతలా మరణించాలని చూస్తాడు. కానీ మీకు లేని సమయంలో కొంత సమయాన్ని పేదలకోసం, మీకు ఉండే తక్కువ డబ్బులో కొంత భాగం ఆకలితో అలమటించేవారికి ఇస్తే మీరెంతో సంతోషంగా ఉండగలరని థెరెసా బోధిస్తుంటారు. నేడు ఆమె మనమధ్య లేకపోయినా ఆమె వదిలి వెళ్లిన సేవ కొనసాగుతూనే ఉంది. అదెంత నాణ్యతగా సాగుతుందో మనకు తెలియదు కానీ, ఆమె మనకు చూపిన బాటలో పయనించేందుకు కష్టమైనది మాత్రం కాదు. మనకు ఉన్న కొద్ది ఆదాయంలో కొంత, సమయం చాలని బ్రతుకు పోరాటంలో కాస్త సమయాన్ని పేదల కోసం, ఆకలితో అలమటించేవారికోసం చేద్దాం, సంతోషం, ప్రశాంతత, తృప్తితో నిండిన మనసుతో సాగిపోదాం.

0 Comments

కన్నీటి నుంచే ఆ తీర్పు పుట్టింది!

8/26/2013

0 Comments

 
Picture
              అది 2005, ఏప్రిల్‌ 22. ఎప్పటిలానే మార్కెట్‌ రోడ్డు జనంతో కిటకిటలాడుతోంది. స్కూళ్లకూ, ఆఫీసులకూ వెళ్లే వాళ్లతో బస్‌స్టాప్‌ మరీ రద్దీగా ఉంది. అప్పటికే లక్ష్మి అక్కడికొచ్చి అరగంట దాటింది. ఆమె కళ్లల్లో వచ్చే ప్రతి బస్సూ తనెక్కాల్సింది అయితే బాగుండునన్న ఆరాటం! చెట్ల మధ్య జింకలా జనం మధ్యలో నిల్చున్న ఆమె, అక్కడే ఓ 'మనిషి వన్నె పులి' నక్కి ఉందని గుర్తించలేకపోయింది. చూస్తుండగానే, తను ఎక్కాల్సిన బస్సు వచ్చింది. అది ఎక్కడ ఆగకుండా వెళుతుందోనన్న కంగారులో జనాన్ని తోసుకుంటూ ముందుకొచ్చింది. అంతలో బస్సును దాటుకుంటూ ఓ బైకు ఆమె మీదకు దూసుకొచ్చింది. దాని మీదున్న వ్యక్తి ఒక్కసారిగా లక్ష్మి మీదకు దూకి, జుట్టు పట్టుకొని బరబరా ఈడ్చుకుంటూ రోడ్డుమీద పడేశాడు. ఏం జరిగిందోనని ఆమె లేచి చూసేలోగానే, సీసాలోని యాసిడ్‌ని అమాంతం మీద పోశాడు. ఒళ్లంతా భగభగ మండిపోతుంటే 'రక్షించండి...' అని అరవడానికి కూడా నోట మాట రాలేదు. అరిచినా పట్టించుకునే స్థితిలో జనం లేరు. సంఘటన జరిగిన వెంటనే ఎటువాళ్లటు పరుగులు తీశారు. యాసిడ్‌ చల్లిన వ్యక్తి తాపీగా బైక్‌ స్టార్ట్‌ చేసుకొని వెళ్లిపోయాడు. వందల మంది మధ్యలో బాధతో విలవిల్లాడుతూ కుప్పకూలింది లక్ష్మి.

                     లక్ష్మి ఢిల్లీలో ఎనిమిదో తరగతి చదువుతోంది. ఓ రోజు స్కూలైపోయాక సరదాగా స్నేహితురాలు ఇంటికెళ్లింది. అక్కడే ఉన్నాడు నయీమ్‌ ఖాన్‌. స్నేహితురాలి అన్న. 'ఈ అమ్మాయి నాదే'... బంగారు బొమ్మలా ఉన్న లక్ష్మిని చూడగానే అతని మెదడులో కదిలిన ఆలోచన ఇదే. నెమ్మదిగా మాట కలిపాడు. అతని విషపు ఆలోచనను గుర్తించలేక స్నేహితురాలి 'అన్న' కదాని తనూ సరదాగా మాట్లాడింది. దాన్ని అలుసుగా తీసుకుని వెంటపడ్డాడు. ఫోను నంబరు తీసుకున్నాడు. 'ఐ లవ్యూ' అంటూ ఎస్సెమ్మెస్‌ పంపాడు. అది చూసి లక్ష్మి ఆశ్చర్యపోయింది. భయపడింది. ఆమె వయసు పదిహేను. అతనికి ముప్ఫై రెండు. 'అతనింత దుర్మార్గుడా' అనుకుంటూ ఆలోచనలో పడిపోయింది. ఇంతలో మరో ఎస్సెమ్మెస్‌. 'వెంటనే జవాబివ్వు. లేకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి'. అది చదివి వణికిపోయింది. ఇంట్లో చెబితే తననే తిడతారు. చదువు మానిపిస్తారు. నెమ్మదిగా ధైర్యం కూడదీసుకుంది. 'మిమ్మల్ని అన్నలా భావించాను. నాకు ఆలాంటి ఆలోచనలు లేవు. దయచేసి వదిలేయండి' అంటూ బదులిచ్చింది. అటు నుంచి జవాబు రాలేదు. అర్థం చేసుకున్నాడనుకుంది. కానీ ఆ నిశ్శబ్దం వెనక రాక్షసత్వం దాగుందని వూహించలేకపోయింది.


                   తన ప్రేమను కాదనిందన్న అవమానంతో నయీమ్‌ పగతో బుసలు కొడుతున్నాడనీ, రహస్యంగా వెంబడిస్తున్నాడనీ తెలుసుకోలేకపోయింది.లక్ష్మి కలలూ, ఆశలూ కూలిపోవడానికి పట్టిన సమయం కేవలం ముప్ఫై సెకన్లు. యాసిడ్‌ పడగానే... మొదట రెండు చెవులూ కరిగిపోయాయి. ముక్కు పిండి ముద్దలా మారింది. పెదాలు పొట్టులా రాలిపోవడం మొదలైంది. రెప్పపాటులో కళ్లకు చేతుల్ని అడ్డం పెట్టుకుంది. ఒళ్లంతా భరించలేనంత మంట.... శరీరంలో ఒక్కో భాగం కాలిపోతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అయినా చేతులను కళ్లపై నుంచి తీయకుండా బాధతో అరుస్తూనే ఉంది. అటుగా వచ్చిన ఓ వ్యక్తి కారులో తీసుకెళ్లి ఆస్పత్రిలో చేర్పించేప్పటికే స్పృహతప్పింది. ఒళ్లంతా సూదులు గుచ్చినంత బాధ. ఎక్కడ ముట్టుకున్నా బ్యాండేజీలు. ముఖానికి ఏమీ జరిగి ఉండదులే అని ఏ మూలో చిన్న ఆశ. పది వారాలు గడిచాయి. కాస్త స్థిమిత పడింది. మునుపటిలా మాట్లాడటం మొదలుపెట్టింది. కానీ డాక్టర్‌ ముఖానికి ఉన్న కట్లు విప్పినప్పుడు అద్దంలో తన ముఖం చూసుకుని తట్టుకోలేకపోయింది. ముఖమంతా కాలిన చర్మపు ముడతలు చూసుకుని, 'ఆ రోజు చేతులు అడ్డుపెట్టుకోకుండా ఉండుంటే, ఇప్పుడిలా నన్ను చూసుకునే దుస్థితి వచ్చుండేది కాదు' అని వలవలా ఏడ్చింది. అయినా అద్దాన్ని పక్కకు జరపలేదు. దాన్లో ముఖం చూసుకుంటూ, తనేం కోల్పోయిందీ, ఇక ముందు జీవితం ఎలా ఉండబోతోందీ అర్థం చేసుకొనే ప్రయత్నం చేసింది.'ప్రేమను ఒప్పుకోలేదని ఓ అమ్మాయి జీవితాన్ని ఇంత సులువుగా నాశనం చేస్తాడా... చెల్లెలి లాంటిదాన్ని అన్నా కనికరం చూపలేదే...' చికిత్స జరుగుతున్నన్నాళ్లూ లక్ష్మి ఆలోచన ఇదే. పోలీసులు అతణ్ని అరెస్టు చేశారు. కానీ నెల తిరిగేసరికి బెయిలుపై విడుదలయ్యాడు. పెళ్లి చేసుకున్నాడు. ఏ పాపం ఎరుగని లక్ష్మి మాత్రం చావుకీ, బతుక్కీ మధ్య వూగిసలాడుతోంది.

                      'ఏ తప్పూ చేయని నేను జీవితాన్ని కోల్పోయాను. అన్నిటికీ కారణమైన అతను స్వేచ్ఛగా బతికేస్తున్నాడు. అతనికి గుణపాఠం చెప్పేందుకు ప్రాణం ఉన్నంత వరకూ పోరాడాలి..' అనుకుంది. అప్పటికే ఆమెకు ఏడు శస్త్ర చికిత్సలు జరిగాయి. మరో నాలుగు చేయాలని డాక్టర్లు చెప్పారు. పూట గడిస్తే చాలనుకొనే కుటుంబం ఆమెది. చికిత్స కోసం పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. లక్ష్మి తండ్రి ఓ వంటవాడు. ఓ వైద్యురాలి దగ్గర పనిచేస్తాడు. ఆమె సాయంతోనే లక్ష్మికి చికిత్స జరిగింది. శరీరం నొప్పి నుంచి కోలుకుంది. కానీ మనసు మాత్రం రంపపు కోత అనుభవిస్తూనే ఉంది. హాయిగా ఆడుతూ, చదువుతూ తిరగాల్సిన వయసులో ఆమె జీవితం ఆస్పత్రి గోడలూ, కోర్టు మెట్లకు అంకితమైంది.యాసిడ్‌ శరీరాన్నే గాయపర్చింది. అంతులేని ఆమె ధైర్యాన్ని ఇసుమంతైనా కదిలించలేకపోయింది. గాయాల నుంచి కోలుకున్నాక జీవితంతో పోరాడాలని లక్ష్మి నిశ్చయించుకుంది. తనకు జరిగిన అన్యాయాన్ని చెబుతూ, యాసిడ్‌ని నిషేధించాలని ఆన్‌లైన్‌లో ఆమె ఉంచిన పిటిషన్‌కు మద్దతుగా 27వేల మంది సంతకాలు చేశారు. ఆ స్పందన కొండంత ధైర్యాన్నిచ్చింది. ఓ న్యాయవాది సాయంతో 'యాసిడ్‌ అమ్మకాలను నిషేధించాలనీ, దాడులకు పాల్పడిన వాళ్లను తీవ్రంగా శిక్షించాలనీ' కోరుతూ 2006లో సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. కోర్టు విచారణకు స్వీకరించింది. ఓ కమిటీని నియమించి యాసిడ్‌ దాడులకు సంబంధించిన చట్టంలో మార్పులకు మార్గం సుగమం చేసింది. న్యాయనిపుణులూ, మేధావులూ దీనిపై చర్చించారు. గణాంకాలను పరిశీలించారు. చివరికి చట్టంలో సవరణను సూచించారు.

                        అమె ధైర్యాన్ని చూసి విధి అసూయ పడిందేమో! మరిన్ని పరీక్షలు పెట్టింది. అన్నయ్య క్షయ వ్యాధితో మంచం పట్టాడు. తరవాత కొన్ని రోజులకే తనకు ధైర్యం నూరిపోసిన తండ్రి చనిపోయాడు. కుటుంబ భారమంతా లక్ష్మి మీదే పడింది. అన్ని బాధల మధ్యలోనూ చదువుకు దూరమవని ఆమె పన్నెండో తరగతిలో చేరింది. ఉన్న చదువుతోనే ఉద్యోగాల వేట మొదలుపెట్టింది. అక్కడా అవమానాలే. బీపీవోలూ, బ్యూటీ పార్లర్‌ల చుట్టూ ఉద్యోగాల కోసం తిరిగింది. వాటిలో పనిచేయడానికి అవసరమైన శిక్షణను తీసుకుంది. ప్రతి ఇంటర్వ్యూలో తన కథ వినడం. జాలి పడటం. మళ్లీ ఫోన్‌ చేస్తామని చెప్పడం. ఉద్యోగం ఇస్తామన్న వారే లేరు. కనీసం తనను మామూలు మనిషిలా చూస్తే చాలనుకుంది. అదీ తీరలేదు. తనను చూసి భయపడేవాళ్లూ, పిల్లల్ని దూరంగా తీసుకెళ్లే వాళ్లే తప్ప స్నేహంగా ఉండేవాళ్లూ, సాయం చేసేవాళ్లూ కనిపించలేదు.

                 అప్పుడే తనలాంటి బాధితులను కలిసింది. అందరినీ కూడగట్టి యాసిడ్‌ దాడులకు వ్యతిరేకంగా పోరాడటం ప్రారంభించింది.'యాసిడ్‌ దాడులను తీవ్రమైన నేరాలుగా పరిగణిస్తున్నాం. వాటికి పాల్పడిన వారికి కనీసం పదేళ్ల నుంచి జీవిత కాలపు జైలు శిక్ష, పది లక్షల రూపాయల జరిమానా విధిస్తాం. వివరాలు నమోదు చేయకుండా యాసిడ్‌ అమ్మడానికి లేదు. అలా చేస్తే కఠిన శిక్షలు తప్పవు. బాధితులకు ప్రభుత్వం మూడు లక్షల రూపాయల జరిమానా చెల్లించాలి' అంటూ సుప్రీంకోర్టు గత నెలలో ఇచ్చిన తీర్పుతో లక్ష్మి కోల్పోయిన ఎనిమిదేళ్ల జీవితం తిరిగొచ్చినట్లయింది. నయీం ఖాన్‌కు పదేళ్ల జైలు శిక్ష పడింది. అయినా లక్ష్మి శాంతించలేదు. 'కోర్టు తీర్పు సమాజంలో భయాన్ని పుట్టిస్తుంది కానీ కోల్పోయిన మా శరీరాన్ని తిరిగి ఇవ్వలేదు. యాసిడ్‌ దాడికి గురయితే చికిత్సకు సుమారు పదిలక్షలపైనే ఖర్చవుతుంది. మూడు లక్షలు సరిపోవు. ఉద్యోగాలు రావు. పెళ్లిళ్ళు కావు. జీవచ్ఛవంలా బతకాలి. డిసెంబర్‌ 16 ఘటనకు దేశమంతా ఒక్కటైంది కదా! మేం అలాంటి బాధనే జీవితాంతం అనుభవిస్తాం. దేశంలో ప్రతి మూడు రోజులకు ఒకరు యాసిడ్‌ దాడికి గురవుతున్నారు. మా గురించి ఎందుకు ఎవరూ పట్టించుకోరూ...' అంటూ బాధపడుతుంది. ఇప్పుడు లక్ష్మి 'స్టాప్‌ యాసిడ్‌ ఎటాక్‌' అనే స్వచ్ఛంద సంస్థలో బాధితులకు కౌన్సెలింగ్‌ ఇస్తూ, నెలకు పదివేల ఆదాయం పొందుతోంది. అన్న చికిత్సకూ, కుటుంబ పోషణకూ, తన చదువుకూ అదే ఆధారం. మామూలూ వ్యక్తులకు ఆమె శరీరానికైన గాయాలే కనిపిస్తాయి. కాస్త మనసుపెట్టి చూస్తే ఆమె కళ్లల్లో నిండిన ఆత్మవిశ్వాసం, పెదాలపై చెరగని చిరునవ్వూ పలకరిస్తాయి. యాసిడ్‌ దాడులకు వ్యతిరేకంగా అలుపెరగక పోరాడుతున్న లక్ష్మి, జీవిత పోరాటంలోనూ ఆనుకున్న విజయాన్ని సాధించాలని ఆశిద్దాం!

మూలం : ఈనాడు దినపత్రిక


0 Comments

పద్మశ్రీ వారియర్‌

8/25/2013

0 Comments

 
Picture
ఫోర్బ్‌స్ శక్తివంతమైన మహిళల్లో ఒకరు
విజయవాడ ఆమె జన్మస్థలం
సిస్కో సిస్టవ్‌‌సు సిటివోగా బాధ్యతలు
మోటొరొలా సంస్థకు సిటివోగా అనుభవం


                  ప్రపంచ టెక్నాలజీ పరిశ్రమలలోని అత్యంత శక్తివంతుల ముఖాలన్ని పురుషూలేక చెంది ఉంటాయని ఇంతవరకు భావిస్తున్న వారు ప్రస్తుతం తమ అభిప్రాయాలను కాస్త మార్చుకోవలసి ఉంది. ప్రపంచ ఐటీ పరిశ్రమ ఇప్పటికీ పురుషూల ఆధిపత్యంలోనే నడుస్తూ ఉండటం నిజమే కాని ఐటి కోటాలోకి ప్రతిభావంతులైన మహిళా మూర్తులు తమ వంతు భాగస్వామ్యాన్ని అందిస్తున్నారు. తమ కృతనిశ్చయం, ప్రతిభ, దార్శనికతల ద్వారా ప్రపంచ ఐటి పరిశ్రమలో అత్యంత శక్తివంతులైన వారి సరసన మహిళలు ఇప్పుడు సగర్వంగా నిలబడుతున్నారు. అలాంటి వారిలో ఒకరు విజయవాడకు చెందిన పద్మశ్రీ వారియర్‌.

                     విజయవాడలో పుట్టిన ఆమె అంతర్జాతీయ సంస్థలకు సిఇవోగా పనిచేయడం అంటే సామాన్య విషయం కాదు. అందున మహిళ ఆ స్థాయికి ఎదగడం అంటే ఎంతో పట్టుదల, కృషి ఉండాలి. తెలుగు వనిత అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తోంది అంటే అది తెలుగు వారందరికీ గర్వకారణం. సాంకేతిక ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన తెలుగు వనిత పద్మశ్రీ వారియర్‌. విజయవాడలో జన్మించిన ఆమె ప్రస్తుతం అంతర్జాతీయ సంస్థ సిస్కో సిస్టమ్స్‌ చీఫ్‌ టెక్నాలజీ అండ్‌ స్ట్రాటజీ ఆఫిసర్‌(సిటిఓ)గా బాధ్యతలు నిర్వహిస్తోంది. గతంలో మోటొరొలా సంస్థకు సిటిఓగా పనిచేసిన అనుభవం ఆమె సొంతం. ఈమె ఇక్కడే పిల్లల మోంటెసోరీ పాఠశాల, మేరీ స్టెల్లా కళాశాలలో చదువుకుంది. విజయవాడలోనే ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తిచేసిన ఆమె ఢిల్లీ ఐఐటి నుంచి కెమికల్‌ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్‌ డిగ్రీని పూర్తి చేసింది. 1982 లో రసాయన శాస్త్రంలో ఇంజినీరింగ్‌ పట్టా పుచ్చుకున్నది. కార్నెల్‌ విశ్వవిద్యాలయం నుంచి కూడా కెమికల్‌ ఇంజనీరింగ్‌లో పట్టాను సాధించింది.

                     వారియర్‌ 1984 సంవత్సరం మోటారోలా సంస్థలో చేరి అక్కడ సుమారు 29 సంవత్సరాలలో వివిధ రకాల బాధ్యతలను వహించి చివరికి వైస్‌ ప్రెసిడెంట్‌ గాను, ఎనర్జీ సిస్టంస్‌ విభాగానికి జనరల్‌ మేనేజర్‌, కార్పొరేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, ప్రధాన టెక్నాలజీ అధికారిగా ఎదిగారు.సిస్కో చీఫ్‌ టెక్నికల్‌, స్ట్రాటజీ అధికారిని అయిన పద్మశ్రీ వారియర్‌ తన దినచర్యలో భాగంగా ఉదయం 4.30 నిమిషాలను నిద్రలేస్తారట. ముందుగా ఈ - మెయిల్స్‌ ను చెక్‌ చేసుకోవటం ఆ తరువాత జిమ్‌ ఆపై పిల్లలను స్కూల్‌కు పంపి 8.30 ప్రాంతంలో ఆఫీసుకు బయలుదేరతారట.2013లో పోర్బ్‌ మ్యాగ్జిన్‌ ప్రకటించిన అత్యంత శక్తివంతమైన మహిళలు జాబితాలో భారత సంతతికి చెందిన పద్మశ్రీ వారియర్‌ 57వ స్థానాన్ని పొందారు. ఈ జాబితాలో సోనియా 9వ స్థానంలో నిలిచారు. 2004లో పద్మశ్రీ మోటరోలా కంపెనీకి సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న సమయంలోనే ఆ కంపెనీ అమెరికా ప్రెసిడెంట్‌ నేషనల్‌ మెడల్‌ ఆఫ్‌ టెక్నాలజీ అవార్డును అందుకున్నారు.

                    2005లో ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అయ్యారు. 2007లో సిస్కో సిస్టమ్స్‌లో చేరారు. ప్రపంచంలోనే అత్యధికంగా జీతం అందుకుంటున్న పది మందిలో పద్మశ్రీ ఒకరని ఫార్ట్యూన్‌ పత్రిక వెలువరించింది. ‘లెవెన్త్‌ మోస్ట్‌ ఇన్‌ఫ్ల్యూయన్షియల్‌ గ్లోబల్‌ ఇండియన్‌’ గా ఎకనమిక్‌ టైమ్స్‌ పేర్కొంది. ఆమె ఆలోచనలను ఎప్పటికప్పుడు సంబంధిత సిబ్బందితో పంచుకుంటూ వారి సూచనలను స్వీకరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఉద్యోగ హోదా కంటే వారు ఇచ్చిన సూచనలు ఎంత వరకు ఉపయోగం అనే విషయాన్నే ఆమె పరిగణలోకి తీసుకుంటారు. అందుకే వారియర్‌ అంటే సంస్థలోని ప్రతి వ్యక్తి గౌరవం. ఎంతో మంది అమ్మాయిలు వారియర్‌ను స్ఫూర్తిగా తీసుకుంటారు. వారికి ఆమె ఇచ్చే సూచన ఒక్కటే ‘‘గోల్‌ ఏర్పరచుకోండి దాన్ని సాధించడానికి ఎంత కష్టమైనా పడండి. అది సాధించిన రోజన నీ కష్టాలన్నీ మరిచిపోతావ్‌’’.

మూలం : సూర్య దినపత్రిక

0 Comments

పర్యావరణ కృషికి గుర్తింపు

8/24/2013

0 Comments

 
Picture
ప్రకృతిని ప్రేమించి... జీవశాస్త్రంలో పీహెచ్‌డీ చేసి... 'పర్యావరణాన్ని పట్టించుకుంటే పదికాలాల పాటు మనకే మంచిది' అంటూ ప్రచారం చేసిన అపరాజిత రెండున్నర లక్షల పౌండ్ల విలువైన ప్రతిష్ఠాత్మక గ్రీన్‌ ఆస్కార్‌ పురస్కారాన్ని సాధించింది.

                     అపరాజిత తండ్రి ఉద్యోగరీత్యా జాంబియాలో స్థిరపడ్డారు. చిన్నతనం నుంచీ ఆఫ్రికా చుట్టుపక్కల అడవుల్లోని పక్షులూ, జంతువులూ, పచ్చని చెట్లను చూస్తూ పెరిగిన అపరాజితకు జీవ శాస్త్రం ఇష్టమైన పాఠ్యాంశంగా మారింది. దాన్లో పీజీ చదివి, పెద్ద ఉద్యోగం చేయాలనుకుంది. కొన్నేళ్లకి ఆమె కుటుంబం స్వస్థలం కోల్‌కతాకి వచ్చేశాక అక్కడే అపరాజిత వృక్షశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసింది. జీవావరణం అంశంలో పీజీ పూర్తి చేసింది.

                     మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ కీకారణ్యాల్లోని పక్షులూ, మొక్కల మీద ఎన్నో అధ్యయనాలు చేసిన ఆమె... అరుణాచల్‌ప్రదేశ్‌ అటవీ ప్రాంతంలో అరుదుగా కనిపించే మూడు ముక్కుల పక్షి హార్న్‌బిల్‌ జీవనశైలిని ఆసక్తిగా గమనించింది. అవి దట్టమైన అడవుల్లో అన్ని రకాల పండ్లు తింటాయి. గింజల్ని వివిధ ప్రాంతాల్లో వెదజల్లుతాయి. దాంతో పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతోంది. ఆ పక్షుల ప్రత్యేకత, అవి చేస్తున్న మేలు ప్రధానాంశంగా పీహెచ్‌డీ చేసిన అపరాజిత 'నేచర్‌ కన్జర్వేషన్‌' పేరుతో ఓ సంస్థని స్థాపించింది.

                    అటవీ పరిసర ప్రాంతాల్లో ఉన్న గిరిజనులు పక్షులనూ, జంతువులనూ వేటాడకుండా... అటవీ సంపదకు నష్టం కలిగించకుండా అవగాహన కల్పించింది. హార్న్‌బిల్‌ల సంఖ్యను పెంచడానికి సంరక్షణ కేంద్రాలు ఏర్పాటుచేసి, వాటి బాధ్యతను గిరిజనులకు అప్పగించింది. వలంటీర్ల సాయంతో ఉద్యానవన తోటలు పెంచి, చేతి వృత్తులను ప్రోత్సహించి... గిరిజనులకు ఉపాధి మార్గం చూపించింది. బడులూ, ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటుచేసింది. పదేళ్లు తిరిగేసరికి అపరాజిత కృషి ఫలించింది. పక్షుల సంరక్షణ కేంద్రాల సంఖ్య అరవైకి చేరింది. గిరిజనులకు విద్య, ఉపాధి అవకాశాలు పెరిగాయి. జీవ వైవిధ్యంపై ఎన్నో పుస్తకాలు రాసిన అపరాజిత, పిల్లల కోసం ప్రత్యేకంగా హార్న్‌బిల్‌ పక్షుల గురించి పుస్తకం రాసింది. పదేళ్లుగా ఆమె చేస్తున్న సేవలను గుర్తించిన లండన్‌ ప్రభుత్వం 'గ్రీన్‌ ఆస్కార్‌' ఇచ్చి సత్కరించింది.


0 Comments

నైనానంద ప్రతిభ

8/24/2013

0 Comments

 
Picture
నయా పైసా ప్రోత్సాహం లేకున్నా..
భారత జూనియర్ టెన్నిస్ విభాగంలో..
జాతీయ స్థాయిలో నెంబర్ వన్‌గా నిలిచింది..
అతి పిన్నవయసులోనే డిగ్రీ పూర్తి చేయబోతున్నది..
ఒకేసారి రెండు చేతులతో రాస్తుంది..
పియానో వాయిస్తూ శ్రావ్యంగా పాడగలదు..
కేవలం 25నిమిషాల్లోనే ఘుమఘుమలాడే..
హైదరాబాదీ బిర్యానీని వండి వడ్డించగలదు..
భగవద్గీత శ్లోకాలైతే కంఠస్థం! ఆ బహుముఖ ప్రజ్ఞాశాలే..            నైనా జైస్వాల్

                  కృషి ఉంటే ఏదైనా సాధించొచ్చని నిరూపిస్తున్నది హైదరాబాద్ కాచిగూడకి చెందిన నైనా. ‘పిట్ట కొంచెం.. కూత ఘనం’ అన్న సామెతను అక్షర సత్యం చేస్తున్నది. ఆల్ ఇన్ వన్‌గా గుర్తింపు పొంది అందరినీ అబ్బురపరుస్తున్నది. ఎవరైనా ఒక్కపని చేయడానికే అపసోపాలూ పడుతుంటారు. అలాంటిది నైనా చదువుల్లో.. ఆటల్లో.. సంగీతంలో మేటి అనిపించుకుంటున్నది. అంతేనా.. నాలుగు భాషలు అనర్గళంగా మాట్లాడేస్తుంది! కఠోర శ్రమ, పట్టుదల ఆమె సొంతం. అందుకే రాబోయే ఒలింపిక్స్‌లో పతకాన్ని సాధించి దేశ ఖ్యాతిని మరింత పెంచాలనే దిశగా అడుగులు వేస్తున్నది.

కుటుంబ నేపథ్యం..
                  తండ్రి అశ్వినీ కుమార్ జైస్వాల్ అడ్వకేట్. మార్వాడీ ఉమ్మడి కుటుంబం. కూతురు కోసం తన ప్రాక్టీసును వదులుకొని కోచ్‌గా మారాడు. తన కోసం ఇప్పుడు చదువును కొనసాగిస్తున్నాడు. తల్లి భాగ్యలక్ష్మి. వరంగల్ వాసి. తల్లిదండ్రులది  ప్రేమ వివాహం. నైనాకు మొదటి గురువు తల్లే. నైనాను ఫస్ట్‌క్లాస్ వరకు మామూలు పిల్లల్లాగానే స్కూలుకు పంపించారు. ఆ తర్వాత టెన్నిస్ ప్రాక్టీస్ మొదలు పెట్టింది. అది చదువుకు ఇబ్బందిగా మారుతుందని ఇంట్లోనే నోట్స్ ప్రిపేర్ చేసి ఇచ్చేది భాగ్యలక్ష్మి. నైనా ఒకసారి చదివితే గుర్తుంచుకునే రకం. అందుకే 8ఏళ్ళ ప్రాయంలోనే తన చేత పదవతరగతి పరీక్షలు రాయించాలని నిర్ణయం తీసుకుంది తల్లి. ఆ దిశగా అమ్మాయిని స్కూలుకు పంపించకుండానే హోం స్కూలింగ్ ద్వారా పదవతరగతి పరీక్షలు రాయించింది. అది కూడా ఐటీసీఎస్ కేంబ్రిడ్జి యూనివర్సిటీ నుంచి. నైనాకు ఒక తమ్ముడు. పేరు అగస్త్య. అక్కకు గట్టి పోటీ. వయసు 7 సంవత్సరాలే కానీ చిచ్చర పిడుగు. అక్కతోపాటు ప్రాక్టీసులకు వెళతాడు. నాలుగు భాషలు మాట్లాడగలడు. భగవద్గీత శ్లోకాలు, దేశాల రాజధానులు టకటకా చెప్పేస్తాడు.

ఆటల్లో మేటి..
                    గేమ్స్‌లో మ్యాజిక్స్ ఏమీ ఉండవు. కాకపోతే దాన్ని ఒక ఆటలా కాకుండా ఎంజాయ్ చేస్తూ ఆడితే గెలుపు తథ్యం. ఆ సూత్రాన్నే నమ్మింది నైనా. తండ్రి ఎంత కోచ్‌గా వ్యవహరించినా కోర్డులోకి దిగిన తర్వాత ఆమె వెనక ఎవరూ కనిపించరు. ఎంకరేజ్ చేయరు. అలా చేస్తే ఎక్కడ ఒత్తిడికి గురవుతుందేమోనని ఆ తండ్రి భయం. అందుకే ఆట ముగిసే వరకు ఆ ప్రాంగణంలో ఎక్కడా కనిపించడు. నైనాను వన్‌మెన్ ఆర్మీలా పంపించడమే అతనికి ఇష్టం. సింగిల్స్, డబుల్స్‌లోనూ కలిపి ఇప్పటిదాకా 12 గోల్డ్‌మెడల్స్, 4 వెండి, 6 కాంస్య పతకాలను సాధించింది. ఇక ట్రోఫీలు, ప్రతిభా పురస్కారాలు, సన్మానాలు, సత్కారాలకైతే లెక్కేలేదు. నేషనల్ లెవల్ అండర్ - 15 విభాగంలో నెంబర్ వన్ స్థానాన్ని సాధించి, ప్రపంచ ర్యాంకింగ్‌లో 6వ స్థానంలో నిలిచింది నైనా.

చదువుల్లో లేరు సాటి..
                    ఆటల్లో పడి చదువును కొనసాగించడం కొంచెం కష్టమే. కానీ నైనా స్కూల్‌కి వెళ్ళకపోయినా ఇంట్లోనే చదువుకొని చిన్న వయసులోనే పదవతరగతి పరీక్షలు రాసి ఫస్ట్ క్లాస్‌లో పాసయింది. ఆ ప్రతిభ చూసి సెయింట్ మెరీస్ కాలేజీ యాజమాన్యం ఇంటర్ చదవడానికి ఉచిత ప్రవేశాన్ని కల్పించింది. పదకొండేళ్ళకు ఇంటరూ పూర్తి చేసింది. ఇప్పుడు నైనాకు పదమూడేళ్ళు. అదే కాలేజీలో బీఏ ( మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం) డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నది. రెండు సంవత్సరాలకు కలిపి కూడా ఫస్ట్ క్లాస్ మార్కులే వచ్చాయి. తన ఇరవయ్యో ఏటికల్లా పొలిటికల్ జర్నలిజంలో పీహెచ్‌డీ పూర్తి చేయాలని కలలు కంటున్నది.

ప్రతిభకు లేదు హద్దు..
                కుడిచేతితో రాస్తే.. ఎడమ వైపు మెదడు పనిచేస్తుంది. ఎడమ చేతితో రాస్తే కుడివైపు మెదడు చురుకుగా ఉంటుంది. కానీ ఒకేసారి రెండు చేతులతో రాయాలంటే చాలా కష్టపడాలి. ఇన్ని చేస్తూ కూడా దొరికిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంది నైనా. రెండు చేతులతో రాస్తూ.. ముత్యాల్లాంటి అక్షరాలతో అందర్నీ మంత్రముగ్ధుల్ని చేస్తున్నది. ఇక పుట్టి, పెరిగింది హైదరాబాద్‌లోనే కాబట్టి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ రావడం మామూలే! అందుకే చైనీస్ నేర్చుకుంది. ఆ భాషే నేర్చుకోవడం వెనక కూడా ఓ కారణం ఉంది. ఈ ఆటలో ఆ దేశం నుంచే ఎక్కువమంది ప్లేయర్స్ ఉన్నారు. వారితో మాట్లాడడం, ఆటలో మెళకువలు నేర్చుకోవడం కోసం ఆ భాషను ఎంచుకొంది. ఐదు సంవత్సరాలున్నప్పుడే పియానో మీద ఆసక్తితో అదీ నేర్చుకుంది. అప్పుడప్పుడు కచేరీలు కూడా ఇస్తుంది. భగవద్గీత శ్లోకాలు కంఠస్తమే కాదు.. దాన్ని హిందీలో ట్రాన్స్‌లేట్ చేసి కూడా చెప్పగలదు. ఇక బిర్యానీ వండాలంటే.. గంటల తరబడి ప్రయాసపడడం తప్పనిసరి! కేవలం 25నిమిషాల్లో రుచికరమైన బిర్యానీని మన ముందు పెట్టగలదు. దానికోసం చిన్న, చిన్న టెక్నిక్స్ వాడుతుందట. ఆ వంటకం వెనక రహస్యం మాత్రం సీక్రెట్ అంటుంది. ఇవేకాక సరదా కోసం ఫొటోషాప్, కోరల్‌వూడాలాంటి సాఫ్ట్‌వేర్ సంబంధమైన కోర్సులు కూడా నేర్చుకుంటున్నది.

పర్‌ఫెక్ట్ టైమింగ్స్..
                     సమయాన్ని వృథా చేయడం అస్సలు ఇష్టం ఉండదు నైనాకు. ప్రతి నిమిషం బిజీగా ఉండడానికే ఓటు వేస్తుంది. ఉదయం 6 నుంచి ఆమె షెడ్యూల్ ప్రారంభమవుతుంది. ఒక గంటపాటు ఇంట్లోనే యోగా చేసి తొమ్మిది గంటల వరకు రెడీ అయి లాల్‌బహుదూర్ స్టేడియం చేరుకుంటుంది. అక్కడ మధ్యాహ్నం 12దాకా ప్రాక్టీస్. మళ్ళీ ఇంటికి వచ్చి మూడింటిలోపు భోజనం.. కాసేపు విశ్రాంతి. మూడింటికి జిమ్‌కు వెళుతుంది. అక్కడ రెండు గంటలు వర్కవుట్లు చేసి ఐదింటికి ఎల్‌బీ స్టేడియం వెళ్తుంది! ఒక గంటపాటు మళ్ళీ ప్రాక్టీస్ చేసి అక్కడ తోటి క్రీడాకారులుంటే.. వాళ్ళతో ఢీ అంటే ఢీ అంటూ మ్యాచ్ ఆడుతుంది. మెల్లగా ఎనిమిదింటికి ఇంటికి చేరి తిండి, తల్లి నోట్స్ ఏదైనా ప్రిపేర్ చేస్తే చదవడంతో రోజును ముగిస్తుంది.

సరైన ప్రోత్సాహం లేక..
                    ‘‘నా కృషి వెనక నా తల్లిదంవూడులు, మా తాతయ్య డాక్టర్ మల్లేషం శ్రమ, ప్రోత్సాహం ఎంతో ఉంది. ఏదైనా కష్టపడి కాదు, ఇష్టపడి చేయాలంటారు వాళ్లు. అందుకే నాకు అదే అలవాటైంది. వచ్చే సంవత్సరం జర్నలిజంలో పీజీ చేయాలనుకుంటున్నాను. నాన్న నాకోసం అందులో జాయిన్ అయ్యాడు. వచ్చే సంవత్సరానికి నోట్స్ ప్రిపేరేషన్‌కి ఈజీగా ఉంటుంది కదా! చాలామంది తల్లిదంవూడులు కోచింగ్ సెంటర్లలో డబ్బులు కట్టి పిల్లలకి ర్యాంకులు రావడం లేదు, ఆటల్లో పైకి రావడం లేదు అనుకుంటుంటారు. ఎవరికైనా సరైన శిక్షణ కావాలి. అది తల్లిదంవూడులే తీసుకుంటే మరింత బెటర్ అని నా అభివూపాయం. ఏ పని చేసినా ఒక వ్యసనంలా చేయాలన్నది నా పాలసీ. రైటింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వడానికి తండ్రి తోడ్పాటుతో పాటు సచిన్, గంగూలీ, అమితాబ్‌లను ఆదర్శంగా తీసుకున్నాను. వాళ్ళు కూడా ఇలా రెండు చేతులతో రాయగలరు అని తెలిసిన క్షణం నాన్నని అడిగాను.

                          నాన్న కూడా కొందరి దగ్గర సలహాలు తీసుకొని దగ్గరుండి నేర్పించారు. ఎప్పుడూ స్కూల్, కాలేజ్‌కి వెళ్ళలేదు అన్న ఫీలింగ్ లేదు. బయట షికారుకు తీసుకెళ్ళలేదనే బెంగా లేదు. చదువుతున్నంతసేపు నేను కాలేజ్‌లో ఉన్నట్లే ఫీలవుతాను. ఇక టోర్నమెంట్సే నా అవుటింగ్. దేశ, విదేశాలు తిరిగాను. అంతకు మించి ఏం కావాలి? కిరణ్‌బేడీ నాకు రోల్ మోడల్. ఆమెలా ఐపీఎస్ కాదు కానీ ఐఏఎస్ అవ్వాలని ఆశ. సైనా, పుల్లెల గోపీచంద్‌లాంటి వాళ్లు కలిసినప్పుడల్లా బాగా మాట్లాడతారు, ఆటల్లో ఇంకా రాణించాలని చెబుతుంటారు. ఇన్ని సాధించినా.. ఒక్క విషయమే కాస్త బాధ కలిగిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా సింగిల్స్‌లోనూ, అటు డబుల్స్‌లోనూ గుర్తింపు లభించింది. కానీ ఇప్పటి వరకు మన ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయసహకారాలు లేవు. స్టోర్స్‌కోటాలో వచ్చే ఏ బెనిఫిట్స్ పొందలేదు. అలా అని ఏ సంస్థ నాకు స్పాన్సర్‌షిప్ అందించడం లేదు. నాన్న ఇంతకుముందు బిజినెస్ చేసేవారు. కూడబెట్టినవన్నీ నా కోసం, తమ్ముడి కోసం ఖర్చు చేస్తున్నారు. అంతేకాదు.. స్టేడియంలో జిమ్‌కి పర్మిషన్ లేదు. అందుకే డబ్బులు కట్టి వేరేచోట వెళుతున్నాను.

                   ఏపీ టీటీ అసోసియేషన్ మల్టీ టాలెంట్ గల అమ్మాయిగా కనీసం అనౌన్స్ చేయడానికి కూడా సాహసించదు. డ్రాస్ కమిటీలో కూడా నాకు ప్లేస్ లేదు. కేవలం నేను ఈ ప్రాంతానికి చెందిన దాన్ని అనే చిన్న చూపేమో’’ అంటోంది నైనా. ఇన్ని అర్హతలు పెట్టుకొని.. సరైనా ప్రోత్సాహం లభించకున్నా.. ఛాంపియన్‌గా నిలిచిపోవాలనే ఆమె ప్రయత్నం గొప్పది. అందులో ఆమె సఫలం అవ్వాలని ఆశిద్దాం!

మూలం : నమస్తే తెలంగాణ దినపత్రిక

0 Comments

ఈమె పత్రికే ఓ రికార్డు

8/23/2013

0 Comments

 
Picture
                వ్యాపారాలన్నీ మనుషుల అవసరాల నుంచే మొదలవుతాయి. మా 'ఎన్‌ఆర్‌ఐ పల్స్‌' పత్రిక కూడా అంతే. అమెరికాలో భారతీయుల సంఖ్య తక్కువేం కాదు. కొన్ని ప్రాంతాలను చూస్తే అమెరికన్లే భారత్‌కు వలసొచ్చినట్లు కనిపిస్తాయి. మరి సొంతదేశంలో ఉన్నవాళ్లలానే, వాళ్లకూ ఎన్నో సమస్యలుంటాయిగా! వాటిని తీర్చాల్సిన బాధ్యతా అక్కడి ప్రభుత్వానికుంది. కానీ వాళ్ల దృష్టికి అసలు సమస్యల్ని తీసుకెళ్లే వాళ్లెవరు? ఇదే విషయం ఓ స్నేహితుడితో అంటే 'నువ్వు ఓ పత్రికను ప్రారంభిస్తే సమస్య తీరిపోతుంది కదా' అన్నాడు. అతనికి క్షణాల్లో ఆ ఆలోచన వచ్చింది. నేనూ అంతే త్వరగా ప్రారంభించాలని నిర్ణయించుకున్నా. ముందస్తు ప్రణాళిక లేదు. పెట్టుబడికి కావల్సిన డబ్బులూ లేవు. కానీ ప్రజలకు పత్రిక అవసరం ఉంది. అది చాలు వ్యాపారం మొదలుపెట్టడానికి అనిపించింది. అలా 2006లో మా పత్రిక మొదలైంది.

                      భారత్‌లో ఉన్నప్పుడు ఓ ఇంగ్లిష్‌ పత్రికలో చాలా కాలం పనిచేశాను. 2001లో మా స్వస్థలం మంగళూరు నుంచి అమెరికాకు వచ్చాక కూడా విలేకరిగా ఇక్కడ కొన్ని పత్రికల్లో పని చేశా. అలా అట్లాంటా ప్రాంతంలో ఉండే భారతీయులతో పరిచయాలు పెరిగాయి. అవే పత్రిక స్థాపనకు పునాది వేశాయి. కానీ ఇక్కడున్న వనరులతో దినపత్రిక పెట్టి నడపడం కష్టమనిపించింది. అందుకే మాస పత్రికతో మొదలుపెట్టా.

                       అందులో భారతీయులకు చట్ట పరంగా ఎదురయ్యే సమస్యలూ, వీసా చిక్కులూ, చదువుకుంటూ పార్ట్‌టైంగా పనిచేసే వాళ్ల ఇబ్బందులూ, మన పండగలూ, కమ్యూనిటీ కార్యక్రమాలకు సంబంధించిన విషయాలూ, భారతీయులు నడిపే వ్యాపారాలూ, వాళ్ల విజయ గాథలకు సంబంధించిన సమాచారం ఇవ్వాలని ప్రణాళిక వేసుకున్నా. ఇందులోని సమాచారం అమెరికాలో ఉండే భారతీయులకు ఎలా ఉపయోగపడేదీ తెలుగు సమాఖ్యల వారికి వివరించా. దీంతో మొదటి ఎడిషన్‌కు ప్రకటనలను ఇవ్వడానికి కొన్ని సంస్థలు ముందుకొచ్చాయి. కొన్ని అమెరికన్‌ సంస్థలూ ప్రకటనలు ఇవ్వడానికి ఆసక్తి చూపడంతో నా శ్రమ చాలా తగ్గింది. కానీ అమెరికాలో వార్తాపత్రికల జోరు బాగా తగ్గిపోతున్న సమయంలో నేను దీన్ని మొదలుపెట్టా. పత్రికలు చదివే సమయమూ ఎవరికీ ఉండట్లేదు. అందుకే బాగా ఆలోచించి పత్రికను ఉచితంగా అందించాలనుకున్నా. 'అది అయ్యే పని కాదు, బాగా నష్టపోతావ్‌' అని చాలామంది హెచ్చరించారు. అయినా ఆ నిర్ణయానికే కట్టుబడ్డా. ప్రతి నెలా తీసుకొచ్చే పత్రికలో ఇంట్లో వాళ్లందరికీ ఉపయోగపడే సమాచారం ఉంటే కచ్చితంగా దాన్ని చదువుతారన్నది నా నమ్మకం. అదే నిజమైంది. భారతీయ దేవాలయాలూ, రెస్టారెంట్లూ, సూపర్‌మార్కెట్ల లాంటి ప్రాంతాల్లో స్టాండ్లను ఏర్పాటు చేసి పత్రికను అక్కడ ఉంచేవాళ్లం. ఉచితమే కాబట్టి చాలామంది తీసుకెళ్లే వారు. 'చదివి బాగుంది' అంటూ ఫోన్లు చేసేవాళ్లు.

                             పత్రికలో ఇచ్చిన సమాచారం, ప్రకటనల వల్ల వివిధ సంస్థలకు వినియోగదారులు పెరిగారు. దాంతో ప్రకటనలు రావడం ఎక్కువైంది. అదే సమయంలో వ్యాపార, వాణిజ్య సంస్థలకు పత్రికను ఉచితంగా పంపడం మొదలుపెట్టాం. అది చదివి, సర్క్యులేషన్‌ గురించి తెలుసుకుని భారతీయ వినియోగదారులకు చేరువ కావడానికి ఇదొక మార్గం అని వాళ్లూ భావించారు. అయితే ఈ స్థాయి విజయం సాధించడానికి నేను చాలా కష్టపడాల్సి వచ్చింది. నాకు కారు నడపడం అంటే భయం. అయినా ధైర్యం చేసి కారు కొనుక్కుని, పత్రికలను అనేక ప్రాంతాలకు తిరిగి పంపిణీ చేసేదాన్ని.ప్రకటనలు వస్తున్నాయి ఫర్వాలేదు అనుకుంటున్న సమయంలోనే ఆర్థిక మాంద్యం ప్రభావంతో, సంస్థలు ప్రకటనలు ఇవ్వడం తగ్గించాయి. దాన్ని ఎదుర్కోవడానికి ప్రత్యేక ఆఫర్లూ, డిస్కౌంట్లూ ప్రవేశ పెట్టాం. ఎక్కువ మంది ఉద్యోగులను తీసుకోవడానికి విరామమిచ్చి, వార్తల సేకరణ, ఎడిటింగ్‌, పేజీల లేఅవుట్‌ లాంటి కీలక బాధ్యతలను నేనే చూసుకోవడం మొదలుపెట్టా. ఫ్రీలాన్సర్లను ఎక్కువగా నియమించుకున్నా. దీంతో బడ్జెట్‌ అదుపులోకి వచ్చింది. ఈ సమయంలో 'లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌'లో నాకు స్థానం రావడంతో ఇక్కడి భారతీయులకు నా గురించీ, పత్రిక గురించీ తెలిసి సర్క్యులేషన్‌ ఇంకా పెరిగి ... లక్షన్నరకు చేరింది. ఆన్‌లైన్‌లో చదివే వాళ్ల సంఖ్యా ఎక్కువైంది. విదేశాల్లో పత్రికను స్థాపించిన మొట్టమొదటి మహిళగా నన్ను గుర్తిస్తూ, ఆ పుస్తకంలో నాకు స్థానం కల్పించారు. వాళ్ల దగ్గర నుంచి ఉత్తరం అందేవరకూ నేనే ఈ రంగంలో మొదటి మహిళనని నాకూ తెలీదు. ఇప్పుడు అమెరికాలోని వాయువ్య ప్రాంతం మొత్తానికీ మా పత్రిక చేరుతుంది. దేశవ్యాప్తంగా దాన్ని అందుబాటులోకి తేవాలని అనుకుంటున్నా.

మూలం : ఈనాడు దినపత్రిక 

0 Comments
<<Previous

    Author

    నా పేరు సునయన ( ఉరఫ్ నర్మద). సు అంటే "మంచిది" అని, నయన అంటే "నేత్రములు" . సునయన అంటే మంచి కన్నులు కలది అని అర్థం. నా కళ్లతో చూస్తున్న ఈ  మహిళా ప్రపంచాన్ని మీముందు ఉంచాలని, అది మన మహిళాలోకానికి మేలు చేకూర్చాలని ఆశీస్తూ మనలో  ఒక  తెలుగు తరుణిగా నా ఈ చిన్ని ప్రయత్నం. 

    Archives

    January 2014
    December 2013
    November 2013
    October 2013
    September 2013
    August 2013
    July 2013
    June 2013

    Categories

    All
    ఏ అమ్మాయీ అమ్ముడవకూడదన్నదే నా లక్ష్యం
    ఆ మూడేళ్లూ కంటినిండా నిద్రలేదు..
    ఏ ఆడబిడ్డనూ ఇటువైపు రానివ్వను
    ఆటో కుమారి
    వేల మందికి కొత్త జీవితం!
    ఈమె పత్రికే ఓ రికార్డు
    పాత చిత్రాల పోస్టర్లతో ...కొత్త డిజైన్లు
    ఆమె ప్రతిభకు అమెరికా ప్రోత్సాహం
    ఇదొక 'అత్యవసర' సేవ!
    ఖేల్ రత్న కుంజరినీ దేవి
    రజనీ బాలలు
    తొలి మహిళా మంత్రి
    జీవన రాగమే మూగబోయింది
    నవీన వనితకు స్ఫూర్తి ప్రదాత.. శారదా దేవి
    కలలు డిజైన్ చేసుకున్న అమ్మాయి
    ఒంటి కాలితో గెలిచింది!
    వందల మందిని కాపాడింది...
    అడవి తల్లికి ఆడబిడ్డల పహరా
    ఐరాస మెచ్చిన అమ్మాయిలు
    పంటల పాఠాలమ్మ
    వసతి గృహాల్లో 'మనో పాఠాలు'
    సహాజ చిత్రాలతో కొత్త అందాలు
    సాయం చేసేందుకు పత్రిక పెట్టింది!
    జీవన సందేశానికి ఒక్క కుంచె చాలు!
    ధ్యాస
    తరుణీ .. ధిల్లానా !
    నిన్న ఆటో డ్రైవర్.. నేడు లాయర్..!
    అంధుల కోసం పత్రిక
    నృత్య వైభవం
    బుకర్ బరిలో జుంపా
    పాతిక లక్షల నష్టం పాఠాలు నేర్పింది!
    లక్కీ ఛాన్స్
    ఈమెను చూస్తే లోకమే చిన్నబోతుంది
    నెలలు నిండని జ్ఞాపకాలు
    తిండి మారితేనే తరాలు బాగుపడతాయి
    మహిళా సమస్యలపై పోరాటం
    చీకటి జీవితాలకు కొత్త వెలుగు...
    మహిళా సాధికారతే లక్ష్యంగా మన్ దేశీ
    ఖైదీల జీవితాల్లో కాంతిరేఖ
    పక్షి ప్రేమికురాలు
    మహిళా పారిశ్రామికవేత్తలకు స్పూర్తి
    పరుగుల షైనీ
    అందమైన సెల్ కవర్లు ఫేస్ బుక్ లో అమ్మేస్తా!
    అవయవాల పంటకు అక్షర సేద్యం
    అశ్వనీ మలాలా!
    కావ్యా టీచర్...మా బడికి రండి
    విరామం తర్వాత విజేతలయ్యేలా!
    మనసుకు నచ్చిందే చదువు
    సాగులో ఆందెవేసిన చేయి కూతురే కొడుకయింది
    అద్భుత ప్రతిభాశాలి వి.యస్. రమాదేవి
    రొమ్ము క్యాన్సర్‌పై జనచైతన్యం
    సేవలోనూ రాణే
    అనుపమాన కృషి
    కారుణ్య బంధం
    రేసింగ్ బైక్ పై నవతరం అమ్మాయి
    అందులకు అండగా..
    నైనానంద ప్రతిభ
    అక్షరమే అతివకు అండ..
    ప్రపంచం మరువలేని మేడమ్‌ క్యూరీ
    ఉపాధితో వెన్నుదన్ను
    ఆకాశమంత ఆత్మవిశ్వాసంతో ముందడుగు
    సమస్యలను మించి పరుగు
    పరదేశంలో చదువు మనదేశంలో సేవ
    పడిలేచిన కెరటం..!
    రుక్మిణి త్యాగం
    తండ్రిని మించిన తనయ
    రుబ్బుడు చదువులు మనకొద్దు :సుచిస్మిత
    పద్మశ్రీ వారియర్‌
    ఆదివాసుల ఆత్మఘోషకు తొలి కదలిక
    వీరీవీరీ గుమ్మడిపండ్లు
    తెలుగందం... మెరిసింది
    ఆణిముత్యం
    ఎగిరిపోతే ఎంత బాగుందో!
    రికార్డుల రాణి ఎలెనా
    అమ్మలగన్న అమ్మ నరసమ్మ!
    సోనాగచికి కొత్త ఆశాదీపం... ఇషిక!
    వ్యాపారమే జీవితం
    విజయోత్సవ నృత్యం
    ఆత్మరక్షణ పాఠాలతో అండ
    సమాజాన్ని కుంచెతో తట్టిలేపిన ధీర
    హైదరాబాద్ సంస్కృతి అంటే ప్రాణం
    స్వాతంత్య ఉద్యమంలో...మహిళామణులు
    ఆఫ్రికాలో అన్నపూర్ణ...
    పాకిస్తాన్ లో తొలి మహిళా ఫైటర్ పైలట్
    మనోనేత్రమే ఆమె జీవిత నేస్తం
    పాకిస్తాన్ సాహాస బాలిక .. మలాలా
    అంతర్జాతీయ కీర్తి కిరీటం
    మృత్యువునే పరిహసించిన సాహస బాలిక
    తెల్లమ్మాయి 'చెత్తశుద్ధి'
    కెమెరాఉమెన్ మల్లీశ్వరితో…
    ఆత్మవిశ్వాసం
    స్వధార్‌హోమ్ వంచితులకు ఆసరా
    ప్రశ్నిస్తేనే ప్రపంచం తెలిసేది...
    కాల్పనికకథలతో ఓలలాడించిన కలం
    1f435d7218
    24050e4082
    245c28fe88
    261cdb5043
    2818b63e80
    28389ca502
    2b0e1c1639
    2fa703fa92
    అంచెలంచెలుగా ఎదిగిన మహిళ: పాక్ విదేశాంగమij
    ఎన్నారై భర్తతో గెంటివేయబడ్డ కోమల్ ప్రవీణ
    హార్వార్డ్ లో భారతీయ తొలి మహిళా ప్రొఫెసరĺ
    31c13c6389
    3554a3419a
    35656ad80d
    55a74999b9
    5780c63669
    57c51a6293
    581f19c0c8
    596314788a
    5b25932644
    601df7f45e
    6038f96c83
    60bb50a07e
    6ac90962a4
    6acc2723b8
    6eceeac0ef
    72a7da41c2
    88cfd59ee5
    994726a014
    A2999c254a
    A31cb50ffd
    A90748427f
    Aaf6b495b5
    B68abb9e8a
    B72ae5d725
    C08f40206b
    E88f0055d9
    F3fc20019d
    F85bffc883
    F9ded65a21
    Fbb115455d
    Fcf7a2fc59
    Freedom Fighter Laxmi Sehgalpng5013f7c557

    RSS Feed


Powered by Create your own unique website with customizable templates.