telugutaruni.weebly.com
  • Home
  • వంటకాలు (Cookeries)
    • ఫలహారాలు (Tiffins)
    • శాకాహారం (Veg)
    • బియ్యపు వంటలు (Rice items)
    • మాంసాహారం (Non-Veg)
    • పచ్చళ్ళు (chutneys)
    • వడియాలు
    • పండ్ల రసాలు (Juices)
    • స్వీట్స్ (Sweets)
    • చిరుతిళ్ళు (Snacks)
    • గ్రేవీ ఐటమ్స్
    • సూప్స్ (Soops)
    • కొత్త కొత్తగా
  • చిట్కాలు (Tips)
    • వంటింటి చిట్కాలు ( Kitchen Tips)
    • ఆరోగ్య చిట్కాలు (Health Tips)
    • సౌందర్య చిట్కాలు (Beauty Tips)
  • మహిళా లోకం
    • ఆదర్శ మహిళలు
    • శభాష్ మహిళా..
  • విహారయాత్ర

తండ్రిని మించిన తనయ

11/12/2013

0 Comments

 
Picture
తొలిసారే 1,72,043 మెజారిటీ
ఎఐసిసి సెక్రటరీగా నియామకం
సమస్యలపై నిరంతర పోరాటం
ట్రస్టుతో ఇతర రాష్ట్రాల్లోనూ సేవలు
  చేయడం అంటే ఎంతో అభిమానం

ప్రియాదత్‌ యువ రాజకీయ నేతల్లో తనదైన ముద్ర వేసుకున్న నాయకురాలు. సునీల్‌ దత్‌ కూతురిగా, సంజయ్‌దత్‌ సోదరిగా రాజకీయాల్లోకి వచ్చినా తన కంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సంపాదించుకున్నారు. మెుదటిసారి 14వ లోక్‌సభకు ముంబయ్‌ ఉత్తర నియోజకవర్గం నుంచి ఎంపికయ్యారు. కాంగ్రెస్‌ పార్టీ తరుఫున ఎన్నికల బరిలోకి దిగి విజయం సాధించారు. ప్రస్తుతం 15వ లోక్‌సభలోనూ కొనసాగుతున్నారు.

బాలీవుడ్‌లో పేరుపొందిన నటుడు సునీల్‌ దత్‌ కూతరు ప్రియాదత్‌. తల్లి నర్గీస్‌ కూడా పేరుపొందిన నటి. వీరిద్దరూ గతంలో కాంగ్రెస్‌ పార్టీ తరుఫున పోటీ చేసి విజయం సాధించారు. సునీత్‌ దత్‌ మంత్రిగా కూడా పనిచేశారు. సంజయ్‌ నటనను వారసత్వంగా ఎంచుకోగా ప్రియా మాత్రం రాజకీయాలను ఎంచుకుంది. తండ్రి నుంచి ఎన్నో రాజకీయ పాఠాలు నేర్చుకుంది. రాజకీయ నాయకురాలు అనే హోదా కోసం కాదని ప్రజా సేవ చేయడమే తన పరమార్థం అని ఆమె ఎప్పుడూ చెబుతుంటారు. యూనివర్సిటీలో డిగ్రీ పూర్తికాగానే టెలివిజన్‌ అండ్‌ వీడియో రంగంలో కొంత కాలం పనిచేసింది. తరువాత న్యూయార్క్‌లో మీడియా ఆర్ట్‌‌సలో విద్యను అభ్యసించింది. 1992-93లో జరిగిన అల్లర్ల కారణంగా సర్వం కోల్పోయిన ముస్లిం శరనార్థుల కోసం ఆమె సహాయ చర్యలు తీసుకున్నారు. 2005లో రాజకీయ అరంగేట్రం చేసిన ముంబయ్‌ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. శివసేన పార్టీ లీడర్‌పై 1,72,043 ఓట్ల మెజారీటీ సాధించింది.

ఎన్నికల్లో పోటీ చేసిన తొలిసారే ఇంత పెద్ద మొత్తంలో మెజారిటీ విజయం సాధించిన మహిళగా ఈమె పలువురి ప్రశంసలు పొందారు. దీంతో ముంబయ్‌లో మీడియా వర్గాలు దత్‌ విజయంపైనే ఫోకస్‌ చేశాయి. అన్యూహ్య విజయం అంటూ పొడగ్తల వర్షం కురిపించాయి. తండ్రిని మించిన తనయ అంటూ ఆకాశానికి ఎత్తేశాయి. కానీ ఆమె ఈ రాతలకు, ప్రశంసలకు ఏ మాత్రం పొంగిపోలేదు. అంత మెజారిటీతో గెలిపించిన ప్రజలకు తాను ఏం చేయగలనో అన్న దానిపైనే ఆమె దృష్టి పెట్టారు. విచిత్రంగా ఈ ఎన్నికలకు కొద్ది రోజుల ముందే ఆమె ఓ బాబుకు జన్మనివ్వడం జరిగింది. దీంతో కొంత ప్రచారానికి ఇబ్బంది ఏర్పడింది. తరువాత ప్రియా ఆలిండియా కాంగ్రెస్‌ కమిటీ సెక్రటరీగా నియమితులయ్యారు. ఆమె పరిధిలోని శాసనసభ్యులు, అధికారులు, కుల సంఘాల నాయకులతో నిరంతరం మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి విశేషంగా కృషి చేశారు. అదో టైంటేబుల్‌లా ఏర్పాటు చేసుకున్నారంటే ఆమె చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చు. ప్రజలకు ఉత్తమ పాలన అందించడం కోసం ఎల్లప్పుడూ శ్రమిస్తూనే ఉండేది. అంతేకాదు పేదలకు సాయం చేయడం కోసం తల్లి నర్గీస్‌ పేరు మీద ఓ ట్రస్టును ఏర్పాటు చేశారు. ఈ ట్రస్టు ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. 2008 బీహార్‌లో వరదలు వచ్చి ఎంతో మంది నిరాశ్రయులుగా మారారు.

మన రాష్ట్రం కాదు కదా .. మనకెందుకు అని అనుకోకుండా వందలాది మంది వంటపాత్రలు, బియ్యం అందజేయడంలో ఈ ట్రస్టు కీలకపాత్ర పోషించింది. నేరుగా భర్తతో కలిసి ప్రియా సహాయ శిబిరాలను సందర్శించి వస్తుసామగ్రిని పంపిణీ చేశారు. కామతిపుర ప్రాంతంలోని సెక్స్‌ వర్కర్లను ఆ ఊబిలోంచి బయటకు తీసుకుని వచ్చి వారికి ఉపాధి కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి తన విన్నపాన్ని తెలియజేశారు. అందుకు ఆయన కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు ఆమె పేర్కొన్నారు. ఓవెన్‌ రాన్‌కాన్‌ను వివాహం చేసుకుంది. ఓరాన్జాస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌లో ఈయన వాటాదారుడు. ఇది వివిధ దేశాల్లో మ్యూజిక్‌ను అందించే కంపెనీ. రాన్‌కాన్‌, ప్రియాలకు ఇద్దరు సంతానం సిదార్థ, సుమీర్‌.


0 Comments

ఆత్మరక్షణ పాఠాలతో అండ

11/8/2013

0 Comments

 
Picture
చిన్నప్పుడే నాన్న చనిపోయారు. తాను చదువుకోవడమే కష్టమైన పరిస్థితుల్లో, చుట్టుపక్కల గ్రామాల్లోని ఎందరో అమ్మాయిల్ని చదువుల బాటలో నడిపించిన వైభవి... యునిసెఫ్‌ నుంచి నవజ్యోతి అవార్డు గెలుచుకుంది.

          మాది మారుమూల గ్రామం. అమ్మాయిలకు రక్షణ తక్కువ. ఈ కారణాలతో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని చదివించేవారుకాదు. మా అమ్మానాన్నలు రోజు కూలీలే. కానీ నన్ను బాగా చదివించాలని కలలు కన్నారు. ఇబ్బంది అయినా బడికి పంపేవారు. నాకు పదేళ్లు ఉన్నప్పుడు నాన్న అనారోగ్యంతో చనిపోయారు. తట్టుకోలేకపోయా. బడికెళ్లడం మానేశా. అమ్మ ఓదార్చింది. 'నువ్వు చదువుకుని ఈ గ్రామం వాళ్లకీ దారి చూపిస్తావని నాన్న అనుకుంటే ఇలా చేస్తావేం..' అని కోప్పడింది. దాంతో స్కూలు దూరమైనా ధైర్యంగా వెళ్లేదాన్ని.

                ఒకసారి దారి మధ్యలో ఓ వ్యక్తి నాతో అసభ్యంగా ప్రవర్తించి, అత్యాచారం చేయబోయాడు. అమ్మ నూరిపోసిన ధైర్యం గుర్తొచ్చింది. బ్యాగుతో బలవంతంగా అతని తలమీద కొట్టి తప్పించుకున్నా. తరవాత గ్రామంలోని అమ్మాయిలతో మాట్లాడితే 'ఇంట్లోంచి కాలు బయటపెట్టాక ఇలాంటి బాధలు చాలానే పడ్డాం' అని చెప్పారు. ఈ అన్యాయాని ఎన్ని రోజులు భరించాలి... కచ్చితంగా అడ్డుకోవాలి అనుకున్నా. వూళ్లో అమ్మాయిలందర్నీ ఒకచోటికి చేర్చాను. వేధింపులనీ, అఘాయిత్యాలనీ, బాల్యవివాహాల్నీ ఎదుర్కొందాం అని ధైర్యం నూరిపోశాను. అందర్నీ ఒప్పించడానికి రెండు నెలలు పట్టింది. 'నలుగురైదుగురు కలిసి వెళ్లండి. పుస్తకాల బ్యాగుల్నే ఆయుధాలుగా చేసుకోండి. చదువు మాత్రం మానొద్దు' అనే నినాదంతో ప్రచారం మొదలుపెట్టా. దారికాచి అడ్డుకునే వాళ్లకి, బ్యాగులతో ఎలా బుద్ధి చెప్పొచ్చో శిక్షణ ఇప్పించా. బాల్య వివాహాలు చేసే తల్లిదండ్రులతో మాట్లాడా. చిన్న వయసులో పెళ్లి చేస్తే ఎన్ని సమస్యలొస్తాయో వైద్య నిపుణులతో చెప్పించా. అలా చాలా పెళ్లిళ్ళు ఆపగలిగా. కిందటేడాది ఇంటర్‌ పూర్తయింది. ఇప్పుడు మా సొంతూరు మహారాష్ట్రలోని చంద్రాపూర్‌ జిల్లాలో నా పేరు తెలియని వాళ్లుండరు. వేల మంది చదువుకునేలా స్ఫూర్తిని అందించినందుకు గాను యునిసెఫ్‌ 'నవజ్యోతి' అవార్డు నాకు లభించింది.

0 Comments

మహిళా పారిశ్రామికవేత్తలకు స్పూర్తి

11/7/2013

0 Comments

 
Picture
తొలిసారిగా పత్రికా రంగంలో ప్రవేశం
తరువాత రాజకీయాల్లోకి...
యుపిఏ హయాంలో రాజ్యసభకు నామినేట్‌
బాల్య వివాహాల రద్దుకు పోరాటం
వ్యాపార దక్షతలోనూ తనకు తానే సాటి


              దేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలో ఒకరైన ేకేక బిర్లాకు కుమార్తెగా శోభన భార్టీయా అందిరికీ తెలుసు. తన పుట్టినిల్లే కాదు, మెట్టినిల్లు సంపన్న కుటుంబమే. అరుున తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలని చిన్ననాటి నుంచే తపించేవారు. పత్రికా రంగంలో చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌గా సేవలను అందించారు. రాజ్యసభలోనూ అడుగుపెట్టి బాల్య వివాహాలను అరికట్టాలని తన గళాన్ని బలంగా వినిపించారు. ఇలా చేపట్టిన ప్రతి పనిలో తన శైలితో ముందుకు దూసుకుపోతున్నారు శోభన. 2009 ఫోర్బ్‌‌స పత్రిక వెల్లడించిన దేశంలోని ధనికుల తొలి వంద మంది జాబితాలో 76 స్థానాన్ని ెకైవసం చేసుకున్నారు. అనేక మంది మహిళా పారిశ్రామికవేత్తలను స్ఫూర్తిగా నిలిచారు.

                    2006లో ది హిందూస్థాన్‌ టైమ్స్‌ గ్రూప్‌కి చైర్‌ పర్సన్‌గా, ఎడిటోరియల్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు శోభన చేపట్టారు. శోభనా భార్టియా 1957లో జన్మించారు. పారిశ్రామిక నేత కేకే బిర్లా కుమార్తె. జీడీ బిర్లాకు మనవరాలు. బిర్లా కుటుంబంలో ఆడపిల్లగా జన్మించినా ఆ వ్యాపార చతురత ఈమెకి వంటబట్టింది. కేకే బిర్లా కుటుంబం హెచ్‌టీ మీడియాలో 75.36 శాతం స్టాక్‌ను కలిగి ఉంది. దీని విలువ దాదాపు రూ.834 కోట్లు (2004) కలకత్తా యూనివర్శిటీలో గ్రాడ్యుయేట్‌ని శోభన పూర్తి చేశారు. శ్యాంసుందర్‌ భాటియాను పెళ్లి చేసుకుంది. ఇతను రూ.14 బిలియన్‌ విలువ కలిగిన ఫార్మా సంస్థ జూబిలాంట్‌ ఆర్గానోసిస్‌ లిమిటెడ్‌కు చైర్మన్‌. శ్యాం సుందర్‌ భార్టియా తండ్రి లేట్‌ మోహన్‌ లాల్‌ భార్టియా. వారి కుమారుడు షమిత్‌ భార్టియా హెచ్‌టీ మీడియా గ్రూప్‌కు డైరెక్టర్‌. శోభన మెట్టినింటి వారు కూడా ప్రముఖ వ్యాపార వేత్తలు కావడంతో తనకున్న ఆలోచనలు అమలు చేయడానికి అవకాశం దొరికింది. శ్యాం సుందర్‌లకు పలు వ్యాపారాలున్నాయి. డోమినో పిజ్జా ఫ్రాంచీజ్‌ వంటి లైఫ్‌ స్టైల్‌ బిజినెస్‌ లను ఏర్పాటు చేశారు. అలాగే బెంగళూరులో స్టోర్‌ చెయిన్‌ నడిపిస్తున్నారు.

                   1986 సంవత్సరం హిందూస్తాన్‌ టైమ్స్‌లో శోభన ఉద్యోగంలో చేరారు. ఒక జాతీయ దినపత్రికలో చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌గా చేరిన తొలి మహిళగా శోభన నిలిచారు. అంతే కాకుండా తక్కువ వయసులో ఆ బాధ్యతను నిర్వర్తించిన మగువగా పేరుగాంచారు. జర్నలిజంలో ప్రవేశం లేకపోయినా తన బాధ్యతను చక్కగా నెరవేర్చేవారు.2006 ఫిబ్రవరిలో శోభన రాజ్యసభకు ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌ అధ్యక్షులు సోనియాగాంధీ ప్రోత్సాహంతో పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. ఈ స్థానాన్ని సైన్స్‌, ఆర్ట్‌, సామాజిక సేవల్లో నిపుణులైన వారికి కేటాయిస్తారు. మీడియాలో సేవ కేటగిరిలో ఆ స్థానం దక్కించుకున్నారు. సామాజిక సేవ విభాగంలో ఆమెను ఎన్నుకున్నారు. 2006లో బాల్యవివాహాలను రద్దు చేయాలని రాజ్యసభలో తన వాదాన్ని శోభన గట్టిగా వినిపించారు.వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం(1996) నుంచి గ్లోబల్‌ లీడర్‌ ఆఫ్‌ టుమారో అవార్డును తీసుకుంది. 2001లో పీహెచ్‌డీ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ వ్యాపార వేత్తగా నిలిచారు. నేషనల్‌ ప్రెస్‌ ఇండియా అవార్డు 1992 తీసుకున్నారు.

                           బిజినెస్‌ వుమన్‌ అవార్డు, ఎకనామిక్‌ టైమ్స్‌ అవార్డ్‌‌స ఫర్‌ కార్పొరేట్‌ ఎక్సలెన్స్‌ అవార్డ్‌‌స 2007 తీసుకున్నారు. ప్రస్తుతం ఎండీవర్‌ ఇండియాకు చైర్మన్‌గా ఉన్నారు. 2001లో పంజాబ్‌, హర్యాన, ఢిల్లీ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ నుంచి బిజినెస్‌ ఉమెన్‌ అవార్డు అందుకున్నారు. అంతేకాకుండా 2003లో భారతీయ మీడియా శక్తివంతురాలైన 50 మంది మహిళా జాబితాలో చోటు చేసుకున్నారు. శోభన హిందూస్థాన్‌ టైమ్స్‌ అండ్‌ హిందూస్థాన్‌లో ప్రముఖ పదవిలో కొనసాగారు. హెచ్‌టీని శోభన తాతయ్య ఘన్‌శ్యామ్‌ దాస్‌ బిర్లా స్థాపించారు. దీనిని మహాత్మ గాంధీ 1924లో ప్రారంభించారు.

                           తన తండ్రి మీడియా బిజినెస్‌లో కొనసాగారు. ఈమె వివాహం అనంతరం 1985లో పదవిలో చేరారు. భర్త శ్యామ్‌ భార్టియా ఈ ఫోర్బ్‌‌స జాబితాలో 54వ స్థానాన్ని దక్కించుకున్నారు. ఇక్కడ పత్రికలే కాకుండా వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ని 2007లో భాగస్వామి తీసుకున్నారు. అలాగే పబ్లిస్‌ మింట్‌, డెయిలీ బిజినెస్‌ న్యూస్‌ పేపర్‌. ఎఫ్‌ రేడియో చానల్‌ను నడిపించేందుకు వర్జిన్‌ రేడియోతో వీరు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈమె ఇద్దరూ కొడుకులు తనతో పాటే కలిసి పని చేస్తున్నారు. ఈమె శాఖాహారి. అయినా ఎంతో ఫిట్‌గా ఉంటారు.

                2004లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత 2005లో మొదటిసారి పద్మశ్రీ అవార్డుకు శోభన నామినేట్‌ అయ్యింది. ఈ అవార్డు జర్నలిజంలో పనిచేసిన వారి ఇస్తారు. కాని జర్నలిస్ట్‌ కంటే ఈమె పారిశ్రామిక వేత్తగానే ఎక్కువగా ఉందని కొన్ని ఆరోపణలు ఎదుర్కొన్నారు. పద్మశ్రీ అవార్డు, రాజ్యసభ నామినేషన్‌ రెండూ యూపీఏ ప్రభుత్వం పరిపాలన కాలంలో జరిగాయి.

0 Comments

ఖైదీల జీవితాల్లో కాంతిరేఖ

11/5/2013

0 Comments

 
Picture
జైలంటే శిక్షలూ, బాధలూ అన్న భావనను దూరం చేస్తూ... ఉదయ్‌పూర్‌లోని జైలు ఒక ఆశ్రమంలా కనిపిస్తుంది. ఉదయం లేచింది మొదలు అక్కడున్న ఖైదీల దినచర్య యోగా, ధ్యానంతో మొదలై... రాత్రి పుస్తకాలు చదవడంతో ముగుస్తుంది. శిక్ష అనుభవిస్తున్న వాళ్లలో చాలామంది చదువులతో రాణించారు. బయటికొచ్చాక ఉద్యోగాలు సాధించారు. మరి ఇదంతా ఎలా సాధ్యమైందంటే... వందల మంది ఖైదీల్లో మార్పు తీసుకొచ్చిన ఇందిర గురించి చదవాల్సిందే! ఉదయపూర్  జైల్లో ఎవర్ని అడిగినా వాళ్లంతా చెప్పే పేరు ఇందిర.

జైలంటే శిక్షలూ, బాధలూ అన్న భావనను దూరం చేస్తూ... ఉదయ్‌పూర్‌లోని జైలు ఒక ఆశ్రమంలా కనిపిస్తుంది. ఉదయం లేచింది మొదలు అక్కడున్న ఖైదీల దినచర్య యోగా, ధ్యానంతో మొదలై... రాత్రి పుస్తకాలు చదవడంతో ముగుస్తుంది. శిక్ష అనుభవిస్తున్న వాళ్లలో చాలామంది చదువులతో రాణించారు. బయటికొచ్చాక ఉద్యోగాలు సాధించారు. మరి ఇదంతా ఎలా సాధ్యమైందంటే... వందల మంది ఖైదీల్లో మార్పు తీసుకొచ్చిన ఇందిర గురించి చదవాల్సిందే! దయ్‌పూర్‌ జైల్లో ఎవర్ని అడిగినా వాళ్లంతా చెప్పే పేరు ఇందిర.

                       మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆమె ఖైదీల్లో మార్పు కోసం కృషి చేసింది. అందుకోసం రోజూ జైలుకి వచ్చి శిక్ష అనుభవిస్తున్న వారిని గమనించేది. కొందరు అపరాధ భావంతో కుంగిపోయేవారు. ఇంకొందరు కోపంతో వింత చేష్టలతో జైలు సిబ్బందిని ముప్పుతిప్పలు పెట్టేవారు. అలాగని వారి చేష్టలకు ఇందిర విసిగిపోలేదు. క్షణికావేశంలో నేరాలు చేసి అక్కడికొచ్చిన వారి జీవితాలు పూర్తిగా పాడయిపోకుండా చూడాలనుకుంది. ఆమె 'ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌' గురు రవిశంకర్‌ శిష్యురాలు. యోగా, ధ్యానంతో వారిలో మార్పు తీసుకురావడం సాధ్యమే అనుకుంది. కానీ అది సాధ్యమయ్యే పనేనా? మొదట ఖైదీలు మాట వినాలి. అధికారులూ అనుమతి ఇవ్వాలి. ఈ రెండింట్లో మొదటిది జరిగితే, రెండోదాన్ని సాధించొచ్చు. అందుకే మొదట మహిళా ఖైదీలకు దగ్గరవ్వడానికి ప్రయత్నించింది.

                       కొందరు భయపడి దూరం జరిగారు. మరికొందరు తనపై దాడి చేసి, హింసాత్మకంగా ప్రవర్తించారు. ఇందిర అన్నీ ఓపిగ్గా భరించింది. తరచూ వారి మంచీచెడులూ కనుక్కొంటూ.. కుటుంబ సభ్యుల క్షేమ సమాచారాలు తెలుసుకుని వూరటనిచ్చేలా మాట్లాడేది.ఇలా ఏడాది పాటు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఒక్కొక్కరుగా అందరూ తనని అర్థం చేసుకుని, ఆమె చెప్పినట్టు వినడం, మంచి పద్ధతులు పాటించడం చేశారు. సరిగ్గా అప్పుడు, వారికి రకరకాల నైపుణ్యాలు నేర్పించడానికి జైలు అధికారుల అనుమతి కోరింది. మొదట వాళ్లు ఒప్పుకోలేదు. కానీ మహిళా ఖైదీలు, ఆమె మాటలకిచ్చే విలువను ప్రత్యక్షంగా చూశాక ఒప్పుకోక తప్పలేదు. దాంతో జైల్లో యోగా, ధ్యానం తరగతులు మొదలయ్యాయి. కోపావేశాలను తగ్గించుకుని ఆనందంగా జీవించేలా 'ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌' గురించి అవగాహన కల్పించింది.

                     నిరక్షరాస్యులకు చదవడం, రాయడం నేర్పించింది. ఆర్నెల్లు తిరిగేసరికి జైలు వాతావరణంలో మార్పొచ్చింది. అల్లర్లూ, గొడవలూ తగ్గాయి. ఖైదీలలో జీవితం పట్ల కొత్త ఆశలు కలిగాయి. ఇదంతా గమనించిన అధికారులు ఆశ్చర్యపోవడమే కాదు... మరిన్ని మంచి పనులు చేయమని ఇందిరను ప్రోత్సహించారు. నెలకు రెండుసార్లు సైకాలజీ వర్క్‌షాపులూ... ప్రతి ఆదివారం యోగాకు సంబంధించిన సెమినార్లూ ప్రారంభమయ్యాయి. కళాశాల సెలవుల్లో విద్యార్థులనూ, లెక్చరర్లనూ పిలిపించి ఆసక్తి ఉన్నవారికి ఆంగ్లం, కంప్యూటర్‌ తరగతులూ... ఉన్నత విద్యావంతులకు ఫ్రెంచ్‌, జర్మన్‌ క్లాసులూ ఏర్పాటు చేసింది. జైలులో ప్రత్యేకంగా గ్రంథాలయం ఏర్పాటు చేసింది. ఉన్నతాధికారులతో మాట్లాడి వేల పుస్తకాలు తెప్పించి అందుబాటులో ఉంచింది. ప్రతి ఒక్కరూ రాత్రిపూట పడుకొనే ముందు కచ్చితంగా కాసేపయినా చదువుకోవాలనే నిబంధన పెట్టింది.

                         ఈ విధంగా మీ ప్రవర్తనలో తెచ్చుకునే మార్పుల వల్ల త్వరగా జైలు నుంచి బయటపడే అవకాశం ఉంది అంటూ నచ్చజెప్పింది. నలుగురైదుగురు ఖైదీలు తమ అనుభవాలను రాస్తే వాటిని పుస్తకాలుగా ప్రచురించింది.'ఖైదీలనగానే తప్పు చేసిన వాళ్లనే భావనతోనే అంతా చూస్తారు. వాళ్లు విడుదలై బయటకు వెళ్లినా, అపరాధ భావంతో నలుగురిలో కలవలేరు. కొందరి మానసిక స్థితి తీవ్ర స్థాయికి వెళ్లి... వాళ్లు బయటికెళ్లినా మనుషుల్ని ద్వేషిస్తారు. నేరాలు చేస్తారు. ఆ పరిస్థితులు తలెత్తకుండా అంతా ఆనందంగా ఉండాలనే ఈ కార్యక్రమాలన్నీ మొదలుపెట్టాను. అవి కొన్ని వందల మంది ఖైదీల్లో మార్పు తీసుకొచ్చినందుకు ఆనందంగా ఉంది. త్వరగా విడుదలైన వారిలో యాభై మందికిపైనే డేటా ఎంట్రీ ఉద్యోగాలు చేస్తున్నారు. మహిళలు స్వయం ఉపాధితో జీవిస్తున్నారు. డిగ్రీ మాత్రమే కాకుండా... జ్యోతిష్య శాస్త్రాన్నీ దూరవిద్య ద్వారా చదువుకొనే అవకాశం కల్పించాం' అంటూ వివరించింది ఇందిర.



0 Comments

కారుణ్య బంధం

11/4/2013

0 Comments

 
Picture
ఎవ్రీ డాగ్ హాజ్ ఇట్స్ డే!
 ప్రతి ఒక్కరికీ ఒక మంచి రోజు ఉంటుందని సామెత.
 రీనా లాంటి వాళ్లు ఉంటే..
 ఎవ్రీ డాగ్ హాజ్ ఇట్స్ డే... ఎవ్రీ డే!
 ప్రతి ఒక్కరికీ ప్రతిరోజూ మంచిరోజే...
 మనుషులకైనా, శునకాలకైనా!
 రీనా... వీధికుక్కల్ని చేరదీస్తుంటారు.
 అక్కడితో అయిపోలేదు.
 పెంపుడు కుక్కల కోసం...
 డే కేర్ సెంటర్ నడుపుతున్నారు.
 ‘వి కేర్ యానిమల్’ అనే సంస్థని కూడా పెట్టారు.
 కుక్కలపై రీనా ప్రేమ ఎంత వరకు వెళ్లిందంటే...
 ‘తనను పెళ్లిచేసుకునే అబ్బాయికి
 కుక్కలంటే ప్రేమ ఉండాలి’ అని కండిషన్
 పెట్టే వరకు!!
 ఈ కండిషన్ వెనుక, కారుణ్యం వెనుక ఉన్న కథే...

             పెంపుడు జంతువులను ప్రేమతోసాకి, ప్రాణం కంటే మిన్నగా చూసుకునేవారు సెలబ్రెటీలనుంచి సామాన్యుల వరకూ చాలామందే ఉన్నారు. అయితే వీధికుక్కల్ని చేరదీసి వాటి హక్కులకోసం పోరాడేవారు మాత్రం చాలా అరుదు. రీనా ఆ కోవలోకే వస్తారు. ‘‘నేను తొమ్మిదోతరగతి చదువుతున్న సమయంలో ఒకరోజు స్కూలుకి వెళుతుంటే రోడ్డు పక్కనే పడుకొన్న కుక్కమీదకు ఓ కారు దూసుకొచ్చింది. కారు కుక్క దగ్గరగా రాగానే...స్టాప్...స్టాప్ అంటూ గట్టిగా అరిచాను. అయినా కారు డ్రైవర్ వినిపించుకోకుండా కారుని కుక్కపై నుంచి పోనిచ్చేశాడు. అయితే అప్పటికే నేను కారు నెంబరు నోట్ చేసుకున్నాను... స్కూలు బ్యాగు పక్కన పెట్టి చనిపోయిన కుక్కని నేను, నా స్నేహితులు కలిసి పక్కకు లాగాము.

                    వెంటనే బిఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్‌కేర్‌కి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాను. వాళ్లు పీపుల్ ఫర్ ఏనిమల్(పిఎఫ్‌ఎ) నెంబర్ ఇచ్చారు. పిఎఫ్‌ఎకి ఫోన్ చేస్తే వాళ్లొచ్చి చనిపోయిన కుక్కను  తీసుకెళ్లి పోస్టుమార్టం చేసి ఖననం చేశారు. నేనిచ్చిన కారు నంబరు తీసుకుని కేసు ఫైల్ చేశారు. కారు నడుపుతున్నవ్యక్తి గవర్నమెంటు అధికారి కారు డ్రైవరు. ఈ కేసు వల్ల ఆర్నెల్లు తిరక్కుండానే అతని ఉద్యోగం పోయింది. అప్పటికిగాని నాకు కోపం తగ్గలేదు’’ అంటూ రీనా ఏడేళ్లకిత్రం జరిగిన సంఘటనను గుర్తుచేసుకుంటున్నప్పుడు మూగజీవులకు ఆమె మనసులో ఉన్న స్థానం ఎంతటిదో అర్థమవుతుంది. తన జీవితం కుక్కల క్షేమం కోసమే అంటోన్న రీనా చెప్పిన వివరాలివి..
 
                     శునక సంరక్షణకోసం పనిచేసే స్వచ్ఛందసంస్థలు చాలా ఉన్నాయి. ఎన్ని ఉన్నా...రోజు రోజుకీ పెరిగిపోతున్న కుక్కల సంఖ్యకు తగ్గట్టు ఆ సేవల్ని పూర్తిస్థాయిలో అందించలేకపోతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లోని బోడుప్పల్ దగ్గర శ్రీలక్ష్మినగర్ కాలనీలో ఉండే రీనా తను డిగ్రీ చదువుతున్న సమయంలో ‘వి కేర్ ఏనిమల్’ అనే సంస్థని స్థాపించి ఇంటిదగ్గరే కుక్కలకోసం ఒక షెల్టర్ ఏర్పాటు చేసుకున్నారు. ఒక పక్క చదువు మరో పక్క కుక్కల పెంపకం...తనకు చేతనైనంత మేరకు రెండింటికీ న్యాయం చేసింది.

                  ‘‘నాన్న లింగారావు ప్రభుత్వ ఉద్యోగి, అమ్మ విమల గృహిణి. చెల్లి, తమ్ముడు...అందరికీ పెంపుడు జంతువులంటే చాలా ఇష్టం. నాకు ఇంకొంచెం ఎక్కువ ఇష్టమన్నమాట. ఎంత ఎక్కువంటే...స్కూలు నుంచి ఇంటికొచ్చేటప్పుడు ఓ పదికుక్కలు వెంటే వచ్చేవి. ఇంటర్ అయ్యేవరకూ వీధి కుక్కలకు హానీ చేయకూడదంటూ కనిపించినవారికల్లా చెబుతుండేదాన్ని. డిగ్రీలో చేరాక కుక్కల కోసం సమయం కేటాయించే అవకాశం ఏర్పడింది. దాంతో షెల్టర్ ఏర్పాటు చేశాను. చాలామంది దూరప్రాంతాలకు వెళ్లాల్సివచ్చినపుడు తమ పెంపుడు కుక్కల్ని ఎక్కడ ఉంచాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. అలాంటి కుక్కలకు డేకేర్‌లాంటి సదుపాయం కూడా ఏర్పాటు చేశాను.

                    గాయాలపాలైన వీధికుక్కల్ని తీసుకొచ్చి చికిత్స చేయించి వాటికి  పిల్లలు పుట్టకుండా కుటుంబనియంత్రణ ఆపరేషన్ చేయించి షెల్టర్‌లో పెట్టుకుని పెంచేదాన్ని’’ అని చెప్పారు రీనా. వీధి కుక్కలకు వైద్యం, పెంపుడు కుక్కలకు డేకేర్ సదుపాయం ఏర్పాటు చేసి ఉన్నంతలో కుక్కలకు సేవ చేసుకుంటున్న రీనాకు ఉన్నట్టుండి ఒక ఆలోచన వచ్చింది. కుక్కల్లో పిల్లల తల్లులు ఆహారం లేక చాలా ఇబ్బంది పడతాయని అలాంటివి ఎక్కడైనా కనిపిస్తే తన దగ్గర వదిలేయమని ఒక ప్రకటన ఇచ్చింది. అప్పుడు మొదలైంది అసలు కథ.
 
 పాలు తాగించి...పక్కనే ఉండి
 
                ‘‘నేనిచ్చిన ప్రకటన చూసి జిహెచ్‌ఎమ్‌సివాళ్లు ఓ నలభైకుక్కల్ని తీసుకొచ్చి నాకప్పగించారు. వాటివెంట నెలల పిల్లలతో పాటు రోజుల వయసున్న బుజ్జి బుజ్జి కూనలు కూడా ఉన్నాయి. తల్లికుక్కలకు కడుపునిండా అన్నం పెట్టి పిల్లలమధ్య వదిలేస్తే ఒక్క కుక్క కూడా పిల్లలకు పాలు ఇవ్వడం లేదు. విషయం ఏంటంటే... ఆ పిల్లలేవీ ఆ కుక్కలకు పుట్టినవి కావు. దాంతో పాలులేక పిల్లలు అరవడం మొదలెట్టాయి. వెంటనే మెడికల్‌షాపుకెళ్లి పాలడబ్బాలు కొనుక్కొచ్చి వాటికి పాలుతాగించాను.

                   ఓ పదిరోజులు కాలేజి ఎగ్గొట్టి ఆ పిల్లలమధ్యే గడిపాను. తల్లికుక్కల్ని బ్లూక్రాస్‌కి తీసుకెళ్లి ఆపరేషన్ చేయించి బయట వదిలేశాను. పిల్లలు కొంచెం పెద్దగా అయ్యాక బయటికి పంపించాను. అలా ‘వి కేర్ ఏనిమల్’ని ఛాలెంజ్‌కి తీసుకుని నడిపించాను. అయితే భవిష్యత్తులో కుక్కల సంరక్షణకోసం పటిష్టమైన సంస్థని ఏర్పాటు చేయడానికి కావాల్సిన శిక్షణ, జ్ఞానం అవసరమని గుర్తించి ‘పీపుల్ ఫర్ ఏనిమల్’ ఆధ్వర్యంలో కొంత శిక్షణ తీసుకున్నాను’’ అని చెప్పే రీనా ఆలోచన సేవ నుంచి పోరాటందాకా విస్తరించింది. కుక్కలకు కూడా హక్కులున్నాయంటూ ప్రచారం చేయడం మొదలుపెట్టింది.
 
 కుక్కల హత్య...
 
                   రీనా ఉండే ప్రాంతంలో ఒకరోజు వీధి కుక్క ఓ చిన్నపాపను కరిచింది. ఆ పాప సర్పంచ్ మనవరాలు కావడంతో అతను వెంటనే ఆ ప్రాంతంలోని కుక్కల్ని చంపించేశాడు. ఆ సంఘటన రీనా దృష్టికి వచ్చింది. ‘‘నాకు విషయం తెలియగానే చెప్పలేనంత ఆవేశం వచ్చింది. పైగా ఆ కుక్కల్ని చంపిన విధానం ఎంత ఘోరం... అంటే ఆ కుక్కలన్నింటికీ మనుషుల్ని పెట్టి పాయిజన్ ఇప్పించి మరీ చంపించేశారు. ఈ సంఘటనలో ఎనభై కుక్కలు చనిపోయాయి. నేను నేరుగా ఆ నాయకుడి దగ్గరికి వెళ్లి ఏ అధికారంతో ఈ పని చేశారని అడిగాను. ‘నాకు పైనుంచి ఆదేశాలున్నాయి’ అన్నారు.

                     కుక్కని చంపే హక్కు ఎవరికీ లేదని అతనిపై కేసు వేశాను. అయితే ఆ తర్వాత నాకు అర్థమైందేమిటంటే... కుక్కల్ని చంపడం నేరమన్న విషయం చాలామందికి తెలియదని’’  రీనా చెబుతున్నప్పుడు తనకళ్లలో చెమ్మ కనిపించింది. ‘‘వీధిలో కుక్కలు లేకపోతే రాత్రిపూట ఎవరూ ప్రశాంతంగా నిద్రపోలేరు. రాత్రివేళ కుక్క అరిచే అరుపు మనకు ధైర్యాన్ని ఇస్తుంది. అదే కుక్క మనల్ని కరిస్తే దాన్ని చంపేటంత కోపం వస్తుంది. ఎందుకంత కోపం... దానికి ఓ రెండు టీకాలు వేయిస్తే పోయేదానికి చంపడందేనికి’’ అని ప్రశ్నిస్తున్న రీనా ఆవేదనలో అర్థం ఉంది. మన ఇంటిముందు పడుకున్న ఓ వీధికుక్క అరుపు దాని ఆకలిని కాదు... తన కావలిని చూపిస్తుందని అర్థమైనవారికి రీనా బాధ కూడా అర్థమవుతుంది. ‘‘నన్ను పెళ్లిచేసుకునే అబ్బాయికి కుక్కలంటే ప్రేమ ఉండాలి’’ అని కండిషన్ పెడుతున్న ఈ శునకప్రేమికురాలి కోరిక నెరవాలని కోరుకుందాం.
 
 వైల్డ్‌లైఫ్ ట్రైనింగ్...
 
 భవిష్యత్తులో రీనా చేయాలనుకుంటున్న కార్యక్రమాలు చాలా పెద్దవి. సొంతంగా భూమి కొనుక్కుని వీధి కుక్కలకోసం పెద్ద పునరావాస  కేంద్రం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. దానికోసం ‘పీపుల్స్ ఫర్ ఏనిమల్’ వారి దగ్గర శిక్షణ కూడా తీసుకున్నారు. ‘వైల్డ్‌లైఫ్ ట్రైనింగ్’లో చేరాక మూగజీవులకు సంబంధించి రీనా చాలా విషయాలు నేర్చుకున్నారు. జెన్‌పాక్ కంపెనీలో పనిచేస్తున్న రీనా ఇంట్లో  ప్రస్తుతం ఓ పది వీధి కుక్కలు ఉంటున్నాయి. వాటిని చూసుకుంటూ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే వీధికుక్కలకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయిస్తున్నారు రీనా. 

0 Comments

అవయవాల పంటకు అక్షర సేద్యం

11/4/2013

0 Comments

 
Picture
నవలలు, కథలు, రచనలకు ఉన్న ప్రాధాన్యత నాటకాలకు లేదు. ఒక మంచి సినిమా వస్తే ప్రేక్షకులు దాన్ని ఆదరిస్తారు. అది ఆస్కార్‌ అవార్డును కైవసం చేసుకుంటుంది. ఒక మంచి పుస్తకాన్ని రాస్తే నోబెల్‌ బహుమతో, రామన్‌మెగసెసే అవార్డు పొందవచ్చు. కానీ నాటకాలు ఇలాంటి అవార్డులకు నోచుకోలేవు. ఎందుకంటే వాటికి అంత ఆదరణ లేదు. 24గంటలు సినిమా టివి ఛానళ్లు వచ్చాక నాటకాలకు ఆదరణ లేక కనుమరుగైపోతున్నాయి. అప్పుడప్పుడు ఎక్కడైనా వీటిని ప్రదర్శించినా, వాటిని చూసేందుకు ప్రేక్షకులు కరువ్ఞ. ఇలాంటి పరిస్థితుల్లో ఒక వనిత రాసిన నాటకానికి అంతర్జాతీయ అవార్డు లభించడం విశేషం. కేవలం ఒకేఒక్క రచనతో  విశ్వఖ్యాతి పొందిన భారతీయ రచయితలు ఎందరో ఉన్నారు. ఇలాంటి జాబితాలో మంజులా పద్మనాభన్‌ కూడా ఉన్నారు. ఒకే నాటకంతో ఆమె 250,000 పౌండ్ల బహుమతిని పొంది ఔరా! అనిపించుకున్నారు.
పుట్టుపూర్వోత్తరాలు
మంజుల 1953లో ఢిల్లీలో జన్మించారు. బోర్డర్‌ స్కూల్లో చదివిన మంజుల కళాశాల చదువు పూర్తి అయ్యాక రైటర్‌గా తన కెరీర్‌ను ఆరంభించారు. ఆరంభంలో చిన్నచిన్న కథల్ని రాయడంలో ఆసక్తి చూపిన మంజుల తర్వాత నాటకాలవైపు తన దృష్టిని సారించారు. 2008లో 'ఎస్కేప్‌ (తప్పించుకో) అనే పుస్తకాన్ని రాశారు. పత్రికల్లో కాలమిస్ట్‌గా కూడా కొంతకాలం పనిచేశారు. ఈమె రచనలు సండే అబ్జర్వర్‌లో ఎక్కువగా ప్రచురితమయ్యేవి. అంతేకాక మంజుల కార్టూనిస్ట్‌గా కూడా పనిచేశారు. నవ్వులను చిందించే కార్టూన్లను వేసి, ఆయాపత్రికలకు పంపేవారు.
నాటకానికి ఖ్యాతి
ఇలా చిన్నచిన్న కథల్ని ఒకవైపు రాస్తూ మరోవైపు కాలమిస్ట్‌గా పనిచేస్తూనే 1997లో 'హార్వెస్ట్‌' పేరుతో ఒక నాటకాన్ని రచించారు. ఈ నాటకానికి అంతర్జాతీయ ఖ్యాతి లభించడమే కాక దాదాపు 250,000 పౌండ్ల బహుమతిని పొందారు. ఇది ఊహించని విజయమని మంజుల అంటారు.
క్షీణదశలో ఎగసిన కెరటం
సినిమాలు, టివి, సెల్‌ఫోన్‌, కంప్యూటర్లు రావడంతో నాటకాలు క్షీణదశకు చేరుకున్న సమయంలో మంజులా పద్మనాభన్‌ 1997లో రాసిన 'హార్వెస్ట్‌ నాటకం 76 దేశాల రచయితల నాటకాల్ని ఓడించి అవార్డును కైవసం చేసుకోవడం ఆశ్చర్యకరం. మొత్తం 1470 నాటకాల్లో మంజుల రాసిన 'హార్వెస్ట్‌' ప్రథమస్థానంలో నిలిచింది. ఈ నాటకానికి ఒనాసిస్‌ పబ్లిక్‌ బెనిఫిట్‌ ఫౌండేషన్‌ వారిచ్చే అంతర్జాతీయ బహుమతిని పొందారు. మంచి రైటర్‌ ప్లేరైటర్‌గా, జర్నలిస్ట్‌గా, కామిక్‌స్క్రిప్ట్‌ ఆర్టిస్ట్‌గా, పిల్లల కథల్ని రాసే రచయితగా పలు విభాగాల్లో పనిచేశారు. 1984లో 'లైట్స్‌అవ్ఞట్‌, హిడన్‌ఫైర్స్‌, ది ఆర్టిస్ట్స్‌ మోడల్‌ 1995లో రాశారు.
  'హార్వెస్ట్‌' నాటకంతో ఉన్నఫళంగా మంజుల ప్రపంచ సాహితీవేత్తలలో ఒకరయ్యారు. 'ఫ్యాట్‌ అండ్‌ 44ఈజ్‌ ఫేమస్‌' అని చాలామంది ఆమెను అభినందించారు. మంజులా పద్మనాభన్‌ 44యేట ఈ గౌరవం సంపాదించుకున్నారు. ప్రపంచ దేశాలలో విస్తృతంగా పర్యటించిన అనుభవం ఉండడం వల్లనే ఈమె ఈ జాక్‌పాట్‌ కొట్టేశారనే ఒక అభిప్రాయం ఉంది. ఎందుకంటే ఒనాసిస్‌ పబ్లిక్‌ బెనిఫిట్‌ ఫౌండేషన్‌ వారు అంతర్జాతీయ స్థాయిలో నాటక రచన పోటీ ఏర్పాటు చేస్తారు. దీనికి సంబంధించిన ప్రకటనని ఎప్పుడూ వర్ధమాన దేశాలకు పంపరు. అనుకోకుండా మంజుల ఆస్ట్రేలియా వెళ్లడం, అక్కడ ఈ పోటీ వివరాలు తెలుసుకోవడం, ఎప్పటినుంచో మెదడులో ఉన్న ఒక చిన్న ఆలోచనను సాహిత్యీ కరించడం, అన్నీ యాదృచ్ఛికంగా జరిగిపోయాయి. ఈమె నాటకంతో దేశానికి మరో అంతర్జాతీయ బహుమతి దక్కింది.
హార్వెస్ట్‌ దేనిగురించి వివరించింది?
 మనసును కదిలించే అంశాలు, మనతో పయనించే విషయాలు ఈ నాటకంలో చాలాచోట్ల ఉన్నాయి. పేదలు తమ కడుపు ఆకలి మంటల్ని చల్లార్చుకునేందుకు దేహంలోని అవయవాల్ని అమ్ముకోవాల్సి వస్తుంది. శరీరంలో ఉన్న అవయవాల ఖరీదు ఎంత విలువైనవో పేదలకు తెలియదు. వారికి తెలిసేది ఒక్కటే. ఒక్కరోజు భోజనాన్ని ఎలా సంపాదించుకోవాలి? రేపటిగురించి చింత లేదు. అందాక ప్రాణం నిలబడుతుందో లేదో తెలియదు. ఈరోజు ఆ ప్రాణాన్ని కాపాడుకోవాలంటే డబ్బు కావాలి. అందుకు ఏదో ఒక అవయవాన్ని అమ్ముకుంటారు. హార్వెస్ట్‌ (పంట) నాటకంలో విషయంలో చాలా అధునాతనమైంది. గుండె మార్పిడి, మూత్రపిండాల మార్పిడి, కళ్ల మార్పిడి, రక్తం మార్పిడి వంటివన్నీ అతి సహజంగా జరిగిపోతున్నా, ఈ సమాజంలో పేదవారి అవయవాలు ఉన్నవారికి ఉపయోగపడుతున్నాయి. పేద దేశాలవారి అవయవాలు ధనికదేశాల వారికి ఉపయోగపడుతున్నాయి. అంటే ఇక జీవసంబంధమైన అవయవాల పంట పండుతోందన్నమాట. దోపిడీ తీరు మారుతోంది. నిన్నటిదాకా శ్రమదోపిడి గొప్ప విషయంగా విరాజిల్లుతూ ఉండేది. ఇప్పుడు అంతకన్నా దారుణమైన దోపిళ్లు కొనసాగుతున్నాయి. హార్వెస్ట్‌ నాటకం ఒక ఊహాత్మక చిత్రణ. ఇందులో ముఖ్యపాత్రధారి మూడవ ప్రపంచ దేశాలకు చెందిన ఒక బీదవాడు. అతడు తన శరీరాన్ని మొత్తానికి మొత్తంగా ఒక విదేశీయుడికి అమ్మేస్తాడు. ఫలితంగా నాటకంలోని నాలుగు ప్రధానపాత్రల జీవితాలలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయి.
ఆమెకున్న అనుభవమే నాటకం
ఈ నాటకాన్ని రాసేందుకు మంజుల తనకున్న అనుభవాలే కారణమని అంటారు. 'మానవాంగాల మార్పిడి ఇతివృత్తంగా, నాటక రచనలో పోటీ ఉన్నట్లు తెలియగానే కొంత ఆసక్తి నాలో పెరిగిందని, ఎందుకంటే అవయవాలను దిగుమతి చేసుకునే ధనిక దేశాలతోనూ, ఎగుమతిచేసే బీద దేశాలతోనూ నాకున్న సత్సంబంధాలే కారణమని' పేర్కొన్నారు మంజుల. 'అందువల్ల ఆ ఇతివృత్తాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకుని, ఒక మంచి నాటకంగా రూపుదిద్దగలనన్న ఆత్మవిశ్వాసం నాలో పెరిగింది. ఫలితం సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలన్నింటినీ స్పృశిస్తూ 'హార్వెస్ట్‌' నాటకం రూపుదిద్దుకుంది' అని అన్నారు. యూరప్‌ దేశాలలో వలె భారతీయ రచయిత తమకు వచ్చే రాయల్టీతో, పారితోషికాలతో స్వతంత్ర జీవనం సాగించే అవకాశం లేదు. జీవనభృతికోసం తప్పకుండా మరో వృత్తి చేపట్టాల్సిందే! కావాలంటే ఏ నవలో రాయాలిగాని, కవిత్వం, కథ, నాటకం వంటి సాహితీ ప్రక్రియలకు డబ్బులు రావు. కవిత్వం, కథ వంటి ప్రక్రియలతో మంచి గుర్తింపు, పేరు ప్రఖ్యాతులైనా లభిస్తాయి. నాటక రచనకు అదీ లేదు. మనదేశంలో పరిస్థితి చూస్తే మహారాష్ట్ర, బెంగాల్‌ రాష్ట్రాలలో తప్పితే, ఇతర రాష్ట్రాలలో నాటక రచనకు ఎలాంటి ప్రోత్సాహం లేదు. మన ఇండో ఆంగ్లికన్‌ రచయితలు కూడా ప్రధానంగా కవిత్వం మీదో, నవలమీదో దృష్టి సారిస్తూ వచ్చారేగాని నాటక రచనమీద కాదు. అందువల్ల మంజులా పద్మనాభన్‌ ఒక ఇంగ్లీషు నాటకం రాయడం పట్ల సాహితీలోకం ఆశ్చర్యపడాల్సి వచ్చింది. అది ఊహించనంత విజయం సాధించినందుకు అబ్బురపడాల్సి వచ్చింది. ఆధునిక ప్రపంచంలో సినిమా, టివి, కంప్యూటర్‌కు ఉన్నత ప్రాధాన్యత నాటకాలకు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో మంజుల రాసిన నాటకానికి బహుమతి రావడం ఆ రంగం మళ్లీ పునరుజ్జీవం పోసుకుంటుందని ఆశిద్దాం.          - రూతు


0 Comments

అంధుల కోసం పత్రిక

11/3/2013

1 Comment

 
Picture
మారుమూల గ్రామంలో ఉన్నా, మెట్రోపాలిటన్‌ సిటీలో ఉన్నా.. మంచి పని చేయాలనే సంకల్పం ఉంటే చాలు ఎన్ని అడుగులైనా వేగంగా పడతాయి. ఇలాగే ఆలోచించిన ముగ్గురమ్మాయిలు చదువుకునే వయసులోనే సామాజిక స్పృహతో కదిలారు. ఐరాస మెచ్చే స్థాయిలో సేవా కార్యక్రమాల్లో నిమగ్నమైన కీర్తి, వైభవి... అంధుల కోసం మాసపత్రికను తీసుకొస్తున్న ఉపాసనల స్ఫూర్తి పథమిది. రోజూ పది దినపత్రికలు చదివే ఉపాసన 'నా సంగతి సరే, మరి చూపులేని వారు వీటినెలా చదవగలరు' అని ఆలోచించింది. వీలైనంత మందికి ఆ సదుపాయాన్ని అందుబాటులోకి తేవాలని బ్రెయిలీలో ఆంగ్ల మాస పత్రికను తీసుకురావడం మొదలుపెట్టింది.

                  మా అమ్మనాన్నలు బాగా చదువుకున్న వాళ్లు. నాతో పాటూ చదువుకున్న వాళ్లు ఐటీ, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల్లో చేరిపోవాలని అనుకుంటున్నప్పుడు నేను జర్నలిజంలో పీజీ చేస్తానని చెప్పా. అమ్మానాన్నలూ ఒప్పుకున్నారు. పీజీ అయ్యాక ఓ ప్రైవేటు సంస్థలో చేరా. చిన్నప్పట్నుంచీ నాకు పత్రికలు చదవడం అలవాటు. ఒకసారి ఓ మారుమూల గ్రామం వెళ్లా. అక్కడ ఒక్క పత్రికా దొరకలేదు. చాలా వెలితిగా అనిపించింది. అప్పుడు ఆలోచిస్తే చూపులేని వాళ్ల పరిస్థితి ఏంటీ అనిపించింది. ఆరా తీస్తే మన దేశంలో చూపులేని విద్యావంతులు యాభైలక్షల మందికి పైనే ఉన్నట్లు తెలిసింది. వాళ్ల కోసం ఓ మ్యాగజైన్‌ తీసుకొస్తే అని ఆలోచించా.

                       వెంటనే ముంబయిలోని 'నేషనల్‌ అసోసియేషన్‌ ఫర్‌ ది బ్త్లెండ్‌ (ఎన్‌ఏబీ)' అధికారుల వద్దకెళ్లి నా ఆలోచన చెప్పా. 'ఇరవై మూడేళ్ల అమ్మాయి... బ్రెయిలీలో మ్యాగజైన్‌ తీసుకురావడం సాధ్యమేనా' అన్నారు. కాస్త నిరుత్సాహం కలిగినా, అది కొన్ని రోజులే. ఆంగ్ల పత్రికలు తిరగేశా. చూపులేని వాళ్లతో మాట్లాడి ప్రతినెలా ఎలాంటి సమాచారం ఇవ్వొచ్చో తెలుసుకున్నా. ఖర్చుఎక్కువ అయినా రెండు గదులు అద్దెకు తీసుకున్నా. నాలుగు నెలలు రిజిస్ట్రేషన్‌ కార్యాలయం చుట్టూ తిరిగాక 'వైట్‌ ప్రింట్‌' పేరుతో పత్రిక తెచ్చేందుకు అనుమతి లభించింది.

                    ఓ బ్లాగు ప్రారంభించి, ఫ్రీలాన్స్‌ జర్నలిస్టులను ఆహ్వానించా. ఇవన్నీ సరే... డబ్బులు కావాలిగా! నేను ఉద్యోగం చేస్తున్నా వచ్చేది సరిపోదు! ప్రకటనలు ఇవ్వమని చాలా సంస్థల్ని అడిగా. కొందరయితే 'మా ఉత్పత్తులు గుడ్డి వాళ్లకెందుకు..' అనడిగారు. కానీ నేను పడుతున్న కష్టం చూసిన ఎన్‌ఏబీ అధికారులు ఆర్థిక సాయం అందిస్తాం అన్నారు. బ్రెయిలీ ప్రింటర్లు అందిచ్చారు. దాంతో అరవై నాలుగు పేజీలతో... ఆహారం, షాపింగ్‌, సినిమాలూ, ఆరోగ్యం, కథలూ, స్ఫూర్తి కథనాలూ, ప్రముఖుల ఇంటర్వ్యూలతో పత్రిక తీసుకురావడం మొదలుపెట్టా. జర్నలిస్టు బర్ఖాదత్‌ దీన్లో ఓ కాలమ్‌ రాస్తున్నారు. మొదట రెండు మూడు వేల కాపీలు ఉచితంగానే ఇవ్వాలనుకున్నా. ఆశ్చర్యంగా... అంధులు 'మామీద జాలితో ఇవ్వకండి. డబ్బు తీసుకుని ప్రోత్సహించండి' అన్నారు. ఏడాది మొదట్లో ప్రారంభమైన పత్రికకు గత కొన్ని నెలల నుంచి ప్రకటనలు వస్తున్నాయి. కొన్ని కార్పొరేట్‌ సంస్థలూ ప్రకటనలతో పాటూ ఆర్థిక సాయం చేయడానికీ ముందుకొచ్చాయి. ప్రస్తుతం ముంబయితో పాటూ ప్రముఖ నగరాల్లో ఈ పత్రిక అందుబాటులో ఉంది.

1 Comment

వసతి గృహాల్లో 'మనో పాఠాలు'

11/1/2013

0 Comments

 
Picture
పిల్లలు అల్లరి చేస్తేనో, చదువుకోకుండా మారాం చేస్తేనో.. బుజ్జగించో, కాస్త భయపెట్టో.. సన్మార్గంలో నడిపించే ప్రయత్నం చేస్తారు తల్లిదండ్రులు. కాని ఇంటికి దూరంగా హాస్టళ్లలో ఉండే పిల్లలకు అలాంటి సమస్యలు వస్తే ఎవరు దిక్కు? వయసుతోపాటు వచ్చే మానసిక సమస్యల్ని ఎవరు తొలగిస్తారు? అలాంటి వారికి నేనున్నాను అంటున్నారు ఖమ్మం పట్టణానికి చెందిన సైకాలజిస్ట్ తాళ్లూరి లక్ష్మి. ఎస్సీ, ఎస్టీ వసతిగృహాలకు వెళ్లి ఉచిత మానసిక వైద్యం అందిస్తున్న ఆమె గురించే ఈ కథనం...

అది ఖమ్మంలోని అంబేద్కర్‌భవన్. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ సంక్షేమ వసతిగృహాల నుంచి వచ్చిన విద్యార్థులతో హాలు నిండిపోయింది. సైకాలజీ కౌన్సిలర్ లక్ష్మి చెబుతున్న మానసిక పాఠాలను ఆసక్తిగా వింటున్నారంతా. తరగతిగదిలో విన్న పాఠ్యాంశాలు జ్ఞానాన్ని ఇస్తే, లక్ష్మి పాఠాలు మానసిక వికాసాన్ని కలిగిస్తున్నాయి.

బడుగు విద్యార్థులకు ప్రభుత్వం ఉచిత విద్య, వసతి కల్పిస్తున్నదే కానీ, వారి మానసిక ఎదుగుదలకు చొరవ చూపడం లేదు. ఆ లోటును పూడ్చాలనుకున్నారు తాళ్లూరి లక్ష్మి. గుంటూరులోని నాగార్జున విశ్వవిద్యాలయంలో ఎంఏ మానసికశాస్త్రం, ఫ్యామిలీ అండ్ మ్యారేజ్ కౌన్సెలింగ్‌లో ఎంఫిల్ చేశారామె. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ కూడా చేస్తున్నారు. ఇంత చదువు చదివి ఇంట్లో ఖాళీగా ఉండటం దేనికని.. అవసరమైన చోట తన సేవల్ని అందించేందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు.

మనోబలం అవసరం..
"మన దేశంలో మానసిక వైద్యుల ప్రాధాన్యం ఇప్పుడిప్పుడే పెరుగుతోంది కాని అభివృద్ధి చెందిన దేశాల్లో వాళ్లకు చాలా ప్రాధాన్యమే ఉంది. చిన్నపిల్లల్లో నడవడిక, ప్రవర్తనకు సంబంధించి ఏ లోపాలు తలెత్తినా ఆ దేశాల్లో మానసిక వైద్యం తీసుకుంటారు. మన దేశంలో కూడా ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాలలో చదివే పిల్లలకు ఇలాంటి మానసిక వైద్యం అందించడం అవసరం'' అంటున్నారు లక్ష్మి. ప్రభుత్వ విద్యాలయాల్లో చదివే విద్యార్థుల్లో అపోహలు, భయాలు, ఆత్మన్యూనతా భావాలను పోగొడితే.. వారు అద్భుతఫలితాలు సాధిస్తారన్నది ఆమె నమ్మకం.

గత నాలుగేళ్ల నుంచి ఆమె ఇదే పనిలో బిజీగా ఉన్నారు. ఖమ్మం జిల్లాతోపాటు, విజయవాడ, గుంటూరులలోని నిరుపేద విద్యార్థులకు ఉచిత మానసిక వైద్యం అందిస్తున్నారు. "సాంఘికసంక్షేమ వసతిగృహాల పరిస్థితి దయనీయం. తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ చదువుకునే విద్యార్థులకు నైతిక ప్రోత్సాహం ఇవ్వాలి. వారికి వారు ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకోలేరు. శరీరానికి తిండి ఎలాగో, మనసుకు శక్తి కూడా అలా అవసరం. ఆ శక్తిని ఇస్తుంది సైకాలజీ కౌన్సెలింగ్. వెనుకబడిన విద్యార్థులు పలు మానసిక ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి వారిలో సానుకూల దృక్పథాన్ని (పాజిటివ్ థింకింగ్) ప్రోత్సహిస్తే.. మంచి ఫలితం వస్తుంది. మేమిప్పుడు అదే పని చేస్తున్నాం'' అన్నారామె.

థెరపీలతో చురుగ్గా..
"ఎస్సీ, ఎస్టీ హాస్టళ్ల పిల్లలను ఎంచుకోవడానికి కారణం ఉంది. వారికి ప్రభుత్వం రోజుకు అయిదురూపాయలే ఇస్తుంది. అందులోనే టిఫిను, భోజనం అన్నీ జరిగిపోవాలి. బయట ఖర్చు పెట్టేందుకు చేతిలో చిల్లిగవ్వ ఉండదు. తల్లిదండ్రులు నిరుపేదలు కావడంతో పిల్లల్ని హాస్టళ్లలో వదిలిపెట్టేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల్ని బోలెడన్ని మానసిక సమస్యలు చుట్టుముడతాయి. జ్ఞాపకశక్తి లోపిస్తుంది. దానివల్ల లాంగ్వేజ్ బేసిక్స్ అలవడవు'' బాధపడుతూ చెప్పారు లక్ష్మి. వసతిగృహాల విద్యార్థులకొచ్చే మరొక సమస్య.. మాధ్యమం మారడం. కొన్ని క్లాసులకు వచ్చాక కొందరు విద్యార్థులు తెలుగు మీడియం నుంచి ఇంగ్లీషు మీడియానికి మారాల్సి వస్తుంది. ఆంగ్లభాష మీద ఉండే భయాల వల్ల వార్షిక పరీక్షలప్పుడు ఫోబియో పట్టుకుంటుంది. వాటిని తొలగించేందుకు 'ఒకే రోజు రెండు ఉదయాలు' అన్న 'డాన్ థియరీ' టెక్నిక్‌ను విద్యార్థుల మీద ప్రయోగిస్తున్నారు లక్ష్మి. "ఒక రోజును 12గంటల చొప్పున రెండు భాగాలుగా విడగొట్టి ఆ సమయంలో విద్యార్థులకు రీడింగ్ అవర్స్‌ను పెడుతున్నాము. ఇది సత్ఫలితాలను ఇస్తోంది. దీంతో పాటు 'మనకు ఒక లక్ష్యం కావాలి' అన్న భావనను విద్యార్థుల్లో నూరిపోసేందుకు 'న్యూరోలింగ్విస్టిక్ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెడుతున్నాను. దీనివల్ల ప్రతి విద్యార్థి మనసులో ఒక ఊహాచిత్రం (లక్ష్యం) ఏర్పడుతుంది. పిల్లలు దాన్ని సులువుగా గుర్తుపెట్టుకుంటారు. అది చదువును బలోపేతం చేస్తుంది'' అంటూ వివరించారామె.

ఖమ్మం జిల్లా వైరా పట్టణంలోని 'బాలవెలుగు' పిల్లలకు కూడా కౌన్సెలింగ్ ఇస్తున్నారు లక్ష్మి. "ఇక్కడున్న పిల్లలంతా సింగిల్‌పేరెంట్ ఉన్నవాళ్లే. తల్లి లేదా తండ్రి ఒక్కరే ఉన్నవారు కాబట్టి.. ఇలాంటి పిల్లల్లో కొన్ని మానసిక సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. బిహేవియర్ థెరపీ, సైకోథెరపీ ద్వారా వాటిని తొలగిస్తున్నాను. పిల్లల్లో కౌమారదశ నుంచి యవ్వనదశకు వచ్చే సమయంలో హార్మోన్ల సమతుల్యత లోపిస్తుంది. ఆ మార్పువల్ల ప్రవర్తనలో తేడాలొస్తాయి. ఇవన్నీ చదువును ప్రభావితం చేస్తుంటాయి. ఇక్కడే సైకాలజిస్టులు అవసరం అవుతారు. లోకజ్ఞానం తక్కువగా ఉండి, ఆత్మవిశ్వాసం లేని వాళ్లకు కూడా జాకబ్‌సన్ థియరీ, ఫెగ్గింగ్ మెథడ్‌లతో కాన్ఫిడెన్స్ లెవెల్స్‌ను పెంచుతున్నాము'' అన్నారు లక్ష్మి.
- వల్లభనేని రమేష్‌బాబు,
ఫోటోలు : మహేష్, ఖమ్మం


ప్రభుత్వం రోజుకు అయిదురూపాయలే ఇస్తుంది. అందులోనే టిఫిను, భోజనం అన్నీ జరిగిపోవాలి. బయట ఖర్చు పెట్టేందుకు చేతిలో చిల్లిగవ్వ ఉండదు. తల్లిదండ్రులు నిరుపేదలు కావడంతో పిల్లల్ని హాస్టళ్లలో వదిలిపెట్టేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల్ని బోలెడన్ని మానసిక సమస్యలు చుట్టుముడతాయి.

- See more at: http://www.andhrajyothy.com/node/13606#sthash.XeqXeFfO.dpuf

0 Comments

సోనాగచికి కొత్త ఆశాదీపం... ఇషిక!

10/31/2013

0 Comments

 
Picture
                     భవిష్యత్తును తీర్చిదిద్దుకొనే వయసు ఆమెది. సరదా సరదాగా గడిపేయాల్సిన రోజులవి. సరదాకు మాత్రమే కాదు సామాజికస్పృహకు కూడా ప్రాధాన్యత ఇస్తుంది ఇషిక.  సోనాగచికి వెళ్లి అక్కడి పిల్లలతో గడపనిదే ఇషికాకు వారం గడవదు. అక్కడికి వెళ్లి పిల్లలకు చదువు చెబుతూ అక్షరాస్యులుగా చేయడానికి, ప్రపంచం గురించి అవగాహన కలిగించడానికి ప్రయత్నిస్తోంది...
 
                 పాప్‌స్టార్స్ విడుదల చేసే కొత్త ఆల్బమ్స్ కోసం వెయిట్ చేయడం ఆమె హాబీ. కొత్తగా అప్‌గ్రేడ్ అయ్యే ఐఫోన్ అప్లికేషన్స్ ఇన్‌స్టాల్ చేసుకొంటూ వాటిలో మునిగితేలడం అంటే కూడా ఇష్టం. రిహన్నా, బ్యాక్‌స్ట్రీట్ బాయ్స్ ఆల్బమ్స్ ఆమె ఐప్యాడ్‌లో ఉంటాయి.. లెవిస్, రీబక్‌లు ఆమె వార్డ్‌రోబ్‌లో ఉంటాయి. టామ్‌క్రూజ్, రణ్‌బీర్ కపూర్‌లు ఆమె హార్ట్ రోబ్‌లో ఉంటారు. ఖరీదైన అలవాట్లు, ఖరీదైన అభిరుచులు ఆమెవి.  ఇంత ‘ఖరీదైన’ నేపథ్యం నుంచి వచ్చిన 17 యేళ్ల అమ్మాయి వీకెండ్ ఎలా గడుపుతుంది? అనే ప్రశ్నకు అందరూ ఒకేరకమైన సమాధానాన్ని ఊహించుకొంటారు. లాంగ్‌డ్రైవ్స్‌తోనూ, ఫ్రెండ్స్‌తో పార్టీలలో మునిగి తేలే అవకాశం ఉంటుందని అంచనా వేస్తారు. అయితే ఎవరీ ఊహాగానాలకూ అందని రీతిలో, తన లైఫ్ స్టైల్‌కు ఏ మాత్రం సంబంధం లేని రీతిలో సంస్కర్త హృదయంతో వారాంతాలను గడుపుతోంది ఇషికా సీల్!
 
                     కోల్‌కతాలోని రెడ్ లైట్ ఏరియా పేరు సోనాగచి. అత్యంత దుర్భర పరిస్థితుల్లో అక్కడ తమ తల్లుల మధ్య బతుకుతున్న చిన్నపిల్లలను చేరదీస్తూ వారికి చదువు చెబుతోంది ఇషిక. తల్లులను ఎడ్యుకేట్ చేసి  పిల్లలను స్కూళ్లలో చేర్పిస్తోంది. దాదాపు మూడు సంవత్సరాల నుంచి ఈ పనిని పవిత్రకార్యంలా భావిస్తుంది ఇషిక. తాను చూసిన, చూస్తున్న ప్రపంచంలో మార్పు తీసుకురావాలని ప్రయత్నించడం ఒక ఎత్తు అయితే, తనకు పరిచయమే లేని  ప్రపంచంలో మార్పు కోసం ప్రయత్నించడం మరో ఎత్తు.
 
     ఒక మంచి పనికి శ్రీకారం చుట్టడానికి సామాజిక పరిస్థితులతో పాటు కొందరు వ్యక్తులు కూడా కారణం అవుతుంటారు.

                   ఇషికకు స్ఫూర్తి ఆమె తల్లి మధుమిత. నిర క్షరాస్యతను నిర్మూలించడానికి పోరాడుతున్న మధుమిత తన ప్రయత్నంలో  కూతురు కూడా భాగస్వామినవుతాను అంటే కాదనలేకపోయింది. దుర్భరమైన పరిస్థితుల మధ్య బతికే సెక్స్‌వర్కర్ల పిల్లలకు చదువుచెబుతానని, సంస్కరిస్తాను అంటే కూతురును నిరాశ పరచలేదు. ‘మంచి ఆలోచన’ అంటూ అభినందించింది కూడా.

                     ‘చారిటీ బిగిన్స్ అట్ హోమ్’ అన్న వాక్యాన్ని మనస్ఫూర్తిగా నమ్ముతూ సామాజికసేవ వైపు ప్రయాణం సాగిస్తున్న కూతురికి ఎలాంటి అడ్డంకులూ కల్పించలేదు మధుమిత. ప్లస్ టూ చదువుతున్న ఇషిక చదువులో కూడా  రాణి స్తోంది. కుటుంబ నేపథ్యంతో వచ్చిన  ఫ్రెండ్స్, ఎంజాయ్ మెంట్‌ను పక్కనపెట్టి.. పిల్లల ప్రపంచంలోకి వస్తోంది.

                       ఈ విషయం గురించి ఇషికను అడిగితే ‘‘నేను అన్ని సౌకర్యాల మధ్య బతుకుతున్నాను. గొప్ప కాలేజీలో చదువుతున్నాను. సుఖసంతోషాలకు ఎలాంటి లోటు లేదు. అయితే ఇలాంటి అదృష్టం చాలా మంది పిల్లలకు లేదు. చిన్న చాక్లెట్ ముక్క ఇచ్చినా ఆ పిల్లల  కళ్లలో ఎంతో ఆనందం కనిపిస్తుంది. అలాంటి ఆనందం వారికి శాశ్వతం కావాలి. అందుకోసమే నా ప్రయత్నం. చదువు విషయంలో, సౌకర్యాల విషయంలో వారి సమస్యలు ఏమిటో నాకు అవగాహన ఉంది. వాటిని పరిష్కరించడానికి నేను నా పరిధిలో తీవ్రంగా ప్రయత్నిస్తున్నాను.

                     ఈ ప్రయత్నంలో నా తల్లిదండ్రులు నాకు పూర్తిగా సహకరిస్తున్నారు. ఇక ఫ్రెండ్స్‌ని, పార్టీలని మిస్సవుతున్నాననే ఫీలింగ్ లేదు. నాకు చిన్న పిల్లలతో గడపడమే సంతృప్తినిస్తోంది..’’ అని అంటుంది. యుక్త వయసులోనే ఇంత పరిణతి చూపుతున్న ఇషికకు ‘నేషనల్ కమ్యూనిటీ సర్వీస్’ అవార్డు వచ్చింది. పలు అంతర్జాతీయ పత్రికలు కూడా ఇషిక సేవా దృక్పథం గురించి ప్రముఖంగా ప్రచురించాయి.

0 Comments

మనసుకు నచ్చిందే చదువు

10/30/2013

0 Comments

 
Picture
                     ఇరుకైన విద్యావిధానంలో మూసపోసిన చదువులు, ర్యాంకుల పరుగులు, ఇవేనా పరిధులు అని ప్రశ్నించుకుని అతి పిన్న వయసులోనే, ఆసక్తి, నైపుణ్యాన్ని సృజనతో ముడిపెట్టి విజయపథంలో సాగుతోన్న యంగ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ హర్షిత వెన్నెల. ఆ విజయప్రస్థానం ఆమె మాటల్లోనే...

             '' నేను హైదరాబాద్‌లో సైన్స్‌ సబ్జెక్ట్‌తో12వ తరగతి చదువుతున్నాను. స్కూల్లో చదువుతున్న రోజుల నుండి కూడా మొదటి ర్యాంకు విద్యార్థిని కాకపోయినా చేసే ప్రతి పనీ సంపూర్ణంగా చేయాలని అనుకుంటాను. ఎప్పుడూ చురుగ్గా ఉంటాను. పరీక్షలు మన జ్ఞాపకశక్తిని పరీక్షించేవే కానీ మన విజ్ఞానాన్ని కాదు అని నేను పూర్తిగా నమ్ముతాను. అలాగని చదువును నిర్లక్ష్యం చేయను. పదో తరగతిలో మంచి మార్కులతో పాస్‌ అయ్యాను. కళ పట్ల నా ఆసక్తి నా ఏడు సంవత్సరాల వయసు నుండే మొదలైంది. మా అమ్మకు కూడా డ్రాయింగ్‌లో నైపుణ్యం ఉండటంతో ఆమె నా తొలి గురువు. నాకు స్కూల్లో సైన్స్‌ సబ్జెక్ట్‌ అంటే తగని పిచ్చి. సైన్స్‌లో రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉండేదాన్ని. నా స్నేహితుడు దుర్గేష్‌. అతనికీ సైన్స్‌, ఆర్ట్స్‌ అంటే ఆసక్తి. ఇద్దరం ఒకళ్ళ సందేహాలు ఒకళ్ళు తీర్చుకుంటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు ఇద్దరం ఆర్టిస్టులమే. 2012 లో గోకరాజు రంగరాజు ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ ఎమ్‌.డి. మా కాలేజీకి వచ్చారు. ఆమె పోట్రెయిట్‌ గీయమని మా స్కూల్‌ వాళ్ళు నన్ను అడిగారు. అది నాకు వచ్చిన పనే అవడంతో వెంటనే చక్కని చిత్రం గీసి ఇచ్చాను. దానికి ఆమె ఎంత సంతోషించారో తెలుసా..? 'నాకు ఇంత ప్రత్యేకత ఇచ్చినందుకు థ్యాంక్స్‌ హరితా! ఇది నా జీవితంలోనే అపురూమైన బహుమతి' అన్నారు. ఆమె ప్రశంస నాకు చాలా సంతోషాన్ని కలుగజేసింది'' అని వివరించారు హర్షిత.

                  ''ఈ విద్యావ్యవస్థ మీదే నాకు వ్యతిరేక భావం ఉంది. నేనెప్పుడూ ప్రశ్నించుకునేదాన్ని, 'ఎందుకు నేనింత కష్టపడుతున్నాను? దీనివలన నేను సాధించేది ఏంటి?' అని. ఈ చదువులు విద్యార్థులకు ఎలా ఆలోచించాలో చెప్పవు. ఏం ఆలోచించాలో చెప్తాయి. ఎక్కువ చదువుకోవడం అంటే ఎక్కువ సంపాదనకు మాత్రమే అన్నది నా అభిప్రాయం. ఈ చదువుల బారి నుండి బయటపడాలంటే ఏం చేయాలో ఆలోచించాను. నాకు వచ్చిందల్లా ఆర్టే. ఆరంభంలో కొత్తగానే అనిపించినా నేను దానిలో మరింత పట్టుదలగా సాధించి, నా స్థాయిని పెంచుకుంటూ పోయాను'' అని హర్షిత వివరించారు.

''ఆర్టిస్టుని అవుదామనుకున్నానని నా ఆసక్తిని గురించి చెప్తే, ఎక్కువ సంపాదన ఉండదని అందరూ నిరుత్సాహ పరిచారు. నేను పెద్దగా సంపాదించ లేకపోవచ్చుకానీ, చేసే పనిలో నాకు చెప్పలేనంత సంతృప్తి దొరుకుతుంది. ఇప్పుడు నేను ఒక వ్యక్తి ఫొటో చూస్తూ బొమ్మ గీసేయగలను. నన్ను ఇంత ప్రోత్సహించిన గొప్పతనం మా జువాలజీ లెక్చరర్‌ గాయత్రీ మేడమ్‌దే. ఆమె ప్రోద్బలంతోనే 2013 మార్చిలో 'కమీషన్డ్‌ ఫర్‌ పోట్రెయిట్స్‌' మొదలుపెట్టాను. దీని ద్వారా నేను ఆదాయం సంపాదించే మార్గాన్ని ఎంచుకున్నాను. మనకు ప్రియమైన వారిని ఎంతగానో ప్రేమిస్తాం. వారికి ఎన్నో బహుమతులు కూడా ఇస్తూంటాం. కానీ అవి కొన్నాళ్ళకు పాడైపోతాయి. అదే పోట్రెయిట్‌ వేయించి, ఇస్తే అది వారికి అమూల్యమైన బహుమతి అవుతుంది. కేవలం వ్యక్తుల బొమ్మలే కాదు, వారికి సంబంధించిన తీపి గుర్తులను, పెంపుడు జంతువులు కూడా చిత్రించి ఇస్తూంటాను. పోట్రెయిట్స్‌ వేయడమేకాక నేను అంతకుముందు వేసిన స్కెచ్‌ల ప్రింట్‌లను కూడా అవసరమైన వాళ్ళు కొనుక్కుంటూ ఉంటారు. ఖరీదు తక్కువే. కమీషన్‌తో పాటు నేను వేసిన సాధారణ చిత్రాలను ఫేస్‌బుక్‌ ఆక్షన్‌ ద్వారా కూడా కొనుక్కుంటూ ఉంటారు. ఇంట్లో నుండే పనిచేస్తాను. నాకంటూ ప్రత్యేక ఆఫీస్‌ ఏమీలేదు. నా వ్యాపార లావాదేవీలన్నీ ఫేస్‌బుక్‌ నుండే చేస్తాను'' అని ముగించారు. హర్షిత.

0 Comments
<<Previous
Forward>>

    Author

    నా పేరు సునయన ( ఉరఫ్ నర్మద). సు అంటే "మంచిది" అని, నయన అంటే "నేత్రములు" . సునయన అంటే మంచి కన్నులు కలది అని అర్థం. నా కళ్లతో చూస్తున్న ఈ  మహిళా ప్రపంచాన్ని మీముందు ఉంచాలని, అది మన మహిళాలోకానికి మేలు చేకూర్చాలని ఆశీస్తూ మనలో  ఒక  తెలుగు తరుణిగా నా ఈ చిన్ని ప్రయత్నం. 

    Archives

    January 2014
    December 2013
    November 2013
    October 2013
    September 2013
    August 2013
    July 2013
    June 2013

    Categories

    All
    ఏ అమ్మాయీ అమ్ముడవకూడదన్నదే నా లక్ష్యం
    ఆ మూడేళ్లూ కంటినిండా నిద్రలేదు..
    ఏ ఆడబిడ్డనూ ఇటువైపు రానివ్వను
    ఆటో కుమారి
    వేల మందికి కొత్త జీవితం!
    ఈమె పత్రికే ఓ రికార్డు
    పాత చిత్రాల పోస్టర్లతో ...కొత్త డిజైన్లు
    ఆమె ప్రతిభకు అమెరికా ప్రోత్సాహం
    ఇదొక 'అత్యవసర' సేవ!
    ఖేల్ రత్న కుంజరినీ దేవి
    రజనీ బాలలు
    తొలి మహిళా మంత్రి
    జీవన రాగమే మూగబోయింది
    నవీన వనితకు స్ఫూర్తి ప్రదాత.. శారదా దేవి
    కలలు డిజైన్ చేసుకున్న అమ్మాయి
    ఒంటి కాలితో గెలిచింది!
    వందల మందిని కాపాడింది...
    అడవి తల్లికి ఆడబిడ్డల పహరా
    ఐరాస మెచ్చిన అమ్మాయిలు
    పంటల పాఠాలమ్మ
    వసతి గృహాల్లో 'మనో పాఠాలు'
    సహాజ చిత్రాలతో కొత్త అందాలు
    సాయం చేసేందుకు పత్రిక పెట్టింది!
    జీవన సందేశానికి ఒక్క కుంచె చాలు!
    ధ్యాస
    తరుణీ .. ధిల్లానా !
    నిన్న ఆటో డ్రైవర్.. నేడు లాయర్..!
    అంధుల కోసం పత్రిక
    నృత్య వైభవం
    బుకర్ బరిలో జుంపా
    పాతిక లక్షల నష్టం పాఠాలు నేర్పింది!
    లక్కీ ఛాన్స్
    ఈమెను చూస్తే లోకమే చిన్నబోతుంది
    నెలలు నిండని జ్ఞాపకాలు
    తిండి మారితేనే తరాలు బాగుపడతాయి
    మహిళా సమస్యలపై పోరాటం
    చీకటి జీవితాలకు కొత్త వెలుగు...
    మహిళా సాధికారతే లక్ష్యంగా మన్ దేశీ
    ఖైదీల జీవితాల్లో కాంతిరేఖ
    పక్షి ప్రేమికురాలు
    మహిళా పారిశ్రామికవేత్తలకు స్పూర్తి
    పరుగుల షైనీ
    అందమైన సెల్ కవర్లు ఫేస్ బుక్ లో అమ్మేస్తా!
    అవయవాల పంటకు అక్షర సేద్యం
    అశ్వనీ మలాలా!
    కావ్యా టీచర్...మా బడికి రండి
    విరామం తర్వాత విజేతలయ్యేలా!
    మనసుకు నచ్చిందే చదువు
    సాగులో ఆందెవేసిన చేయి కూతురే కొడుకయింది
    అద్భుత ప్రతిభాశాలి వి.యస్. రమాదేవి
    రొమ్ము క్యాన్సర్‌పై జనచైతన్యం
    సేవలోనూ రాణే
    అనుపమాన కృషి
    కారుణ్య బంధం
    రేసింగ్ బైక్ పై నవతరం అమ్మాయి
    అందులకు అండగా..
    నైనానంద ప్రతిభ
    అక్షరమే అతివకు అండ..
    ప్రపంచం మరువలేని మేడమ్‌ క్యూరీ
    ఉపాధితో వెన్నుదన్ను
    ఆకాశమంత ఆత్మవిశ్వాసంతో ముందడుగు
    సమస్యలను మించి పరుగు
    పరదేశంలో చదువు మనదేశంలో సేవ
    పడిలేచిన కెరటం..!
    రుక్మిణి త్యాగం
    తండ్రిని మించిన తనయ
    రుబ్బుడు చదువులు మనకొద్దు :సుచిస్మిత
    పద్మశ్రీ వారియర్‌
    ఆదివాసుల ఆత్మఘోషకు తొలి కదలిక
    వీరీవీరీ గుమ్మడిపండ్లు
    తెలుగందం... మెరిసింది
    ఆణిముత్యం
    ఎగిరిపోతే ఎంత బాగుందో!
    రికార్డుల రాణి ఎలెనా
    అమ్మలగన్న అమ్మ నరసమ్మ!
    సోనాగచికి కొత్త ఆశాదీపం... ఇషిక!
    వ్యాపారమే జీవితం
    విజయోత్సవ నృత్యం
    ఆత్మరక్షణ పాఠాలతో అండ
    సమాజాన్ని కుంచెతో తట్టిలేపిన ధీర
    హైదరాబాద్ సంస్కృతి అంటే ప్రాణం
    స్వాతంత్య ఉద్యమంలో...మహిళామణులు
    ఆఫ్రికాలో అన్నపూర్ణ...
    పాకిస్తాన్ లో తొలి మహిళా ఫైటర్ పైలట్
    మనోనేత్రమే ఆమె జీవిత నేస్తం
    పాకిస్తాన్ సాహాస బాలిక .. మలాలా
    అంతర్జాతీయ కీర్తి కిరీటం
    మృత్యువునే పరిహసించిన సాహస బాలిక
    తెల్లమ్మాయి 'చెత్తశుద్ధి'
    కెమెరాఉమెన్ మల్లీశ్వరితో…
    ఆత్మవిశ్వాసం
    స్వధార్‌హోమ్ వంచితులకు ఆసరా
    ప్రశ్నిస్తేనే ప్రపంచం తెలిసేది...
    కాల్పనికకథలతో ఓలలాడించిన కలం
    1f435d7218
    24050e4082
    245c28fe88
    261cdb5043
    2818b63e80
    28389ca502
    2b0e1c1639
    2fa703fa92
    అంచెలంచెలుగా ఎదిగిన మహిళ: పాక్ విదేశాంగమij
    ఎన్నారై భర్తతో గెంటివేయబడ్డ కోమల్ ప్రవీణ
    హార్వార్డ్ లో భారతీయ తొలి మహిళా ప్రొఫెసరĺ
    31c13c6389
    3554a3419a
    35656ad80d
    55a74999b9
    5780c63669
    57c51a6293
    581f19c0c8
    596314788a
    5b25932644
    601df7f45e
    6038f96c83
    60bb50a07e
    6ac90962a4
    6acc2723b8
    6eceeac0ef
    72a7da41c2
    88cfd59ee5
    994726a014
    A2999c254a
    A31cb50ffd
    A90748427f
    Aaf6b495b5
    B68abb9e8a
    B72ae5d725
    C08f40206b
    E88f0055d9
    F3fc20019d
    F85bffc883
    F9ded65a21
    Fbb115455d
    Fcf7a2fc59
    Freedom Fighter Laxmi Sehgalpng5013f7c557

    RSS Feed


Powered by Create your own unique website with customizable templates.