
బొంబాయి రవ్వ - 100 గ్రా.
పాలు - 100 మి.లీ.
మైదా - 50 గ్రా.
గోధుమ పిండి - 50 గ్రా.
పంచదార - 50 గ్రా.
యాలకుల పొడి - టీస్పూన్
నెయ్యి - వేయించడానికి సరిపడా
తయారుచేసే పద్ధతి :
- బొంబాయి రవ్వను పాలల్లో వేసి 20 నిమషాల సేపు నాననివ్వాలి.
- తరువాత మైదా, గోధుమ పిండి వేసి చిక్కని ముద్దలా కలుపుకోవాలి.
- ఇప్పుడు పంచదార, యాలకుల పొడి కూడా వేసి అవసరమైతే కొద్దిగా నీళ్ళు కూడా చిలకరించి ఓ పది నిముషాలు నాననివ్వాలి.
- బాణలిలో నెయ్యి వేసి కాగాక మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేస్తూ బోండాం మాదిరిగా వేయించి తీయాలి.
మూలం : ఈనాడు ఆదివారం పుస్తకం