బియ్యం : ఒక కిలో
బెల్లం కోరు : ముప్పావు కిలో
నువ్వులు : కొద్దిగా
నూనె : వేయించుకోవడానికి సరిపడా
తయారుచేసే పద్ధతి :
ముందుగా బియ్యాన్ని శుభ్రముగా కడుక్కొని, ఒక రాత్రంతా నానబెట్టుకోవాలి. మరుసటి రోజు పొద్దున్నే ఆ నీటిని వడకట్టి, నీరు పోయేదాకా ఒక గుడ్డమీద ఆరబెట్టుకోవాలి. తడిలేని బియ్యాన్ని పొడి చేసుకొని జల్లడ పట్టుకోవాలి. బెల్లం పొడికి కప్పు నీరు కలిపి స్టవ్ మీద పెట్టుకొని చిక్కటి పాకం వచ్చేదాకా కలపెట్టాలి. ఇలా తయారైన బెల్లం పాకానికి, బియ్యం పిండి కొంచెం తిప్పుతూ బాగా కలిసి పోయేట్టు కలుపుకోవాలి. పొయ్యి మీద నుండి దించుకొని ఉండలు లేకుండా చేసుకోవాలి. దీనిని వేడిగా ఉన్నప్పుడే ఉండలు చుట్టుకోవాలి. బాణలిలో నూనె పోసి స్టవ్ మీద పెట్టుకోవాలి. చేతి మీద ప్లాస్టిక్ పేపర్ లేదా అరిటాకు వేసుకొని, దానికి నూనె రాసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క ఉండా తీసుకొని కొన్ని నువ్వులు చల్లుకొని పూరిలాగా చిన్న మంట మీద నూనెలో వేపుకోవాలి. ఒక్కోదాన్ని అట్లాకాడల మద్య నూనె బాగా పోయేట్టు నొక్కుతూ బయటకి తీయాలి.
మూలం : ఆదివారం ఆంధ్రప్రభ