
ఛాయపెసరపప్పు : కేజీ,
పంచదార : కేజీ,
నెయ్యి : 400 గ్రాములు,
జీడిపప్పు : 50 గ్రాములు,
యాలకులు : 6,
నీళ్లు : తగినన్ని,
పచ్చకర్పూరం : చిటికెడు.
తయారు చేసే విధానం
పెసరపప్పు వేయించి మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి. పంచదారలో సరిపడా నీళ్లు పోసి తీగపాకం వచ్చేవరకు ఉడికించాలి. అందులో పచ్చకర్పూరం, యాలకుల పొడి వేసి కలపాలి. ఆ తర్వాత పెసరపొడి, కొద్దికొద్దిగా నెయ్యి వేస్తూ బాగా కలిపి దించాలి.అందులోనే నేతిలో వేయించిన జీడిపప్పు పలుకులు కలపాలి. గోరు వెచ్చగా ఉన్నప్పుడే ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. ఇవి ఒక రోజు తర్వాత తింటే చాలా రుచిగా ఉంటాయి.