telugutaruni.weebly.com
  • Home
  • వంటకాలు (Cookeries)
    • ఫలహారాలు (Tiffins)
    • శాకాహారం (Veg)
    • బియ్యపు వంటలు (Rice items)
    • మాంసాహారం (Non-Veg)
    • పచ్చళ్ళు (chutneys)
    • వడియాలు
    • పండ్ల రసాలు (Juices)
    • స్వీట్స్ (Sweets)
    • చిరుతిళ్ళు (Snacks)
    • గ్రేవీ ఐటమ్స్
    • సూప్స్ (Soops)
    • కొత్త కొత్తగా
  • చిట్కాలు (Tips)
    • వంటింటి చిట్కాలు ( Kitchen Tips)
    • ఆరోగ్య చిట్కాలు (Health Tips)
    • సౌందర్య చిట్కాలు (Beauty Tips)
  • మహిళా లోకం
    • ఆదర్శ మహిళలు
    • శభాష్ మహిళా..
  • విహారయాత్ర

అందులకు అండగా..

9/28/2013

0 Comments

 
Picture
                       'జీవితంలో అన్ని సమస్యలూ పరీక్షించడానికే వస్తాయి. ఏవీ కూడా చనిపోయేంత పెద్దవి కావు' అని తన స్కూళ్లో చదివే పిల్లలకు తరచూ చెబుతుంటుంది బెర్తా ధికర్‌. ఆమె జీవితానుభవం నుంచి చెప్పే పాఠమే అది. భవిష్యత్తులో ఏమవుతుందో ముందే తెలిస్తే, అంతకంటే నరకం మరోటి ఉండదు. కొన్నేళ్ల క్రితం బెర్తా పరిస్థితి కూడా అలాంటిదే. డిగ్రీ చదివేప్పుడు తనకు క్రమంగా కంటిలోపలి రెటినాను తినేసి చూపుపోయేలా చేసే 'రెటినైటిస్‌ పిగ్మెంటోసా' అనే వ్యాధి ఉన్నట్లు తెలిసింది. ఆ వ్యాధిని తగ్గించడం ఎవరి వల్లా కాలేదు. అంత మాత్రాన నిరాశపడి ఖాళీగా కూర్చోలేదు. 'పూర్తిగా చూపు పోయినప్పుడు చూసుకుందాం. ఇప్పుడైతే చదవగలుగుతున్నా కదా' అని ధైర్యంగా పీజీలో చేరింది. కానీ వ్యాధి తన పని తాను చేసుకుపోవడంతో పీజీ సగంలో ఉండగానే ఆమె చూపును పూర్తిగా కోల్పోయింది.

                       ఆ పరిస్థితికి మానసికంగా ముందే సిద్ధపడటంతో, దాన్ని ఎదుర్కోవడం ఆమెకు పెద్ద కష్టం కాలేదు. పీజీ పూర్తయ్యాక ఉద్యోగాల వేటలో పడింది. అసలు సమస్య మొదలైంది అప్పుడే. చూపులేని వాళ్లు ఎలా పనిచేస్తారంటూ ఎవరూ ఉద్యోగం ఇవ్వలేదు. దీంతో వీధివీధి తిరిగి పచ్చళ్లూ, జామ్‌లూ అమ్మడం మొదలుపెట్టింది. మరోవైపు చిన్నప్పట్నుంచీ చూపులేని వాళ్లు అసలు చదువుకోవడమే కష్టం కదా అన్న ఆలోచనలు ఆమెను వేధించేవి. ఎన్నో నెలలు కష్టపడి తనుంటోన్న మేఘాలయలో వాడుక భాష అయిన ఖాసీలో బ్రెయిలీ కోడ్‌ని సృష్టించింది. దాని ద్వారా వచ్చిన డబ్బుతో అంధుల కోసం ఉచిత స్కూల్‌ను మొదలుపెట్టింది. ఇప్పుడా స్కూల్‌లో నూటయాభైకి పైగా చిన్నారులు చదువుకుంటున్నారు.

                       తన లాంటి వాళ్లకోసం ఆమె చేస్తోన్న కృషికి గుర్తింపుగా పద్మశ్రీ, సీఎన్‌ఎన్‌ రియల్‌ హీరోస్‌ అవార్డులతో పాటూ మరెన్నో పురస్కారాలను అందుకుంది. అలాంటి వాటి ద్వారా వచ్చిన డబ్బుతో పాటూ తెలిసిన వాళ్ల సహాయంతో ఎన్నో ఏళ్లుగా స్కూల్‌ను విజయవంతంగా నడిపిస్తోంది.

0 Comments

సాధనా గానామృతం

9/28/2013

0 Comments

 
Picture
శాస్ర్తీయ సంగీతమంటే ఆసక్తితో చిన్నప్పుడే ప్రారంభించిన ‘సాధన’
తొలిపాట ‘జాన్‌ బాజ్‌ ’లో ‘హర్‌ కిసీకో నహీ మిల్తా’ సూపర్‌ హిట్‌
మున్నాలో ‘మనసా’ పాటతో తెలుగులో మంచి గుర్తింపు
ఇళయరాజా, ఏ.ఆర్‌.రెహ్మాన్‌ వంటి దిగ్గజాలతో పనిచేసే అవకాశం
2002 జాతీయ ఉత్తమ గాయనీ అవార్డు... ఫిలింఫేర్‌ అవార్డులు


ఆమె స్వరం విన్నవారికి స్వర్గం నుంచి ఇంపోర్ట్‌ చేసుకున్న ఓ మధుర ఫలం తిన్న అనుభూతి కలుగుతుంది. అమృతం సేవించిన ఆనందం కలుగుతుంది. తీయని స్వరంతో పాటకు ప్రాణం పోసే సాధనా సర్గం గురించి ఆమె పాటలే నిర్వచిస్తారుు. మున్నా చిత్రంలో పాపులర్‌ సాంగ్‌ ‘మనసా..నువ్వుండే చోటే చెప్పమ్మా’ అంటూ కురక్రారు హృదయంలో నేటికీ మోగుతున్న స్వరం ఆమెది. శంభో శివ శంభోలో ‘కనుపాపల్లో ప్రేమ’ వంటి ఎన్నో ఆణిముత్యాల్లాంటి పాటలు ఆలపించి తెలుగువారికి సుపరితమైన సాధనా సర్గం గురించి ఈరోజు..

ప్రొపైల్‌

పూర్తి పేరు         : సాధనా సర్గమ్‌
పుట్టిన తేది        : మార్చ్‌ 14,
జన్మ స్థలం         : మహా రాష్ట్ర
వృత్తి                  : నేపథ్య గాయని
ప్రత్యేకతలు         : ప్లేబ్యాక్‌ సింగింగ్‌,
                          శాస్త్రీయ,
                          ఆధ్యాత్మికసంగీతం
కెరీర్‌ ప్రారంభం   : 1982
తొలి పాట         : విధాత
పాడిన భాషలు  : తెలుగు ,హిందీతో,
                 మరాఠీ, తమిళం,
                 కన్నడభాషల్లో 
                 పాడారు.

             
శాస్ర్తీయ సంగీతంలో ప్రావీణ్యం గడించాక సాధన తల్లి ఆమెను అనిల్‌ మోహిల్‌ అనే ఒక కంపోజర్‌ను పరిచయం చేయించింది.దాంతో ఆమెకు చిన్నప్పుడే పాడే అవకాశం వచ్చింది.1982లో సాధన ‘విధాత’ అనే చిత్రంలో పాడి తన కెరీర్‌ను ప్రారంభించింది. జాన్‌ బాజ్‌ చిత్రంలో సాధన పాడిన ‘హర్‌ కిసీకో నహీ మిల్తా’ అనే పాట మంచి పాపులారిటీను సంపాదించింది. నేటికీ ఆ పాటను విన్న వారు మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటారు. తరువాత ‘మైసే మీనా సే’, ‘లోగ్‌ కహ్తె హే’ అనే పాటలను ఆమెకు మరింతగా గుర్తింపును తీసకు వచ్చాయి.త్రిదేవ్‌ చిత్రంలో ‘మై తేరి మోహబ్బత్‌ మే’, ‘గజర్‌ నే కియా ఇషారా’ వంటి పాటలు సంగీతాభిమానులను అలరించాయి. 90 దశకంలో సాధన మంచి నేపథ్యగాయనిగా గుర్తింపు పొందింది.

స్వర సేవలో..
               కెరీర్‌ తొలి దశలో ఆమె పాడిన పాటలు తక్కువే అయినా అవి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి.కేవలం నేపథ్య గీతాలనే కాకుండా ఆధ్మాత్మిక గీతాలను కూడా అలపించి సంగీతానికి సేవ చేసింది.తన దైన శైలిలో పాడి పాటకు జీవం పోసే గాయని సాధన. సాధన పాడిన పాటలలో రోమాంటిక్‌ టచ్‌ ఉన్న పాటలే అధికం.అంతే కాకుండా ఆమె ఎన్నో రంగస్థల ప్రదర్శనలిచ్చి సంగీత ప్రియులను అలరించింది. ఏ.ఆర్‌.రెహ్మాన్‌తో కలిసి ఇచ్చిన స్టేజ్‌ షో హైలైట్‌గా నిలించింది.

మేస్ట్రోతో...
                 సాధన తన కెరీర్‌లో అత్యధిక పాటలు హిందీలోనే పాడగా దేశంలోని వివిధ భాషల్లో ప్రధానంగా దక్షిణాది చిత్రాలలో ఎన్నో మధురమైన పాటలను పాడింది. సంగీత దర్శకుడు ఏ. ఆర్‌.రెహ్మాన్‌ కోసం తెలుగు, తమిళం, హిందీ చిత్రాలలో అనేక పాటలను ఆలపించింది.రెహ్మాన్‌ చిత్రం ‘వారియర్స్‌ ఆఫ్‌ హెవెన్‌ అండ్‌ ఎర్త్‌’ చిత్రంలో పాడి అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించింది.రెహ్మన్‌తో పాటు అమె మేస్ట్రో ఇళయరాజా కోసం అనేక పాటలు పాడటంతో పాటు అనేక మంది సంగీత దర్శకులతో కలిసి పని చేశారు. అందులో ఏ.ఆర్‌.రెహ్మాన్‌,హిమేష్‌ రేషమ్యా, ఇళయరాజ, శంకర్‌-ఎహాసాన్‌-లాయ్‌, యువన్‌ శంకర్‌ రాజా, రాజేష్‌ రోషన్‌, ఆర్పీ. పట్నాయక్‌, చక్రీ వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. అంతేకాకుండా కె.జే. యేసుదాసు, బాలసుబ్రహ్మణ్యం, కుమార్‌సాను, హరిహరన్‌ వంటి ప్రముఖ సింగర్స్‌తో కలిసి ఎన్నో యుగళ గీతాలను అలపించింది..

తెలుగులో..
              ప్రభాస్‌ కథానాయకుడిగా ‘మున్నా’ చిత్రంలో ‘మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా’ అనే పాట యూత్‌ను ఎంతగా అలరించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.ఈ పాటను పాడింది సాధన సర్గమే. అంతే కాకుండా హోలీ చిత్రంలో ‘చెలియా చెలియా’ పాటలో ఆర్పీ. పట్నాయక్‌తో లిసి పాడారు. సంక్రాంతి చిత్రంలో ‘ఎలా వచ్చెనమ్మా’, స్టాలిన్‌లో ‘సిగ్గుతో చీచీ’ వంటి పాటలను పాడింది. సిద్ధార్థ్‌, తమన్నాల జంటగా ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ లో ‘పంచీరే పంచీరే’ పాటను పాడింది.

తెలుగులో టాప్‌ - 5

పాట             చిత్రం  
చెలియా చెలియా     హోలి
బాబా నీకు బాబా
మనసా           మున్నా
పంచీరే పంచీర       కొంచెం ఇష్టం కొంచెం కష్టం
కనుపాపల్లో ప్రేమా    శంభో శివ శంభో

అవార్డులు

  • 2002లో జాతీయ ఉత్తమ గాయనీ అవార్డు
  • 2 సార్లులో ఫిలింఫేర్‌ ఉత్తమ గాయనీ అవార్డులు
  • జీ సినిమా ఉత్తమ గాయనీ అవార్డు విజేత
  • స్టార్‌ స్క్రీన్‌ ఉత్తమ గాయనీ అవార్డు

వంటి అవార్డులు.. మరెన్నో గౌరవాలనందుకున్నారు.


0 Comments

సహాజ చిత్రాలతో కొత్త అందాలు

9/27/2013

0 Comments

 
Picture
                   సాధారణ వ్యక్తి కూడా సులభంగా అర్థం చేసుకునేలా చిత్రాలను గీయడం ఆమె ప్రత్యేకత.నిజానికి ప్రాంతీయతకు దర్పమైన కళారూపం ఏదైనా తన ప్రస్థానాన్ని మరింత విజయవంతంగా కొనసాగిస్తుంది. చిత్రకారుడు ఏం ఫీలవుతాడో అదే కాన్వాస్‌పై వాలుతుంది. కొన్ని సార్లు ఒక థీవ్గును ఎంచుకుని కూడా పెరుుంటింగ్‌ ఉంటుంది. ప్రతీ కళాఖండానికి థీవ్గు ఉంటుందనేది మరో వాదన. ఏదేమైన కళాకారుడి ఆంతరంగిమై చిత్రకళకు ఆది. అర్పిత కూడా తన పెరుుంటింగ్స్‌లో వివిధ రకాలైన థీవ్గ్సును ప్రదర్శించే వారు. 1990 తరువాత అర్పిత పెరుుంటింగ్స్‌ను అనేక జాతీయ , అంతర్జాతీయ స్థారుులో ప్రదర్శించింది. అందుకు గుర్తింపుగా అమెకు ‘పద్మభూషణ’్‌ అవార్డు కూడా లభించింది.

ప్రొఫైల్‌

పూర్తి పేరు         : అర్పితా సింగ్‌
పుట్టిన సంవత్సరం    : 1937
ప్రస్తుత నివాసం      : కొత్త ఢిల్లీ
భర్త             : పరంజీత్‌ సింగ్‌ (పేయింటర్‌)
కూతురు          : అంజుమ్‌ సింగ్‌ (కళాకారిణి)
వృత్తి             : పెయింటర్‌
ఆవార్డులు         : ‘పద్మభూషణ్‌ ’ (2011)

                  అర్పిత సింగ్‌ ఒక పెయింటర్‌ అనే విషయం పక్కన ఉన్న పెయింటింగ్స్‌ బట్టి తెలుస్తుంది. కాని అర్పిత గురించి తెలుసు కోవాల్సిన ఆసక్తి కరమైన విషయాలు చాలా ఉన్నాయి.ఆమె పెయింటింగ్‌ ‘విష్‌ డ్రీమ్‌’ 9 కోట్ల 60 లక్షలు పలికిందంటే అమె పెయింటింగ్స్‌కు అంతర్జాతీయ స్థాయిలో ఎలాంటి పాపులారిటి ఉందో అర్థం చేసుకోవచ్చు. అమె చిత్ర కళా ప్రతిభను గుర్తించి భారత ప్రభుత్వం భారత పౌరులకు అందించే అత్యున్నత పురస్కారలలో ఒకటైన ‘పద్మభూషణ్‌’తో గౌరవించింది. అర్పిత భర్త ప్రఖ్యాత చిత్రకారుడైన ‘పరంజీత్‌ సింగ్‌’ . వారి కూతురు ‘అంజుమ్‌ సింగ్‌’ కూడా చిత్ర కళలో ప్రవేశం ఉంది.

పెయింటింగ్‌పై ఆసక్తి కలిగిందిలా...
                       అర్పితా సింగ్‌ పశ్చిమ బెంగాల్‌లో 1937లో జన్మించారు. చిన్న నాటినుంచే అర్పితకు చిత్రకళ అంటే అమితాసక్తి ఉండేది. ఢిల్లీలోని పాలిటెక్నిక్‌ కళశాలలో స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్‌‌స విభాగంలో చిత్రకళలో ఓనమాలు నేర్చుకున్నారు. 1954 నుంచి 1959 వరకు సాగిన ఈ కోర్సులో చిత్రకళా వాతావరణం అర్పితలోని చిత్రకళాకారిణిని మేల్కోలిపింది.గ్రాడ్యువేషన్‌ పూర్తయ్యాక భారత ప్రభుత్వ ఇండస్ట్రీస్‌ రెస్టారేషన్‌ ప్రోగ్రామ్‌లో ఉద్యోగం చేసింది. ఈ సమయంలోనే అనేక మంది సంప్రదాయ కళాకారులను, నేత వృత్తికారులను లిసే అవకాశం కలిగింది.అమె జీవితంపై ప్రభావం చూపిన అంశాలలో ఇదే ప్రధానం.1970 మధ్యలో ఆమె గీసిన చిత్రాలు ప్రధానంగా నలుపు , తెలుపు రంగులతో అలరించేవి. సింపుల్‌గానే ఉంటూ ఆలోచింపచేయడం అర్పిత కళాఖండాల ప్రత్యేకత.

అంతర్జాతీయ ప్రఖ్యాతి
                       1990 తరువాత అర్పిత గీసిన చిత్రాలకు మంచి పాపులారిటీ వచ్చింది. సాధారణ వ్యక్తి కూడా సులభంగా అర్థం చేసుకునేలా చిత్రాలను గీయడం ఆమె ప్రత్యేకత.నిజానికి చిత్రకళ అనేది అందరికీ అర్థం అయ్యేలా ఉంటే తన ప్రస్థానాన్ని మరింత విజయవంతంగా కొనసాగించవచ్చు. అయితే ఇది ఒక చిత్రకారుడికీ మరో చిత్రకారుడికీ మధ్య ఉన్న ప్రత్యేకత. చిత్రకారుడు ఏం ఫీలవుతాడో అదే కాన్వాస్‌పై వాలుతుంది. కొన్ని సార్లు ఒక థీమ్‌ను ఎంచుకుని కూడా పెయింటింగ్‌ ఉంటుంది. ప్రతీ కళాఖండానికి థీమ్‌ ఉంటుందనేది మరో వాదన కూడా. ఏదేమైన కళాకారుడి ఆంతరంగిమై చిత్రకళకు ఆది. అర్పిత కూడా తన పెయింటింగ్స్‌లో వివిధ రకాలైన థీమ్స్‌ను ప్రదర్శించే వారు. 1990 తరువాత అర్పిత పెయింటింగ్స్‌ను అనేక జాతీయ , అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శించింది. అందుకు గుర్తింపుగా అమెకు ‘పద్మభూషణ’్‌ అవార్డు కూడా లభించింది.

టర్నింగ్‌ ‘పెయింట్‌’

                  అర్పితా సింగ్‌ మాత్రమే కాదు సాటి మహిళా కళాకారులు కూడా పీకల్దాకా హ్యాప్పీగా ఫీలైంది ఎప్పుడో తెలుసా? అర్పిత గీసిన ‘విష్‌ డ్రీమ్‌’ అనే పెయింటింగ్‌ ఏకంగా 9 కోట్ల 60 లక్షలు (2.24 మిలియన్‌ అమెరికన్‌ డాలర్లు) పలికినప్పుడు.సాఫ్రాన్‌ ఆర్ట్‌ ఆన్‌లైన్‌ వేలం పాటలో 2010లో ఈ చిత్రాన్ని ఒక కళాభిమాని సొంతం చేసుకున్నాడు. దీంతో దేశంలోనే ఈ స్థాయిలో పాపులారిటీ ( వేలం పాటలో విజయం) సాధించిన తొలి మహిళా చిత్రకారిణిగా అర్పితా రికార్డు సృష్టించారు.అయితే ఈ సందర్భంలో అర్పితా మాట్లాడుతూ ‘ కళాకారుడు వేలం పాటను దృష్టిలో ఉంచుకుని చిత్రాలను గీయరు. అయితే చిత్రకళకు నేటికీ ఇంత ఆధరణ ఉండటమనేది నిజంగా హర్షించదగ్గ విషయం.’ అని తెలిపారు.

భారతీయ మగువల మానస చిత్రం...
                1980లో అర్పిత బెంగాలీ జనపద దృశ్యాలను పెయింటింగ్‌గా మలచడం ప్రారంభించింది.ఈ పెయింటింగ్స్‌ను మహిళనే ప్రధానంగా చేసుకుని చిత్రించే వారు.ఆమె చిత్రాలలో అధిక శాతం గృహిణీ స్త్రీలు తమ పని చేసుకునే విధానాన్ని...వారు ఇంటి పనులలో ఉన్నప్పుడు ఉన్న సందర్భాన్ని చిత్రీకరించే వారు.ఈ కోణంలో చిత్రాలను గీసి మహిళల అభిమానాన్ని సొంతంచేసుకున్నారు. ప్రారంభంలో భారత సంప్రదాయ చిత్రకళా విధనమైన వాటర్‌ కలర్స్‌ను వినియోగించి పేపర్‌పై పేయింటింగ్స్‌ వేసే వారు.1990 నుంచి అర్పిత సింగ్‌ ఆయిల్‌ పెయింటింగ్‌ వేయడం ప్రారంభించారు. అమె చిత్రాలలో స్ర్తీలను సహజంగా చూపించేవారు. అర్పితా పెయింటింగ్‌లను భారతీయ మగువల మానసచిత్రంగా అభివర్ణిస్తారు.

అవార్డులు
  • పద్మభూషణ్‌ (2011) తో భారత ప్రభుత్వం అమెను సత్కరించింది.
  • పరిషద్‌ సమ్మాన్‌(1991) తో సాహిత్య కళా పరిషద్‌ సత్కరించింది.
  • అల్జేరియా బైనియల్‌ (1987)తో అల్జేరియా ప్రభుత్వం గౌరవించింది.
  • అఖిల భారత చిత్రకళా పోటీ విజేత (1981,1992)

Picture
0 Comments

పాతిక లక్షల నష్టం పాఠాలు నేర్పింది!

9/27/2013

0 Comments

 
               గెలిచినప్పుడు... ప్రపంచమంతా వెంట ఉంటుంది. ఎటు చూసినా వెలుగే కనిపిస్తుంది. ఓడిపోయినప్పుడు... ఒంటరితనమే తోడుంటుంది. చుట్టూ చీకటి కమ్ముకుంటుంది. రెండుసార్లు అనుకున్నది సాధించాలనే ఆరాటంలో ఘోరంగా కుప్పకూలిపోయిన స్వప్నదీ ఒకప్పుడు అదే పరిస్థితి. కలిసి రాని వ్యాపారాలు లక్షల్లో నష్టాన్ని మిగిల్చాయి. ఆశల్ని ఆవిరి చేశాయి. అయినా అధైర్యపడకుండా పట్టుదలగా మరో ప్రయత్నం చేసిన ఆమె, వ్యాపార విజయం సాధించింది. రోజుకి నాలుగొందల గ్లాసుల చెరకు రసాన్ని అందించే కేన్‌ కోక్‌ మెషీన్ల తయారీతో నిలదొక్కుకుంది. కడుపు నింపుకోవడానికి కూడా డబ్బుల్లేని పరిస్థితి నుంచి కోటి టర్నోవర్‌ స్థాయికి ఎదిగిన తీరుని ఇలా చెబుతోందామె.గా చదువుకోవాలి... కానీ ఉద్యోగంలో చేరకుండా సొంతంగా ఏదయినా వ్యాపారం చేయాలన్నదే చిన్నప్పట్నుంచీ నా ఆలోచన. కానీ ఆ దారిలో నడక ప్రారంభించాక అది అనుకున్నంత సులువు కాదని నాకు అర్థమైంది.

                        నేనూ ఓడిపోవాలనుకోలేదు. ఆర్థిక సమస్యలూ, అప్పుల వేదనలూ, ఆకలి మంటలూ, ఆత్మహత్య ఆలోచనలూ... అన్నిటినీ అధిగమించాను. కొందరు స్నేహితులూ, బంధువులూ మా ముఖం చూడ్డానికి కూడా ఇష్టపడలేదు. 'హాయిగా ఉద్యోగం చేసుకోక లేనిపోని ప్రయోగాలెందుకు' అని విమర్శించారు. ఈ మాటలన్నిటినీ సానుకూలంగానే తీసుకున్నా. ఎలాగయినా అనుకున్నది సాధించాలని రెండేళ్ల పాటు కష్టపడ్డాను. దాని ఫలితంగానే ఈ రోజు 'కేన్‌ కోక్‌'ల తయారీ పరిశ్రమలో నిలదొక్కుకోగలిగాను. ఇప్పుడు మా సంస్థ టర్నోవరు కోటి రూపాయలకు దగ్గర్లో ఉంది. ఉత్త చేతులతో హైదరాబాద్‌ వచ్చి సాధించిన ఈ విజయం వెనక నిద్రలేకుండా పస్తులతో పడుకున్న రాత్రులున్నాయి.లక్షల నష్టం...

                           మాది గుంటూరు జిల్లాలోని ఖమ్మంపాడులో ఓ వ్యవసాయ కుటుంబం. చదువు మీద ఆసక్తితో బీఎస్సీ కంప్యూటర్స్‌ పూర్తి చేశాను. కానీ వ్యాపారంలో మెలకువలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఎంబీఏ చేశా. మా గ్రామంలో పీజీ చేసిన మొదటి అమ్మాయిని నేనే. చదువయ్యాక అవగాహన కోసం హైదరాబాద్‌లోని ఓ సంస్థలో హెచ్‌ఆర్‌గా చేరా. కొన్నాళ్లకు నష్టాలు రావడంతో దాన్ని మూసేశారు. అక్కడున్నప్పుడే సహోద్యోగితో పరిచయం ప్రేమగా మారింది. పెద్దవాళ్లకు చెప్పి పెళ్లి చేసుకున్నాం. సొంతంగా ఏదయినా చేయాలన్న నా ఆలోచనకు మా వారి ప్రోత్సాహం లభించింది.

                     అప్పుడే పాఠశాలలో పిల్లల హాజరూ, వారు బడికి రాగానే ఆటోమేటిగ్గా తల్లిదండ్రులకు ఎస్సెమ్మెస్‌లు వెళ్లేలా ఓ సాఫ్ట్‌వేర్‌ను తయారు చేశాను. ఈ సాఫ్ట్‌వేర్‌ ఆలోచన నచ్చడంతో చాలా పాఠశాలలు తీసుకోవడానికి ముందుకొచ్చాయి. దాంతో కొంతమంది సిబ్బందిని నియమించుకుని, స్కూళ్లలో సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్‌ చేశాం. కానీ నిర్వహణలో లోపాలతో ఆ సాఫ్ట్‌వేర్‌ ఉపయోగాలను పూర్తిగా పొందలేకపోయారు. దాంతో చాలా స్కూళ్లు ఆర్డర్లు వెనక్కి తీసుకున్నాయి. ఆఫీసూ, కంప్యూటర్ల అద్దె, ఉద్యోగుల జీతాలూ... అన్నీ కలిపి కొన్ని లక్షల రూపాయలు నష్టపోయాం. ఇంటాబయటా అందరికీ మా మీద నమ్మకం పోయింది. మాకు మాత్రం... మళ్లీ ఏదయినా చేసి, అందరి ముందూ గర్వంగా నిలబడాలనే కసి మొదలైంది.

                       సరిగ్గా అప్పుడే రిసార్ట్స్‌ ఆలోచన వచ్చింది. నీళ్లలో వెదురుతో కాటేజీలు నిర్మించి... ఆధునిక సౌకర్యాలు అందిస్తే ఆదరణ, ఆదాయం పొందగలం అనుకున్నాం. ఇంట్లో వాళ్లకి చెబితే అసలు ఒప్పుకోలేదు. 'హాయిగా ఉద్యోగం చేసుకోండి... మీరు బాధపడి, మమ్మల్ని బాధపెట్టకండి' అన్నారు. వినలేదు. ఈసారి ఎలాగయినా కలిసొస్తుంది అని ఒప్పించాం. మా నాన్నా, మావగారూ ఇంట్లో బంగారమంతా తాకట్టు పెట్టి డబ్బిచ్చారు. అరకులో నాలుగెకరాల పొలం కొని పనులు ప్రారంభించాం. ప్రాజెక్టు మొదలయ్యే లోపే మరో దెబ్బ. మేం కొన్న స్థలం మరో వ్యక్తి పేరు మీదా రిజిస్టరై ఉందని తెలిసింది. కాటేజీల నిర్మాణం ఆపమని అతను గొడవ. కేసు కలెక్టర్‌ దాకా వెళ్లింది. వాస్తవాలు తేలేవరకూ పనులు ఆపమని అధికారులు ఆదేశించారు. ఆర్థికంగా మళ్లీ నష్టం. ఈ రకంగా మొత్తమ్మీద పాతిక లక్షల నష్టంతో అప్పుల్లో కూరుకుపోయాం. ఇంట్లో వాళ్ల ముందు తలెత్తుకోలేకపోయాం. ఎక్కడా కలిసి రావట్లేదనే బాధ ఒకవైపు. చదువుకుని కూడా అవగాహన లేకుండా అడుగు వేశామనే బాధ మరోవైపు. ఒకానొక సమయంలో ఆత్మహత్య గురించీ ఆలోచించాను. అయితే అప్పటికి నాకు ప్రసవమై మూడు నెలలు. పసి పాప కోసమైనా బతకాలనిపించింది.

                   ఛార్జీలకు కూడా డబ్బుల్లేని పరిస్థితుల్లో నాన్న అప్పు చేసి హైదరాబాద్‌ పంపించారు. ఆయనిచ్చిన డబ్బులతో కొన్నాళ్లు గడిపాం. తరవాత కొన్నాళ్లు తినీతినకా నిమ్మరసంతో కడుపు నింపుకున్నాం. పెద్దవాళ్లకి విషయాలు తెలిస్తే బాధపడతారని ఉద్యోగం చేస్తున్నామని అబద్ధం చెప్పాం. సరిగ్గా ఆ సమయంలోనే ఈనాడు ఆదివారం అనుబంధంలో చెరకు రసం యంత్రంతో బెంగళూరులోని కొందరు కోట్లలో టర్నోవర్‌ సాధిస్తున్నారని చదివాను. నేను కూడా అలాంటి వాటిని ఆధునికంగా తయారు చేసి మార్కెటింగ్‌ చేయొచ్చనిపించింది. మా దగ్గరి బంధువొకరు సాంకేతికంగా మద్దతివ్వడానికి ముందుకొచ్చాడు. ఈసారి తొందర పడలేదు. పూర్తిగా అవగాహన వచ్చాకే ఆచరణలో పెడదామనుకున్నాం. చాలామంది మేం మళ్లీ వ్యాపారం చేయబోతున్నాం అని తెలిసి ఆశ్చర్యపోయారు. కొందరు మాత్రం మా పట్టుదలకు మెచ్చుకొని ఆర్థికసాయం చేయడానికి ముందుకొచ్చారు.విఫలమయ్యాక విజయం...అసలు బయట చెరకు రసానికి ఎంత ప్రాధాన్యం ఉంది. ఎలాంటి ప్రాంతాల్లో దాన్ని అమ్ముతున్నారో తెలుసుకున్నాం. హైదరాబాద్‌లో కార్పొరేట్‌ తరహాలో అవుట్‌లెట్లు తెరిచి బాగా సంపాదిస్తున్న వారూ కనిపించారు. కానీ ఆ యంత్రాలు అత్యాధునికమైనవి కావు. అవి చూసి కొత్తగా ఎలాంటి మెషీన్లు తయారుచేయగలమా అని ఆలోచించా.

                      చెరకు గెడ నుంచి పూర్తిస్థాయిలో రసం తీసి, చల్లబరిచి.. సెకన్లలో నచ్చిన రుచిలో బయటికొచ్చే యంత్రాన్ని తయారుచేయాలనుకున్నా. చెరకు రైతులకు ఇదే విషయాన్ని చెబితే చాలామంది యంత్రాలను తీసుకొని చెరకు రసం అమ్మడానికి ఆసక్తి చూపించారు. తక్కువ స్థలంలో యంత్రం అమర్చడానికి వీలుగా తయారు చేస్తే కిరాణా షాపులూ, బేకరీలూ, జిరాక్స్‌ సెంటర్లూ... ఇలా ఎక్కడైనా పెట్టుకోవచ్చనే ఆలోచన వచ్చింది. చిన్న చిన్న వ్యాపారులతో మాట్లాడితే, మేం కొంటామని హామీ ఇచ్చారు. ఆత్మవిశ్వాసం పెరిగింది. అధ్యయనం చేసి, నిపుణులతో మాట్లాడి, సాంకేతిక సాయం పొంది... మొదట ఒక డమ్మీ యంత్రాన్ని తయారు చేశాం. దాన్నుంచి రసం పూర్తి స్థాయిలో రాలేదు. కొంత నిరాశ. మరో యంత్రాన్ని తయారు చేశాం. అదీ ఫెయిల్‌. ఇలా నాలుగు డమ్మీలను తయారు చేస్తే చివరిది అనుకున్న ఫలితాన్నిచ్చింది.

                   ఇదంతా పూర్తయ్యేప్పటికి పద్నాలుగు నెలలు పట్టింది. చాలా ఖర్చయ్యింది. ఆరు సెకన్లలో కేజీ చెరకు నుంచి ముప్పావు లీటరు రసం వచ్చింది. టచ్‌ స్క్రీన్‌ సాయంతో చెరకు రసం తీసుకునే ఏర్పాటూ చేశాం. అన్ని పరిశీలనలూ పూర్తయ్యాక ఈ ఏడాది ఏప్రిల్‌లో 'కేన్‌ కోక్‌' పేరుతో మా ఉత్పత్తి బయటికొచ్చింది. దీనితో రోజుకు నాలుగొందల కప్పుల్ని అమ్మొచ్చు. యంత్రం డిజైన్‌ను బట్టి లక్ష నుంచి రెండున్నర లక్షల వరకూ ధర ఉంటుంది.నేను ఆలోచనలు చెబితే, టెక్నికల్‌గా మా బంధువు సాయిబాబా యంత్రాన్ని డిజైన్‌ చేశారు. మేం ఈ విజయం సాధించడానికి మా అడపడుచూ, స్నేహితులూ పెట్టుబడికి కావల్సిన పద్దెనిమిది లక్షలు ఆందజేశారు. యంత్రాల విడిభాగాల తయారీ నుంచి అన్నీ మేమే తయారు చేయడం మొదలుపెట్టాం. వైజాగ్‌, విజయవాడ, మెదక్‌, హైదరాబాద్‌లో కొన్ని మెషీన్లను అమ్మాం. మన రాష్ట్రంతో పాటూ మధ్యప్రదేశ్‌, బెంగళూరు, చెన్నై, మహారాష్ట్రల నుంచి 80 దాకా ఆర్డర్లు వచ్చాయి. మాకు ఇప్పుడు చేతినిండా పని ఉంది.

                         సాఫ్ట్‌వేర్‌ సంస్థల్లో పని చేసే కొందరు ఉద్యోగులు అవుట్‌లెట్లను తెరవడానికీ మమ్మల్ని సంప్రదించారు. ఒక్కో యంత్రం తయారీకి ఇరవై రోజుల సమయం పడుతుంది. ప్రస్తుతం మా దగ్గర పాతిక మంది పని చేస్తున్నారు. అలానే చెరకు రైతుల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రసం ఆర్నెల్ల వరకూ నిల్వ ఉండేలా బాటిళ్లలో భద్రపరిచి మార్కెట్‌లోకి తేవాలనుకుంటున్నాం. మైసూర్‌లో కేంద్ర మంత్రిత్వ శాఖ ఆధ్వరంలో పనిచేసే కంట్రోలింగ్‌ ఫుడ్‌ టెక్నాలజీ సంస్థ మాకు సలహాలూ, సూచనలూ ఇస్తోంది. మూడు నెలల్లో అనుకున్నది ఆచరణలోకి వస్తుంది. ప్రస్తుతం మూడేళ్ల మా అమ్మాయిని మా పుట్టింట్లో ఉంచి నేనూ, మావారూ ఈ వ్యాపారం మీదే పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాం

0 Comments

జీవ వైవిధ్యానికి ‘శుభ’ సంకల్పం

9/26/2013

0 Comments

 
Picture
                               అందమైన ప్రకృతి అంటే మన కళ్లెదుట కనిపించే పచ్చటి చెట్లే అనుకుంటే పొరపాటు. ఆ చెట్లపై తిరిగే ఎన్నోరకాల కీటకాలు, రంగురంగుల సీతాకోకచిలుకలు కూడా ప్రకృతిలో ఓ భాగమే. మన ఇళ్లలో చెట్లను పెంచుకుంటాం గానీ, సీతాకోకచిలుకలను ఎగరనీయం. చెట్లను ఆశ్రయించి బతికే కీటకాలు కనిపిస్తే చాలు వాటిని చిదిమేసి చంపేసే వరకూ నిద్రపోం. సాటి మనుషుల్నే పురుగుల కంటే హీనంగా చూసే ప్రవృత్తిని అలవరచుకుంటున్న ఆధునిక మానవుడు ఆ పురుగులనేం రక్షించగలడు?

            క్రిమికీటకాలు లేకుండా ప్రకృతి శోభిల్లదనేది కొంతమందికే తెలుసు. అలాంటి వారు ప్రకృతిలోని ప్రతి పురుగునూ ప్రేమిస్తారు. అవి అంతరించిపోకుండా పాటుపడతారు. ఈ కోవకు చెందినశుభలక్ష్మి (42) జీవవైవిధ్య పరిరక్షణకు తన వంతు కృషి చేస్తూ ఎంతోమందికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచింది. ముంబైకి చెందిన ఆమె దట్టమైన అడవుల్లోకి వెళ్లి అందమైన సీతాకోకచిలుకలను, కాంతులీనే కీటకాలను సేకరించటం ఓ అలవాటుగా చేసుకుంది. ఈ అలవాటే కీటకాలపై పరిశోధన చేసే దిశగా అడుగులు వేయంచడంతో- శుభలక్ష్మి డాక్టరేట్‌ను సాధించింది. మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్‌ల్లోని దట్టమైన అడవుల్లో ప్రతి చెట్టూ ఆమెకు సుపరిచితమే. అక్కడ ఎగిరే సీతాకోకచిలుకలన్నీ ఆమెకు నేస్తాలే. అటవీ ప్రాంతంలో రాత్రి వేళ సంచరిస్తూ కీటకాలను పట్టుకోవడం అంటే ఆమెకు ఎంతో సరదా. చిన్నపాటి బోను, తెల్లటి దుప్పటి, 165 మెగావాట్ల మెర్క్యూరీ లైట్- ఇవే ఆమె ఆయుధాలు. దట్టమైన అడవుల్లో రెండు చెట్ల మధ్య దుప్పటి ఏర్పాటు చేసి అక్కడ లైటు ఉంచితే- ఆ కాంతికి సీతకోకచిలుకలు చేరుతాయి. వెంటనే వాటి గురించి అక్కడే నోట్సు రాసుకొని ఫొటోలు తీసుకుంటుంది. ఇలాంటి కష్టతరమైన వృత్తిని అమ్మాయిలు ఎంపికచేసుకోరు. కానీ, శుభలక్ష్మి దీన్ని ఎంపిక చేసుకోవటం ఆమె నిర్భయత్వానికి నిదర్శనం.

                    ఇప్పటి వరకూ మహారాష్టల్రో 419 రకాలు, అరుణాచల్ ప్రదేశ్‌లో 500 రకాలకు చెందిన కీటకాల వివరాలను సేకరించి ఆమె అధ్యయనం చేసింది. అరుదైన కీటకాలను, సీతాకోకచిలుకలను ఎన్నింటినో శుభలక్ష్మి వెలుగులోకి తెచ్చింది. నేడు ఎవరైనా ముంబైలోని సంజయ్ గాంధీ నేషనల్ పార్క్‌కు వెళితే అరుదైన, అందమైన సీతాకోకచిలుకలను, వివిధ జాతులకు చెందిన కీటకాలెన్నింటినో చూడవచ్చు. కార్పెంటర్ తేనెటీగ అనేది మయన్మార్‌లోనే ఉంటుందని చాలామంది భావిస్తారు. శుభలక్ష్మి వాటిని సేకరించి ఈ పార్క్‌లో ఉంచింది. ప్రపంచంలోనే అతి పెద్దదైన 12 అడుగుల చిమ్మట జాతికి చెందిన ఓ కీటకాన్ని కూడా ఆమె వెలుగులోకి తెచ్చింది. పురుషులు మాత్రమే వచ్చే ఈ రంగంలోకి మీరెందుకు వచ్చారని ఎవరైనా అడిగితే, చిన్నతనం నుంచి ఏ కీటకాన్ని చూసినా తనకు విపరీతమైన భయమని, అయితే ప్రకృతి అంటే ఎంతో ఇష్టమని, కీటకాల పట్ల ఉన్న భయాన్ని తొల గించుకునేందుకు వాటిపై అధ్యయనం చేయాలన్న ఆసక్తి తనలో పెరిగిందని ఆమె చెబుతుంటారు.

                    మనదేశంలో కీటకాల అధ్యయానికి సంబంధించి వేళ్లమీద లేక్కించే శాస్తవ్రేత్తలే ఉన్నారు. 2004లో వీటిపై శుభలక్ష్మి డాక్టరేట్ సాధించిన తరువాత, పలు డాక్యుమెంట్లను మహారాష్టల్రో విడుదల చేశారు. దీంతో ఆమె గురించి లోకానికి తెలిసింది. అప్పటి నుంచి ఎంతోమంది విద్యార్థులు, టీచర్లు, పర్యావరణవేత్తలు పురుగులు, సీతాకోకచిలుకలు, కీటకాలకు సంబంధించిన సమాచారాన్ని ఆమె నుంచి తెలుసుకునేవారు.

                      2011లో అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఓ ఉపాధ్యాయురాలు ఓ పట్టుపురుగుకు సంబంధించిన ఫొటోను శుభలక్ష్మికి పంపారు. ఆ ఫొటోలోని పురుగును ఎవరూ గుర్తించలేదని, దానికి సంబంధించిన సమాచారం కూడా లభ్యం కావటం లేదని ఆమె రాసింది. దాంతో 10 రోజుల పాటు అరుణాచల్‌ప్రదేశ్ అడవులలో పగలూ, రాత్రి సంచరించి ఆ పురుగుకు సంబంధించిన వివరాలను సేకరించగలిగానని శుభలక్ష్మి తెలిపారు.

                      ఇప్పటివరకు సుమారు 500 రకాల కీటకాల వివరాలను సేకరించి డాక్యుమెంట్లు రూపొందించినట్లు ఆమె తెలిపారు. ముంబై నేచురల్ సొసైటీకి చెందిన నరేష్ చతుర్వేది ఆమెకు గైడ్‌గా వ్యవహరించారు. సీతాకోకచిలుకలపై పరిశోధన చేస్తున్నపుడు ఆయన ఓ విలువైన సూచన చేశారు. ఇప్పటివరకూ ఈ జాతులకు సంబంధించిన సరైన ప్రాథమిక సమాచారమే లేదని, ఆమె పరిశోధన ఫలితంగా రాబోయే తరానికి విలువైన సమచారం అందాలని ఆయన ఆకాంక్షించారు. ఆయన మాటలే తనకు శిరోధార్యమయ్యాయని, అందుకే ఎలాంటి భయం లేకుండా కీటకాలకు సంబంధించిన ఎన్నో వివరాలను సేకరించి పుస్తకాల రూపంలో నిక్షిప్తం చేశానని ఆమె తెలిపారు.

                   ప్రపంచ వ్యాప్తంగా 1,20,000 జాతుల సీతాకోక చిలుకల వివరాలు రికార్డుల రూపంలో లభ్యమవుతున్నాయని, మనదేశంలో 12,000 రకాలపై వివరాలున్నట్లు ఆమె తెలిపారు. అటవీ జంతువులు, పక్షులు, కీటకాలకు సంబంధించిన జాతులను భద్రపరిచే సంజయ్‌గాంధీ నేషనల్ పార్క్‌లోకి ఆమె 1993లో అడుగుపెట్టింది. ఆనాటి నుంచి ఈనాటి వరకూ వాటితో అనుబంధాన్ని పెంచుకొని, వాటి సంరక్షణే ధ్యేయంగా సేవలందిస్తోంది. ఆ పార్క్ సిబ్బంది ఆమె ధైర్యానికి ఆశ్చర్యపోతుంటారు. పార్క్‌కు చెందిన ఓ అసిస్టెంట్, ఓ డ్రైవర్ మాత్రమే ఆమెకు తోడుగా అడవుల్లోకి వెళతారు. రాత్రివేళ పులులు, భయంకరమైన పాములు సంచరిస్తున్నా ఎలాంటి భయం లేకుండా ఆమె తిరగటం చూసి పార్క్ సిబ్బంది ఆశ్చర్యపోతారు. సంజయ్ గాంధీ పార్క్‌కు వెళ్లే సందర్శకులు అక్కడి సీతాకోకచిలుకలు, కీటకాలను చూసి పరవశించి పోతారు. అవి అంత అందంగా కనువిందు చేస్తున్నాయంటే శుభలక్ష్మి కృషి దాగివుంది. అడవుల్లోకి వెళితేనే కొన్ని కీటకాల జాతులను మాత్రమే చూడగలం. పట్టణాలు, నగరాల్లో వాటి ఉనికి నేడు ప్రశ్నార్థకంగా మారింది. కనీసం మన ఇళ్ళలో పెంచుకునే గార్డెన్‌లలో సైతం సీతాకోకచిలుకల జాడ లేదు. పొలాల్లో పురుగుమందులు, రసాయన ఎరువుల ప్రభావంతో ఇవి కనుమరుగవుతున్నాయి. జీవవైవిధ్యాన్ని కాపాడేలా వీటిని గనుక మనం రక్షించుకోకపోతే రాబోయే కాలంలో ప్రకృతి సమతుల్యత దెబ్బతినడం ఖాయమని శుభలక్ష్మి అంటున్నారు. ప్రకృతిని కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుందనే వాస్తవాన్ని చిన్నారులకు మనం నేర్పితే- సీతాకోకచిలుకలు, కీటకాలు వంటివి కనుమరుగు కావని ఆమె నమ్ముతోంది.

0 Comments

పడిలేచిన కెరటం..!

9/25/2013

0 Comments

 
Picture
                   చుట్టూ ఎత్తయిన కొబ్బరిచెట్లు.. వాటిని తాకాలని తాపత్రయపడే అలల హోరు.. చల్లటి గాలులతో అలరారే నీరోజక్ముంచల్ బీచ్ అంటే ఆమెకు ప్రాణం.. బుడిబుడి అడుగుల వేస్తూ ఆ బీచ్‌లోఎన్నో ఆటలు ఆడుకుంది... పెళ్లయి భర్తతో అత్తారింటికి వెళుతూ కూడా ఆ సముద్రాన్ని తనివితీరా ఓ సారి చూసుకొని వెళ్లిపోయింది... అలాంటి ఆందమైన బీచ్ కొందరి స్వార్థానికి కళావిహీనం కావడాన్ని ఆమె ఏ మాత్రం సహించలేకపోయంది. ఆ బీచ్‌ను పరిరక్షించేందుకు ఆమె అలుపెరుగని పోరాటం చేస్తోంది. కేరళలోని కన్నూర్ జిల్లా పాజయాంగడికి చెందిన జజీరాకు పెళ్లయి ఇద్దరు పిల్లలు పుట్టారు. అప్పటివరకు ఆ బీచ్ చుట్టుపక్కల పెద్ద మార్పేమీ జరగలేదు. మూడో బిడ్డను కనటానికి 2010లో జజీరా పుట్టింటికి వచ్చింది. వచ్చీరావటంతోనే అందమైన బీచ్‌ను చూసేందుకు వెళ్లి షాక్‌కు గురైంది. ఆహ్లాదకరమైన ఆ ప్రాంతంలో ఎత్తయిన భవనాలు, నిరంతరం ఇసుకును తోడేస్తూ తిరిగే ట్రక్కుల శబ్దాలు తప్ప పర్యాటకుల జాడే లేని బీచ్‌ను చేసి ఆమెకు కన్నీరు ఆగలేదు. రేయింబవళ్లు ఇసుక తరలిపోవడం ఆమెను ఆవేదనకు గురిచేసింది. డబ్బు సంపాదన కోసం ఇసుక మాఫియా బీచ్ అందాలను కొల్లగొడుతున్నా అక్కడివారు ఏమీ పట్టనట్లు చూస్తూండడం జజీరాను కలిచివేసింది. బీచ్‌ను కాపాడుకోపోతే క్రమంగా అది కనుమరుగయ్యే ప్రమాదం ఉందని నిండు గర్భిణిగా ఉన్నా ఆమె కార్యాచరణకు ఉపక్రమించింది.

                    అక్రమ సంపాదనకు అలవాటు పడి కొందరు అధికారులు అడ్డగోలుగా ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇవ్వడం, ఒడిషా, బీహార్, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా కొందరు ఇసుకను తరలించడాన్ని ఆమె గమనించింది. ఇసుక మా ఫియా దారుణాలను ఉన్నతాధికారుల దృష్టికి ఆమె తీసుకువెళ్లింది, పోలీసు అధికారులు చుట్టూ తిరిగింది. స్థానికుల ప్రజలకు ఎంతగానో చెప్పింది. అయనా, ఏ ఒక్కరూ ఆమె గోడు వినలేదు. ఎంతో కష్టపడి ఒకసారి పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించగలిగింది. అయనా, ఇసుక తవ్వకాలు ఆగకపోగా ఆమెపై దాడులు జరిగాయి. ఇసుక కాంట్రాక్టర్లు తమ వద్ద పనిచేసే మహిళలతో ఆమెపైనా, ఆమె పిల్లలపైనా దాడులు చేయించారు. ఆ బెదిరింపులకు లొంగ ఇసుక మాఫియాపై జజీరా సమరభేరి మోగించింది. ముందు తన సోదరులను ఇసుక తవ్వకాల వద్దకు పోకండా ఆపగలిగింది.

                            ఓ రోజు హఠాత్తుగా ఆమె తన ముగ్గురు పిల్లలతో పాటు పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించింది. తొమ్మిది రోజుల పాటు ఆందోళన సాగించి, ఇసుక మాఫియకు అడ్డుకట్ట వేయాలంటూ వేడుకుంది. భారీ వర్షం కురుస్తున్నా పిల్లలు తడవకుండా గొడుగు పట్టుకుని, వణికించే చలిలో సైతం ఆమె ఆందోళన కొనసాగించింది. చివరకు తహశీల్దార్ వచ్చి ఇసుక మాఫియా చర్యలను అరికడతామని హామీ ఇచ్చిన తరువాత ఆందోళన విరమించింది. అయితే, తహశీల్దార్ ఏ విధమైన చర్యలు తీసుకోకపోవటంతో ఆమె ఈసారి కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు ఉపక్రమించింది. తనతో పాటు బిడ్డలను కూడా వర్షంలో కూర్చోబెట్టి వారి ఆరోగ్యం పాడు చేస్తోందని స్ర్తి, శిశు సంక్షేమశాఖ అధికారులు జజీరాపై కేసు పెట్టారు. అయనాసరే ఆమె తన పోరాటం కొనసాగించి, కొంతమేరకు విజయం సాధించింది. బీచ్ వెంబడి పోలీసు యంత్రాంగాన్ని నియమించి ఇసుక తవ్వకాలను అరికడతామని హామీ ఇవ్వటమే కాకుండా ఆ మేరకు రక్షకదళాలను అధికారులు ఏర్పాటు చేశారు.

                               కొన్నాళ్లు ఇసుక తవ్వకాలు ఆగినట్లే ఆగి మళ్లీ ఊపందుకున్నాయి. జజీరా ఈసారి తన నిరసనను నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికే తెలియజేయాలని భావించి, తిరువనంతపురంలోని సచివాలయం ఎదుట తన పిల్లలతో ఆందోళన ప్రారంభించింది. ఆమె ఆందోళనకు స్పందించి సాక్షాత్తూ ముఖ్యమంత్రి దిగివచ్చి ఆమెను కలుసుకుని ఇసుక మాఫియా ఆగడాలను తెలుసుకున్నారు. బీచ్‌ల్లో ఇసుక తవ్వకాలను ఆపివేయిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అయతే, అది ఎంతవరకు సమర్థవంతంగా అమలు జరుగుతుందో వేచి చూడాలి. దాశాబ్దకాలంగా ఇసుక మాఫియాపై జజీరా ఒంటరిగానే పోరాటం చేసింది. నేడు ఆమె వెనుక భర్త, కుటుంబ సభ్యులు, ఎంతోమంది పర్యాటకులు, పర్యావరణ ప్రేమికులు, వేలాది మంది స్థానికులు అండగా నిలుస్తున్నారు. జజీరా పోరాటం వల్ల పర్యావరణ పరిరక్షణపై జనంలో చైతన్యం పెరిగిందని ప్రముఖ సామాజిక కార్యకర్త సుల్ఫాత్ అంటున్నారు. రాజకీయ నాయకుల అండ లేకున్నా ఇసుక మాఫియాపై జజీరా చేస్తున్న పోరాటం స్ఫూర్తి దాయకంగా ఉందని స్థానికులు మద్దతు ఇస్తున్నారు. తమ ఆదాయానికి భారీగా గండి కొడుతున్న జజీరాను ఇసుక మాఫియా ఏమీ చేయకుండానే ఊరుకుంటుందా? అన్న ఆందోళన జనంలో లేకపోలేదు. ఉత్తరప్రదేశ్‌లో ఇసుక మాఫియాపై యుద్దం చేసిన ఐఎఎస్ అధికారిణి నాగ్‌పాల్ నిర్దాక్షిణ్యంగా సస్పెన్షన్‌కు గురైందని కేరళ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.

                             ‘నన్ను చంపినా, నా ఇంటిని నాశనం చేసినా ఇసుక మాఫియా నన్ను ఓడించలేదు. ఎందుకంటే- వాస్తవాలను, న్యాయాన్ని న మ్ముకుని పోరాడుతున్న నాకు ఎలాంటి ఓటమి ఉండదు’ అని జజీరా ఎంతో ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తోంది. పడిలేచిన కెరటం వలే ఆమె నిత్యం కొత్త ఉత్సాహంతో ముందుకు వెళుతోంది. అలుపెరుగని ఆమె పోరాటానికి ఎప్పటికైనా మంచి ఫలితం ద క్కుతుందని కేరళ వాసులు బలంగా నమ్ముతున్నారు.


0 Comments

బుకర్ బరిలో జుంపా

9/25/2013

0 Comments

 
Picture
భారతీయ సంతతికి చెందిన రచరుుత్రి
ఇంటర్‌ప్రెటర్‌ ఆఫ్‌ మాలడీస్‌కు పులిట్జర్‌
తెరెకక్కిన తొలి నవల ద నేవ్గు సేక్‌
నక్సల్‌ బరి నేపథ్యంలో ది లోల్యాండ్గ
ఆలోచింపజేసే రచనలు ఆమె సొంతం


ఆమె రాసిన మూడు నవలలు ఓ సంచలనం. ఆమెకు లక్షల మంది అభిమానులు తెచ్చిపెట్టారుు. అరుుతే విమర్శకులు లేకపోలేదు. ఓ హెన్రీ, పులిట్జర్‌ అవార్డులు అందుకుని తన రచనా ఘనత ఏపాటిదో చూపించారు. తండ్రి భారతదేశాన్ని వీడిపోరుున తరువాత లండన్‌లో జన్మించింది ఈ రచరుుత్రి. అరుునా భారత దేశ సంసృ్కతి, సంప్రదాయాలు, సమస్యలు అన్నింటిపైన పట్టు సంపాదించింది. 1967లో పశ్చిమ బెంగాల్‌లో దున్నే వాడిదే భూమి పేరుతో ప్రారంభమైన ఉద్యమ నేపథ్యంలో రాసిన నవల ‘ది లోల్యాండ్గ’. ఇది ఈ సంవత్సరానికి బుకర్‌ పురస్కారం ఎంపిక జాబితాలో చోటు సంపాదించుకుంది.

ఝంపా లహరి
అసలు పేరు                నీలాంజన సుధేష్ణ
జననం                      11 జులై 1967
ప్రాంతం                      లండన్‌, ఇంగ్లాండ్‌
వృత్తి                           నవలా రచయిత
హాబీ                         షార్ట్‌ స్టోరీ సేకరణ
రచనలు                    ఇంటర్‌ప్రిటర్‌ ఆఫ్‌ మాలడీస్‌(1999)
                                  ది నేమ్‌ సేక్‌(2003)
                                 అన్‌అకస్టమెడ్‌ ఎర్త్‌(2008)
అవార్డులు                   ఓ.హెన్రీ(1999), పులిట్జర్‌(2000)



                      విదేశాల్లో ఉంటున్న భారతీయుల జీవనశైలిని, సాంస్కృతిక పరమైన గుర్తింపు వంటి అంశాలతో ఎంతో అద్భుతంగా రాస్తూ ఇటీవల ప్రముఖ రచయితల సరసన చేరిన యువ రచయిత్రి లహరి. ‘ది నేమ్‌సేక్‌’ ఆమె తొలి నవల. శరణార్ధుల జీవితాలను ఎంతో గొప్పగా వర్ణించింది. ఆమె పుస్తకాలు ఎందరు అభిమానులను ఆకట్టుకుందో అంతే స్థాయిలో విమర్శకుల దృష్టిలోనూ నిలిచాయి. అయితే చాలామంది అంతగా పట్టించుకోని అంశాలను ప్రస్తావిస్తూ రాసిన ఆమెను గొప్ప రచయిత్రిగా పాఠకుల లోకం పేర్కొన్నది. ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక మాన్‌ బుకర్స్‌ ప్రైజ్‌ కోసం ఎంపికయిన 13 నవలల సుదీర్ఘ జాబితాలో అమెరికాలోని భారతీయ సంతతికి చెందిన నవలా రచయిత్రి ఝుంపా లాహిరికి చెందిన ది లోల్యాండ్‌ అన్నిటికన్నా ముందు వరసలో ఉంది. తనతో పాటు పోటీలో ఉన్న ఇతర ఐదుగురు రచయితలను దాటగలిగితే ఈ ప్రతిష్టాత్మకమైన పురస్కారం ఆమెనే వరించవచ్చు.

                               లండన్‌లో జన్మించిన లాహిరి కుటుంబ సంబంధాల గురించి అత్యంత హృద్యంగా రాసిన ఈ నవల ఆమెతో పోలిస్తే అంతగా పేరు ప్రఖ్యాతులు లేని పలు నవలలతో 50 వేల పౌండ్ల విలువైన ఈ ప్రైజ్‌ కోసం పోటీ పడుతోంది. లాహిరి కథా కథనం తీరు సాటిలేనిది. భారత్‌, అమెరికాలతో ముడిపడిన లోల్యాండ్‌ నవల గత సెప్టెంబర్‌లో ప్రచురణ కావడమే కాకుండా లండన్‌కు చెందిన సాహితీ విమర్శకుల దృష్టిలో ఈ బహుమతికి అన్ని విధాలా తగినదిగా కూడా గుర్తింపు పొందింది. పశ్చిమ బెంగాల్‌ నుంచి వలస వెళ్లిన కుటుంబంలో లండన్‌లో జన్మించిన ఝంపా లహరి ప్రస్తుతం న్యూయార్క్‌లో నివసిస్తున్నారు. ఆమె రాసిన ‘ఇంటర్‌ప్రెటర్‌ ఆఫ్‌ మాలడీస్‌’ అనే కథానికల సంపుటికి సైతం 2000 సంవత్సరంలో పులిట్జర్‌ బహుమతి లభించింది. 2003వ సంవత్సరంలో ఝంపా తొలి నవల ‘ద నేమ్‌ సేక్‌’ని మీరా నాయర్‌ తెరకెక్కించారు కూడా. బెంగాలీ అయిన జుంపా లాహిరి 1967వ సంవత్సరంలో జులై 11వ తేదీన లండన్‌లో జన్మించారు. జుంపా మూడు సంవత్సరాల వయస్సునప్పుదు ఆమె తల్లిదండ్రులు ఇంగ్లాండు నుండి అమెరికా వలసవెళ్లారు. ఆమె తండ్రి రోడ్‌ ఐలాండ్‌ విశ్వవిద్యాలయంలో లైబ్రేరియన్‌గా పనిచేసేవారు. జుంపా రచించిన నవల ద థర్డ్‌ అండ్‌ ఫైనల్‌ కాంటినెంట్‌లో ప్రధాన పాత్రకు తన తండ్రియే ఆధారం.ఎన్నో నవలలను ఆమె రచించి పేరు పొందారు.

ది లోల్యాండ్ కథ విషయానికి వస్తే...

                   లహరి ఈసారి నక్సల్బరీ మీద దృష్టి పెట్టింది. దున్నేవాడిదే భూమి నినాదంతో 1967లో బెంగాల్‌లో దావానలంలా వ్యాపించిన ఈ ఉద్యమం ఈ కథకు కీలక నేపథ్యం. ఆ సమయంలోనే, అంటే నక్సల్బరీ ఉద్యమం దేశం నలుచెరగులా వ్యాపిస్తున్న సమయంలోనే యవ్వనంలో ఉరకలెత్తే ఇరువురు అన్నదమ్ముల కథ ది లోల్యాండ్‌. ఈ పేదరికం, దారిద్య్రం పోవాలంటే తుపాకీ పట్టుకోక తప్పదు అని నమ్మిన ఆ అన్నదమ్ముల్లో ఒకడు చాలా త్వరగా ఇందులో ఉన్న ప్రమాదాన్ని గ్రహిస్తాడు.ఉద్యమంలోని కష్టనష్టాలను గమనించి తను విరమించుకుని అమెరికాకు వెళ్లిపోతాడు.

                      మరొకడు నక్సలైట్‌గా కొనసాగి బూటకపు ఎన్‌కౌంటర్‌లో చనిపోతాడు. ఈ వార్త విని అమెరికా నుంచి సోదరుడు తిరిగి వచ్చేసరికి ఇటీవలే అతడి జీవితంలో ప్రవేశించిన భార్య. పైగా గర్భవతి. ఆమె దైన్యస్థితిని అర్థం చేసుకున్న సోదరుడు ఆమెను వివాహం చేసుకొని అమెరికా(రోడ్‌ ఐల్యాండ్‌)కు తీసుకువెళతాడు. అక్కడ ఆమెకు కుమార్తె పుడుతుంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇరువురూ ఆ పాపకు అసలు నిజం చెప్పకుండా పెంచి పెద్ద చేస్తారు. కాని రాను రాను భార్యకు అతడితో ఉన్న వైవాహిక సంబంధం నచ్చదు. పెళ్లి వీగిపోతుంది. చివరకు ఏమయ్యింది అనేది కథ.ఈ ఏడాది బుకర్స్‌ ప్రైజ్‌ కోసం ఎంపికయిన వారి జాబితాలో మార్గరేట్‌ అట్‌వుడ్‌, జెఎం కోజీలాంటి లబ్ధప్రతిష్ఠులు లేకపోవడం గురించి ప్రస్తావిస్తే, అర్హతలేని వారికి అవార్డులు ఇవ్వడం, అర్హులయిన వారిని పక్కన పెట్టడం లాంటి వివక్ష ఏదీ లేదని న్యాయ నిర్ణేతల బృందం అధ్యక్షురాలు రాబర్ట్‌మాక్‌ఫర్లేన్‌ చెప్పారు. ఈ అవార్డు కోసం ఎంపికయిన నవలల్లో సంప్రదాయ నవల నుంచి ప్రయోగాల దాకా, క్రీస్తుశకం ఒకటో శతాబ్దం మొదలుకొని నేటి దాకా, అలాగే వంద పేజిలనుంచి వెయ్యి పేజీల దాకా ఉండే అన్ని రకాల నవలలున్నాయి.

                     అమెరికా అధ్యక్షుడు బారక్‌ ఒబామా ఆర్ట్‌‌స అండ్‌ హ్యుమానిటీస్‌ ప్రెసిడెంట్‌ కమిటీ సభ్యురాలిగా జుంపా లహరిని నియమించారు. 1999లో ఇంటర్‌ప్రెటర్‌ ఆఫ్‌ మాలడీస్‌, 2003లో ద నేమ్‌ సేక్‌, 2008లో అన్‌అకస్టమెడ్‌ ఎర్త్‌ పుస్తకాలనువ అందుబాటులోకి తీసుకువచ్చారు. 1993లో హెన్‌ఫీల్డ్‌ ఫౌండేషన్‌ నుంచి ట్రాన్స్‌ అట్లాంటిక్‌ అవార్డును, 2002లో గుగెన్‌హీమ్‌ ఫెలోషిప్‌ను జుంపాలహరి అందుకున్నారు.

0 Comments

సాయం చేసేందుకు పత్రిక పెట్టింది!

9/23/2013

0 Comments

 
Picture
ప్రతి ఆరోగ్య సమస్యా బాధిస్తుంది. ఎయిడ్స్‌ శారీరకంగా బాధపెట్టడమే కాదు... మానసికంగా కూడా కుంగదీస్తుంది. ఆ వ్యాధి లక్షణాలు ఉన్నాయని తెలియగానే చాలామంది కించపరిచేలా మాట్లాడతారు. ఒక్క ఆ వ్యక్తినే కాకుండా... కుటుంబ సభ్యుల్నీ దూరం పెడతారు. ఇవన్నీ బాధితుల్నీ, వారి కుటుంబ సభ్యుల్నీ ఎంత క్షోభ పెడతాయో దగ్గరగా చూసింది తమిళనాడులోని కరూర్‌కి చెందిన ఆస్మా నజీర్‌.

                   మధ్య తరగతి కుటుంబంలో పుట్టి, డిగ్రీ వరకూ చదువుకున్న ఆస్మా అనారోగ్యంతో బాధపడే అలాంటి వారికి ఉపయోగపడే మంచి మాటలూ, వైద్య సలహాలూ అందించాలనుకుంది. తెలిసీతెలియక ఆ వ్యాధి బారిన ఎవరూ పడకుండా నిపుణుల సాయం అందించాలనుకుంది. ఆ వ్యాధితో బాధపడే వారి దుస్థితి ఎలా ఉంటుందో కళ్లకు కట్టాలనుకుంది. కానీ అది తన ఒక్కదాని వల్ల అయ్యే పనేనా? ఇలా ఒకటీ రెండూ కాదు... ఏడేళ్ల పాటు ఆలోచించింది. చివరికి ఓ పత్రిక ప్రారంభించి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలనుకుంది. అందుకోసం నాలుగు నెలల పాటు గ్రామాల్లో తిరిగి, వైద్యుల్ని కలిసి, బాధితులతో మాట్లాడి... ఓ అవగాహనకు వచ్చింది. అందరూ పత్రిక తీసుకొస్తే మంచిది అన్నారు.

                     హెచ్‌ఐవీకి సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి ఆసక్తి చూపారు. డబ్బులు పెట్టి కొనడానికి మాత్రం ఎవరూ మొగ్గు చూపలేదు. ఇంట్లో వాళ్లూ, తెలిసిన వాళ్లూ 'ఇక ఆ ప్రయత్నం ఆపెయ్‌' అన్నారు. ఆస్మా ఒప్పుకోలేదు. ఆచరణలో ఇబ్బందులు ఉన్నాయని మంచి ఆలోచనని పక్కన పెట్టేస్తామా అని నిలదీసింది. పత్రికను ఉచితంగానే పంచాలని నిర్ణయించుకుంది. ఆలోచన సరే... కానీ అది ఖర్చుతో కూడుకున్న పని. ఏం చేయాలో పాలుపోలేదు. తమిళనాడులోని ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీని సంప్రదించి తన ఆలోచనను చెప్పింది. 'మంచి పని చేస్తానంటే... మేం మద్దతిస్తాం' అంటూ అక్కడి సభ్యులు ముందుకొచ్చారు. ఆర్నెల్ల పాటు ప్రకటనలు ఇచ్చి సహకరిస్తామని చెప్పారు. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న ఆమె స్నేహితులు 'నువ్వేం దిగులుపడకు, నువ్వు నిలదొక్కుకునేదాకా మేం డబ్బు సాయం చేస్తాం' అన్నారు. అలా 2008 డిసెంబర్‌ ఒకటి ఎయిడ్స్‌ డే నాడు 'పాజిటివ్‌+' పక్ష పత్రిక మార్కెట్లోకి వచ్చింది.

                       ఎనిమిది పేజీలు... ఐదు వేల కాపీలు. పేపర్లు అమ్మే వాళ్లతో మాట్లాడి పత్రికను రైళ్లలో పంచమని కోరింది. స్టేషనరీ యజమానులతో మాట్లాడి పుస్తకాలు కొన్నవారికి ఉచితంగా ఇవ్వమని చెప్పింది. రెండు నెలలు గడిచాయి. ఉచితంగా ఇచ్చినా ఎవరూ చదవట్లేదని తెలిసి బాధపడింది. అప్పటికే సుమారు లక్ష రూపాయల దాకా ఖర్చయ్యాయి. ఎక్కడ లోపం ఉందో తెలుసుకునేందుకు చాలామందిని కలిసి మాట్లాడింది. 'ఎయిడ్స్‌ బాధితుల కష్టాలే ఇస్తే ఏం చదువుతాం' అన్న మాటలు ఆలోచనలో పడేశాయి. వెంటనే తగిన మార్పులు చేసుకుంది. హెచ్‌ఐవీ బారిన పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి... రోగనిరోధక శక్తిని పెంచే ఎటువంటి ఆహార పదార్థాలు తినాలి... వంటి విషయాలను నిపుణులతో చెప్పించింది. ఎయిడ్స్‌ బారినపడ్డా, పలు రంగాల్లో విజయాలు సాధించిన వారి స్ఫూర్తి కథనాల సంఖ్యను పెంచుతూ వచ్చింది. ఈ ప్రయత్నం ఫలించింది. కాలేజీ విద్యార్థులు బాగా ఆదరించారు. క్రమంగా పాఠకుల సంఖ్య పెరిగింది.

                    అది చూసి, చిన్న షాపుల యజమానులు ప్రకటనలు ఇవ్వడానికి ముందుకొచ్చారు. మరింత ఉత్సాహంతో సినిమా ప్రముఖులూ, రాజకీయ నాయకుల అభిప్రాయాలనూ దాన్లో చేర్చింది. ఎయిడ్స్‌ బాధితుల కోసం ఉన్న హెల్ప్‌లైన్లూ స్వచ్ఛంద సంస్థలూ, బ్లడ్‌ బ్యాంకుల వివరాలూ, అత్యవసర పరిస్థితుల్లో సేవలందించే ఆసుపత్రులూ కౌన్సెలింగ్‌ కేంద్రాల సమాచారం ఇవ్వడం ప్రారంభించింది. ఇవన్నీ పత్రిక ఆదరణనూ, ప్రకటనల రాబడినీ పెంచాయి. దాంతో ఆస్మా కష్టాలు కొంతవరకూ తీరాయి. తక్కువ ఖర్చుతో పత్రికను తీసుకొచ్చేందుకు ఆస్మా చాలా కష్టపడుతుంది. తనతో పాటూ ఇద్దరు స్నేహితులు బయట తిరిగి సమాచారం సేకరించుకుని వస్తారు. తను ఇంట్లో పనులు చేసుకుంటూనే ఆంగ్లం, తమిళంలో కథనాలు రాసుకుంటుంది. స్వయంగా పేజీలు డిజైన్‌ చేసుకుంటుంది. రోజుకి పదిహేను గంటలు కష్టపడుతూ సర్క్యులేషన్‌ను యాభై వేల కాపీలకు చేర్చిన ఆస్మాను ఎవరయినా ప్రశంసిస్తే 'ఆ సంఖ్యను చూసి నేను ఆనందించడం లేదు. సమాజంలో ఏ కాస్తయినా మార్పు తీసుకురాగలిగానా అనే ఆలోచిస్తున్నా' అంటుంది.


0 Comments

సమాజాన్ని కుంచెతో తట్టిలేపిన ధీర

9/22/2013

0 Comments

 
Picture
                  చిత్రలేఖనం అనగానే మనసు అగాధంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న భావాలన్నింటినీ ఏరికూర్చి తెల్లని కాగితంపై ఒక మాలగా అల్లి సింగారించే అద్భుత కావ్యగీతిక. చెప్పాలనుకున్న మాటలు ఎంతకీ చెలియకట్టలు తెగిరాక, వెన్నెల వెలుగుతో దోబూచులాడే మూగభాష్యం ఎవరికి చెప్పను? ఎలా చెప్పను? ఎప్పుడు చెప్పను? చెప్పాలనుకునే మాటలు నాకంటే ముందుగా ఎవరో ఒకరు ఏదో ఒక సందర్భంలో చెబుతూనే ఉంటారు. అయినా నా మనోవేదన తీరడం లేదు. నాకు నేను నీతో సమీపంగా గాలికూడా దూరలేనంత దగ్గరగా ఎండిపోయిన ఆకులశబ్దం రాగతాళాల మధ్యలో శ్రావ్యంగా, మనోహరంగా చెప్పాలనుకుంటున్నా...అయినా నీ చెంతకు నా పలుకు చేరడం లేదు. గాలితుపానుల మధ్య వీచే ప్రతి కెరటంపై నేను రాసి పంపుతున్న ప్రేమకావ్యం నీదరికి రావడం లేదు. ఏదిఏమైనా, ఎలాగైనా, ఏమైనా సరే నేను పంపాలనుకునే సందేశం నీకే నేరుగా నీగుండె గదిలో నిక్షిప్తంగా నిలిచేలా పంపాలనుకున్నా. అదేంటో తెలుసా? ఈ గిఫ్ట్‌కాగితం విప్పి చూడు నీకే తెలుస్తుంది...పగలూ రాత్రి తేడా లేకుండా, అన్నపానీయాలను దరిచేరనీయకుండా నీకోసం వేసిన ప్రేమచిత్రం నీ మనసు కదిలించడం లేదా? అంటూ పాషాణ గుండెల్ని కదిలించే ప్రేమ సన్నివేశాలతో చిత్రాలను వేసి, 20వ శతాబ్దంలో టాప్‌టెన్‌ చిత్రాల్లో తన చిత్రానికి చోటు సంపాదించి, చరిత్ర సృష్టించిన ధీర వనిత క్లారా క్లింగ్‌హోఫర్‌.

                     స్త్రీ మనసును ఒక స్త్రీ లోతుగా అధ్యయనం చేసి, నగ్నచిత్రాలను సైతం ధైర్యంగా, నిర్భయంగా చిత్రాల ద్వారా బాహ్యప్రపంచానికి చాటిచెప్పే ప్రయత్నంలో ఆమెకెన్నో సవాళ్లు ఎదురయ్యాయి.  'స్త్రీకి మనసు ఉంది, స్వచ్ఛమైన ప్రేమ కోసం ఆ మనసు తపిస్తుంది, స్పందించే ప్రాణికోసం ఆరాటపడుతుంది, ఈ ప్రయత్నంలో ఎదుటివారి ప్రేమను ఆశించడంలో తప్పేంటి? ప్రశ్నించే క్లారా చిత్రాలు ఓ సంచలనం. 

అమెరికాలో పెరిగారు

                   క్లారా ఆస్ట్రియాలోని లింబర్గ్‌లో జన్మించినా, చిన్నవయసులోనే లండన్‌కు చదువు నిమిత్తం పయనమయ్యారు. లండన్‌లోని 'స్లైడ్‌ స్కూల్‌ ఆఫ్‌ ఫైన్‌ఆర్ట్స్‌'లో ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌ను నేర్చుకున్నారు. 1920లో ఒక రచయితను వివాహం చేసుకున్నారు. చిన్నతనంలోనే తన చుట్టూ బాలికలకు, మహిళలకు జరుగుతున్న అన్యాయాలను గమనించిన క్లారా వారి సమస్యలను, మనోవిశ్లేషణపై చిత్రాలను గీయడం ఆరంభించారు.

దిగంబర చిత్రాలకు వెనుతిరగలేదు

               క్లారా చిత్రాలు ఎక్కువగా దిగంబరంగా కనిపిస్తాయి. కారణం మహిళఅంతర్గతంలో మెదిలే భావాలను కచ్చితంగా చిత్రించడంలో ఆమె దిట్ట. ఆమె చిత్రాల్లో ఒక ప్రేయసి, ఒక తల్లి, ఒక చెల్లి, అన్నింటికి మించి ఒక ఆరాధనభావంతో నిండినవి ఉంటాయి. అలాగని సంప్రదాయాలు, ఆచారాలను గాలికి వదిలేసినవిగా ఉండవు. 1919లో లండన్‌లో ఆమె చిత్రాలు ప్రదర్శనకు నోచుకున్నప్పుడు ఒక సంచలనవార్తగా అయ్యింది. ఒక బాలిక బాల్యం నుంచే ఎదుర్కొనే వివక్ష ఆ ఫలితంగా ఆమెలో చెలరేగే మానసిక ఘర్షణకు నిదర్శనం తన చిత్రాలని అంటారు క్లారా.

నేటితరం మహిళా చిత్రాలు

                 1925లో 'ఉమెన్‌ ఆఫ్‌ టుడే లో క్లారా గురించి రాస్తూ, చిత్రలేఖనంలో క్లారా రాత్రికిరాత్రే కళాకారిణిగా మారలేదు. ఆరు సంవత్సరాల లేతప్రాయంలోనే చిన్నివేళ్లతో బ్రెష్‌ను పట్టుకుని, కుంచెగీయడం ఆరంభించారు. పరిణతి చెందిన ఇంగ్లీషు చిత్రకారిణిగా పేరుపొందారు. కేవలం 19సంవత్స రాల టీనేజ్‌లోనే క్లారా తన చిత్రాలు ప్రదర్శనకు నోచుకున్నా యంటే అర్థం చేసుకోవచ్చు ఆ కళపట్ల ఆమెకున్న ఆసక్తి, అంకితభావం.

పేదరికంలోనూ మసకబారని కళ

                       క్లారా క్లింగ్‌హోఫర్‌ తన 14వసంవత్సరంలో అద్భుత చిత్రాలు వేయడం గమనించిన ఆమె తల్లిదండ్రులు ఆ దిశగా ఆమెను ప్రోత్సహించడం ఆరంభించారు. పేదరికానికి చెందిన క్లారా తల్లిదండ్రులు తమ కూతుర్ని ఏవిధంగా ప్రోత్సహించాలో అర్థం కాలేదు. తమ కూతురిలో ఉన్న కళాభిరుచిని తెలిసిన వారికి చెప్పి, కొంత ఫండ్‌ను సేకరించడం మొదలుపెట్టారు. ఫైనాన్స్‌ స్కూల్లో చేర్పించారు. అక్కడే ప్రముఖ చిత్రకారుడు బెర్నార్డ్‌ మినిస్క్‌ఫై క్లారా చిత్రాలను వేసే విధానాన్ని గమనించి, లియెనార్డో డావిన్సీ చిత్రలేఖన లక్షణాలు క్లారాలో ఉన్నాయని చెప్పి ఆమెను ప్రోత్సహించారు. ఒక సభకు వచ్చి, చిత్రలేఖన ప్రదర్శనపై బోధించమని ఆహ్వానించినప్పుడు అక్కడికి వెళ్లిన క్లారా తనకు వచ్చిన కళ గురించి మాట్లాడలేకపోయారు. అయినప్పటికి ఆమె అధైర్యపడలేదు. రెండేళ్లు కష్టపడి, తన సత్తాను చాటుకున్నారు. ఇంగ్లండ్‌, యూరప్‌ వంటి దేశాల్లో క్లారా పెయింటింగ్‌ ఎగ్జిబిషన్లకు నోచుకున్నాయి.

నాజీల దాడుల్లో చెదరని విశ్వాసం

                         క్లారా 1929లో భర్త, తన పిల్లలతో కలిసి హాలెండ్‌కు వెళ్లాల్సి వచ్చింది. అక్కడ నాజీలు క్లారా చిత్రాలను చూసి, ఆమెను వేధింపులకు గురిచేశారు. ఇదే సమయంలో భర్తలో చెలరేగే అసూయ కారణంగా క్లారా మరిన్ని కష్టాల మధ్య తనకున్న కళను ముందుకు సాగించడంలో కష్టతరమైంది. ఒక మహిళ అందులో స్త్రీ సమస్యలపై ఆమె వేస్తున్న చిత్రాలు హాలెండ్‌లోని పురుషసమాజంలో హర్షించేందుకు బదులు, అపార్థం చేసుకుని, క్లారాపై దాడులకు పూనుకున్నారు. వీటిని భరించలేక క్లారా తన కుటుంబాన్ని తీసుకుని, తిరిగి అమెరికాకు వచ్చారు. ఇక్కడే తన కళకు, తనకు శ్రేయస్సు అని భావించి, అమెరికాలోనే స్థిరపడ్డారు. తన కళ కోసం, భర్తను వదిలేందుకు ఆమె వెనుకంజ వేయలేదు. ఒకానొక పరిస్థితుల్లో క్లారా భర్త తన భార్య చిత్రాలను వేసేందుకు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో ఆమె భర్తకు దూరంగా ఉండేందుకు నిర్ణయించుకున్నారు. కళపట్ల ఆమెకున్న అంకితభావాన్ని గమనించి, అర్థం చేసుకుని, చివరికి భార్యాబిడ్డలతో కలిసి జీవించేందుకు నిర్ణయించుకున్నారు. ఇంటగెల్చి, రచ్చగెల్చిన క్లారా చిత్రాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అనిపిస్తుంది. క్లారా వేసిన పెయింటింగ్స్‌ దాదాపు 90శాతం మహిళలపైనే వేయడం విశేషం. 20వ శతాబ్దంలో సైతం మహిళను ఒక వస్తువుగా భావిస్తూ లైంగిక, మానసిక దాడులకు దిగుతున్నవారిని విమర్శిస్తూ, స్త్రీలను ప్రోత్సహించడమే తన చిత్రకళాధ్యేయమని చెబుతారు క్లారా. అందుకే నేటికి ఆమె చిత్రాలు టాప్‌టెన్‌లో స్థానాన్ని పదిలపరచుకున్నాయి. కళ ఏదైనా సమాజాభివృద్ధికి, మానవవికాసానికి దోహదం చేసినప్పుడే ఆ కళ పదికాలాలపాటు నిలుస్తుందని క్లారా తన చిత్రాల ద్వారా నిరూపించుకున్నారు. అందుకు ఆమె కళ అభినందనీయం.

0 Comments

రేసింగ్ బైక్ పై నవతరం అమ్మాయి

9/21/2013

0 Comments

 
Picture
                  'ఆడపిల్లలు ఇలా నడవాలి, అలాగే నడుచుకోవాలి... ఫలానా ఉద్యోగాలే చేయగలరు... ఏ స్కూటీనో, స్కూటరో తప్ప వేరే బండిని నడపడం అటుంచి అసలు బండిని పట్టుకోమనండి చూద్దాం...' ఈ మూసపోసిన ఆలోచనలకు కళ్ళెం వేసి,ఊహలకు రెక్కలు తొడిగి, బైక్‌ మీద పరుగులు పెట్టిస్తోంది 21 ఏళ్ళ శీతల్‌ అయ్యర్‌.


                 ఆడపిల్లలు రోడ్డు మీద బైక్‌ నడుపుతూ వెళితే తల ఆశ్చర్యంగా తిప్పనివాళ్ళు ఉంటారా? బైక్‌లు నడపాలంటే కండల్లో బలం ఉండాలి. సున్నితంగా ఉండే ఆడపిల్లలు బైక్‌ నడపలేరనేది ఒక రకంగా మనలో రంగరించుకుపోయిన అభిప్రాయం. స్కూటీ గురించి నటి ప్రియాంకా చోప్రా ప్రకటన చూస్తుంటాం - 'కేవలం అబ్బాయిలకేనా మనకూ ఉంది ఫన్‌!' అంటూ! శీతల్‌ కూడా ఇదే మాట అంటుంది కానీ స్కూటీ గురించి కాదు, బైక్‌ నడపడం గురించి. 'ఎవరు చెప్పారు బైక్‌లు కేవలం అబ్బాయిల కోసమని. బైక్‌ స్పోర్ట్‌ మగవాళ్ళకే కాదు ఆడవాళ్ళకు కూడా' అని ఆమె అంటుంది.

                 మోటార్‌ సైకిల్‌ నడపడం అంటే సహనాన్ని, నైపుణ్యాన్ని సమతుల్యం చేసుకుంటూ ఒత్తిడిని నియంత్రణ చేసుకోవలసి వస్తుంది. హైవే మీద బైక్‌ నడుపుతున్నపుడు ఒక్కోసారి ఏ సమస్యా ఉండదు కానీ కొన్నిసార్లు చాలా విసుగ్గా తట్టుకోలేనట్టుగా జీవితం మీద విరక్తిగా ఇక ఆపేద్దామా అని కూడా అనిపించిన సందర్భాలుంటాయి. అందుకే బైక్‌ నడపడం లేక రేస్‌లో పాల్గొనడం అందరి వల్లా కాని పని అంటారు. కానీ ఆ అనుభవాలన్నిటి నుండి నేర్చుకుని తనను తాను మలచుకోవడమే జీవితం. ఆ విధంగా మలచుకుని చూపిన శీతల్‌ తన అనుభవాల సారం గురించి చెప్పిన మాట ఇది.

                          మూడు సంవత్సరాల క్రితం ఇటానగర్‌లో జరిగిన రైడర్స్‌ మీట్‌లో దేశం మొత్తం నుండి బైౖక్‌ రైడింగ్‌లో పాల్గొన్న 150 మంది రైడర్స్‌లో ఆమె ఒక్కరే మహిళ. 2010 నుండి పరిస్థితి మారింది అంటుంది శీతల్‌. మహిళా రైడర్స్‌ సంఖ్య పెరిగింది. బైకింగ్‌ కమ్యూనిటీలు పెరిగాయి. స్త్రీ పురుష భేదం చూపకుండా మహిళలకు ఎంతో సహకారాన్ని కూడా అందిస్తున్నాయి.

                             శీతల్‌ ప్రథమంగా హైదరాబాద్‌లోని హైవే నవాబ్‌ క్లబ్‌లో చేరింది. తరువాత 2012లో వోల్ఫ్‌ క్లబ్‌లో చేరి శిక్షణ పొందింది. కమ్యూనిటీతో పాటు అందులోని స్నేహితులు అందించిన తోడ్పాటు, మార్గదర్శకత్వం, రక్షణ బైక్‌ నడపడంలో ఆనందాన్ని పొందేలా చేస్తున్నాయని ఆమె అభిప్రాయం. ఒక మల్టీ నేషనల్‌ కంపెనీలో ఈవెంట్‌ మేనేజర్‌గా పూర్తి స్థాయి బాధ్యతలు నిర్వహిస్తూనే తన అభిరుచిని కూడా పట్టుదలతో ఆస్వాదిస్తోంది. ఇది ఎంతమందికి సాధ్యం. అది కూడా కష్టనష్టాలను, ప్రతికూల పరిస్థితులనూ ఎదుర్కొంటూ! అయితే, ఆడపిల్లలు తలచుకుంటే ఏమైనా సాధించగలిగే సామర్థ్యం, ఓర్పు, నేర్పు వారి సొంతమని నిరూపిస్తోంది శీతల్‌.

అలా జరిగిపోయిందంతే...


                        రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బండి మీద కూర్చుని, చిరునవ్వుతో అలవోకగా ఇంజన్‌ రైజ్‌ చేసే శీతల్‌ను చూస్తే ఆశ్చర్యం కలగడంతో పాటు ముచ్చట వేయక మానదు. బైక్‌ నడపాలన్న కోరిక శీతల్‌కు చిన్నతనం నుండే ఏర్పడింది. మోటార్‌ సైకిల్‌ నడపడంపై తండ్రికున్న వ్యామోహమే ఆమెకు ప్రేరణ. బండి నడపడంపై ఆమెకున్న ఇష్టాన్ని చూసి తండ్రి ప్రోత్సాహంతో లామ్‌డేటా, వెస్పా వంటి వాహనాలను పెరుగుతున్న వయస్సులోనే నడిపింది. ప్రతి ఆదివారం తండ్రి బైక్‌ను శుభ్రం చేసుకుంటుంటే ఆసక్తిగా గమనిస్తూ ఉండేది. బైక్‌లోని భాగాలన్నిటిపై అవగాహన పెంచుకుంది. 'బైక్‌లపై ప్రేమ రక్తంలో ఉంది. అందుకే అలా జరిగిపోయిందం'టుంది శీతల్‌. 2000వ సంవత్సరంలో చనిపోయిన తండ్రిని గుర్తు చేసుకుంటూ... బాల్యంలోని ప్రతి అనుభూతీ తనకు ఎంతో ప్రియమైనదని ఆమె అంటుంది.

ఇది స్వేఛ్చానుభూతి!

                        'బైకింగ్‌ నాకు స్వాతంత్య్రం, స్వేచ్ఛల అనుభూతి నిస్తుంది. బైక్‌ నడపడానికి రోడ్డే నాకు స్ఫూర్తి. బైక్‌ నడుపుతున్నప్పుడు ఏర్పడే అనుభూతే బైక్‌ సవారీ వదిలి పెట్టనివ్వకుండా చేస్తోంది. బైక్‌పై సవారీ చేస్తూ విభిన్న ప్రదేశాలు తిరగడం నిజంగా జీవితంలో చాలా ఇష్టమైన విషయం' అని ఆమె చెబుతుంది. బైక్‌ రైడింగ్‌లోని ప్రతి నిమిషాన్ని ఆస్వాదిస్తుంది శీతల్‌. బైక్‌ రైడింగ్‌ చేసే క్రమంలో ఎన్నో ప్రదేశాలు తిరుగుతూ విభిన్న సంస్కృ తులు కలిగిన ఎంతో మందిని కలవడం జరుగుతుం టుంది. అరుణాచల్‌లోని కొండల మీద బైక్‌ నడిపిన అనుభవం ఆమెకు చాలా ప్రత్యేక అనుభూతిని మిగి ల్చింది. ఉద్విగభరితంగా, మనస్సు పులకరింప చేసేదిగా ఉన్న ఆ రైడ్‌ ఎంతో సంతోషాన్ని మిగిల్చింది అంటుంది. అందమైన కొండలు, ప్రేమను కనబరచే అక్కడి మనుష్యుల తీరు, అంతటి చలిని కూడా లెక్క చేయకుండా స్నేహితులతో కలసి చేసిన ఆ సరదా ప్రయాణం ఒక మరపురాని అనుభూతి. ఈ క్రమంలో వారితో పంచుకునే అనుభవాల నుండి చాలా నేర్చుకున్నానంటుంది. ''ప్రతి రోడ్‌ ట్రిప్‌ కొత్త విషయాలను నేర్చుకోవడానికి తోడ్పడే ప్రయాణం. ప్రపంచాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడే సాధనం. ప్రతి రైడ్‌ ఒక కొత్త అనుభవం. నన్ను నేను తెలుసుకోవడానికి అవెంతో ఉపకరిం చాయి'' అనడంలో శీతల్‌ బుద్ధికుశలత, ఆత్మవిశ్వాసం తొణికిసలాడతాయి.

                      ''మోటార్‌ సైకిల్‌ సవారీ నన్ను నేను తెలుసుకోవడానికి దోహదపడింది. నేను చేసినవి కేవలం ప్రయాణాలు కావు. ఎన్నో అనుభూతుల, అనుభవాల మాలికలు ప్రతి ప్రయాణంలో పరిసరాల నుండి, కలసిన మనుష్యుల నుండి పాఠాలు నేర్చుకుంటూనే ఉన్నాను'' అంటుంది శీతల్‌.

అంతా అమ్మ ప్రోత్సాహమే!

                            సాధారణంగా ఏ ఆడపిల్ల అయినా ఎంచుకోవడానికి భయ పడే రంగాన్ని ఎంచుకున్నప్పుడు ఆ ఆడపిల్లలే కాదు వాళ్ళ తల్లి తండ్రులకు కూడా సమాజం నుండి సవాళ్ళు తప్పవు. అలాగే శీతల్‌ తల్లికి కూడా 'నీకు కానీ పిచ్చి పట్టిందా! ఎందుకు ఇటువంటి పనులు చేయనిస్తున్నావు' అని కొన్ని వందల మంది అన్నారు. కానీ ఆమె ఆ మాటలను పట్టించుకోలేదు. అడుగడుగునా కూతురికి ప్రోత్సాహాన్నిచ్చింది. ఆమె తన కూతురిని దృఢంగా, స్వతంత్రంగా పెంచాలనుకుంది. అలానే పెంచింది. ''నేను కూడా ఆమె అంచనాలను అందుకుంటూ పెరిగాను. ఆమె ఆశ మేరకు జీవితంలో సాధించాను. ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే మా అమ్మే కారణం. ఆమే నా బలం'' అంటుంది శీతల్‌.

0 Comments
<<Previous

    Author

    నా పేరు సునయన ( ఉరఫ్ నర్మద). సు అంటే "మంచిది" అని, నయన అంటే "నేత్రములు" . సునయన అంటే మంచి కన్నులు కలది అని అర్థం. నా కళ్లతో చూస్తున్న ఈ  మహిళా ప్రపంచాన్ని మీముందు ఉంచాలని, అది మన మహిళాలోకానికి మేలు చేకూర్చాలని ఆశీస్తూ మనలో  ఒక  తెలుగు తరుణిగా నా ఈ చిన్ని ప్రయత్నం. 

    Archives

    January 2014
    December 2013
    November 2013
    October 2013
    September 2013
    August 2013
    July 2013
    June 2013

    Categories

    All
    ఏ అమ్మాయీ అమ్ముడవకూడదన్నదే నా లక్ష్యం
    ఆ మూడేళ్లూ కంటినిండా నిద్రలేదు..
    ఏ ఆడబిడ్డనూ ఇటువైపు రానివ్వను
    ఆటో కుమారి
    వేల మందికి కొత్త జీవితం!
    ఈమె పత్రికే ఓ రికార్డు
    పాత చిత్రాల పోస్టర్లతో ...కొత్త డిజైన్లు
    ఆమె ప్రతిభకు అమెరికా ప్రోత్సాహం
    ఇదొక 'అత్యవసర' సేవ!
    ఖేల్ రత్న కుంజరినీ దేవి
    రజనీ బాలలు
    తొలి మహిళా మంత్రి
    జీవన రాగమే మూగబోయింది
    నవీన వనితకు స్ఫూర్తి ప్రదాత.. శారదా దేవి
    కలలు డిజైన్ చేసుకున్న అమ్మాయి
    ఒంటి కాలితో గెలిచింది!
    వందల మందిని కాపాడింది...
    అడవి తల్లికి ఆడబిడ్డల పహరా
    ఐరాస మెచ్చిన అమ్మాయిలు
    పంటల పాఠాలమ్మ
    వసతి గృహాల్లో 'మనో పాఠాలు'
    సహాజ చిత్రాలతో కొత్త అందాలు
    సాయం చేసేందుకు పత్రిక పెట్టింది!
    జీవన సందేశానికి ఒక్క కుంచె చాలు!
    ధ్యాస
    తరుణీ .. ధిల్లానా !
    నిన్న ఆటో డ్రైవర్.. నేడు లాయర్..!
    అంధుల కోసం పత్రిక
    నృత్య వైభవం
    బుకర్ బరిలో జుంపా
    పాతిక లక్షల నష్టం పాఠాలు నేర్పింది!
    లక్కీ ఛాన్స్
    ఈమెను చూస్తే లోకమే చిన్నబోతుంది
    నెలలు నిండని జ్ఞాపకాలు
    తిండి మారితేనే తరాలు బాగుపడతాయి
    మహిళా సమస్యలపై పోరాటం
    చీకటి జీవితాలకు కొత్త వెలుగు...
    మహిళా సాధికారతే లక్ష్యంగా మన్ దేశీ
    ఖైదీల జీవితాల్లో కాంతిరేఖ
    పక్షి ప్రేమికురాలు
    మహిళా పారిశ్రామికవేత్తలకు స్పూర్తి
    పరుగుల షైనీ
    అందమైన సెల్ కవర్లు ఫేస్ బుక్ లో అమ్మేస్తా!
    అవయవాల పంటకు అక్షర సేద్యం
    అశ్వనీ మలాలా!
    కావ్యా టీచర్...మా బడికి రండి
    విరామం తర్వాత విజేతలయ్యేలా!
    మనసుకు నచ్చిందే చదువు
    సాగులో ఆందెవేసిన చేయి కూతురే కొడుకయింది
    అద్భుత ప్రతిభాశాలి వి.యస్. రమాదేవి
    రొమ్ము క్యాన్సర్‌పై జనచైతన్యం
    సేవలోనూ రాణే
    అనుపమాన కృషి
    కారుణ్య బంధం
    రేసింగ్ బైక్ పై నవతరం అమ్మాయి
    అందులకు అండగా..
    నైనానంద ప్రతిభ
    అక్షరమే అతివకు అండ..
    ప్రపంచం మరువలేని మేడమ్‌ క్యూరీ
    ఉపాధితో వెన్నుదన్ను
    ఆకాశమంత ఆత్మవిశ్వాసంతో ముందడుగు
    సమస్యలను మించి పరుగు
    పరదేశంలో చదువు మనదేశంలో సేవ
    పడిలేచిన కెరటం..!
    రుక్మిణి త్యాగం
    తండ్రిని మించిన తనయ
    రుబ్బుడు చదువులు మనకొద్దు :సుచిస్మిత
    పద్మశ్రీ వారియర్‌
    ఆదివాసుల ఆత్మఘోషకు తొలి కదలిక
    వీరీవీరీ గుమ్మడిపండ్లు
    తెలుగందం... మెరిసింది
    ఆణిముత్యం
    ఎగిరిపోతే ఎంత బాగుందో!
    రికార్డుల రాణి ఎలెనా
    అమ్మలగన్న అమ్మ నరసమ్మ!
    సోనాగచికి కొత్త ఆశాదీపం... ఇషిక!
    వ్యాపారమే జీవితం
    విజయోత్సవ నృత్యం
    ఆత్మరక్షణ పాఠాలతో అండ
    సమాజాన్ని కుంచెతో తట్టిలేపిన ధీర
    హైదరాబాద్ సంస్కృతి అంటే ప్రాణం
    స్వాతంత్య ఉద్యమంలో...మహిళామణులు
    ఆఫ్రికాలో అన్నపూర్ణ...
    పాకిస్తాన్ లో తొలి మహిళా ఫైటర్ పైలట్
    మనోనేత్రమే ఆమె జీవిత నేస్తం
    పాకిస్తాన్ సాహాస బాలిక .. మలాలా
    అంతర్జాతీయ కీర్తి కిరీటం
    మృత్యువునే పరిహసించిన సాహస బాలిక
    తెల్లమ్మాయి 'చెత్తశుద్ధి'
    కెమెరాఉమెన్ మల్లీశ్వరితో…
    ఆత్మవిశ్వాసం
    స్వధార్‌హోమ్ వంచితులకు ఆసరా
    ప్రశ్నిస్తేనే ప్రపంచం తెలిసేది...
    కాల్పనికకథలతో ఓలలాడించిన కలం
    1f435d7218
    24050e4082
    245c28fe88
    261cdb5043
    2818b63e80
    28389ca502
    2b0e1c1639
    2fa703fa92
    అంచెలంచెలుగా ఎదిగిన మహిళ: పాక్ విదేశాంగమij
    ఎన్నారై భర్తతో గెంటివేయబడ్డ కోమల్ ప్రవీణ
    హార్వార్డ్ లో భారతీయ తొలి మహిళా ప్రొఫెసరĺ
    31c13c6389
    3554a3419a
    35656ad80d
    55a74999b9
    5780c63669
    57c51a6293
    581f19c0c8
    596314788a
    5b25932644
    601df7f45e
    6038f96c83
    60bb50a07e
    6ac90962a4
    6acc2723b8
    6eceeac0ef
    72a7da41c2
    88cfd59ee5
    994726a014
    A2999c254a
    A31cb50ffd
    A90748427f
    Aaf6b495b5
    B68abb9e8a
    B72ae5d725
    C08f40206b
    E88f0055d9
    F3fc20019d
    F85bffc883
    F9ded65a21
    Fbb115455d
    Fcf7a2fc59
    Freedom Fighter Laxmi Sehgalpng5013f7c557

    RSS Feed


Powered by Create your own unique website with customizable templates.