
మైదా - 500గ్రా.,
నెయ్యి - 100గ్రా.,
ఉప్పు -చిటికెడు,
చక్కెర -350గ్రా.,
కొబ్బరికాయలు-2,
గసగసాలు -100గ్రా.,
పుట్నాల పప్పు- 150గ్రా.,
యాలకులు -5గ్రా.,
ఆయిల్- తగినంత
తయారు చేసే విధానం:
మైదాపిండిని జల్లించి దీనికి ఉప్పు, నెయ్యి కలివి నీళ్ళతో పూరీల పిండి లా కలపండి. ఒక బాణలిలో తురిమిన కొబ్బరికోరు వేసి సన్నని మంటమీద వేయించిన తర్వాత అందులో పుట్నాల పప్పుపొడి, గసగసాలు, చక్కెర కూడా వేసి బాగా వేయించి స్టౌ మీది నుంచి దింపి, యాలకుల పొడి కలివి పక్కన ఉంచండి. ముందుగా కలివి సిద్ధం చేసుకున్న మైదాను చిన్న, చిన్న ముద్దలుగా చేసుకొని వాటిని పూరీల్లా వత్తి, దాని మధ్యలో బాణలిలో తయారు చేసిన కొబ్బరి తురుము, పుట్నాల పప్పు విండి మిశ్రమాన్ని రెండు స్పూనులు వేసి పూరీని మధ్యకు మడవండి. అర్ధ చంద్రాకారంలో వస్తుంది. తర్వా త వాటి చివరలను తడి చేసి మడత మీద మడత వేసి వేళ్లతో గట్టిగా అదమండి. ఈ విధంగా చేయడం వల్ల మడత లోపలి మిశ్రమం బయటకు రాదు. ఇలా తయారయిన కజ్జికాయలను కాగిన నూనెలో ఎర్రగా వేయించండి.