
మైదా - 500గ్రా.,
సోడా-1/2 టీ స్పూను,
పెరుగు- గరిటెడు
తయారు చేసే విధానం:
- ముందుగా మైదాపిండి, వంట సోడాలను కలిపి జల్లెడలో జల్లించి, అందులో గడ్డగా కాకుండా వేడిచేసి చల్లార్చిన నెయ్యి కలపాలి. మొత్తం పిండిలో నెయ్యి అంతా కలిసేలా చూడాలి. తర్వాత అందులో పెరుగు కూడా కలిపి, కొంచెం కొంచెం నీళ్లు చల్లుతూ గట్టి పిండి ముద్దలా చేసి 10 నిమిషాలు నాననివ్వాలి.
- ఆ పిండిని గులాబ్జామ్లంత సైజులో ముద్దలుగా చేయాలి. వాటిని రెండు అరచేతుల మధ్య గట్టిగా రుద్దుతూ, గుండ్రని ముద్దలుగా చేయడం వల్ల, గుల్లపడి బాదూషాలా తయారు చేయడానికి వీలవుతుంది.
- ఇలా చేసిన పిండి ముద్దల మధ్యలో రెండు పక్కలా బొటనవేలు చివరతో నొక్కాలి.
- ఇపుడు సన్నని మంట మీదున్న ఒక బాణలిలో నెయ్యి పోసి, దానిలో పిండిముద్దలను లేత బంగారురంగు వచ్చే వరకూ చేయించి, వాటిని ఒక ట్రేలో వరసగా అమర్చాలి.
- ఆ తర్వాత ఒక గిన్నెలో చక్కెర వేసి, దానికి మూడు కప్పుల నీళ్లు కలిపి వేడిచేసి లేతపాకంలా తయారయ్యాక దానిని అమర్చి ఉంచుకున్న బాదుషాల మీద పోస్తే పాకం అంతా ఇంకిపోతుంది.