కందిపప్పు - కప్పు;
బెల్లంతురుము - కప్పు;
నీరు - 3 కప్పులు.
పైన కవరింగ్ కోసం:
మైదా - కప్పు;
నువ్వుపప్పు - 2 టేబుల్స్పూన్లు;
నూనె - అర కప్పు;
నీరు - అరకప్పు;
పసుపు - అర టేబుల్ స్పూను
తయారి:
- ఒక పాత్రలో కందిపప్పు, తగినంత నీరు వేసి కుకర్లో ఉంచి నాలుగు విజిల్స్ వచ్చాక దించేయాలి
- చల్లారాక అధికంగా ఉన్న నీరు తీసేసి, పప్పును మెత్తగా చిదిమి, బెల్లం తురుము జత చేసి స్టౌ మీద ఐదు నిముషాలు ఉంచి దించి చల్లారనివ్వాలి
- ఏలకులపొడి జత చేసి, ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి
- ఒక పాత్రలో మైదా, నీరు, పసుపు, నూనె వేసి చపాతీపిండిలా కలిపి మూడుగంటలసేపు నాననివ్వాలి
- ఈ పిండిని చిన్న ఉండలా తీసుకుని చేతితో ఒత్తి, పూర్ణం ముద్దను ఇందులో ఉంచి, అప్పడాల పీట మీద ఉంచి అప్పడాల కర్రతో నెమ్మదిగా ఒత్తాలి
- స్టౌ మీద పెనం ఉంచి, కొద్దిగా నూనె వేసి, తయారుచేసి ఉంచుకున్న ఓలిగను పెనం మీద వేసి చుట్టూ నూనె వేసి, రెండువైపులా నూనె వేసి కాలాక తీసేయాలి.